ఏపీలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీలు | AP Government Transfers Of 18 IAS Officers | Sakshi

18 మంది ఐఏఎస్‌లను బదిలీ చేసిన ఏపీ ప్రభుత్వం  

Sep 13 2019 7:29 PM | Updated on Sep 13 2019 7:49 PM

AP Government Transfers Of 18 IAS Officers - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీలు జరిగాయి. 18 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వారి వివరాలు.. అజయ్‌ జైన్‌- హౌజింగ్‌ ముఖ్య కార్యదర్శి.. శాంతిలాల్‌ దండే- పరిశ్రమలు, పెట్టుబడులు శాఖ కార్యదర్శి.. సిద్దార్థ జైన్- స్టాంప్స్‌, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌, ఐజీ‌.. భాను ప్రకాష్‌- గిడ్డంగులు కార్పొరేషన్‌ వీసీఎండీ.. పి.ఉషాకుమరి- ఆయుష్‌ కుమార్‌, పి.ఎ.శోభ- గిరిజన సహాకార సంస్థ వీసీఎండీ.. టి. బాబురావు నాయుడు- పునరావాస ప్రత్యేక కమిషనర్‌.. కె.శారదాదేవి- మైనార్టీ సంక్షేమశాఖ ప్రత్యేక కమిషనర్‌.. జి. రేఖా రాణి- కార్మిక శాఖ ప్రత్యేక కమిషనర్‌గా బదిలీ అయ్యారు.

చెరుకూరి శ్రీధర్‌- ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ జాయింట్‌ సెక్రటరీ.. ఎల్‌.ఎస్‌ బాలాజీ- మర్క్‌ఫెడ్‌, అగ్రోస్‌ ఎండీ.. ఎంఏ కిషోర్‌- కమిషనర్‌, రాజమండ్రి మున్సిపల్‌ కార్పొరేషన్‌.. నందకిషోర్‌- ఎంగీ ఎపీటీఎస్‌.. డి. వాసుదేవ రెడ్డి- ఏపీ బేవరరేజస్‌ కార్పొరేషన్‌ వీసీఎండీ.. వి. రామకృష్ణ- స్పెషల్‌ కమిషనర్‌.. ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌.. ఎన్‌. చంద్రమోహన్‌ రెడ్డి- ఏపీ యుఎఫ్‌ఐడీసీ ఎండీ శాఖలకు బదిలీ చేశారు. కాగా జి. అనంతరామును సాధారణ పరిపాలనా శాఖ(జీఎడీ)కు రిపోర్టు చేయాలని ఆదేశించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement