240 కేజీల గంజాయి పట్టివేత
జగ్గంపేట: తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం వద్ద 240 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణాకు పాల్పడుతున్న ముగ్గుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారయ్యారు. ఈ సందర్భంగా ఓ వాహనాన్ని సీజ్ చేశారు. గంజాయిని విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వైపు ఓ వాహనంలో తరలిస్తుండగా ముందస్తు సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు చేపట్టారు. నిందితులపై కేసు నమోదు చేసి స్టేషన్కు తరలించారు.