-
హైదరాబాద్: పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వాన
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారి మేఘాలు కమ్ముకొని.. పలు చోట్ల వాన కురిసింది. కోఠి, సెక్రటేరియట్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. పంజాగుట్ట, ఖైరతాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. బలహీన పడిన ఉపరీతల ఆవర్థనం ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి నిజామాబాద్ వరకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. మరో 2, 3 రోజుల్లో రాష్ట్రమంతా రుతుపవనాలు విస్తరించనున్నాయని హైదారబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరీతల ఆవర్థనం బలహీన పడిందని పేర్కొంది. ఈరోజు రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారీ వర్షం పడనున్నట్లు సూచించింది. వికారాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట జిల్లాలకు భారీ వర్షాలు ఉన్నట్లు తెలిపింది. సాయంత్రం హైదరాబాద్కి ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలతో కూడిన తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పింది. దక్షిణ ఈశాన్య, మధ్య తెలంగాణ జిల్లాలకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాల పడతాయని పేర్కొంది. -
ఎడారి దేశంలో మళ్లీ వర్షం.. విమాన సర్వీసులు రద్దు
ఎడారి దేశం దుబాయ్లో ఇటీవల భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. యూఏఈలో గురువారం మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. దుబాయ్ వాతావరణ శాఖ శుక్రవారం ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. దాంతో అనేక విమాన సర్వీసులు రద్దయ్యాయి. దుబాయ్లో బస్సు సర్వీసులను కూడా నిలిపేస్తున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు.ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. దుబాయ్, షార్జా, రస్ అల్ ఖైమా, అబుదాబి అంతటా ఇండిగో, విస్తారా, స్పైస్జెట్ వంటి విమాన సర్వీసుల రాకపోకలకు అంతరాయం కలుగుతుందని ముందే నివేదించాయి. ‘ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా దుబాయ్, అబుదాబి, షార్జాలలో విమాన సర్వీసుల్లో మార్పులుంటాయి. వర్షాల కారణంగా స్థానికంగా రోడ్డు ప్రయాణాల్లో అవాంతరాలు కలుగొచ్చు. అందుకు తగ్గట్టుగా ప్రయాణికులు సిద్ధంకావాలి’ అని ఇండిగో ఎయిర్లైన్ తన ఎక్స్ ప్లాట్ఫామ్లో పోస్ట్ చేసింది.ఇదీ చదవండి: భారత కంపెనీపై ‘టెస్లా’ ఫిర్యాదు.. ఏం జరిగిందంటే..బుధవారం రోజునే దుబాయ్ ఎయిర్పోర్ట్లు స్థానిక విమానయాన సంస్థలతోపాటు ప్రయాణికులకు సలహాలు జారీ చేశాయి. అక్కడి జాతీయ దినపత్రిక ఖలీజ్ టైమ్స్ కథనాల ప్రకారం..గురువారం రాత్రి దుబాయ్కి వెళ్లే ఐదు ఇన్బౌండ్ విమానాలను దారి మళ్లించగా, తొమ్మిది అరైవల్, నాలుగు అవుట్బౌండ్ సర్వీసులను రద్దు చేసినట్లు తెలిసింది.#6ETravelAdvisory: Due to bad weather in #Dubai #Sharjah #RasAlKhaimah #AbuDhabi, our flight operations are impacted. Road blockages may disrupt local transport. Plan accordingly and allow extra time for airport travel. Check flight status at https://t.co/F83aKzsIHg— IndiGo (@IndiGo6E) May 2, 2024 -
ఉపశమనం.. తెలంగాణకు నాలుగు రోజుల వర్ష సూచన!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎండలు దంచికోడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 41 నుంచి 43 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు తెలుస్తోంది. ఈరోజు(ఆదివారం) రేపు(సోమవారం) రెండు రోజుల పాటు రాష్టానికి తీవ్రమైన ఎండలతో పాటు వడగాల్పుల హెచ్చరికలను ఐఎండీ జారీచేసింది. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకు ప్రజలు బయటకు రావద్దని ఐఎండీ హెచ్చరించింది. ఇక.. వడగాల్పుల తీవ్రత అధికంగా ఉండటంతో ఈరోజు పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వనపర్తి, జోగులంబ గద్వాల జిల్లాలకు వడగాల్పుల నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. రేపు (సోమవారం) రాష్ట్రంలో వనపర్తి జోగులాంబ గద్వాల జిల్లాలో అక్కడక్కడ వడగాల్పులు విచే అవకాశం ఉండడంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు.. ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో భిన్న పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. కాస్త ఉపశమనం.. నాలుగు రోజుల వర్ష సూచన ఇప్పటికే తీవ్రమైన ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాష్ట్ర ప్రజలకు కాస్త ఉపశమనం లభించనున్నట్లు తెలుస్తోంది. ఈరోజు(ఆదివారం) నుంచి రాష్ట్రవ్యాప్తంగా నాలుగు రోజులు రాష్ట్రానికి వర్ష సూచన ఉన్నట్లు ఐఎండీ పేర్కొంది. ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఈరోజు ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షం పలు జిలాల్లో కురిసే అవకాశం ఉంది, ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాలకు వర్ష సూచనతో ఎల్లో అలెర్ట్ జారీ చేసింది ఐఎండీ. రేపు అదిలాబాద్ కొమరం భీమ్ ఆసిఫాబాద్ మంచిర్యాల్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు మెదక్ కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉండడంతో ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. -
తెలంగాణకు చల్లటి కబురు.. రెండు రోజులు వర్షాలే..
సాక్షి, హైదరాబాద్: వేసవి ఎండతో సతమతమవుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. రానున్న రెండు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందిన తెలిపింది. మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. కాగా, వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో ఆరో తేదీ వరకు వాతావరణం పొడిగా ఉంటుంది. ఈనెల 7, 8 తేదీల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. @CEO_Telangana @TelanganaCMO @SpokespersonECI @ECISVEEP @TelanganaCS @DCsofIndia @IASassociation @IasTelangana @tg_weather @metcentrehyd #ECISVEEP #CEO_Telangana pic.twitter.com/DWngGDsOSh — IMD_Metcentrehyd (@metcentrehyd) April 3, 2024 మరోవైపు.. తెలంగాణలో ఈ ఎండా కాలంలో తొలిసారిగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత బుధవారం నమోదైంది. ఖమ్మంతోపాటు భద్రాద్రి కొత్తగూడెంలో 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డ్ అయ్యింది. గురువారం నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఎల్నినో పరిస్థితులు జూన్ చివరి వరకు కొనసాగనున్న నేపథ్యంలో ఈ వేసవిలో ఎండలు ఎకువగానే ఉంటాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు నమోదవుతున్నాయి. నిజామాబాద్లో 41.2, ఆదిలాబాద్లో 41.3, మెదక్, రామగుండం, నల్లగొండలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. -
రెండురోజుల్లో అల్పపీడనం!
సాక్షి, విశాఖపట్నం: మయన్మార్ తీరానికి ఆనుకుని తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న రెండురోజుల్లో వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. మరోవైపు వాయవ్య మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న మరో ఉపరితల ఆవర్తనం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర సముద్రతీర ప్రాంతాల వరకు, విదర్భ, తూర్పు మధ్యప్రదేశ్, దక్షిణ ఛత్తీస్గఢ్ అంతర్భాగంగా తూర్పు–పడమర ద్రోణి సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తువరకు విస్తరించి ఉంది. దీని ఫలితంగా రానున్న మూడురోజులు కోస్తాంధ్రలో అనేకచోట్ల, రాయలసీమలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కోస్తాంధ్రలో మంగళ, బుధవారాల్లో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. సోమవారం ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి వరకు విజయనగరం, కోనసీమ, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, పశ్చిమ గోదావరి, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీవర్షాలు కురిశాయి. ఇది కూడా చదవండి: టమాటా రైతుకు బాసట.. -
దంచికొట్టిన వాన
సాక్షి, హైదరాబాద్/ సాక్షి నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా వానలు కొనసాగుతున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలతోపాటు ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, హైద రాబాద్ జిల్లాల్లో దంచికొడుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు నిండి అలుగు పారుతున్నాయి. ముఖ్యంగా మంగళవారం తెల్లవారుజాము నుంచి కురిసిన కుండపోత వాన గ్రేటర్ హైదరాబాద్, శివారు ప్రాంతాలను వణికించింది. ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో మరో మూడురోజులు వర్షాలు కొన సాగుతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. దంచికొట్టి.. వణికించి.. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఎడతెరిపిలేకుండా కురిసిన వాన జన జీవనాన్ని అతలాకుతలం చేసింది. లోత ట్టు ప్రాంతాలు, కాలనీలు జలమయం అయ్యాయి. ఇళ్లు, అపార్ట్మెంట్లలోకి వరద నీరు చేరింది. రోడ్లు చెరువులను తలపించాయి. పలుచోట్ల రోడ్లపై వరద ఉధృతికి వాహనాలు కొట్టుకుపోయాయి. మియాపూర్లో మంగళవారం తెల్లవారుజాము మూడు గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు ఐదు గంటల్లోనే ఏకంగా 14.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తిరిగి మధ్యాహ్నం వరకు మరో 5.9 సెంటీమీటర్లు వాన పడినట్టు వాతావరణశాఖ ప్రకటించింది. రాజేంద్రనగర్, అత్తాపూర్ డివిజన్ల పరిధిలో పిల్లర్ నంబర్ 193 ప్రాంతం, శివరాంపల్లి, నేషనల్ పోలీస్ అకాడమీ ప్రాంతాల్లో రోడ్డుపై వరద నిలిచి రాకపోకలు స్తంభించాయి. మణికొండలోని పంచవటి కాలనీలో వరద రోడ్డును ముంచెత్తింది. మంచిరేవుల వద్ద చిన్న గుట్టపై నుంచి బండరాళ్లు దొర్లి ఓఆర్ఆర్ సర్వీస్రోడ్డుపైకి వచ్చాయి. ఇక భారీ వర్షం కారణంగా హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోని విద్యాసంస్థలకు మంగళవారం సెలవు ప్రకటించారు. స్తంభించిన ట్రాఫిక్తో యాతన కొన్ని ప్రధాన రహదారులపై మోకాలి లోతు నీళ్లు నిలవడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. కొంత దూరం ప్రయాణించడానికి కూడా అరగంట, గంట సమయం పట్టడంతో వాహనదారులు ఇబ్బందిపడ్డారు. ఆర్టీసీ బస్సులు వరదలో చిక్కుకుపోయాయి. బేగంపేట, పంజాగుట్ట, మాదాపూర్, దుర్గం చెరువు, మినిస్టర్ రోడ్డు, టోలీచౌకి, భరత్నగర్ ఫ్లైఓవర్, ఎల్బీ నగర్, మేడ్చల్, సుచిత్ర, బోయిన్పల్లి, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్, ఐకియా తదితర మార్గాల్లో ఈ దుస్థితి కనిపించింది. మధ్యాహ్నం తర్వాత పరిస్థితి కాస్త మెరుగుపడింది. జంట జలాశయాల గేట్లు ఎత్తివేత ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో భారీ వర్షాలతో పలు చెరువులు అలుగుపోస్తున్నాయి, వాగులు పొంగుతున్నాయి. దీనితో ఈసీ, మూసీ నదులకు వరద పోటెత్తింది. దీనితో జంట జలాశయాలు ఉస్మాన్సాగర్, హిమాయత్ సాగర్ నిండు కుండల్లా మారాయి. ప్రాజెక్టుల గేట్లు ఎత్తి 5వేల క్యూసెక్కులకుపైగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీనితో మూసీ పరీవాహక ప్రాంతాల వారిని అధికారులు అప్రమత్తం చేశారు. మూసారాంబాగ్ వంతెన వద్ద వరద మట్టం పెరగడంతో తాత్కాలికంగా రాకపోకలను నిలిపివేశారు. ప్రొక్లెయినర్లతో విద్యార్థులను తరలించి.. భారీ వర్షాలు, వరదతో గ్రేటర్ హైదరాబాద్ శివార్లలోని గుండ్లపోచంపల్లి మైసమ్మగూడలో ప్రైవేటు హాస్టళ్లను నిర్వహిస్తున్న సుమారు 15 అపార్ట్మెంట్లు జల దిగ్బంధమయ్యాయి. విద్యార్థులంతా హాస్టళ్లలో చిక్కుకుపోవడంతో భయాందోళన వ్యక్తమైంది. అధికారులు ప్రొక్లెయినర్ల సాయంతో హాస్టళ్లలోని విద్యార్ధులను బయటికి తరలించారు. మరో మూడు రోజులూ భారీ వర్షాలు వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లోని ఆవర్తన ప్రభావంతో దక్షిణ ఒడిశా, ఉత్తర ఏపీ తీరంలో అల్పపీడనం ఏర్పడిందని.. దాని ప్రభావంతో మరో మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా సగటున 3.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వెల్లడించింది. అత్యధికంగా నిజామాబాద్ జిల్లా మంచిప్పలో 15.75, రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దలింగాపురంలో 15.35, జగిత్యాల జిల్లా మెట్పల్లిలో 15 సెంటీమీటర్ల వర్షం కురిసినట్టు తెలిపింది. మొత్తంగా ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు రాష్ట్రంలోని 21 జిల్లాల్లో అత్యధికంగా, 12 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్టు వెల్లడించింది. కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్లు: సీఎస్ మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. ఏవిధమైన ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా చర్యలు చేపట్టాలని, అన్ని శాఖలతో సమన్వయం చేసుకోవాలని స్పష్టం చేశారు. ప్రతి జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయాలని.. అగ్నిమాపక, పోలీసు బృందాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. సీఎస్ మంగళవారం కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇప్పటికే వివిధ జిల్లాల్లో చెరువులు, కుంటలు నిండి ఉన్నాయని.. వాటికి గండ్లు పడకుండా తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాగులు ఉధృతంగా ప్రవహించే కాజ్ వేలు, కల్వర్టులు, వంతెనల వద్ద ముందుజాగ్రత్త చర్యగా భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. -
విధ్వంసంతో ఆస్తులే కాదు, ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతాయి
వాతావరణంలో గత కొన్నాళ్లుగా వచ్చిన మార్పుల వల్ల, కుంభవృష్టి, క్లౌడ్ బరస్ట్ లాంటివి సాధారణం అయిపోయాయి. విస్తారంగా.. అంటే అనేక చోట్ల కురవాల్సిన వర్షం ఒకే చోట కురిస్తే ?అదీ.. కేవలం కొద్దిసేపట్లో, నాలుగైదు రోజుల్లోనే ఏడాదంతా పడాల్సిన వర్షమంతా పడితే? వాగులు, వంకలు నిండిపోతాయి. కొండచరియలు విరిగిపడతాయి. నదులు పొంగి పొర్లుతాయి. గత నెల రోజులుగా దేశంలోని అనేక ప్రాంతాల్లో, ముఖ్యంగా హిమాచల్ప్రదేశ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర లాంటి చోట్ల వర్షాలు సృష్టించిన విధ్వంసం అంతాఇంతా కాదు. దీని వల్ల వేల కోట్ల ఆస్తుల నష్టంతో పాటు వందల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ► జులై, ఆగస్టు,సెప్టెంబర్ నెలల్లో విహారయాత్రలు, తీర్థయాత్రలు పెట్టుకోవద్దు. ముఖ్యంగా కొండ ప్రాంతాలకు పోవద్దు. చార్ధామ్, అమర్నాథ్ యాత్రలు చేయాలనుకునేవారు వర్షాకాలానికి ముందే ప్లాన్ చేసుకోండి. ► పొంగి ప్రవహిస్తున్న బ్రిడ్జిలు, కల్వర్ట్లు మొదలైన వాటిపై పయనించొద్దు. ప్రవహించే నీటి గతిశక్తిని తక్కువ అంచనా వేయొద్దు. నీరు వాహనంలోకి ప్రవేశిస్తే దాని బరువు పెరిగి, మునిగిపోతుంది. ► అనేక రాష్ట్రాల్లో రోడ్లు, వంతెనలు, డ్యాంల నిర్వహణ ఏమాత్రం బాగా లేదు. ఇప్పటికే అనేకం శిథిలావస్థకు చేరుకున్నాయి. దిగువ తట్టు ప్రాంతాల్లో ఉన్నవారు క్షేమంగా ఉండాలంటే, చెరువు కట్టలు, బ్యాములు సరిగా నిర్వహించేలా ప్రజాప్రతినిశులపై ఒత్తిడి తీసుకురండి. ఎందుకంటే.. అథిదులు ఇంటికొచ్చాక పంట పండించలేము కదా, అలాగే వర్షకాలంలో మేలుకుంటే సరిపోదు, డ్యాములు, బ్రిడ్జిలు లాంటి నిర్వహణ ఏడాది పొడవునా జరగాలి. ► ముఖ్యంగా ఏప్రిల్, మే నెలలో వీటి స్థితిపై స్ర్టక్చరల్ ఆడిటింగ్ జరగాలి. అవి ధృడంగా ఉన్నాయని ఇంజనీర్లు సర్టిఫై చేయాలి. లేకపోతే వానాకాలంలో నిద్రలోనే జలసమాధి అయ్యే ప్రమాదం పొంచి ఉంటుంది ► నదుల్లోకి దిగొద్దు. మీరు దిగినప్పుడు నీరు తక్కువ ఉండొచ్చు. కానీ ఎగువ ప్రాంతంలో డ్యాం తెరవడం, భారీ వర్షం లాంటి కారణాల వల్ల క్షణాల్లో నీటి ప్రవాహం పెరిగి ఉపద్రవం సంభవించవచ్చు. ► కొండమార్గాల్లో అంటే, ఘాట్రూట్లలో వర్షాకాలంలో ప్రయాణాలు వద్దు. భారీ వర్షాలు కురిసినప్పుడు పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడతాయి. ఒక పెద్ద బండరాయి క్షణాల్లో కిందకు వచ్చి అక్కడ పయనిస్తున్న వాహనాన్ని లోపలికి తీసుకొని వెళ్లిపోతుంది. తస్మాత్ జాగ్రత్త. ►ఎక్కడో కొండప్రాంతాల్లో కాదు.మహానగరాల్లో జలప్రళయం సాధారణం అయిపోయింది. చెరువులు కుంటలు ఉన్న ప్రాంతాల్లో నివాసాలు ఏర్పరుచుకోవద్దు . స్మార్ట్ ఫోనుల్లో కంపాస్ అనేది ఉంటుంది . అందులో చెక్ చేసుకొంటే మీరున్న ప్రాంతం ఎత్తు ఎంతో , ఇట్టే తెలిసిపోతుంది . ► రాబోయే రోజుల్లో జలప్రళయాలు సాధారణం అయిపోతాయి. ప్రభుత్వాలు కూడా లోతట్టు ప్రాంతాలను గుర్తించి అవి నివాస యోగ్యం కావని ముందే హెచ్చరికలు జారీ చెయ్యాలి. ఇంట్లోకి నీళ్లు ప్రవేశిస్తే ఇంట్లోని సామాగ్రి మొత్తం పాడై వేలల్లో నష్టం జరుగుతుంది. పాములు, తేళ్లు, మొసళ్లు వంటివి ఇంట్లోకి వస్తే ప్రాణానికే ప్రమాదం. ► చెట్లు నాటడం, వన సంరక్షణ, డ్రైనేజీ వ్యవస్థలు, బ్రిడ్జిలు ఇతరత్రా మౌలిక సదుపాయాల నిర్వహణ ప్రభుత్వాలు బాధ్యత . వాటిని ఆయా ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలకు వదలకుండా ఏటా ఇంత అని టార్గెట్ పెట్టి ఆ లక్ష్యాన్ని అందుకోవడం తప్పని సరి చేస్తూ పార్లమెంట్ చట్టం తేవాలి . లక్ష్యాన్ని అందుకొని ప్రభుత్వాల పై రాజ్యాంగ పరమయిన చర్యలు ఉండాలి . ► అహ నా పెళ్ళంట సినిమా లో కోట శ్రీనివాస్ రావు క్యారెక్టర్ " నా కేంటి .. నా కేంటి " అంటుంటుంది . మనం పడవ లో పయనిస్తున్నాము . దానికి చిల్లు పడితే అందరం పోతాము . మనం బతకాలంటే మంది కూడా బతకాలి అనే ఇంగిత జ్ఞానం ప్రజల్లో రావాలి. ఆలా కాకపోతే ఒక వర్షాకాలం రాత్రికి రాత్రే ఒక భారీ డ్యాం పగిలి ఒక పెద్ద నగరం, అనేక గ్రామాలు కొట్టుకొని పోయే ప్రమాదం ఉంది. -వాసిరెడ్డి అమర్ నాథ్, మానసిక నిపుణులు, విద్యావేత్త -
ఈసారి వానలు తక్కువే.. కరువుకు 20 శాతం ఛాన్స్! ఇబ్బందులు తప్పవు
న్యూఢిల్లీ: దేశంలో ఈ ఏడాది సాధారణ కంటే తక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రైవేట్ వాతావరణ అంచనాల ఏజెన్సీ ‘స్కైమెట్ వెదర్’ సోమవారం ప్రకటించింది. లా నినా, ఎల్నినో ప్రభావంతో కరువు సంభవించడానికి 20 శాతం అవకాశాలు ఉన్నట్లు వెల్లడించింది. వరుసగా గత నాలుగేళ్లుగా దేశంలో సాధారణం, అంతకంటే ఎక్కువ వర్షాలు పడ్డాయి. ఈసారి సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైతే ప్రధానంగా వ్యవసాయ రంగంలో ఇబ్బందులు తప్పవు. పంటల ఉత్పత్తి పడిపోతుంది. తద్వారా ఆహార ధాన్యాల ధరలు పెరుగుతాయి. చదవండి: ఆప్కు జాతీయ హోదా.. ఆ మూడు పార్టీలకు షాక్ -
తిరుపతి నగరంలో భారీ వర్షం (ఫోటోలు)
-
తెలంగాణ: ఈ జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాల నిష్క్రమణతో రాష్ట్రంపై వర్ష ప్రభావం.. మరో వారంపాటు ఉండొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ క్రమంలో ఇవాళ, రేపు..(శని, ఆది వారాల్లో) ఉరుములు, మెరుపులతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవొచ్చని హెచ్చరించింది. తెలంగాణలోని పలు జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, రంగారెడ్డి, వరంగల్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలతో పాటు హైదరాబాద్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ యెల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 18న ఉత్తర అండమాన్, దాని పరిసరాల్లో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. రెండు మూడు రోజుల తర్వాత వర్షాలు తగ్గుముఖం పట్టినట్లు అనిపించినప్పటికీ.. ఉదయం లేదా సాయంత్రం పూట చిరుజల్లులు కురిసే అవకాశం ఉండొచ్చని తెలిపింది. #15OCT 4:50AM⚠️ Rainy Morning Ahead for #Hyderabad During 5-8AM Moderate -Heavy Rains expected in Many parts of City in next 3-4Hrs Please Plan Accordingly ⚠️⚠️⚠️#HyderabadRains pic.twitter.com/jH58FNh2BW — Hyderabad Rains (@Hyderabadrains) October 14, 2022 HEAVY DOWNPOUR ALERT TODAY ⚠️ STRONG EASTERLY CONVERGENCE will cause Widespread rains in almost all many districts of Telangana during afternoon - early morning with HEAVY - VERY HEAVY RAINS at few areas ⚠️ Hyderabad too, high chances for strong rains during afternoon - morning pic.twitter.com/wNCk1XY8TY — Telangana Weatherman (@balaji25_t) October 15, 2022 ఇదీ చదవండి: ఏపీకి పొంచి ఉన్న తుపాను గండం! -
హైదరాబాద్లో ఉరుములతో కూడిన భారీ వర్షం.. ఫొటోలు, వీడియోలు
సాక్షి, హైదరాబాద్: సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షంతో హైదరాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ట్రాఫిక్ జామ్తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తాజాగా మంగళవారం మధ్యాహ్నం కూడా ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, ఎస్ఆర్ నగర్, కూకట్పల్లి, మాదాపూర్, అమీర్పేట, బషీర్ బాగ్, అబిడ్స్, లకిడికాపుల్, నాంపల్లి, కోఠి, సుల్తాన్ బజార్, బేగం బజార్, అల్వాల్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో వాన పడింది. హైదరాబాద్ నగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ) డీఆర్ఎఫ్ బృందాలను అప్రమత్తం చేసింది. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు జారీ చేశారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అన్నారు. it's Raining 🌧 @Hyderabadrains #rains #HyderabadRains pic.twitter.com/opYupmA8e9 — Muhammed Dastagir (@Dastagir_Hyd) September 27, 2022 Durgam Cheruvu wants all of this water but the drains were never built only 👍🏾 Madhapur is a disaster every rain with our without city wines#HyderabadRains pic.twitter.com/qKrQwRxqF5 — Donita Jose (@DonitaJose) September 27, 2022 @KTRTRS hyderabad capital city #HyderabadRains #ghmc pic.twitter.com/uqW9MM0JU3 — BalaramRajdoot (@BRd175) September 27, 2022 Rain @hyd mind space#HyderabadRains pic.twitter.com/F5VNSbzf9p — sridhar reddy (@reshusri) September 27, 2022 Rains 🙈😓😓😓#HyderabadRains pic.twitter.com/PMqUrUlUj3 — Hemangi Gala🇮🇳 (@hemangigala) September 27, 2022 #HyderabadRains #Hyderabad #whether #rains pic.twitter.com/wZs3XRZoVs — Satish Shukla🇮🇳 (@Satish_shukla99) September 27, 2022 -
జర పైలం: మరో మూడు రోజులు మస్తు వానలే.. ఈ జిల్లాల్లో జాగ్రత్త!
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాగా, తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం, దానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వివరించింది. pic.twitter.com/RPhZIciJTL — IMD_Metcentrehyd (@metcentrehyd) September 10, 2022 కాగా, ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, యాద్రాద్రి భువనగిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయి. సిరిసిల్ల, కరీంనగర్, నల్లగొండ, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ఇక, ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కురిసే అవకాశం ఉంది. pic.twitter.com/qRCs1YJSXV — IMD_Metcentrehyd (@metcentrehyd) September 10, 2022 -
అస్సాంలో బీభత్సం సృష్టిస్తున్న వరదలు...ముగ్గురు మృతి
Assam Floods Nearly 25,000 people affected: దేశంలో అనేక రాష్ట్రలలోని ప్రజలు భయంకరమైన ఎండలు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే అస్సాం మాత్రం అకాల వర్షాలతో వరదల్లో చిక్కుకుంది. అసోంలోని దిమా హసావో జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి ఒక మహిళతో సహా ముగ్గురు వ్యక్తులు మరణించారని అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఏఎస్డీఎంఏ) తెలిపింది. కొండ జిల్లా ఆకస్మిక వరదలు కారణంగా కొండ చరియలు విరిగిపడటంతో అనేక ప్రాంతాల్లో రోడ్డు, రైలు మార్గాలు దెబ్బతిన్నాయని వెల్లడించింది. కొండచరియలు విరిగిపడటంతో జటింగా-హరంగాజావో, మహూర్-ఫైడింగ్ వద్ద రైల్వే లైన్ నిలిచిపోయింది. గెరెమ్లాంబ్రా గ్రామం వద్ద మైబాంగ్ సొరంగం వద్ద కొండచరియలు విరిగిపడటం వల్ల రహదారి బ్లాక్ అయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. అస్సాంలో ఎడతెరిపి లేకుండా కురిసిన అకాల వర్షాల కారణంగా సుమారు ఐదు జిల్లాలోని దాదాపు 25000 మంది ప్రజలు వరదల బారిన పడ్డారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. వరదలు సృష్టించిని విధ్వంసం: న్యూ కుంజంగ్, ఫియాంగ్పుయ్, మౌల్హోయ్, నమ్జురాంగ్, సౌత్ బగేటార్, మహాదేవ్ తిల్లా, కలిబారి, నార్త్ బాగేటార్, జియోన్, లోడి పాంగ్మౌల్ గ్రామాలలో కొండచరియలు విరిగిపడడంతో దాదాపు 80 ఇళ్లు తీవ్రంగా ప్రభావితమయ్యాయని ఏఎస్డీఎంఏ తెలిపింది. అస్సాంలోని ఇప్పటి వరకు కాచర్, దేమాజీ, హోజాయ్, కర్బీ అంగ్లాంగ్ వెస్ట్, నాగావ్, కమ్రూవ్ ఈ ఆరు జిల్లాలు వరదల వల్ల ప్రభావితమయ్యాయి. ఆరు జిల్లాలో 94 గ్రామాలకు చెందిన 24,681 మంది వరద బారిన పడ్డారు. ఒక్క కాచర్ జిల్లాలోనే 21,000 మంది వరద బారిన పడ్డారు. ఆ తర్వాతి స్థానంలో కర్బీ ఆంగ్లోంగ్ వెస్ట్ దాదాపు 2,000 మంది బాధితులు, ధేమాజీలో 600 మందికి పైగా ప్రజలు ప్రళయం బారిన పడ్డారు. ఆర్మీ, పారామిలిటరీ బలగాలు, ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్, ఎస్డీఆర్ఎఫ్, సివిల్ అడ్మినిస్ట్రేషన్తో సహా క్యాచర్, హోజాయ్ జిల్లాలకు చెందిన శిక్షణ పొందిన వాలంటీర్లు దాదాపు 2,200 మందిని రక్షించారు. #WATCH Roads, bridges and agricultural land were inundated in Hojai, Assam yesterday due to floods following incessant rain in the region pic.twitter.com/DitKiMbb6O — ANI (@ANI) May 15, 2022 (చదవండి: పెదవుల పై ముద్దు పెట్టుకోవడం అసహజ నేరం కాదు) -
కడప నగరం.. జలమయం
కడప కార్పొరేషన్: ‘అసని’ తుపాను ప్రభావంతో నగరంలో జోరుగా వర్షం పడుతూనే ఉంది బుధవారం అర్థరాత్రి నుంచి నిర్విరామంగా కురిసిన వర్షానికి కడప నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. జన జీవనం అస్తవ్యస్తమైంది. మండువేసవిలో వర్షాకాలాన్ని తలపించేలా కురిసిన వర్షాన్ని చూసి జనం ఆశ్చర్యపోయారు. ఉదయం నుంచి సన్నటి జల్లులతో నిరంతరాయంగా కురిసిన వర్షానికి ఆర్టీసీ బస్టాండు, అప్సర థియేటర్, వై జంక్షన్, మృత్యుంజయకుంట, ఎస్బీఐ కాలనీ, బాలాజీన నగర్, శాస్త్రి నగర్, గంజికుంట కాలనీ, గౌస్ నగర్, పాతకడప, రామాంజనేయపురం, చిన్నచౌకు, ప్రకాష్నగర్, ఓంశాంతి నగర్, ఎన్టీఆర్నగర్, అంగడివీధి, మాసాపేట, నంద్యాల నాగిరెడ్డికాలనీ, రామరాజుపల్లె, ఎన్జీఓ కాలనీ, అల్లూరి సీతారామరాజు నగర్, రామకృష్ణ నగర్, భరత్ నగర్, మేకల దొడ్డి తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. వీధి వ్యాపారస్తులు, తోపుడు బండ్ల వ్యాపారులు అవస్థలు పడ్డారు. మోకాలిలోతుకుపైగా ఉన్న నీటిలో వాహనాలు దిగడం వల్ల ఇంజిన్లలోకి నీరు చేరి అవి మొరాయించాయి. పాత కడపలో పెద్ద ఎత్తున వర్షపునీరు నిలవడంతో పాతకడప జెడ్పీ స్కూల్లో పరీక్ష రాసే విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. -
హైదరాబాద్లో పలు చోట్ల వర్షం..
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో కొద్ది రోజులుగా భానుడి భగభగలతో ఎండలు మండిపోతున్నాయి. నగరవాసులు ఉక్కపోతతో సతమతమవుతున్నారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. అక్కడక్కడ చిరుజల్లులు కురిశాయి. నగరంలోని మలక్ పెట్, సైదాబాద్, మాదన్నపేట్, సంతోష్ నగర్, చంపా పేట్, ఉప్పల్, మేడిపల్లి, రామంతపూర్, జూపార్క్, ఫలక్నూమా, బహదూర్ పురా, పాతబస్తీలోని మరికొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. అలాగే నగర శివారులోని దుండిగల్, సూరారం, దూలపల్లి, బహదూర్ పల్లి, పలు ప్రాంతాల్లో వాన కురిసింది. దీంతో నగరవాసులకు ఎండ నుంచి కొంత ఉపశమనం కలిగింది. -
దిల్షుఖ్నగర్ థియేటర్లోకి భారీగా వరద నీరు, 40 వాహనాలు ధ్వంసం
సాక్షి, హైదరాబాద్: రాత్రి కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ నగరం జలమయైంది. నగరంలో ఎక్కడ చూసిన రోడ్లన్ని నీట మునిగాయి. దీంతో ఇళ్లలోకి నీళ్లు చేరి ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక దిల్షుఖ్నగర్లోని ప్రముఖ శివగంగ థియేటర్లోకి భారీగా వరద నీరు చేరడంతో స్థానికంగా ఆందోళన నెలకొంది. అలాగే ఈ భారీ వర్షానికి థియేటర్ పక్కన ఉన్న గోడ కూలిపోవడంతో అక్కడ పార్క్ చేసిన 40 వాహనాలు ధ్వంసం అయ్యాయి. అయితే ఆ గోడను పక్కనే ఉన్న నాళ పక్కనే కట్డడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. నాళ పక్కనే గోడ కట్టడంతో అది కూలడంతో నాళ దెబ్బతిందని, దీంతో భారీగా నీరు రోడ్లపైకి, థియేటర్లోకి, ఇళ్లలోకి చేరినట్లు స్థానికులు పేర్కొన్నారు. -
రాయలసీమలో నేడు, రేపు వానలు
సాక్షి, విశాఖపట్నం: తమిళనాడు, శ్రీలంక తీరాలకు సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ కారణంగా తేమగాలులు రాయలసీమ వైపుగా పయనిస్తున్నాయి. దీంతో పాటు తీరం వెంబడి తూర్పు–పశ్చిమ గాలుల కలయిక (షియర్ జోన్) కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాయలసీమలో మంగళ, బుధవారాల్లో విస్తారంగా వర్షాలు కురిసే సూచనలున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తాంధ్రలో అక్కడక్కడా తేలికపాటి వానలు కురిసే అవకాశాలున్నట్లు పేర్కొంది. గడిచిన 24 గంటల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. చదవండి: ఇంటర్ ఆన్లైన్ అడ్మిషన్లకు 27 వరకు గడువు -
Telangana: దంచికొట్టిన వాన
మెదక్ జిల్లా చేగుంటలో అత్యధికంగా 21.7 సెంటీమీటర్లు, మేడ్చల్ జిల్లా ఉప్పల్లో 20.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 25 చోట్ల భారీ వర్షం కురిసిందని వాతావరణ శాఖ ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కుండపోత వాన కురిసింది. చాలా ప్రాంతాల్లో పది, పదిహేను సెంటీమీటర్లకుపైనే వర్షపాతం నమోదైంది. వందకుపైగా బస్తీలు నీటమునిగాయి. పెద్ద సంఖ్యలో కాలనీల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో జనం ఇబ్బందులు పడ్డారు. ఐదు జిల్లాల్లో అప్రమత్తం ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులతో రాష్ట్రవ్యాప్తంగా మరో రెండు రోజులు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో పలుచోట్ల కుండపోత వానలు పడే అవకాశం ఉందని.. ఆయా జిల్లాల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. సాక్షి, హైదరాబాద్/ నెట్వర్క్: రాష్ట్రంపై ఉపరితల ఆవర్తనం, నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో విస్తారంగా వానలు పడుతున్నాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. చెరువులు నిండాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా పలు నగరాలు, పట్టణాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై నీరు చేరి జనం ఇబ్బందులు పడ్డారు. నాలుగు రోజుల కింద పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతోపాటు ఉపరితల ఆవర్తనంతో భారీ వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రస్తుత నైరుతి సీజన్లో రాష్ట్రంలో ఇప్పటివరకు 36.9 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైనట్టు తెలిపింది. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం 8.30 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 2.67 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైనట్టు వెల్లడించింది. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. అత్యధికంగా హైదరాబాద్లో 8.17 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైనట్టు ప్రకటించింది. జిల్లాల్లో వానలే వానలు.. యాదాద్రి జిల్లాలో బుధవారం రాత్రంతా కుండపోత వాన పడింది. 25 చెరువులు అలుగు పోస్తున్నాయి. బిక్కేరు వాగు పొంగడంతో 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 1,000 ఎకరాల్లో వరి నీటమునిగింది. పత్తి చేలలో నీరు నిలిచింది. మూసీ కల్వర్టులపై వరద ప్రవహిస్తుండడంతో రాకపోకలను నిలిపివేశారు. జనగామ జిల్లాలో భారీ వర్షంతో బచ్చన్నపేట- నక్కవానిగూడెం శివారు, జనగామ మండలం గానుగుపహాడ్ వాగులు పొంగి పొర్లుతున్నాయి. నల్లచెరువు, వెల్దండ, గండిరామారం, తాటికొండ వల్లభరాయ్, ఛాగల్ మర్రికుంట చెరు వులు మత్తడి పోస్తున్నాయి. రోడ్లపై నీటి వరదతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నిర్మల్ జిల్లాలో భారీ వర్షం పడింది. రోడ్లన్నీ చెరువుల్లా మారాయి. ఇళ్లలోకి నీళ్లు చేరాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. వీర్నపల్లి మండలంలోని గిరిజన తండాల్లో వాననీరు ఇళ్లలోకి చేరింది. పత్తి చేన్లు మునిగాయి. నక్కవాగు, సుద్దవాగు, బిక్కవాగు, గంజివాగు, సండ్రవాగులు పొంగిపొర్లుతున్నాయి. సిరిసిల్ల పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రుద్రంగి మండలంలో గొర్రెగుండం జలపాతం దూకుతోంది. వికారాబాద్ జిల్లాలో వానలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రాకపోకలకు ఇబ్బంది తలెత్తింది. పరిగి, వికారాబాద్, తాండూర్ పట్టణాల్లోని పలు కాలనీల్లో నీళ్లు చేరాయి. ధారూర్ మండలం రాళ్లచిట్టంపల్లిలో ఇల్లు కూలి షబ్బీర్ (38) అనే వ్యక్తి మృతి చెందాడు. మోమిన్పేట మండలం గోవిందాపూర్కు చెందిన బుడ్డమ్మ ఆసరా పింఛన్ తీసుకొని వస్తుండగా మల్లారెడ్డిగూడెం సమీపంలోని వాగు దాటుతూ కొట్టుకుపోయింది. మొయినాబాద్ మండలం అమ్డాపూర్లో ఈసీ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగులో చిక్కుకుని.. సురక్షితంగా బయటపడి జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం సంగెం–ఎఖీన్పూర్ గ్రామాల మధ్య వాగులో ముగ్గురు వ్యక్తులు చిక్కుకుపోగా.. పోలీసులు ఫైర్ రెస్క్యూ టీం, గ్రామస్తులతో కలిసి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. తెగిన చెరువు కట్ట భారీవర్షంతో జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలో చెరువు కట్ట తెగిపోవడంతో పెద్దవాగు పొంగిపొర్లింది. సాతారంలో శివార్లలో వ్యవసాయ పనులకు వెళ్లిన ఏడుగురు, వేంపల్లిలో మరొకరు వాగులో చిక్కుకున్నారు. విషయం తెలిసిన పోలీసులు గజ ఈతగాళ్లు, తాళ్ల సహాయంతో సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. -
Monsoon: నైరుతి వచ్చేసింది!
సాక్షి, హైదరాబాద్: ‘నైరుతి’రాష్ట్రాన్ని పలకరించింది. ఈ నెల 3న కేరళను తాకిన రుతుపవనాలు.. చురుకుగా ముందుకు వస్తూ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మీదుగా రాష్ట్రం వైపు వ్యాపిస్తున్నాయి. శనివారం రాష్ట్రంలోని నైరుతి దిశలో ఉన్న జిల్లాల్లో రుతుపవనాలు ప్రవేశించినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న 24 గంటల్లో ఈ రుతుపవనాలు రాష్ట్రంలోని చాలాచోట్ల విస్తరించే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది. ఇప్పటికే కర్ణాటక తీరం, గోవా అంతటా, మహారాష్ట్రలోని కొంత భాగం వరకు వేగంగా విస్తరిస్తున్నాయి. అలాగే ఉత్తర కర్ణాటకలో చాలా భాగం, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని చాలా ప్రాంతాల్లోకి ప్రవేశించినట్లు వాతావరణ శాఖ తెలిపింది. రెండ్రోజులు తేలికపాటి వర్షాలు.. రాష్ట్రానికి నైరుతి దిక్కు నుంచి కిందిస్థాయిలో గాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. చాలాచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు నమోదవుతాయని సూచించింది. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం 8గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల వానలు కురిశాయి. సగటున సగటున 6.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలు మినహాయిస్తే మిగతా అంతటా వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లా జుక్కల్లో అత్యధికంగా 8.75 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. కాస్త ముందే... ఈ ఏడాది నైరుతి రుతపవనాలు కాస్త ముందుగానే వచ్చాయి. గతేడాది జూన్1న కేరళలోకి ప్రవేశించిన నైరుతి క్రమంగా విస్తరిస్తూ జూన్ 11న రాష్ట్రానికి చేరుకుంది. ఈ ఏడాది మే 30న కేరళకు చేరుకుంటాయని వాతావరణ శాఖ తొలుత అంచనా వేసి... క్రమంగా మే 31 నాటికి వస్తాయని ప్రకటించింది. చివరకు మరింత లోతైన అంచనాలతో జూన్ 3న కేరళను తాకుతాయని పేర్కొంది. ఈ మేరకు నైరుతి దిశ నుంచి కిందిస్థాయి గాలులతో రుతుపవనాల రాక కనిపించింది. అనంతరం రుతుపవనాలు చురుకుగా ముందుకు సాగడం... రాష్ట్రానికి నైరుతి దిశ నుంచి కిందిస్థాయి గాలుల తీవ్రత ఎక్కువవడంతో రెండ్రోజుల్లోనే రాష్ట్రాన్ని పలకరించాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఆరు రోజుల ముందే రాష్ట్రాన్ని చేరుకోవడం గమనార్హం. -
