హిందూపురం: అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో పేకాట స్థావరాలపై మంగళవారం పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న 11 మందిని అరెస్ట్ చేశారు. పేకాట సమాచారం అందుకున్న పోలీసులు పట్టణంలోని దండు రోడ్డులో వివిధ చోట్ల దాడులు నిర్వహించి అదుపులోకి తీసుకోగా, వారి నుంచి రూ.1,09,750 నగదు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
11 మంది పేకాట రాయుళ్ల అరెస్ట్
Published Tue, May 19 2015 2:38 PM | Last Updated on Tue, Aug 21 2018 6:12 PM
Advertisement
Advertisement