హైదరాబాద్లో పలు చోట్ల వర్షం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో పలు చోట్ల వర్షం పడుతుంది. బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, మాదాపూర్, గచ్చిబౌలి, మియాపూర్, బోరబండ, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్లో ఉరుములతో కూడిన వర్షం కురిసింది. దీంతో డీఆర్ఎఫ్ సిబ్బందిని జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు. రాష్ట్రంలో బుధవారం ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అలాగే అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు, వడగళ్లతోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఇక ఈనెల 15 నుంచి 17వ తేదీ వరకు అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కాగా, గత 24 గంటల్లో కామారెడ్డి జిల్లా బొమ్మనదేవిపల్లిలో అత్యధికంగా 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది. మొత్తం 35 కేంద్రాల్లో వర్షపాతం రికార్డయిందని, భద్రాచలంలో అత్యధికంగా 38.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని తెలిపింది. చదవండి: తెలంగాణలో మళ్లీ ఎన్నికలు: రేపు నోటిఫికేషన్? కుంభకోణం: మాజీ మంత్రి పేషీ నుంచే..! -
ముంబైలో తేలికపాటి జల్లులు
ముంబై: దేశ ఆర్థిక రాజధానిని వరుణుడు కరుణించడం లేదు. అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి. ముంబైతో పాటు థానె, కళ్యాణ్, దోంబివాల వంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో సోమవారం ఉదయం తేలికపాటి జల్లులు కురిశాయి. పొగమంచు కప్పేయడంతో ఉష్ణోగ్రతలు పడిపోయాయి.. పరిసరాలు సరిగా కనిపించడం లేదు. ఈ సందర్భంగా ప్రాంతీయ వాతావరణ కేంద్రం ముఖ్య అధికారి కేఎస్ హోసాలికర్ మాట్లాడుతూ.. ‘ముంబై, థానె, నవీ ముంబై ప్రాంతాల్లో గడిచిన ఆరు గంటల నుంచి తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి. ఇక రానున్న మూడు, నాలుగు గంటల్లో ఈ ప్రాంతాల్లో మోస్తరు జల్లులు పడే అవకాశం ఉంది’ అని తెలిపారు. ఇక మరో 24 గంటల పాటు ఆకాశం మేఘావృతం అయి ఉంటుందని తెలిపారు. ఇక వాతావరణ శాఖ ప్రకారం మరో 48 గంటల పాటు ముంబై, పరిసర ప్రాంతాల్లో వాతావరణం మేఘావృతం అయి ఉంటుందని.. ఉష్ణోగ్రత 22 డిగ్రీలకు పడి పోతుందని వెల్లడించింది. ముంబై వాతావరణ పరిస్థితులకు సంబంధించి పలువురు నెటిజన్లు ఫోటోలు షేర్ చేస్తున్నారు. Dip in temperatures with smog shrouding parts of Mumbai city and Thane leading to decreased visibility. According to the forecast, it is likely to be cloudy with the minimum temperature at 23 to 22 degrees celsius for next 48 hours#Mumbairains #December #rains #thane #birds pic.twitter.com/quQXw3OJ2Z — Pratik Mukane | प्रतिक मुकणे (@pratikmukane) December 14, 2020 -
విశ్వ నగరాలు.. శాస్త్రీయ విధానాలు
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలతో నిండా మునకేస్తోంది మన గ్రేటర్ సిటీ. ఈ దుస్థితిని నివారించేందుకు విశ్వనగరాల్లో అమలవుతున్న అత్యున్నత శాస్త్రీయ విధానాలు భాగ్యనగరంలోనూ అమలుచేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచంలో లండన్, న్యూయార్క్, ఫిలడెల్ఫియా, పారిస్ నగరాల్లో భారీ వర్షం, విపత్తులు సంభవించినపుడు ప్రధాన రహదారులు, కాలనీలు మునగకుండా వరద, మురుగు నీరు సాఫీగా వెళ్లేందుకు వేర్వేరుగా ఏర్పాట్లు ఉండడం విశేషం. ఆయా నగరాల్లో అమలు చేస్తున్న అత్యున్నత విధానాలను నగరంలోనూ అమలు చేస్తే ముంపు సమస్యలను నివారించడం సాధ్యపడుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. బార్సిలోనాలో.. బెంగళూరులో ఇంజెక్షన్ వెల్ సాంకేతికత ఇలా.. బెంగళూరు నగరంలో ప్రధాన రహదారులను ముంచెత్తుతున్న వరద నీటిని అరికట్టేందుకు భారీ సంఖ్యలో అండర్పాస్లు, ప్రధాన రహదారులపై ఇంజెక్షన్ వెల్స్ను ఏర్పాటు చేస్తున్నారు. భూమిపైనుంచి బోర్వెల్ యంత్రంతో 150 నుంచి 200 అడుగుల లోతు వరకు బోరుబావి(ఇంజెక్షన్ వెల్) తవ్వుతారు. ఈ బావిలోకి 12 ఎంఎం పరిమాణం చిల్లులున్న కేసింగ్ పైపును దింపుతారు. పైపులోనికి రాళ్లు చేరకుండా చుట్టూ సన్నటి జాలీని ఏర్పాటు చేస్తారు. ఈ బోరుబావి చుట్టూ రెండు మీటర్ల లోతు, మరో 1.5 మీటర్ల పొడవు, వెడల్పుతో గుంత ఏర్పాటు చేస్తారు. ఈ గుంతలో ఒక మీటరు మందం వరకు 40 ఎంఎం పరిమాణం ఉన్న బెందడి రాళ్లు వేస్తారు. మరో 0.5 మీటర్ల మేర 20 ఎంఎం పరిమాణం ఉన్న గులకరాళ్లను నింపుతారు. మరో 0.3 మీటర్ల మేర మందం ఇసుకతో నింపుతారు. పార్కు లేదా కమ్యూనిటీ హాలు లేదా లోతట్టు ప్రాంతాల నుంచి వర్షపునీరు వచ్చి ఈ ఇంకుడు గుంతపై కొద్దిసేపు నిలిచే ఏర్పాటు చేస్తారు. ఈ నీరు ఇంకుడు గుంత నుంచి, దానికి మధ్యలో రంధ్రాలున్న కేసింగ్ పైపు ద్వారా దశలవారీగా భూమి లోపలి పొరల్లోకి ఇంకుతుంది. దీంతో వర్షపునీరు భూమి అంతరాల్లో ఉన్న ఆయా పొరల్లోకి పాకుతుంది. దీంతో ఆయా పొరల్లోకి సమృద్ధిగా నీటి ఊట చేరి సమీపంలో కిలోమీటరు పరిధిలో ఉన్న బోరుబావులు త్వరగా రీఛార్జీ అవుతాయి. సాధారణ ఇంకుడు గుంత కంటే ఇంజెక్షన్ వెల్ సాంకేతికత ఆధారంగా నిర్మించే రీఛార్జి పిట్స్తో ఫలితాలు రెట్టింపు స్థాయిలో ఉంటాయి. ఒక్కో ఇంజెక్షన్ వెల్కు సుమారు రూ.40 వేల అంచనా వ్యయం కానుందని అంచనా. మన నగరంలోని కుత్బుల్లాపూర్ ఉమామహేశ్వర కాలనీ దుస్థితి ఇదీ.. విశ్వ నగరాల్లో చర్యలివే.. ఆయా నగరాల్లోని అన్ని ప్రధాన, సర్వీసు రహదారులకు ఇరువైపులా వర్షపు నీరు సాఫీగా వెళ్లేందుకు వీలుగా వరదనీటి కాల్వలను ఏర్పాటు చేశారు. కాల్వల్లో మురుగు నీరు చేరకుండా చర్యలు చేపట్టారు. మురుగునీటి పారుదల వ్యవస్థకు ప్రత్యేక పైప్లైన్ వ్యవస్థ. ఆయా రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో రెయిన్గేజ్, స్మార్ట్బాల్ టెక్నాలజీ ఆధారంగా వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు శాస్త్రీయ అంచనాతో ముంపు నివారణ. వరద నీటి కాల్వలపై ఆక్రమణలు పూర్తిగా నిషిద్ధం. లోతట్టు ప్రాంతాల్లో భారీ పరిమాణంలో ఉండే ఇంకుడు కొలనుల ఏర్పాటుతో వరదనీరు నేలగర్భంలోకి సులువుగా ఇంకేలా చర్యలు. పార్కులు, ఫుట్పాత్లు, రహదారులకు ఇరువైపులా, నగరంలో ఖాళీస్థలాల్లో భారీగా గ్రీన్బెల్ట్ ఏర్పాటు చేయడంతో కాంక్రీట్ విస్తీర్ణం తగ్గి వర్షపు నీరు నేలగర్భంలోకి చేరుతుండడంతో తప్పుతున్న ముంపు అవస్థలు. ప్రతి ఇల్లూ, భవనం, కార్యాలయం, వాణిజ్య సముదాయంపై కురిసిన వర్షాన్ని నిల్వ చేసేందుకు అందుబాటులో విధిగా రీఛార్జింగ్ పిట్. దీంతో రహదారులపైకి వచ్చే వరద సుమారు 60 శాతం తగ్గుతోంది. భవన విస్తీర్ణంలో సగభాగం గ్రీన్బెల్ట్ ఉండేలా చూడటంతో వరద ముప్పు తప్పుతోంది. ఇక ఫిలడెల్ఫియా (అమెరికా), బార్సిలోనా మహానగరాల్లో ఇంకుడు గుంతలను విస్తృతంగా తవ్వడంతో 80 శాతం వర్షపు నీటిని ఒడిసిపడుతున్నారు. ఉదాహరణకు 200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఇంటికి బోరుబావికి ఆనుకొని రెండు మీటర్ల వెడల్పు, 2 మీటర్ల లోతున ఇంకుడు గుంత ఏర్పాటు. గుంత పూడకుండా చుట్టూ లోపలి వైపు నుంచి బండ రాళ్లు లేదా ఇటుకలతో మధ్యలో సన్నటి ఖాళీలుంచి పేర్చాలి. గుంతపై ఆర్సీసీ సిమెంటుతో తయారు చేసిన జాలీ ఏర్పాటు. జాలీకి ఉన్న పెద్ద రంధ్రాల నుంచి వర్షపునీరు గుంతలోకి మళ్లేలా ఏర్పాటు చేయాలి. ఇంటి పైకప్పుపై చేరిన వర్షపునీరు నేరుగా ఈ గుంతలోకి చేరేలా ఏర్పాటు చేయాలి. ఇలా చేస్తే రోజుకు సుమారు 50 నుంచి 80 మి.లీటర్ల వర్షపాతాన్ని బోరుబావికి సమీపంలో ఇంకించవచ్చు. సీజన్లో నిల్వ చేసిన ఈ నీరు ఐదుగురు సభ్యులున్న కుటుంబానికి మూడు నెలల అవసరాలకు సరిపోతాయి. లోతట్టు ప్రాంతాలు, పార్కులో పెద్ద విస్తీర్ణంలో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేస్తే వాటికి సమీప ప్రాంతాల్లో బోరుబావులు రీఛార్జీ అవుతాయి. వర్షపునీటిని ఎక్కడికక్కడే ఇంకింపజేస్తే రహదారులను ముంచెత్తే వర్షపునీరు సైతం తగ్గుముఖం పడుతుంది. మన పొరుగునే ఉన్న తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూర్ నగరంలో తరచూ వరదనీరు నిలిచే ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో భారీ పరిమాణంలో ఉండే ఇంకుడు గుంతలను ఏర్పాటు చేశారు. దీంతో వరదనీరు నేలగర్భంలోకి చేరి భూగర్భ జలమట్టాలు గణనీయంగా పెరిగినట్లు టీఎస్డీపీఎస్ గుర్తించింది. ఈ నమూనా గ్రేటర్ పరిధిలోనూ అమలు చేయాల్సిన ఆవశ్యకత ఉంది. -
హైదరాబాద్లో పలు చోట్ల వర్షం
సాక్షి, హైదరబాద్: నగరంలో మంగళవారం తెల్లవారుజామునుంచి పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, కోటి, నాంపల్లిలో వాన పడుతోంది. చార్మినార్, ఫలక్నుమా, చంద్రాయణగుట్టలో మోస్తరు వర్షం కురుస్తోంది. దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, బడంగ్పేట్, మీర్పేట్లో వర్షం పడడంతో పలు కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో ముంపు నుంచి పలు శివారు కాలనీలు ముంపు నుంచి ఇంకా తేరుకోలేదు. ఇప్పటికే కురిచిన భారీ వర్షాలకు పలు చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. పలు కాలనీలు, ఇంకా బురదమయంగానే ఉన్నాయి. మరోవైపు తూర్పు పశ్చిమ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, మంగళవారం మధ్యాహ్నం తర్వాత అల్పపీడనంగా మారే అవకాశం అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నేడు, రేపు కోస్తాంధ్రలో భారీ వర్షాలు, రాయలసీమలో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తీర ప్రాంతంలో 45 కిలో మీటర్ల నుంచి 50 కిలో మీటర్లు వేగంతో ఈదురుగాలులు విస్తాయని తెలిపింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. -
24 గంటల్లో జిల్లాలో నమోదైన వర్షపాతం
సాక్షి, విజయనగరం: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు విజయనగరం జిల్లాలో గడిచిన 24 గంటల్లో భారీ వర్షపాతం నమోదైంది. సోమవారం కురిసిన వర్షానికి జిల్లా వ్యాప్తంగా అత్యధికంగా భోగాపురంలో 11 సెంటిమీటర్లు, కొత్తవలసలో 10 సెంటిమీటర్లు, డెంకాడలో 8 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. వేపాడ, మెంటాడ, జామి, పూసపాటిరేగ, బొండపల్లిలలో 7 సెంటిమీటర్లు నమోదు కాగా ఎల్ కోట, విజయనగరం, గరివిడి, గుర్ల, గజపతినగరం, పాచిపెంట, గుమలక్ష్మిపురంలలో 6 సెంటీమీటర్లుగా నమోదైంది. ఎస్ కోట, గంట్యాడ, నెల్లిమర్ల, చీపురుపల్లి, మెరకముడిదాం, తెర్లాం, రామభద్రాపురం, సాలూరు, పార్వతీపురం, గరుగుబిల్లిల్లో 5 సెంటీ మీటర్లు.. దత్తిరాజేరు, బాడంగి, బొబ్బిలి, జేఎం వలసలలో 4 సెంటీమీటర్లు.. కురుపాం, మక్కువ, సీతానగరం, బలిజిపేటలలో 3 సెంటీమీటర్లుగా వర్షపాతలం నమోదైంది. -
కొనసాగుతున్న వాయుగుండం
సాక్షి, విజయవాడ : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కొనసాగుతోంది. క్రమంగా బలపడి 24గంటల్లో తీవ్రవాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పశ్చిమ వాయువ్యం దిశగా పయనించి సోమవారం రాత్రి నర్సాపురం-విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు.వాయుగుండం ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. సోమవారం కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, మిగిలిన చోట్ల మోస్తారు నుంచి తేలిక వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. మంగళవారం ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురవనున్నాయి. తీరం వెంబడి గంటకు 55-75 కి.మీ వేగంతో గాలుల వీచే అవకాశం ఉందని విశాఖ జిల్లాకు వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మత్స్య కారులు వేటకు వెళ్లకుండా చూడాలని అధికారులను జిల్లా కలెక్టర్ వినయ్చంద్ ఆదేశించారు. వాయుగుండం నేపథ్యంలో కలెక్టరేట్లో ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేశారు. సహాయం కోసం కలెక్టరేట్లో టోల్ఫ్రీ నెంబర్లు: 0891-2590102, 0891-2590100 ఫోన్ చేయాలని ప్రజలకు సూచించారు. తీరప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండి, తగినజాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అటు తెలంగాణలోనూ వాయుగుండం ప్రభావం కనిపిస్తోంది. హైదరాబాద్ సహా రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి.