gamblers
-
పేకాటపై వార్తలు, జర్నలిస్టుపై దాడి
దిస్పూర్: రాష్ట్రంలో పేకాట శిబిరాలు పెరిగిపోతున్నాయని వార్తలు రాసిన ఓ జర్నలిస్టుపై జూదగాళ్లు మూకుమ్మడి దాడి చేశారు. విద్యుత్ స్తంభానికి కట్టేసి చిత్రవధ చేశారు. ఈ సంఘటన గువాహటికి పశ్చిమాన 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న మీర్జాలో జరిగింది. ప్రముఖ అస్సామీ దినపత్రిక ప్రతీదిన్లో రిపోర్టర్గా విధులు నిర్వర్తిస్తున్న కరుప్ జిల్లాకు చెందిన మిలన్ మహంత అనే జర్నలిస్ట్ గ్రామీణ ప్రాంతాల్లో పేకాటపై వరుస కథనాలు రాశారు. దీంతో కక్ష్య పెంచుకున్న ఐదుగురు జూదగాళ్లు రిపోర్టర్పై ఈ చర్యకు పాల్పడ్డారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జర్నలిస్టు మిలన్ మహంత్ మెడ, తల, చెవుల మీద గాయాలవగా.. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దాడికి పాల్పడిన నిందితులపై బారి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. నిందితుల్లో ఒకరిని అరెస్టు చేశామని మిగతావాళ్లు కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
చీరాల పట్టణంలో విచ్చల విడిగా జూదం
ప్రకాశం, చీరాల రూరల్: భౌతికదూరం పాటించి కరోనా వైరస్కు అడ్డుకట్ట వేయాలని ప్రచార మాధ్యమాల్లో ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేస్తున్నా... సమావేశాలు పెట్టి పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా... కొందరు యువకులు అధికారుల సూచనలను ఏ మాత్రం లెక్క చేయడం లేదు. ఇష్టాను రీతిగా వ్యవహరిస్తూ కనీసం ముఖానికి మాస్కు కూడా ధరించకుండా వైరస్ను వ్యాప్తి చెందే విధంగా ఎక్కడ పడితే అక్కడ జూదాలు ఆడుతున్నారు. పోలీసులు దాడులు నిర్వహిస్తూనే ఉన్నప్పటికీ జూదరులు ఏదో ఒకచోట ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. మరికొందరు భౌతిక దూరం పాటించకుండా ద్విచక్ర వాహనాపై డబుల్స్, త్రిబుల్స్ రైడ్స్ చేస్తూ పోలీసులకు పట్టుబడుతున్నారు. చీరాలలో జూద స్థావరాలు.. చీరాల వన్టౌన్ పరిధిలో దండుబాట, విఠల్ నగర్, ప్రకాశ్ నగర్, జయశంకర్ నగర్, ఉజిలిపేట, పాలేటి నగర్, జవహర్ నగర్, హరిప్రసాద్ నగర్, శ్రీరాంనగర్, కొత్తపాలెం వంటి ప్రాంతాలు, టూ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో జాన్పేట, జయంతిపేట, మరియమ్మ పేట, ఐక్యనగర్, విజయ నగర్ కాలనీ, రామ్నగర్, శాంతి నగర్, గాంధీ నగర్, ఆనంద పేట, శృంగారపేట, హారిస్ పేట, హయ్యర్పేట, థామస్ పేట, గంజిపాలెం, గొల్లపాలెం వంటి ప్రాంతాల్లో కొందరు యువకులు పేకాట, చింత పిక్కలాట, హౌసీ వంటి ఆటలాడుతున్నారు. కనీస జాగ్రత్తలూ లేవు.. ప్రభుత్వం లాక్డౌన్లో కొన్ని సడలింపులు ఇవ్వడంతో ఇప్పటిదాకా ఇళ్లకే పరిమితమైన యువకులు జూలు విదిల్చారు. ఆకతాయిలు వివిధ రకాల జూదాలపై దృష్టి సారించారు. ఎవరికి తోచిన విధంగా వారు కనీసం మాస్కులు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా గుంపులు గుంపులుగా చేరి ఆటలాడుతూ స్థానికులకు భయాందోళనలు కలిగిస్తున్నారు. బుధవారం స్థానిక వైకుంఠపురం, విఠల్ నగర్, ప్రకాష్ నగర్లలో కనీస జాగ్రత్తలు పాటించకుండా ఆటలాడుతున్న వారిని గమనించిన సాక్షి ఫోటోలు తీస్తుండగా ఆ యువకులు ముఖాలకు చేతులు అడ్డుపెడుతూ కాలికి బుద్ధి చెప్పారు. పోలీసులు గస్తీలు ముమ్మరం చేసి జూదాలను అరికట్టాలని స్థానికులు పోలీసు ఉన్నతాధికారులను కోరుతున్నారు. -
చర్చనీయాంశంగా ‘పచ్చ’పోలీసు
క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే పోలీసు శాఖలో ఓ ఇంటి దొంగ పెత్తనం మితిమీరింది. జిల్లా పోలీసు బాస్ తనదైన శైలిలో అరాచక శక్తుల ఆటకట్టించే ప్రయత్నం చేస్తున్నా.. ఆ ప్రణాళిక సమాచారం దాడులకు ముందే నేరగాళ్లకు చేరిపోతోంది. గత ఎన్నికల సమయంలోనూ ఈ ‘పచ్చ’ పోలీసు ఏకపక్షంగా వ్యవహరించిన తీరు ఆ శాఖలో చర్చనీయాంశమైంది. ఇప్పటికీ ఆయన పంథా ఇలాగే కొనసాగుతోంది. మామూళ్ల మత్తులో అక్రమార్కుల పట్ల ఆయన చూపుతున్న ‘విశ్వాసం’ పోలీసు శాఖ పరువును బజారున పడేస్తోంది. –సాక్షి ప్రతినిధి, అనంతపురం సాక్షి, తాడిపత్రి(అనంతపురం) : నియోజకవర్గంలోని మట్కా డాన్ రషీద్తో పాటు క్రికెట్ బుకీలు దాడుల కంటే ముందుగానే అక్కడి నుంచి తప్పించుకుపోయారు. ప్రస్తుతం సదరు మట్కాడాన్ ఏకంగా గోవాలో మకాం వేశారు. పోలీసు శాఖ ఎంతో గోప్యంగా దాడులకు ప్లాన్ చేస్తున్నా.. సమాచారం అసాంఘిక శక్తులకు ముందుగానే చేరిపోతోంది. ఈ వ్యవహారంలో ఓ పోలీసు అధికారి హస్తం ఉన్నట్లు చర్చ జరుగుతోంది. మట్కా డాన్లు.. క్రికెట్ బుకీలు.. అసాంఘిక శక్తులకు ఆయనో సమాచార కేంద్రం. పోలీసు శాఖ ఎప్పుడు.. ఎక్కడ.. ఎవరిపై దాడులు చేస్తుందో ముందుగానే తెలుసుకోవడం, సంబంధిత వ్యక్తులకు చేరవేసి తన పబ్బం గడుపుకోవడం గత కొంతకాలంగా జరిగిపోతోంది. మట్కా.. పేకాట.. బెట్టింగ్.. ఇతరత్రాలను సమూలంగా అరికట్టేందుకు జిల్లా పోలీసు బాస్ వాటి మూలాల్లోకి వెళుతున్నా, ప్రధాన నిర్వాహకులు చిక్కినట్లే చిక్కి తప్పించుకుపోతుండటం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారం వెనుక సొంత శాఖలోనే ఓ లీకు వీరుడు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా టీడీపీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యేకు ఫోన్ చేసి మరీ దాడుల సమాచారం చేరవేస్తున్నట్లు సమాచారం. ఫలితంగా.. తాడిపత్రి నియోజకవర్గంలోని మట్కా డాన్ రషీద్తో పాటు క్రికెట్ బుకీలు పోలీసులకు చిక్కకుండా తప్పించుకోగలిగారని పోలీసు శాఖలోనే చర్చ జరుగుతోంది. గతంలో జిల్లావ్యాప్తంగా ఉన్న మట్కాడాన్లతో పాటు క్రికెట్ బుకీలు, గ్యాంబ్లర్ల భరతం పట్టేందుకు జిల్లా ఎస్పీ సత్యయేసు బాబు సిద్ధమయ్యారు. ఆ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. జిల్లావ్యాప్తంగా ఉన్న మట్కాడాన్లు, క్రికెట్బుకీల జాబితాను పోలీసు ఉన్నతాధికారులు సిద్ధం చేశారు. జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్లోని కీలకమైన అధికారులకు మాత్రమే ఈ సమాచారం ఉంది. సదరు వ్యక్తులు ఎక్కడెక్కడ ఉన్నారు? ఏ విధంగా పట్టుకోవాలనే పక్కా ప్లాన్ను కూడా అధికారులు వేసుకున్నారు. సిద్ధం చేసిన జాబితాలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే అనుచరులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో సదరు సమాచారాన్ని పోలీసు శాఖలోని ఓ లీకు వీరుడు నేరుగా ఆ మాజీ ఎమ్మెల్యేకే ఫోన్ చేసి చేరవేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అందువల్లే అక్రమార్కులు తప్పించుకున్నారని తెలుస్తోంది. ఈ వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్గా ఉన్నట్టు సమాచారం. పలు ఫిర్యాదులు.. వాస్తవానికి ముందస్తుగా సమాచారాన్ని లీకు చేసిన ఆరోపణలను ప్రధానంగా ఒక పోలీసు అధికారి ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా సదరు పోలీసు అధికారిపై గతంలోనే అనేక ఫిర్యాదులు ఉన్నాయి. అప్పట్లో పూర్తిగా అధికారపార్టీకి తొత్తుగా వ్యవహరించారని కూడా తెలుస్తోంది. ఎన్నికల సమయంలో కూడా అధికార పార్టీ కార్యకర్తగా వ్యవహరించి ప్రతీ సమాచారాన్ని చేరవేయడమే కాకుండా.. పార్టీ మారేందుకు ఎవరెవరు సిద్ధమవుతున్నారు? వారిని జారుకోకుండా చూసుకోవాలని కూడా సూచనలు చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సదరు పోలీసు అధికారిపై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు కూడా సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇలా పట్టుబడకుండా ఉన్న మట్కాడాన్ ప్రధానంగా గోవాలో మకాం వేయడంతో పాటు అప్పుడప్పుడూ తాడిపత్రికి కూడా వచ్చిపోతున్నారనే సమాచారం కూడా పోలీసుల వద్ద ఉంది. అయినప్పటికీ పట్టుకునేందుకు ప్రయత్నించకపోవడం విమర్శలకు తావిస్తోంది. -
పోలీసులకు సవాల్ విసిరిన పేకాట రాయుళ్లు..
మా భర్తలు ఉదయాన్నే పని ఉందని చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోతున్నారు. ఎప్పుడో అర్ధరాత్రి వస్తున్నారు. 24 గంటలూ క్లబ్బుల్లోనే ఉండి మద్యం సేవిస్తూ.. పేకాటలోనే నిమగ్నమవుతున్నారు. ఉన్న ఆస్తులను తగలేస్తున్నారు. ఇంటి వ్యవహారాలు అసలు పట్టించుకోవడం లేదు. అత్యవసరమై ఫోన్ చేసినా స్పందించడం లేదు. పేకాట స్థావరాలను మూయించండి. – ఇదీ ఇటీవల కొందరు మహిళలు జిల్లా పోలీసు అధికారులకు ఫోన్ చేసి వెళ్లబోసుకున్న గోడు సాక్షి, పాలకొల్లు సెంట్రల్/భీమవరం: క్లబ్లు, టౌన్హాళ్లలోని పేకాట స్థావరాలపై పోలీసులు ఉక్కుపాదం మోపడంతో జూదరులు రూటుమార్చారు. పేరొందిన హోటళ్లు, ధనికులు నివాసముండే ప్రాంతాలను ఎంచుకుని జోరుగా పేకాట శిబిరాలు సాగిస్తున్నారు. పోలీసులకే సవాల్ విసురుతున్నారు. జిల్లాలోని భీమవరం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం, ఏలూరు, జంగారెడ్డిగూడెం, నల్లజర్ల తదితర ప్రాంతాల్లో యూత్క్లబ్లు, కాస్మోక్లబ్లు, టౌన్హాళ్లు ఉన్నాయి. వీటిలో ఎంతోకాలంగా పేకాట ఆడడం సహజంగా మారిపోయింది. ఎస్పీగా నవదీప్సింగ్ బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో క్లబ్లపై దృష్టిసారించారు. దీంతో ఉద్యోగ విరమణ చేసిన వారు, కొంతమంది రాజకీయ నాయకులు, ధనికులు పెద్ద మొత్తంలో పేకాట ఆడే క్లబ్లు కొన్ని నెలలుగా దాదాపు మూతపడ్డాయి. పోలీసులు నిత్యం దాడులు చేస్తూ పేకాటను దాదాపుగా అరికట్టారనే చెప్పాలి. అయితే పేకాట ఆడడమే నిత్యకృత్యంగా మారిన వారు దానిని మానలేక కొత్తకొత్త స్థావరాల్లో శిబిరాలు నిర్వహిస్తున్నారు. కొంతకాలం పొరుగు రాష్ట్రాలకు వెళ్లినా.. పోలీసుల దాడులతో బెంబేలెత్తిన జూదరులు కొంతకాలం యానాం, ఖమ్మం, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లి పేకాట ఆడినా.. ఇటీవల మళ్లీ రూటు మార్చి జిల్లాలోని పట్టణాల్లోనే ప్రత్యేక స్థావరాలను ఏర్పాటు చేసుకున్నట్టు సమాచారం. భీమవరం పట్టణంలో పేరొందిన హోటళ్లు, లాడ్జిల్లోనే పెద్ద ఎత్తున జూదం నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఈ హోటళ్లలో అయితే పోలీసు దాడులుండవనే భావనతోనే వీటిని ఎంచుకున్నట్టు సమాచారం. ఈ సమాచారం మేరకు ఇటీవల భీమవరంలోని పలు హోటళ్లల్లో పోలీసులు దాడులు చేసి నిందితులను అరెస్టు చేసి వారినుంచి పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇంకా అనేక చోట్ల పేకాట స్థావరాలు నడుస్తున్నాయని తెలుస్తోంది. అలాగే ధనికులు నివాసం ఉండే ప్రాంతాల్లోని ఖాళీగా ఉన్న విశాలమైన గృహాలను ఆఫీసు కార్యకలపాలంటూ అద్దెకు తీసుకుని వాటిలో గుట్టుచప్పుడు కాకుండా పేకాడుతున్నట్టు సమాచారం. పట్టుబడుతున్నది యువకులే! పోలీసుల దాడుల్లో పట్టుబడుతున్నది అధికంగా యువకులేనని పోలీసులు చెబుతున్నారు. బడాబాబులూ పట్టుబడుతున్నా.. వారిని పోలీసులు తప్పిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది పోలీసు సిబ్బంది జూదరులకు సహకరిస్తూ దాడుల్లో జరిగే అవకాశం ఉంటే ముందుగా వారికి ఫోన్ ద్వారా సమాచారం అందిస్తున్నారనే విమర్శలూ ఉన్నాయి. పోలీసు శాఖ మరింత పకడ్బందీగా ముందుకెళ్తే పేకాటను పూర్తిగా అరికట్టవచ్చని, అయితే స్థానిక పోలీసు సిబ్బందితో కాకుండా పొరుగు స్టేషన్ల సిబ్బందితో దాడులు చేయిస్తే ప్రయోజనం ఉంటుందనే వాదన వినబడుతోంది. పాలకొల్లులో పోలీసులకే సవాల్! పాలకొల్లు టౌన్ హాలులో మంగళవారం పోలీసులు దాడి చేసి 16 మంది జూదరులను అరెస్ట్ చేశారు. గతంలో చాలాసార్లు హెచ్చరికలు జారీ చేసినా క్లబ్ సభ్యులు వినకపోవడంతో ఆఖరికి పోలీసులు దాడులు చేసినట్టు తెలుస్తోంది. దాడి చేసిన సమయంలో కొందరు జూదరులు గోడ దూకి పారిపోయారు. కొందరు పోలీసులను చూసినా కోతాట ఆడుతూనే ఉన్నారు. క్లబ్ సభ్యులు కొందరు తమకు కోర్టు అనుమతి ఉంది.. ఆడే దమ్ముంది.. మీకు ఆపే దమ్ముంటే ఆపుకోవచ్చని పోలీసులకు సవాల్ విసిరినట్టు సమాచారం. ఈ విషయం ఎస్పీ నవదీప్సింగ్ దృష్టికి వెళ్లడంతో ఆయన సీరియస్ అయ్యారు. టౌన్ హాలు వద్ద బుధవారం కూడా భారీగా పోలీసులను మోహరించారు. బుధవారం సాయంత్రం కొందరు సభ్యులు టౌన్హాల్ వద్దకు కార్లలో రావడంతో అక్కడే ఉన్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రత్యేకించి కార్లలో ఇక్కడకు ఎందుకు వచ్చారో తెలుసుకుంటామని, వారు సరైన వివరాలు ఇస్తే వారి అడ్రస్లు తీసుకుని విడుదల చేస్తామని సీఐ ఆంజనేయులు తెలిపారు. కాయిన్లతో ఆట జిల్లాలోని క్లబ్బుల్లో నగదు ప్రత్యక్షంగా టేబుల్పై పెట్టకుండా అక్కడ ఉండే కౌంటర్లలో నగదు చెల్లించి దానికి సరిపడా కాయిన్లు తీసుకుంటారు. వాటితోనే ఆట కొనసాగిస్తారు. -
పోలీసుల నుంచి పారిపోతూ..
లక్నో: పోలీసుల నుంచి పారిపోతూ ఓ యువకుడు ప్రమాదవశాత్తూ బావిలో పడి మృతిచెందాడు. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం చిత్రాకోట్ జిల్లాలో గురువారం జరిగింది. పేకాటాడుతున్న శిబిరంపై పోలీసులు ఒక్కసారిగా దాడి చేయడంతో భయంతో యువకులు పరిగెత్తారు. ఇందులో భోలా(19) అనే యువకుడు గందరగోళంలో పక్కనున్న బావిలో పడిపోయాడు. బాధితుడిని బావిలో నుంచి తీసి స్థానిక ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయాడు. భోలా శరీరంపై గాయాలు ఉన్నాయని, అతన్ని తోటి స్నేహితులే బాగా కొట్టారని బోలా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మట్కా కనికట్టు.. బతుకు తాకట్టు
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం గ్రామానికి చెందిన ఐజయ్య (పేరు మార్చాం) మట్కా జూదానికి బానిసయ్యాడు. జహీరాబాద్లోని ఓ హోటల్లో సర్వర్గా పనిచేస్తూ.. వచ్చిన డబ్బంతా ‘మెయిన్ ముంబై’ మట్కాలో పెట్టాడు. అడ్డగోలు వడ్డీకి అప్పులు చేసి కూడా పందేలు కాశాడు. కానీ ఇప్పటివరకు రూపాయి గెలుచుకున్నది లేదు. చివరికి ఉన్న రెండెకరాల పొలం అమ్ముకున్నాడు. ... వీరే కాదు.. తెలంగాణ పల్లెల్లో వేలకొద్దీ కుటుంబాలు మట్కా జూదానికి చిన్నాభిన్నమవుతున్నాయి. చెమటోడ్చి సంపాదించిన నాలుగు రాళ్లను మాయదారి మట్కానే మింగేస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటకల సరిహద్దు జిల్లాల్లో ఈ జూదం జోరుగా సాగుతోంది. మన రాష్ట్రంలో మట్కాపై నిషేధం ఉన్నా... ఆ రెండు రాష్ట్రాల్లో దానికి చట్టబద్ధత ఉంది. దీంతో ఇక్కడివారు సరిహద్దులు దాటివెళ్లి మరీ పందేల్లో పాల్గొంటున్నారు. కొందరు ఇక్కడి నుంచే ఫోన్ల ద్వారా పందేలు కాస్తున్నారు. దీనిపై ‘సాక్షి’ బృందం క్షేత్రస్థాయి పరిశీలన జరిపింది. మహారాష్ట్రలో మట్కాకు అడ్డా అయిన ‘ఉమ్మర్గ’ పట్టణానికి వెళ్లి పరిశీలించింది. ఈ సందర్భంగా ఎన్నో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగు చూశాయి. అక్కడ మట్కా ఆడుతున్న వారిలో తెలుగువారే ఏకంగా 80 శాతం వరకు ఉండడం గమనార్హం. – వర్ధెల్లి వెంకటేశ్వర్లు, సాక్షి ప్రతినిధి తెల్ల బట్టలు.. మాసిన గడ్డంతో ఉన్న ఈ పెద్దాయన జీవితమంతా జూదంతోనే పండిపోయింది. ఆదిలాబాద్ జిల్లా జైనథ్కు చెందిన ఆయన.. భార్య పుట్టింటి నుంచి తెచ్చిన బంగారు నగలు, వారసత్వంగా వచ్చిన మూడెకరాల భూమిని మట్కాకే తగలేశాడు. చివరికి కుటుంబ సభ్యులను కూడా వదిలేసి వచ్చి మట్కాకు కేంద్రమైన ఉమ్మర్గ (మహారాష్ట్ర)లో మకాం పెట్టాడు. వారానికి రూ.రెండున్నర వేల జీతంతో మట్కా చీటీలు రాసే పని చేస్తున్నాడు. లక్షన్నర మందికిపైగా.. మట్కా జూదం కేవలం సరిహద్దు జిల్లాల్లోనే కాకుండా ఇటీవల ఉమ్మడి వరంగల్, హైదరాబాద్, ఖమ్మం జిల్లాలకు కూడా విస్తరించింది. రాష్ట్రం నుంచి రోజుకు సగటున 1.5 లక్షల మంది మట్కా పందేలు కాస్తున్నట్లు అంచనా. ఇందులో 50 వేల మంది వరకు సరిహద్దులు దాటి మహారాష్ట్ర పట్టణాల్లో ప్రత్యక్షంగా జూదంలో పాల్గొంటున్నట్లు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేకాటపై ఉక్కుపాదం మోపిన నేపథ్యంలో..జూదరులు మట్కా వైపు దృష్టి సారించినట్లు చెబుతున్నారు. అక్కడ చట్టబద్ధమే.. మహారాష్ట్రలో మట్కాకు చట్టబద్ధత ఉంది. మెయిన్ ముంబై, రాజధాని నైట్, న్యూముంబై దబ్రా, సెంట్రల్ ముంబై, శుభలక్ష్మి, న్యూవర్లీ, రాజధానిడే, కల్యాణి.. ఇలా రకరకాల పేర్లలో వందకుపైగా మట్కా కంపెనీలు జూదం నిర్వహిస్తున్నాయి. అన్నీ కూడా నిరుపేదలు, దినసరి కూలీలు, మధ్యతరగతి వారు టార్గెట్గా నడుస్తున్నవే. ఇందులో రోహణ్ ఖత్రీ అనే వ్యక్తి నడిపిస్తున్న మెయిన్ ముంబై, కల్యాణ్ మట్కా కంపెనీలకు 75 శాతం మార్కెట్ వాటా ఉంది. ఈ రెండు ఆటలను కూడా అంతా పనులు ముగించుకొని ఇంటికొచ్చే వేళల్లో నిర్వహిస్తుంటారు. దీంతో వ్యాపారులు, ఉద్యోగులు, రాజకీయ నాయకులు, యువత కూడా మట్కా ఆడుతున్నారు. అంకెలు, సంఖ్యల మాయాజాలం! మెయిన్ ముంబై, కల్యాణ్ కంపెనీలు రోజుకు ఒక ఆట నిర్వహిస్తాయి. 00 నుంచి 999 వరకు సంఖ్యల ఆధారంగా ఈ జూదం నడుస్తుంది. ఒక్కో ఆటలో ప్యానల్, సింగిల్, జోడీ, డబుల్ ప్యానల్ అనే విభాగాలు ఉంటాయి. ప్యానల్ను కూడగా వచ్చిన చివరి సంఖ్యను సింగిల్ అని పిలుస్తారు. ఆట ఓపెన్ కాకముందు ప్యానల్కు పందెం కాస్తే విజేతలకు ప్రతి రూ.10కి రూ.1,400 ఇస్తారు. డబుల్ ప్యానల్ గెలిస్తే రూ.2,400, సింగిల్ నంబర్ గెలిస్తే రూ.95, జోడీ గెలిస్తే రూ.950 చొప్పున చెల్లిస్తారు. చాలా మంది జోడీ నంబర్ మీద పందెం కాస్తుంటారు. ఆట ఓపెన్ అయిన రెండు గంటల్లో ముగుస్తుంది. ఒక్కో ఆటలో 6 లక్షల నుంచి 10 లక్షల మంది వరకు పాల్గొంటారని మట్కా కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచే.. ఆదిలాబాద్ జిల్లా జైనథ్, బేల మండలాలు, ఖానాపూర్, జిన్నింగ్ ఏరియాల్లో, ఖుర్షిద్నగర్, ఆదిలాబాద్లోని తాంసి బస్టాండ్, సంగారెడ్డి జిల్లాలో జహీరాబాద్, న్యాల్కల్ మండలం రాజోల్, సంగారెడ్డి పట్టణం, నారాయణఖేడ్, సమీప గ్రామాలు, కామారెడ్డి జిల్లాలోని పిట్లం, బిచ్కుంద, మహబూబ్నగర్ జిల్లాలోని కృష్ణా్ణ, మన్ననూరు, ఆత్మకూరు, నారాయణపేట మండలాల్లో మట్కా జూదం సాగుతున్నట్లుగా పోలీసుల వద్ద సమాచారం ఉంది. ఇక హైదరాబాద్, వరంగల్తో సహా అన్ని నగర, పట్టణ ప్రాంతాల్లో ఆన్లైన్ పందేలు ఎక్కువగా సాగుతున్నాయి. మొత్తంగా రోజుకు రూ. 3 కోట్ల నుంచి రూ. 5 కోట్ల వరకు చేతులు మారుతున్నట్లు అంచనా. టెక్నాలజీతో విస్తృతమై.. ఒకప్పుడు కోడి పందాల తరహాలో ఒకచోట గుంపులుగా చేరి చీటీలపై నంబర్లతో సాగిన మట్కా దందా... సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో బాగా విస్తృతమైంది. మొబైల్ ఫోన్లో యాప్లు, ఎస్సెమ్మెస్ల స్థాయికి చేరింది. ఎక్కడున్నా, ఎక్కడి నుంచైనా మట్కా ఆడేలా వీలు ఏర్పడింది. ఇక తెలంగాణలో ప్రభుత్వం పేకాటపై ఉక్కుపాదం మోపడంతో జూదం ఆడేవాళ్లు మట్కావైపు మళ్లారు. పేకాట క్లబ్బులు నిర్వహించడంలో అనుభవమున్న వారు మట్కా ఏజెంట్లుగా మారిపోయారు. పందెం రాయుళ్ల నుంచి రూ.2 వేలు రుసుము తీసుకుని ఏడాది పాటు సభ్యత్వం ఇస్తున్నారు. పందెం డబ్బు చెల్లించడం కోసం బ్యాంకు ఖాతా నంబర్ ఇచ్చి, గెలిస్తే బహుమతి డబ్బు ఇవ్వడం కోసం జూదరుల ఖాతా నంబర్లు తీసుకుంటున్నారు. పందెం కాయాలనుకుంటే.. నిర్వాహకుల ఖాతాలో డబ్బులు వేసి, ఫోన్ చేసి ‘మట్కా’ ఓపెనింగ్ నంబరో, ప్యానల్ నంబరో, జోడీ నంబరో చెబితే నోట్ చేసుకుంటారు. గెలిస్తే పందెం కాసినవాళ్ల బ్యాంకు ఖాతాలో నేరుగా డబ్బులు జమ చేస్తారు. పందెం కాయడం సులువుగా మారిపోవడంతో మట్కా మెల్లమెల్లగా విస్తరిస్తోంది. తెలంగాణలో కార్మికుల నుంచి కాంట్రాక్టర్ల వరకు చాలా మంది దీని మాయలో పడిపోతున్నారు. రాష్ట్రం నుంచి లక్ష మందికిపైగా సభ్యత్వం తీసుకున్నట్లు మహారాష్ట్రలోని ఉమ్మర్గలో ఉన్న మట్కా నిర్వాహకులు చెబుతుండడం గమనార్హం. ఊరూరికీ ఏజెంట్ల వ్యవస్థ ముంబై మాఫియా కనుసన్నల్లో నడిచే మట్కా జూదం ఏజెంట్ల వ్యవస్థ మీద ఆధారపడి కొనసాగుతోంది. ప్రతి పట్టణంతో ఇద్దరు ముగ్గురు ఏజెంట్లను నియమించుకుని.. వారు సేకరించే పందెం సొమ్ము నుంచి 10 శాతం కమీషన్గా ఇస్తున్నారు. ఈ ఏజెంట్ల మీద పర్యవేక్షణకు మునీంలు, వారిపై పట్వారీలు.. అలా అధినేత వరకు ఉంటారు. వారికి వేర్వేరుగా కమీషన్లు ఉంటాయి. 1 రాష్ట్రం నుంచి మొదలై.. మట్కా జూదం జరుగుతున్న తీరును గుర్తించడం కోసం ‘సాక్షి’ బృందం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నుంచి మహారాష్ట్రలోని ఉమ్మర్గ పట్టణం వరకు క్షేత్రస్థాయి పరిశీలన చేసింది. ముందుగా జహీరాబాద్లో ఒక ఏజెంట్ను కలవగా.. ఆ సమయంలో న్యాల్కల్ మండలం రాజోల్లో జోరుగా పందేలు సాగుతాయని వెల్లడించాడు. కర్ణాటక, తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న ఆ గ్రామానికి వెళుతుండగా పొలిమేరల్లోనే పందాల గుంపు కనిపించింది. అటువైపు వెళ్లేసరికి పందెం రాయుళ్లు, నిర్వాహకులు అడవిలోకి వెళ్లిపోయారు. అక్కడ జెరప్ప అనే వ్యక్తి, అతని అనుచరులు కలసి మట్కా జూదం నిర్వహిస్తుంటారని.. ప్రతి రోజూ మూడు నాలుగు వందల మంది పందేలు కాస్తుంటారని స్థానికుడొకరు వెల్లడించారు. 2 ఉమ్మర్గ.. పందాలకు అడ్డా అనంతరం ‘సాక్షి’ బృందం మహారాష్ట్రలోని ఉమ్మర్గ పట్టణానికి వెళ్లి పరిశీలించింది. ఈ పట్టణం మట్కాకు ముంబై తర్వాత రెండో రాజధానిగా అభివర్ణిస్తుంటారు. రాష్ట్రం నుంచి చాలా మంది ప్రత్యక్షంగా మట్కా పందేలు కాయడం కోసం ఉమ్మర్గకు వెళుతుంటారు. ఉమ్మర్గ పట్టణం, సమీప గ్రామాల్లో కలిపి 150 వరకు లాడ్జీలు ఉండగా... ఇందులో పది పదిహేను మాత్రమే సాధారణ లాడ్జీలు. మిగతావన్నీ బెట్టింగ్ అడ్డాలే. వాటిల్లోకి ఉచితంగా వెళ్లవచ్చు. డబ్బులు తీసుకుని భోజనం, మద్యం కూడా సమకూర్చుతారు. అసలు ఈ పట్టణ జనాభాలో 40 శాతం మంది మట్కా ఏజెంట్లేనని, సుమారు 1,000 మంది ఏజెంట్లు ఉంటారని స్థానికులు చెప్పారు. ఇక్కడి లాడ్జీల్లో చాలా వరకు తెలంగాణ జిల్లాల నుంచి వచ్చేవారే ఉంటారని వెల్లడించారు. ‘సాక్షి’ బృందం ఓ స్థానిక సహాయకుడిని తోడు తీసుకుని పందేలు కాసే ఓ లాడ్జీలోకి వెళ్లింది. అందులో పది పన్నెండు చిన్న గదులు ఉండగా.. అంతా పందెం రాయుళ్లతో కిక్కిరిసి ఉన్నాయి. వారిలో 80 శాతం మంది తెలుగు వారే కనిపించారు. 20–30 మందితో మాట్లాడగా.. వారంతా హైదరాబాద్, ఆదిలాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల నుంచి వచ్చినట్టు చెప్పారు. రూ. 50 నుంచి రూ. 500 వరకు పందేలు కాస్తున్నారు. 3 పందెం కోసమంటూ వెళ్లి.. తర్వాత ఉమ్మర్గ పట్టణంలోని మహాదేవుని రోడ్డు ప్రాంతంలో ఉన్న మూడంతస్తుల మరో లాడ్జిలోకి పరిశీలన బృందం వెళ్లింది. అక్కడ దాదాపు 30 గదులు ఉండగా.. అన్నింటిలోనూ తెలుగు వాళ్లు కనిపించారు. రిటైర్డ్ ఉద్యోగుల నుంచి వ్యాపారులు, కూలీల వరకు అందరూ వారిలో ఉండడం గమనార్హం. ఒక్కసారి ఇక్కడికి వస్తే వారం రోజుల వరకు ఉంటారని గదులు శుభ్రం చేసే వ్యక్తి వెల్లడించాడు. ‘సాక్షి’ బృందం కూడా పందెం ఆడటానికంటూ ఆ లాడ్జిలోని ఒక గదిలోకి వెళ్లి పరిస్థితిని పరిశీలించింది. వారికి నమ్మకం కలిగించడానికి రూ.100, రూ.50 పందేలు కూడా కాసింది. ఫలితం వచ్చే సమయం దాకా అక్కడున్నవారితో మాటలు కలిపి.. వివరాలు సేకరించింది. 4 మట్కా చీటీలు రాసేది తెలుగువాళ్లే.. ఆ లాడ్జి నిర్వహించే ఏజెంట్ వద్ద క్లర్కుగా పనిచేసే వ్యక్తిని ‘సాక్షి’ బృందం పలకరించగా.. అతను తన పేరు ‘ఎన్.రాజ్’ అని చెప్పాడు. ఉమ్మర్గ, పర్భణి, ధర్మపురి, నాందేడ్ తదితర ప్రాంతాల్లోని మట్కా కేంద్రాలకు తెలుగు వారే ఎక్కువగా వస్తారని వెల్లడించాడు. అందువల్ల కచ్చితంగా తెలుగు వచ్చిన వారినే ఏజెంటుగా, చీటీలు రాసే క్లర్కుగా తీసుకుంటారని చెప్పాడు. క్లర్కుకు వారానికి రూ. 2.5 వేలు జీతంగా ఇచ్చి భోజనం పెడతారని తెలిపాడు. ఫోన్ ద్వారా పందేలు కాయవచ్చని చెబుతూ.. ఆ ఫోన్ నంబర్లు కూడా రాసి ఇచ్చాడు. బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేయాలని.. గెలిస్తే తాము కూడా ఖాతాలో జమ చేస్తామని చెప్పాడు. 5 పెద్ద ఏజెంట్పై ఆరా.. మట్కా కంపెనీల్లో నంబర్వన్ అయిన ‘మెయిన్ ముంబై’లో భారీగా పందెం కాస్తామని, ఆ స్థాయి ఏజెంట్ ఎవరని సాక్షి బృందం ఆరా తీసింది. దాంతో ఓ మధ్యవర్తి రూ.300 తీసుకుని.. పెద్ద ఏజెంట్ నిర్వహించే లాడ్జికి తీసుకెళ్లాడు. ఆ ఏజెంట్ పేరు రతన్ భాయ్ అని చెప్పాడు. బృందం ఆయనను కలవగా.. తెలుగువారని తెలుసుకుని మర్యాదగా ప్రవర్తించారు. భారీగా పందెం కాస్తామంటే ఐదు నుంచి 10 నంబర్ల మీద పెడితే మంచిదని సలహా కూడా ఇచ్చాడు. బ్యాంకులో డబ్బు వేసి.. ఫోన్కాల్, ఎస్సెమ్మెస్ ద్వారానైనా మట్కా స్లాట్ బుక్ చేసుకోవచ్చని చెప్పాడు. ఫోన్ నంబర్లు ఇచ్చాడు. ఆ నంబర్లకు కాల్ చేస్తే.. బ్యాంకు ఖాతాల నంబర్లు ఎస్సెమ్మెస్ చేస్తానన్నాడు. దీంతో పని ముగిసిన బృందం.. సరేనంటూ అక్కడి నుంచి తిరిగి వచ్చేసింది. -
20 మంది జూదరుల అరెస్ట్..
గుంతకల్లు రూరల్: కదిరిపల్లి సమీపంలోని పేకాట స్థావరంపై గుంతకల్లు రూరల్ ఎస్ఐ బాబాజాన్ తన సిబ్బందితో కలిసి బుధవారం సాయంత్రం దాడులు నిర్వహించారు. 20 మంది జూదరులను అదుపులోకి తీసుకుని, వారినుంచి 14 సెల్ఫోన్లు, 7 బైక్లు, రూ. 2 లక్షలకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అడపాదడపా జూదరులు పట్టుపడుతున్నప్పటికీ, ఇంత భారీ ఎత్తున గ్యాంబ్లింగ్ జరుగుతూ పట్టుపడటం ఇదే మొదటిసారి. ఈ నేపథ్యంలో నిఘా మరింత పెంచుతామని ఎస్ఐ తెలిపారు. -
అంగట్లో సాగుతోన్న పేకాట !
యథేచ్ఛగా విస్తరిస్తోన్న మట్కా కరువైన పోలీసుల నిఘా బాన్సువాడ: మూడు రాష్ట్రాలకు సరిహద్దుల్లో ఉన్న బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లో పేకాట బహిరంగంగా కొనసాగుతోంది. కొందరు దళారులు ప్రత్యేకం దృష్టిపెట్టి, పేకాడేందుకు రైతులు, వ్యాపారులను ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. నెల రోజులుగా బాన్సువాడలోని వారాంతపు సంతలో కొందరు వ్యక్తులు వినూత్న రీతిలో పేకాటను సాగిస్తున్నారు. హీరో, హీరోయిన్ల ఫొటోలను ప్రదర్శించి, హీరోకు సింగిల్, హీరోయిన్కు డబుల్ డబ్బులు ఇస్తామంటూ ప్రచారం చేస్తున్నారు. హీరోయిన్ ఫొటోపై రూ.100 పెడితే రూ.300 ఇస్తామని, హీరో ఫొటోపై రూ.100 పెడితే రూ.200 ఇస్తామని చెబుతూ పేకాడిస్తున్నారు. హీరోయిన్ ఫొటోపై డబ్బులు పెడితే, పత్తాలను తీస్తారు. ఆ పత్తాల్లో సదరు హీరోయిన్ ఫోటో ఉంటే, పెట్టిన వ్యక్తికి రెండింతలు డబ్బులు ఇస్తారు. ఇలా వందలాది మంది ఈ పేకాట ఆడుతూ తమ డబ్బులను కోల్పోతున్నారు. ప్రతీ సంతలో ఈ ఆటపై రూ.2 నుంచి రూ.5లక్షల వరకు కోల్పోతున్నారని తెలిసింది. బాన్సువాడ, పిట్లం, బిచ్కుంద, మద్నూర్, జుక్కల్ వారాంతపు సంతల్లో ఈ పేకాట కొనసాగుతోంది. బహిరంగంగా పేకాడుతున్నా పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాన్సువాడ, బిచ్కుంద సర్కిళ్లలో.. కొన్ని రోజులుగా బాన్సువాడ ప్రాంతంలో పేకాట జోరుగా సాగుతోంది. పేకాడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా పోలీస్ యంత్రాంగం హెచ్చరించినా, బాన్సువాడ, బిచ్కుంద సర్కిళ్లలో జోరుగా పేకాట ఆడుతున్నట్లు తెలుస్తోంది. వివిధ ప్రాంతాల్లో పేకాడుతున్నట్లు సమాచారం ఉన్నప్పటికీ దాడులు చేయకుండా వదిలేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పోలీసులు పట్టించుకోకపోవడంతోనే పేకాట యథేచ్ఛగా కొసాగినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. పలుచోట్ల పోలీసుల దాడులు.. గతంలో బాన్సువాడ పట్టణంలో ఓ మహిళ నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. అలాగే తాడ్కోల్ రోడ్డుపైన పేకాట స్థావరంపై దాడి చేసి సుమారు రూ.3 లక్షల వరకు స్వాధీనం చేసుకున్నారు. అయినా పేకాటరాయుళ్లలో మార్పు రావడం లేదు. వర్ని, బీర్కూర్, కోటగిరి, బాన్సువాడ ప్రాంతాల్లో కొందరు పలుకుబడి కలిగిన వ్యక్తులు పేకాట ఆడిస్తున్నట్లు ప్రచారం ఉంది. బాన్సువాడ శివారులోని తాడ్కోల్, బోర్లం, ఇస్లాంపుర, రాజారాం దుబ్బ ప్రాంతాల్లో నిరంతరం పేకాట ఆడుతున్నారు. వీరు ప్రత్యేకంగా శిబిరాలను ఏర్పాటు చేసుకొని పేకాడుతుండగా, పోలీసులు రాకుండా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలిసింది. గతేడాది క్రితం పేకాట జోరుగా సాగగా, లక్షలాది రూపాయలు చేతులు మారాయి. రాజకీయ పలుకుబడితో.. గతంలో బీర్కూర్ మండలంలో పేకాట ఆడుతున్నవారిపై ఎస్పీ ప్రత్యేకంగా దాడులు నిర్వహించి పేకాటకు పూర్తిగా అడ్డుకున్నారు. అయితే ప్రస్తుతం మళ్లీ పేకాట ఆడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. రాజకీయ పలుకుబడితో పేకాటను కొనసాగిస్తున్నారు. మరోవైపు బిచ్కుంద సర్కిల్ పరిధిలోనూ పేకాట ఆడుతున్న వారు అధికంగా ఉన్నారని తెలిసింది. వీరు ఎక్కువగా పొలాల్లో ఆడుతున్నట్లు సమాచారం. దెగ్లూర్ నుంచి వచ్చి.. మట్కా నంబర్లు తెచ్చి.. సరిహద్దు మండలాల్లో మట్కా కూడా విస్తరిస్తోంది. మహారాష్ట్రలోని దెగ్లూర్ నుంచి పలువురు ఏజెంట్లు వచ్చి మట్కా నంబర్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది. మట్కా నిర్వాహకులు కొందరు ఏజెంట్లను నియమించి బాన్సువాడ ప్రాంతానికి పంపుతున్నారు. వీరు మట్కా నంబర్లను విక్రయించి, సెల్ఫోన్లపై నంబర్లును వెల్లడిస్తూ మట్కాను విస్తరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత యాసంగి సీజన్లో రైతులకు డబ్బులు రావడంతో వారిని లక్ష్యంగా చేసుకుని కొందరు మట్కాను కొనసాగిస్తున్నట్లు సమాచారం. సమాచారం అందిస్తే చర్యలు పేకాట, మట్కా నిర్వాహకుల పై చర్యలు తప్పవు. ఎవరికైనా సమాచారం లభిస్తే వెంటనే పోలీసులకు చేరవేయాలి. దాడులు చేసి పట్టుకుంటాం. పేకాట, మట్కాపై ఉపేక్షించేది లేదు. కఠిన చర్యలు తీసుకుంటాం. – నర్సింహారావు, డీఎస్పీ, బాన్సువాడ -
నంద్యాలలో పేకాట రాయుళ్లు అరెస్ట్
-
పేకాటలో కొట్లాట.. ఒకరి మృతి
హైదరాబాద్: పేకాట సందర్భంగా తలెత్తిన తగాదా ఒకరి మరణానికి కారణమైంది. బొల్లారం బొమ్మనకుంటలో సోమవారం రాత్రి కొందరు వ్యక్తులు పేకాట ఆడారు. ఈ సందర్భంగా ఏర్పడిన విభేదాలతో వారు కొట్టుకున్నారు. తీవ్రంగా గాయపడిన జగద్గిరిగుట్టకు చెందిన శ్రీనివాసాచారి(40) అక్కడికక్కడే చనిపోయాడు. ఇందుకు సంబంధించి ఒక వ్యక్తి మంగళవారం ఉదయం బొల్లారం పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
ఆకస్మిక దాడులు.. 6.5 కోట్ల నగదు పట్టివేత
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీగా హవాలా సొత్తును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని చాందినీ చౌక్ ప్రాంతంలో డీఆర్ఐ అధికారులు ఆదివారం రాత్రి దాడులు నిర్వహించి పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. దాంతో పాటు వారి వద్ద నుంచి రూ.6.5 కోట్ల నగదుతో పాటు 21 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. తమకు అందిన సమాచారం మేరకు.. హవాలా నిర్వహించి మోసాలకు పాల్పడుతున్న స్థావరాలపై ఏకకాలంలో దాడులు నిర్వహించినట్లు ఓ అధికారి తెలిపారు. హవాలా గ్యాంగులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. -
పోలీసులు దాడి: 21 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్
ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని సీవీఎన్ క్లబ్లోని పేకాట శిబిరంపై గురువారం తెల్లవారుజామున పోలీసులు దాడి చేశారు. పేకాట నిర్వాహకుడి అశోక్తోపాటు 21 మంది పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని వన్టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ దాడికి ఏఎస్పీ నేతృత్వం వహించారు. -
8 మంది పేకాట రాయుళ్ల అరెస్టు
హైదరాబాద్: అంబర్పేట పోలీసులు పేకాట స్థావరంపై దాడి చేసి, 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. బుధవారం ఉదయం గోల్నాకలోని పెరల్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో కొందరు పేకాడుతున్నారన్న సమాచారం మేరకు దాడి చేశారు. ఈ సందర్భంగా పేకాడుతున్న 8మందిని అదుపులోకి తీసుకోవటంతో పాటు వారి నుంచి 7 సెల్ఫోన్లు రూ. 33,250 స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేశారు. -
16 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్
గుంటూరు : నగరంలోని శ్రీనగర్లో పేకాటస్థావరంపై శనివారం పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో 16 మంది పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. లక్షా 16 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
10 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్
హైదరాబాద్ : నగరంలోని చైతన్యపూరిలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా పేకాడుతున్న 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.36,210 నగదుతోపాటు ఏడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. చైతన్యపురిలోని ఓ ఇంట్లో యువకులు పేకాట ఆడుతున్నారని ఆగంతకులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే సదరు ఇంటిపై దాడి చేసి పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. -
పేకాటరాయుళ్లు అరెస్ట్: భారీగా నగదు స్వాధీనం
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం బొల్లకడియంలో14 మంది పేకాటరాయుళ్లను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 5.5 లక్షల నగదు, 13 సెల్ ఫోన్లతోపాటు 5 బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ... దర్యాప్తు చేస్తున్నారు. -
పేకాటరాయుళ్లు అరెస్ట్: నగదు స్వాధీనం
చిత్తూర్తు : చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం బోయకొండ గ్రామంలో 20 మంది పేకాటరాయుళ్లను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 2.6 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే 17 సెల్ ఫోన్లుతోపాటు 5 కార్లు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పేకాట స్థావరంపై దాడి.. ఐదుగురి అరెస్ట్
రాజాపేట: నల్లగొండ జిల్లా రాజాపేట మండలం నమిల గ్రామంలో ఓ పేకాట స్థావరంపై ఆదివారం అర్ధరాత్రి పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా పేకాడ ఆడుతున్న ఐదుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 30 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ వీరయ్య తెలిపారు. -
పేకాటరాయుళ్లు అరెస్ట్: నగదు స్వాధీనం
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా పాలకొండ బెల్లంకి వీధిలో పేకాటస్థావరంపై పోలీసులు ఆదివారం దాడి చేశారు. ఈ సందర్భంగా 10 మంది పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 30 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్స్టేషన్కు తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పేకాటరాయుళ్లు అరెస్ట్ : రూ. 25 వేలు స్వాధీనం
ఒంగోలు : ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలోని పేకాట స్థావరంపై పోలీసులు గురువారం దాడి చేశారు. ఈ సందర్భంగా నలుగురు పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 25 వేల నగదు పోలీసులు స్వాధీనం చేసుకుని.... సీజ్ చేశారు. వారిని పోలీస్ స్టేషన్కి తరలించి.. వారిపై కేసు నమోదు చేశారు. -
పేకాటరాయుళ్లు అరెస్ట్: నగదు స్వాధీనం
మెదక్ : మెదక్ జిల్లా గజ్వేల్ మండలం గిరిపల్లిలో బుధవారం పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. నలుగురు పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 56 వేలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పేకాట స్థావరంపై పోలీసుల ఆకస్మిక దాడి
హైదరాబాద్సిటీ: కందుకూరు పరిధిలో పేకాట స్థావరంపై ఆదివారం పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు. అందిన సమాచారం మేరకు పోలీసులు పేకాటాడుతున్న ఏడుగురి అరెస్ట్ చేశారు. వారి నుంచి సుమారు రూ.35 వేల నగదు, 7 సెల్ఫోన్లు, రెండు సెట్ల కార్డులు, 3 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నంద్యాలలో పేకాటరాయుళ్లు అరెస్ట్
కర్నూలు : కర్నూలు జిల్లా నంద్యాలలోని మహానందీశ్వర ఆలయ సమీపంలో పేకాడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 32 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఉప్పల్లో పోలీసుల తనిఖీలు
హైదరాబాద్: నగరంలోని ఉప్పల్లో పేకాట స్థావరంపై ఎస్ఓటీ పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు. గురువారం తనిఖీలు చేపట్టిన పోలీసులు 16 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు రూ. 80 వేల నగదు, 16 సెల్ఫోన్లు స్వాధీనం చేసున్నారు. కేసు నమోదు చేసి నిందితులను ఉప్పల్ స్టేషన్కు తరలించారు. -
మూసపేటలో 12 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్
హైదరాబాద్ : కూకట్పల్లి సమీపంలోని మూసపేటలో బుధవారం పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. 12 మంది పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 81 వేల నగదుతోపాటు తొమ్మిది సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దాబాలపై ఎస్వోటీ పోలీసుల దాడి
రంగారెడ్డి: రంగారెడ్డి యాచారం మండలం తమ్మలోనిగూడ గేట్ సమీపంలో ఉన్న ఓ దాబాలపై సోమవారం ఎస్వోటీ పోలీసులు దాడులు చేశారు. దాబాలో పేకాటాడుతున్న 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారినుంచి 27 వేల నగదుతో పాటు 8 సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
కోడిపందాల స్థావరాలపై దాడి: ఏడుగురు అరెస్ట్
విజయనగరం: విజయనగరం జిల్లా ఎల్ కోట మండలం తామరాపల్లిలో కోడిపందాల స్థావరాలపై బుధవారం పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు. వారి వద్ద నుంచి రూ. 18,00 నగదుతోపాటు ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఐదుగురు జూదరుల అరెస్ట్
కంకిపాడు: కృష్ణా జిల్లా కంకిపాడు మండలం నెప్పల్లిలో ఓ పేకాట శిబిరంపై ఆదివారం రాత్రి పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐదుగురు పట్టుబడ్డారు. వారి నుంచి రూ.10, 410 నగదు స్వాధీనం చేసుకున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఎస్ఐ హనీష్ నేతృత్వంలో ఈ దాడులు జరిగాయి. నిందితులపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. -
పేకాట శిబిరాలపై దాడులు
హైదరాబాద్: నగరంలోని ఎస్ఆర్ నగర్ పీఎస్ పరిధిలోని ఎల్లారెడ్డిగూడలోని పేకాట శిబిరాలపై మంగళవారం వేకువజామున పోలీసులు దాడి చేశారు. ఓ ఇంట్లో పేకాడుతున్నారన్న సమాచారం మేరకు ఎస్వోటీ పోలీసులు దాడి చేశారు. ఈ తనఖీల్లి 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిని ఎస్ఆర్ నగర్ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
10 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్
హైదరాబాద్ : నేరెడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరాలపై ఎస్వోటీ పోలీసులు గురువారం దాడి చేశారు. ఈ సందర్భంగా 10 మంది పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 1.57 లక్షల నగదుతోపాటు 10 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తెనాలిలో నలుగురు పేకాటరాయుళ్లు అరెస్ట్
గుంటూరు : గుంటూరు జిల్లా తెనాలి బీసీ కాలనీలో పేకాట స్థావరంపై పోలీసులు ఆదివారం దాడి చేశారు. ఈ సందర్భంగా నలుగురు పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 44 వేలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్కి తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలాగే జిల్లాలోని అమృతలూరు మండలం పెదపూడిలో ముగ్గురు కోడిపందాల నిర్వహకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి మూడు కోళ్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు. -
పేకాట స్ధావరాలపై దాడి: 19 మంది అరెస్టు
అత్తాపూర్: నగరంలోని రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో 19 మంది పేకాట రాయుళ్లను పోలీసులు ఆదివారం రాత్రి అరెస్ట్ చేశారు. ఇంద్రానగర్లోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు ఎస్ఐ నారాయణరెడ్డి సిబ్బందితో కలసి దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న 19 మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.10, 500 స్వాధీనం చేసుకున్నారు. అదే ఇంటి నుంచి మాంసం కత్తులను కూడా స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నారు. -
ఎనిమిది మంది పేకాటరాయుళ్లు అరెస్ట్
కర్నూలు: కర్నూలు జిల్లా కోయిలకుంట్ల మండలం కంభమల వద్ద పేకాట స్థావరంపై పోలీసులు శనివారం దాడి చేశారు. ఎనిమిది మంది పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 18,500 స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘ఆడుకోండి.. నేను చూసుకుంటా’
ఏలూరులో బరితెగించిన తెలుగు తమ్ముళ్లు ముక్కలాట రూ. కోటిపైనే ఏలూరు : అక్కడో... ఇక్కడో... ఎక్కడో ఎందుకు. అధికారంలో ఉన్న టీడీపీ నాయకుడి ఇంట్లోనే పేకాట ఆడుకుంటే పోలీస్ యంత్రాంగం అటువైపు కన్నెత్తి చూడదు. ఇదే ప్లాన్ను ఏలూరులో పక్కాగా అమలు చేయాలని టీడీపీ నేతలు, బడాబాబులు భావించారు. బడా పేకాటరాయుళ్లు అనుకున్నదే తడవుగా నగరంలోని ఓ సీనియర్ టీడీపీ నేత వీరికి బంపర్ ఆఫర్ ఇచ్చారు. నగర నడిబొడ్డున ఉన్న తన ఇంట్లోనే విచ్చలవిడిగా పేకాట ఆడుకోవడానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. ఊరికే కాదండోయ్.. ఇందుకు రోజుకు రూ.50 వేలు చెల్లించుకోండని ఓ రేటు కూడా నిర్ణయించారు. నగరంలో ఇంకెక్కడ పేకాట ఆడినా పోలీసులకు ఎంతోకొంత మామూళ్లు ఇచ్చుకోవాలి. ఆ మొత్తమే సదరు నేతకు ఇచ్చుకుంటే ‘ఫుల్ సెక్యూరిటీ’ అని భావించిన పేకాటరాయుళ్లు ఆ డీల్కు ఒప్పుకుని ఎంచక్కా పేకాటలో మునిగితేలుతున్నారు. వినడానికి ఒకింత ఆశ్చర్యంగా అనిపించినా ఏలూరు నగర నడిబొడ్డున కొద్దినెలలుగా ఓ టీడీపీ నేత ఇంట్లో పేకాట దందా అడ్డూఅదుపు లేకుండా సాగిపోతోంది. టీడీపీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి సోదరుడు, ఆర్ఆర్ పేటలోని ఓ వస్త్ర దుకాణం యజమాని, ఏలూరులో ప్రభుత్వాసుపత్రికి చెందిన ఓ కాంట్రాక్టర్, మాదేపల్లికి చెందిన చేపల చెరువుల యజమాని, కృష్ణాజిల్లా కైకలూరుకు చెందిన ఓ ఆరుగురు బడా వ్యాపారవేత్తలు.. ఇలా 20నుంచి 25మంది వరకు ‘బిగ్ షాట్స్’ ఆ నేత ఇంట్లో నిత్యం పేకాటలో మునిగి తేలుతున్నట్టు తెలుస్తోంది. కుటుంబ సభ్యులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా భవనంపై ప్రత్యేకంగా ఓ పోర్షన్ను సదరు ప్రజా ప్రతినిధి ఈ జూదానికి కేటాయించినట్టు సమాచారం. ‘ఆడుకోండి.. నేను చూసుకుంటా’ ప్రతిరోజూ సాయంత్రం 4గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఆ ఇంట్లో పేకాట ఆడుకున్నందుకు గాను రోజుకు రూ.అర లక్ష చొప్పున ఇస్తున్న పేకాటరాయుళ్లు ఇటీవల కాలంలో రూ.కోటి ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ మధ్యన కొందరు ఆటగాళ్లు.. వామ్మో కోటి ఇచ్చామా అని లెక్క వేసుకుని కొద్దిరోజులు అక్కడ ‘ఆట’ ఎత్తేశారట. దాంతో సదరు నేత ఫోన్చేసి ‘ఏమిటి రావడం లేదు. రూ.50 వేలు ఎక్కువనుకుంటే.. రూ.40 వేలు ఇవ్వండి. అదీకాదంటే రూ.30 వేలు ఇచ్చి ఆడుకోండి’ అని ‘డిస్కౌంట్’ ఆఫర్ ఇచ్చినట్టు చెబుతున్నారు. దీంతో అక్కడ జూదక్రీడ మళ్లీ జోరుగా సాగుతోందని అంటున్నారు. ముందుగా రూ.15 లక్షల వరకు కోత ఆట (కోసాట), ఆ తర్వాతే ఓకులాట ఆడతారని, మొత్తంగా రోజుకు రూ.కోటిపైనే చేతులు మారతాయని సమాచారం. ఆ టీడీపీ నేత ఊళ్లో ఉన్నా లేకున్నా ఆట మాత్రం నిర్విరామంగా కొనసాగేలా ఏర్పాట్లు చేసినట్టు చెబుతు న్నారు. వాస్తవానికి ఇక్కడ పెద్దమొత్తంలో పేకాట నడుస్తోందనే విషయం నగరంలోని కొంతమంది పోలీసులకు తెలిసినా దాడులు చేసే సాహసం చేయడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. పొలాలు, కాలువ గట్లపై పేకాట ఆడే వాళ్లను కాళ్లు చేతులు విరిగేట్టు చితకబాదే పోలీసులు నగరంలో నడిబొడ్డున రూ.కోట్లలో విచ్చలవిడిగా సాగుతున్న పేకాట శిబిరంవైపు మాత్రం కన్నెత్తి చూడటం లేదు. -
11 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్
విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా పాడేరు మండలం గుత్తులపుట్టులో పేకాట స్థావరాలపై పోలీసులు శుక్రవారం దాడి చేశారు. 11 మంది పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 20 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
18 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్
హైదరాబాద్: నగరంలోని మేడిపల్లిలోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్న సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. మంగళవారం ఉదయం చేపట్టిన దాడుల్లో పేకాట ఆడుతున్న 18 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.35 వేల నగదు, 8 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి స్టేషన్కు తరలించారు. -
నలుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్
నెల్లూరు: నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం ముత్యాలపాడులో పేకాటస్థావరాలపై పోలీసులు దాడి చేశారు. శుక్రవారం ఉదయం నిర్వహించిన ఈ తాడుల్లో నలుగురు వ్యక్తులను పట్టుకున్నారు. వారి నుంచి రూ. 24 వేల నగదు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. -
8 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్
గుంటూరు(వినుకొండ): వినుకొండ పట్టణంలోని మార్కాపురం రోడ్డులో ఉన్న ఓ ఫర్నిచర్ షాపులో ఆదివారం రహస్యంగా పేకాటాడుతున్న వారిపై పోలీసులు రైడ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.3.65 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు స్పెషల్ బ్రాంచి పోలీసులు తెలిపారు. -
12 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్
అనంతపురం : అనంతపురం జిల్లా గుంతకల్లు సమీపంలోని మొమినాబాద్లో పేకాట స్థావరంపై పోలీసులు శనివారం అకస్మిక దాడి చేశారు. 12 మంది పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 60 వేల నగదుతోపాటు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారని పోలీస్ స్టేషన్కి తరలించారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
9 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్
మహబూబ్నగర్ : మహబూబ్నగర్ జిల్లా కొత్తకోటలో పేకాటస్థావరంపై పోలీసులు శుక్రవారం దాడి చేశారు. 9 మంది పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.5 వేల నగదుతోపాటు ఆరు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పేకాట రాయుళ్లు అరెస్ట్: రూ. 80 వేలు సీజ్
గుంటూరు : గుంటూరు జిల్లా కొల్లిపర మండలం తూములూరులోని పేకాట శిబిరంపై పోలీసులు గురువారం దాడి చేశారు. ఈ సందర్భంగా 18 మంది పేకాటరాయుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 80 వేలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు. పేకాటరాయుళ్లపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
31 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్
ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం చిదిమెళ్లలోని పేకాట స్థావరాలపై పోలీసులు శనివారం దాడులు చేశారు. ఈ సందర్భంగా 31 మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 7.6 లక్షల నగదుతోపాటు 29 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పదిమంది పేకాట రాయుళ్లు అరెస్టు
రైల్వే కోడూరు(వైఎస్సార్ జిల్లా): పది మంది పేకాట రాయుళ్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన రైల్వే కోడూరు మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. మండలంలోని మలంపాలెం గిరిజన కాలనీ సమీపంలో పేకాట ఆడుతున్నరాన్న సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి పదిమందిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 30,780 స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ శివప్రసాద్ తెలిపారు. -
8 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్
హైదరాబాద్ : కుషాయిగూడ పారిశ్రామికవాడలోని పేకాట స్థావరాలపై ఎస్ఓటీ పోలీసులు శనివారం తెల్లవారుజామున దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 8 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 42 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. అలాగే బైకులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. కుషాయిగూడలోని పేకాట స్థావరాలపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. -
కారులో హైటెక్ జూదం!
ఆదిబట్ల: ప్రెస్ స్టిక్కర్ను అంటించుకొని టవేరా వాహనంలో తిరుగుతూ హైటెక్ పద్ధతిలో పేకాటాడుతున్న ఎనిమిది నిందితులను శుక్రవారం ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. సీఐ అశోక్ కుమార్ కథనం ప్రకారం.. నగరంలోని దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం ప్రాంతాలకు చెందిన గంగారామ్ రాజేష్, దిలోవర్ రాజేష్, దేవీ అమర్, మట్టిపల్లి అయిలేష్, పూజారి కృష్ణ, బుచ్చి వెంకటేష్, బోడి నీరజ్రెడ్డి, నల్లమోతు మధులు ఓ గ్రూప్గా ఏర్పడ్డారు. వీరు తరచూ ఓ టవేరా వాహనంను అద్దెకు తీసుకొని అందులోని సీట్లు తొలగించి లాంగ్ డ్రైవ్కు వెళ్తూ పేకాటాడుతున్నారు. ఈ క్రమంలో ఎస్ఓటీ పోలీసులు శుక్రవారం ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని బొంగ్లూర్ గేట్ ఔటర్ రింగ్ రోడ్ టోల్గేట్ వద్ద వాహనాన్ని పట్టుకున్నారు. ఎనిమిది మంది జూదరులను అదుపులోకి తీసుకున్నారు. మొబైల్ పేకాట నిర్వాహకులు ప్రసాద్, రమేష్ వాహనం దిగి పరారయ్యారు. పట్టుబడిన జూదరుల నుంచి రూ. 2.20లక్షల నగదు, 9 సెల్ఫోన్లు, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఎవరికీ అనుమానం రాకుండా జూదరులు వాహనాన్ని ప్రెస్ స్టిక్కర్ అంటించుకొని తిరుగుతుండడం గమనార్హం. నెలలో పది, పదిహేను సార్లు ఇలా వాహనం అద్దెకు తీసుకొని లాంగ్ డ్రైవ్కు వెళ్తుంటామని జూదరులు తెలిపారు. ఈ మేరకు ఆదిబట్ల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
14 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్
నల్లగొండ : పేకాట ఆడుతున్న 14 మందిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. ఈ ఘటన శుక్రవారం నల్లగొండ జిల్లా భూదాన్పోచంపల్లి మండలం దొతిగూడెం గ్రామం సమీపంలో చోటు చేసుకుంది. హైదరాబాద్కి చెందిన 14 మంది యువకులు దొతిగూడెం గ్రామ సమీపంలోని ఓ కోళ్ల ఫారంలో పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు కోళ్లఫారం వద్దకు చేరుకొని పేకాట ఆడుతున్న 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి రూ. 29వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను భువనగిరి కోర్టులో హాజరుపర్చారు. కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. -
పేకాట శిబిరంపై దాడి: 8మంది అరెస్ట్
మాగనూర్(మహబూబ్నగర్): మహబూబ్నగర్ జిల్లా మాగనూర్ మండల పరిధిలోగల మారుతీనగర్లో పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేసి, 8మందిని అదుపులోకి తీసుకున్నారు. మారుతీ నగర్లోని బహిరంగ ప్రదేశంలో పేకాట ఆడుతున్నారని సమాచారంతో మంగళవారం వేకువజామున ఎస్.ఐ. ఫరాద్ హుసేన్ తన సిబ్బందితో దాడి చేశారు. పేకాట రాయుళ్ల నుంచి రూ.32, 440 నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించారు. -
లాడ్జిపై పోలీసుల దాడి: పేకాటరాయుళ్లు అరెస్ట్
హైదరాబాద్: బాలానగర్లోని ఓ లాడ్జిపై పోలీసులు శుక్రవారం దాడి చేశారు. ఈ సందర్భంగా ఏడుగురు పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి భారీగా నగదుతోపాటు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల కాలంలో బాలానగర్ పరిధిలో పేకాట స్థావరాలు అధికమయ్యాయి. ఈ నేపథ్యంలో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ క్రమంలో పోలీసులు ఆ ప్రాంతంలో లాడ్జిలపై దాడులు నిర్వహించారు. -
11 మంది పేకాట రాయుళ్ల అరెస్ట్
హిందూపురం: అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో పేకాట స్థావరాలపై మంగళవారం పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న 11 మందిని అరెస్ట్ చేశారు. పేకాట సమాచారం అందుకున్న పోలీసులు పట్టణంలోని దండు రోడ్డులో వివిధ చోట్ల దాడులు నిర్వహించి అదుపులోకి తీసుకోగా, వారి నుంచి రూ.1,09,750 నగదు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
8మంది పేకాట రాయుళ్ల అరెస్ట్
నల్గొండ: నల్గొండ జిల్లాలో పేకాట స్థావరాలపై శుక్రవారం పోలీసులు దాడులు నిర్వహించారు. వేములపల్లి మండలంలోని కుక్కడం గ్రామ శివారులో పేకాట ఆడుతున్న 8 మందిని గురువారం అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ విజయ్కుమార్ తెలిపారు. పేకాటరాయుళ్ళ వద్ద నుంచి రూ.25,120 నగదు, 4 ద్విచక్ర వాహనాలు, ఒక కారును స్వాధీన పర్చుకున్నట్లు చెసుకొని వారిని మిర్యాలగూడ కోర్టుకు రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. తెలిపారు. -
8మంది పేకాట రాయుళ్ల అరెస్ట్
సాలూరు : విజయనగరం జిల్లా లో పేకాట స్ధావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. రోజూ పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో శుక్రవారం ఆకస్మిక దాడి చేసిన పోలీసులు పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం జిల్లా పాచిపెంట మండలంలోని కంచేడువలస గ్రామంలో పేకాట ఆడుతున్న ఓ ఇంటిపై పోలీసులు శుక్రవారం సాయంత్రం దాడి చేశారు. ఈ దాడిలో ఎనిమిదిమందిని అరెస్ట్ చేయడంతో పాటు వారి నుంచి రూ.11,700 నగదు, ఆటో, బైకు, ఏడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. -
మర్రివాడలో పేకాట రాయుళ్లు అరెస్ట్
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం మండలం మర్రివాడ గ్రామంలో పేకాట శిబిరంపై శనివారం తెల్లవారుజామున పోలీసులు దాడి చేశారు. ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 3 వేల నగదుతోపాటు మూడు బైకులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్కు తరలించారు. -
పేకాట రాయుళ్లు అరెస్టు
తెనాలి రూరల్(గుంటూరు): గుంటూరు జిల్లా తెనాలి పట్టణ పరిధిలో పేకాట శిబిరంపై ఆదివారం సాయంత్రం పోలీసులు దాడి చేశారు. వివరాలు...పినపాడు సమీపంలోని పొలాల్లో పేకాట ఆడుతున్న బృందంపై ఎస్సై రవీంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన దాడిలో 9 మందిని అరెస్టు చేశారు. పోలీసులు వారి నుంచి రూ.35 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. -
చింతలపూడిలో బెట్టింగ్ రాయుళ్ల అరెస్ట్
పశ్చిమగోదావరి: పశ్చిమగోదావరి జిల్లా చింతలపుడి మండలం సీతానగరంలో క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.5,200ల నగదు, మూడు బైక్ లు, ఒక ఎల్ఇడి టీవీ, 5 సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. (చింతలపుడి) -
పేకాట రాయుళ్లు అరెస్ట్
అనంతపురం: అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలంలోని కోడికొండ చెక్పోస్ట్ వద్ద పేకాట స్థావరంపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. పేకాట ఆడుతున్న 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 6 లక్షల రూపాయల నగదుతో పాటు, నాలుగు కార్లు స్వాధీనం చేసుకున్నారు. (చిలమత్తూరు) -
మట్కాజూదంపై పోలీసుల ఉక్కుపాదం
అనంతపురం: రోజురోజుకూ పెరిగిపోతున్న మట్కా జూదంపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. వివరాలు...అనంతపురం జిల్లా ఉరవకొండలో పక్కా వ్యూహంతో మట్కాస్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో పోలీసులు 8 మందిని అరెస్ట్ చేశారు. అంతేకాకుండా వారినుంచి రూ. 1.75 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. -
పేకాట రాయుళ్లపై పంజా
విజయనగరం పట్టణంలోని చిక్కాల వీధిలో పేకాట అడుతున్న ఏడుగురు పేకాట రాయుళ్లను పోలీసులు శనివారం సాయంత్రం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 29,970, ఏడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. -
హయత్నగర్లో పేకాట రాయుళ్ల అరెస్ట్
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం అబ్దుల్లాపూర్మెట్లోని పేకాట స్థావరాలపై పోలీసులు దాడి చేశారు. పేకాట ఆడుతున్న తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. లక్షా 25 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. అలాగే రెండు కార్లు, నాలుగు బైకులతోపాటు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్కు తరలించారు. -
పేకాటరాయుళ్ల అరెస్ట్
ఒంగోలు: ప్రకాశం జిల్లా నాగులవంకలో ఆదివారం పోలీసులు పేకాట స్థావరంపై దాడి చేశారు. పోలీసులు ఆరుగురు పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.87 వేలు స్వాధీనం చేసుకున్నారు. -
ట్రాక్టర్పై పేకాటరాయుళ్లు ఊరేగింపు
కర్నూలు: కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండల కేంద్రంలోని పేకాట క్లబ్పై మంగళవారం పోలీసులు ముకుమ్మడి దాడులు నిర్వహించారు. ఈ సందర్బంగా 50 మంది పేకాట రాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. పేకాటరాయుళ్ల వారి వద్ద నుంచి భారీగా నగదు, సెల్ ఫోన్లుతోపాటు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పేకాటరాయుళ్లను ట్రాక్టర్పై ఊరేగిస్తూ... పోలీసు స్టేషన్కు తరలించారు. కొలిమిగుండ్లలో పేకాటరాయుళ్లు నిత్యం పేకాట క్లబ్లో కాలం వెళ్లబుచ్చుతున్నారు. దాంతో వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ క్రమంలో పోలీసులు ముకుమ్మడి దాడులు నిర్వహించారు. -
పేకాటరాయుళ్ల అరెస్ట్; నగదు, సెల్ ఫోన్లు స్వాధీనం
హయత్ నగర్ : నగరంలోని హయత్ నగర్ బృందావన్ కాలనీలో బుధవారం పేకాటస్థావరంపై పోలీసులు దాడులు జరిపారు. అందిన సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు పేకాట ఆడుతున్న ఐదుగురు పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 4 సెల్ ఫోన్లు, రూ. 9, 300 లను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. -
పేకాట స్ధావరాలపై దాడి, మహిళల సహా 8మంది అరెస్ట్
హైదరాబాద్ : పేకాట స్ధావరాలపై సైబారాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు గత కొంతకాలంగా నగర శివారు ప్రాంతాలను అడ్డాగా చేసుకుని ఇష్టానుసారంగా జరుగుతున్న పేకాట స్థావరాలపై నిరంతరంగా దాడులు జరుపుతున్న నేపథ్యంలో తాజాగా మరో అడ్డా గుట్టురట్టయింది. 15 రోజుల క్రితం రామంతాపుర్లో ఓ ఇంటిపై ఎస్వోటీ సీఐ పుష్పన్కుమార్ అధ్వర్యంలో జరిపిన దాడిలో పురుషులతో పాటు ముగ్గురు మహిళలు పట్టుబడిన విషయం తెలిసిందే. తాజాగా నిన్నరాతి ఎస్వోటీ సీఐ వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో మణికొండలోని ల్యాంకో హిల్స్ ఫ్లాట్లో జరిపిన దాడిలో ఇద్దరు మహిళలు సహా ఎనిమిదిమంది ప్రముఖ వ్యక్తులు అడ్డంగా బుక్కయిపోయారు. వీరి వద్ద నుంచి రూ.3.48 లక్షల నగదు, 8 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
పేకాట స్థావరాలపై దాడులు, ఏడుగురి అరెస్ట్
హైదరాబాద్ : హైదరాబాద్ నాచారంలో పేకాట స్థావరాలపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా ఏడుగురు పేకాటరాయుళ్లను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి లక్షా 13వేల రూపాయల నగదుతో పాటు ఏడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వీరిని ఓయూ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఓ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా పేకాడుతున్నట్లు సమాచారం అందటంతో పోలీసులు ఈ దాడి చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేకాట స్థావరాలతో పాటు, క్లబ్లపై ఉక్కుపాదం మోపిన విషయం తెలిసిందే. హైదరాబాద్లో పేకాట క్లబ్ అనే మాట వినపడకూడదని... అందుకు తగు విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు కూడా. ఈ నేపథ్యంలో పోలీసులు పేకాట స్థావరాలపై దాడులు ముమ్మరం చేశారు. -
స్టార్ హోటల్పై టాస్క్ఫోర్స్ పోలీసుల దాడి
హైదరాబాద్ : సోమాజీగూడలోని ఓ స్టార్ హోటల్పై వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం దాడి చేశారు. ఈ సందర్భంగా 15మంది పేకాటరాయుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రెండు లక్షల నగదు, 15 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. హోటల్లో పేకాడుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఈ దాడి చేశారు. అనంతరం పేకాటరాయుళ్లను స్టేషన్కు తరలించి అక్కడ నుంచి కోర్టులో హాజర పరచనున్నారు. -
సిటీ శివార్లలో కొక్కొరో.. కో!
నగరంలో 20-ట్వంటీ మ్యాచ్లను తలపిస్తున్న కోడిపందేలు ఏటా 30 కోట్లకు పైగానే చేతులు మారుతున్న వైనం ఫాంహౌస్లు, అపార్టమెంట్ సెల్లార్లు, గుట్టలే అడ్డాలు ఆదివారం వచ్చిందంటే హైదరాబాద్ నగరంలో కోడి కూతకు కోట్లు చేతులు మారుతున్నాయి. సంక్రాంతి సమయంలో గోదావరి జిల్లాల్లో ఐపిఎల్, వన్డే మ్యాచ్ల మాదిరిగా పందేలు జరుగుతుంటే హైదరాబాద్ నగరంలో ఆదివారం కోడిపందేలు ట్వంటీ ట్వంటీ మ్యాచ్ల మాదిరిగా ఆడేస్తున్నారు. పందెం వేసేవారికన్నా...చూసేవారి బెట్టింగులు లక్షల్లో ఉంటున్నాయి. మామూలు రోజుల్లో కూడా నగరంలో జరుగుతున్న కోడిపందేల ఖరీదు ఏడాదికి 33 కోట్లు. సాక్షి సిటీ ప్లస్ ప్రతినిధి, హైదరాబాద్ ఆదివారం వచ్చిందంటే...చాలు హైదరాబాద్లో ఓ పది ప్రాంతాల్లో కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. అపార్టు మెంట్లు, ఫాంహౌజ్లు, కంపెనీల కాంపౌండ్లు... కోడిపందేలకు అడ్డాలుగా తయారయ్యాయి. కొంపల్లి, బాచుపల్లి, కూకట్పల్లి, నిజాంపేట, మియాపూర్, చందానగర్, పఠాన్చెరువు, బీహెచ్ ఈఎల్, కొండాపూర్ తదితర ప్రాంతాల్లో ఈ పందేలు జరుగు తున్నాయి. నాలుగు అపార్టుమెంట్ల మధ్యలో ఓ పది గజాల స్థలముంటే చాలు.. కోడి పందేలకు ఏర్పాట్లు చేసేస్తున్నారు. ఒక్క ఫోన్కాలతో జూదగాళ్లు పందెం ప్రాంతా నికి చేరుకో వడం, పందెం లెక్కలు చెప్పుకోవడం, పందేనికి కోళ్లను వదల డం, నిమిషాల్లో పందెం పూర్తయిపోవడం. అంతే గప్చుప్గా ఎవరిళ్లకు వారు వెళ్లిపోవడం. ఈ తతంగమంతా అపార్ట్మెంట్ వాచ్మెన్ చేతులమీదుగా నడుస్తోంది. ఈ పందేలను నమ్ము కుని బెట్టింగ్ వ్యాపారం చేసేవారికి వాచ్మెన్లు బినామీలుగా పనిచేస్తున్నారు. ‘‘ఈ పందేలు..పేద జీవితాలను పాములా కాటేస్తున్నాయి’’ ఏదో కూలీ చేసుకుని బతుకుదామని వచ్చామండీ. ఊళ్లో ఉంటే ఇలాగే పందేలు, పత్తాలు అంటూ బతుకు నాశనమవు తుందని ఇక్కడికొచ్చాం. ఇక్కడ అంతకంటే గొప్పగా జూదాలు ఆడే అవకాశముందని వచ్చాక తెలిసింది’’ అంటూ ప్రగతినగర్లోని ఒక అపార్టు మెంట్ వాచ్మెన్ భార్య పందెం వల్ల పడుతున్న కష్టాలను చెప్పుకొచ్చింది. కత్తులు...ఎత్తులు కోడి పందేలు వేసే ప్రాంతాలకు అందరికంటే ముందుగా చేరేది కత్తులు కట్టేవారు. పందెం కోళ్లకు పదునైన కత్తులు కట్టి వందలు సంపాదించేవారు నగరంలో పదులసంఖ్యలో ఉన్నారు. వీరు ఒకపక్క కత్తుల సేల్స్ చేస్తూనే మరోపక్క పందెం రాయళ్ల నెట్వర్క్ని పెంచుతున్నారు. హైదరాబాద్లో పందెం కోళ్లకు బార్కాస్ ప్రాంతం చాలా ఫేమస్. సంక్రాంతి సమయంలో ఇక్కడ చాలాకోళ్లు అమ్ముడుపోతాయి. కాని మామూలురోజుల్లో ఇక్కడ జరుగుతున్న పందేలకు కోళ్లన్నీ గోదావరి జిల్లాల నుంచే వస్తున్నాయి. అక్కడి నుంచి పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ పెంచుతున్నారు. ఎర్రగట్ట నాటుకోడి దుకాణాల్లో కూడా పందెం కోళ్లు దొరుకుతున్నాయి. ఇవి కాకుండా శివారుల్లో ఉన్న తోటల్లో పందెంకోళ్లను పెద్ద సంఖ్యలో పెంచుతున్నారు. వీరి పెంపకం, పందేలు వేయడం వంటి పనులన్నీ పేదలే చేస్తున్నారు. ముఖ్యంగా రోజు కూలీల చేతులమీదనే నడుస్తున్నాయి. అయితే వీరంతా పెద్దస్థాయి బెట్టింగ్బాబులకు బినామీలు. ఆదివారం వేసే పెద్ద పందేలు కాకుండా... మిగతారోజుల్లో ఈ కూలీలు రెండు వేలకు, మూడు వేలకు పందేలు వేసుకుని జేబులు గుల్ల చేసుకుంటున్నారు. రైడింగ్ వేళ... రెండు వారాలక్రితం నిజాంపేట పరిధిలో కోడిపందెం జరుగుతుందని తెలిసి పోలీసులు రైడింగ్ చేశారు. పోలీసులు వస్తున్నారని తెలిసి...అందరూ చుట్టుపక్కల అపార్టుమెంట్లలోకి వెళ్లి దాక్కున్నారు. పోలీసులు కష్టపడి ఒకర్నో ఇద్దర్నో పట్టుకున్నారు. వాళ్లని తిరిగి ఇళ్లకు తీసుకురాడానికి పోలీసులకు గట్టిగానే ముట్టజెప్పామని పందెంలో పాల్గొన్నవారు బాహాటంగానే చెప్పడం గమనార్హం. కూకట్పల్లి ప్రాంతంలో విధిగా పందెంలో పాల్గొనే ఓ కూలీని పలకరిస్తే పోలీసుల పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాడు. ‘‘మేం వేసే పందేల గురించి పోలీసులకు తెలియకపోవడం ఏంటండీ...చాలావరకూ మేం ఎప్పటికప్పుడు పందేల ప్రదేశాలను మార్చేస్తుంటాం. ఎంత మార్చినా...నెలకో...రెండు నెలలకో దొరికిపోతుంటాం. చేసేదేముంది...వారి వాటా వారికిచ్చి బయటపడతాం’’ అని అంటాడు. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకురాగా అటువంటి పందేలేమీ జరగడం లేదన్నారు. మియాపూర్... ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు.. మియాపూర్ పరిధిలోని ఒక అపార్టుమెంటు సెల్లార్లో ఉన్నట్టుండి జనం పోగయ్యారు. ఓ పది బైక్లు, రెండు కార్లు గేటు ముందు ఆగాయి. ఒకబ్బాయి బ్యాగులో నుంచి కోడిని కింద వదిలాడు. రెండో కోడి అప్పటికే సిద్దంగా ఉందక్కడ. కత్తులు కట్టేవాడు...తన పని మొదలుపెట్టాడు. అంతే ఒకటి...రెండూ అంటూ పందెం వెలను వేలల్లో పాడుతూ కోళ్లను కింద వదిలారు. ఒకటి రెండు నిమిషాల్లో పందెం వేడుక ముగిసిపోయింది. వీక్షకుల బెట్టింగ్లు కూడా పూర్తయి పోయాయి. అదే నిమిషంలో కోళ్ల వేలం కూడా చేసేశారు. ఎవరి కోడిని వారు బ్యాగులో వేసుకుని బయలుదేరిపోయారు. అక్కడ జరి గిన బెట్టింగ్ ఖరీదు రెండు లక్షలు. గుట్టు చప్పుడు కాకుండా అపార్ట్మెంట్ పరిసరాల్లో కోడిపందేలు వేస్తున్న తీరు ఇది. ప్రగతినగర్ ఆదివారం ఉదయం పది గంటలకు... ప్రగతినగర్ గుట్ట దేనికి ఫేమస్ అంటే కోడి పందేలకని అక్కడ ఎవరిని అడిగినా చెబు తారు. ఆదివారం వచ్చిందంటే... తక్కువలో తక్కువ పది పందేల వరకూ జరుగుతాయి. చేతి సంచుల్లో కోడిపుంజులను వేసుకుని గుంపులుగా గుట్ట ఎక్కేస్తారు. అప్పటికే అక్కడ బెట్టింగ్రాయుళ్లు రెడీగా ఉంటారు. అక్కడ కూడా గుట్ట ఎక్కి దిగేలోపు పందెం పనులు ముగించేస్తారు. ఆ రోజు అక్కడ జరిగిన బెట్టింగ్..మూడున్నర లక్షలు. కొంపల్లి ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు..కొంపల్లి ప్రాంతంలో ఒక ఫాంహౌస్లో పందేనికి ఏర్పాట్లు చేసుకున్నారు. పందెం వేసేది ఆ చుట్టుపక్కల కంపెనీల్లో పనిచేసుకునే కూలీలు. వీక్షకులు మాత్రం బాగా డబ్బున్నవారు. ఓ పది కార్లు, ఐదారు మోటారుబైకుల్లో జనం వచ్చారు. పందెం మొదలవ్వక ముందే... బెట్టింగ్ రాయుళ్లు గ్రూపులుగా విడిపోయారు. కోళ్లను వదల గానే పాట పదివేల నుంచి మొదలుపెట్టారు. క్షణాల్లో నాలుగు లక్షలకు వెళ్లిపోయింది. పందెం ముగియగానే డబ్బులు బయటికి తీసారు. పంపకాలు పూర్తయ్యాయి. బెట్టింగ్ ఖరీదు ఐదు లక్షలు. వాట్ నెక్ట్స్ అనగానే ఓ ఇద్దరు పేక పెట్టెలు తెరిచారు. -
కాయ్ రాజా..కాయ్
*మళ్లీ జడలు విప్పిన పేకాట క్లబ్బులు *రిక్రియేషన్ పేరుతో మూడుముక్కలాట *నిరుపేదలు, చిరుద్యోగులే టార్గెట్ *ఫిర్యాదు చేసినా..పట్టించుకోని యంత్రాంగాలు సాక్షి,సిటీబ్యూరో: నగరంలో మళ్లీ పేకాట క్లబ్బులు జడలు విప్పాయి. మూడుముక్కలాటతో కోట్లల్లో టర్నోవర్ చేస్తున్నాయి. రిక్రియేషన్ పేరుతో ఏర్పాటై కేవలం పేకాటకే పరిమితమయ్యాయి. జిమ్,యోగ,స్విమ్మింగ్,ఇండోర్గేమ్స్ వసతులున్నాయంటూ రిక్రియేషన్ క్లబ్ పేరుతో రిజిస్ట్రర్ చేసినా.. అక్కడ మాత్రం కేవలం మూడుముక్కలాటే సాగుతోంది. చిరుద్యోగులు, వ్యాపారులు, అట్టడుగు వర్గాలు సైతం ఈ మాయా జూదంలో చిక్కుకుని రోజుల తరబడి ఇళ్లకు కూడా వెళ్లని పరిస్థితి నెలకొంది. క్లబ్లు మూసేయాలంటూ ఇటీవల హబ్సిగూడ, కోఠి, బోయిన్పల్లిల్లో పలువురు మహిళలు పోలీస్స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నగరంలో రిక్రియేషన్ పేరుతో ఏర్పడ్డ సుమారు పదిహేను క్లబ్బుల్లో ప్రస్తుతం మూడుముక్కలాట జోరుగా సాగుతోంది. హబ్సిగూడ , సైదాబాద్, కోఠిలలోని క్లబ్లకు తమ భర్తలు బానిసలయ్యారని, పిల్ల ల్ని, మమ్మల్ని పట్టించుకోవటం లేదంటూ ఉ స్మానియా యూనివర్సిటీ,సుల్తాన్బజార్ ఠాణా అధికారులకు విన్నవించుకున్నా సరైన స్పందన రాలేదని బాధితులు మానవహక్కుల కమిషన్ ను ఆశ్రయించారు. బోయిన్పల్లిలో కాలనీ లోని రెండు ప్రధాన రోడ్లను మూసివేసి ఓ క్లబ్ రూట్ డైవర్షన్ చేస్తూ తమ క్లబ్కు వచ్చి పోయే వారికి అడ్డంకులు లేకుండా చేయటం విశేషం. కోట్లల్లో దందా ... రిక్రియేషన్ క్లబ్పేరిట పేకాట దందా కోట్లల్లో సాగుతోంది. రూ.5 వేలు, రూ.10 వేలు, రూ.20 వేలు, రూ.50 వేలు, రూ.లక్ష, రూ.2 లక్షల చొప్పున వేర్వేరు కార్డ్ రూమ్స్ నిర్వహిస్తున్నారు. ఒక్కో రూమ్లో 20 నుంచి 30 టేబుల్స్పై ఉదయం నుంచి రాత్రి వరకు ఒక్కోటేబుల్పై 10 నుంచి 20 రౌండ్లు ఆడుతున్నారు. ఈ మేరకు ఒక్కో కార్డు రూమ్లో సుమారు 300 నుంచి 500 రౌండ్ల పేకాట సాగుతోంది. ఈ లెక్కన ఆయా కార్డు రూము రేంజ్ను బట్టి రౌండ్కు కొంత సొమ్ము చొప్పున నిర్వహకులు తీసుకుంటున్నారు. ఉదాహరణకు రూ.5 వేల కార్డు రూములో ఒక్కరోజులో 300 రౌండ్ల ఆట సాగితే నిర్వహకులకు రూ.15 లక్షల ఆదాయం వస్తుంది. ఈ లెక్కన రూ.10వేలు, రూ.50వేలు, రూ.లక్ష, రూ.2లక్షల కార్డు రూమ్ల ఆదాయం ఎంత ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇలా రోజుకు లక్షల్లో ఆదాయాన్ని (టర్నోవర్ అయితే కోట్లలో) జేబులో వేసుకుంటున్న క్లబ్లు ఆయా వ్యవస్థల్ని మేనేజ్ చేయడానికి భారీగానే ఖర్చు చేస్తున్నాయి. కోడ్ ఉల్లంఘించినా... పోలీసులు పక్షం రోజులుగా చేస్తున్న తనిఖీల్లో లెక్కాపత్రాలు లేకుండా రూ.50 వేలకుపైగా త రలిస్తున్న డబ్బును స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేస్తున్నారు. అయితే లెక్కపత్రాలు లేకుండానే కోట్లాది రూపాయలు రిక్రియేషన్క్లబ్లలో చేతులు మారుతున్నా పోలీసులు మాత్రం అటు వైపు కన్నెతి చూడకపోవడం గమనార్హం. ఎన్నికల కోడ్ ఈ క్లబ్లకు వర్తించదా..? కేసులేనా చర్యలేవి..:? బస్తీల్లో గొడవలు చేసే ఒక వ్యక్తి మూడునాలుగు కేసులలో పట్టుబడితే అతనిపై రౌడీషీట్ తెరుస్తారు. ఇక గుడుంబా విక్రయిస్తూ నాలుగైదు సార్లుకుపైగా పట్టుబడితే పీడీ చట్టం ప్రయోగిస్తారు. అలాంటిది పదుల సంఖ్యలో నిబంధనలు ఉల్లంఘించి కేసులలో ఇరుక్కున రిక్రియేషన్ క్లబ్లపై శాశ్వత చర్యలు తీసుకోకపోడానికి గల కారణాలు పోలీసులకే తెలియాలి. తూతూ మంత్రంగా సైదాబాద్ పరిధిలో ఫ్రెండ్స్ కల్చరల్ క్లబ్పై దాడి చేసి 12 మంది పేకాటరాయుల్ని అరెస్టు చేశారు. ఈ క్లబ్పై దాడి జరగడం, కేసులు నమోదు చేయడం కొత్తేమీకాదు. మూడు సార్లకుపైగా పేకాట కేసుల్లో పట్టుబడిన క్లబ్ల లెసైన్స్లను శాశ్వతంగా రద్దు చే స్తే బాగుంటుందని పలువురు కోరుతున్నారు. స్నాచర్లకు అడ్డా... గొలుసు దొంగలకు క్లబ్లు అడ్డాగా మారుతున్నాయి. క్లబ్ పరిసర కాలనీలలో మహిళల మెడలోని చైన్లు తెంచుకెళ్లి వాటిని క్లబ్లో ఎవరోఒకరి వద్ద కుదువ పెట్టడం, వచ్చిన డబ్బుతో జల్సాలు చేయడం స్నాచర్ల రోజు వారి విధిగా మారింది. స్నాచింగ్ జరిగిన వెంటనే చుట్టుపక్క ఠాణాల పోలీసులు అప్రమత్తమై గాలిస్తున్నా వారు మాత్రం నిర్భయంగా క్లబ్లకు చేరుకుంటున్నారు. ఈ విషయం తెలియని పోలీసులు ఊరంతా గాలిస్తున్నారు. నిబంధనలు హుష్ ‘కాకి’ రిక్రియేషన్ పేరుతో ఏర్పాటైన ఈ క్లబ్బులో సరిపోను పార్కింగ్తో విశాలమైన ఆవరణ ఉండాలి క్లబ్ సభ్యత్వం ఇచ్చే సమయంలో వారి ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకోవాలి. క్లబ్లో జిమ్, యోగ, స్విమ్మింగ్పూల్లతో పాటు అవుట్డోర్ లేదా ఇండోర్ గేమ్స్ సదుపాయాలుండాలి. కోర్టు అనుమతితో కేవలం 13 ముక్కలతో కూడిన పేకాట(స్కిల్డ్గేమ్) మాత్రమే ఆడాలి. ముందస్తు అనుమతి లేకుండా నాన్మెంబర్స్ను అనుమతించరాదు కానీ పై నిబంధనలు ఏవీ అమలు కావటం లేదు. రిక్రియేషన్కు అవసరమైన సౌకర్యాలు లేకుండానే ఒక్క పేకాటనే నిర్వహిస్తున్నారు. కానీ యంత్రాంగం మాత్రం ఆర్నెళ్లకు ఒక మారు చుట్టపుచూపులా దాడులు చేసి తాత్కాలికంగా మూసేస్తున్నారు. మూడు రోజులకే నిర్వాహకులు తిరిగి వాటిని ప్రారంభించటం నగరంలో ఆనవాయితీగా మారింది. -
పేకాటరాయుళ్ల అరెస్ట్, 1.69లక్ష నగదు స్వాధీనం
గుంటూరు: జిల్లాలో ఎక్కడో ఒకచోట పేకాట శిబిరాలు వెలుస్తూనే ఉన్నాయి. పోలీసుల కంటపడకుండా ఇలాంటి శిబిరాలను యదేచ్ఛగా కొనసాగుతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లాలోని తిప్పలవారిపాలెం మండలం సత్యనారాయణపురంలో పేకాట శిబిరాలపై శుక్రవారం పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న నలుగురిని పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారినుంచి 1.69లక్షల రూపాయల నగదు, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
13మంది పేకాటరాయుళ్ల అరెస్ట్
హైదరాబాద్ : హైదరాబాద్- హయత్నగర్ మండలం బ్రాహ్మణపల్లిలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఓ రియల్ ఎస్టేట్ ఆఫీస్లో పేకాట ఆడుతున్న 13 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి 57 వేల రూపాయలు, 13 మొబైల్ ఫోన్లు, 3 కార్లు, 7 బైకులను స్వాధీనం చేసుకున్నారు. పేకాటరాయుళ్లలో బ్రాహ్మణపల్లి ఉపసర్పంచ్ బాల్రాజు కూడా ఉన్నాడు. -
మట్కా బ్రదర్స్ అరెస్టు
నంద్యాల టౌన్, న్యూస్లైన్: జ్యూవెలరీ, టైర్లు, బట్టల వ్యాపారం ముసుగులో ఆన్లైన్లో అంతర్జాతీయ స్థాయి మట్కా రాకెట్ నిర్వహిస్తున్న అన్నదమ్ములు సయూద్ అహ్మద్, షరీఫ్ అహ ్మద్ను పోలీసులు అరెస్ట్ చేశారు. గ్యాంగ్కు చెందిన మరో నిందితుడు గఫార్ అహ్మద్ పరారీలో ఉన్నాడు. ఇందుకు సంబంధించిన వివరాలను నంద్యాల డీఎస్పీ అమర్నాథ్నాయుడు, టూటౌన్ సీఐ రామాంజినాయక్ ఆదివారం విలేకరులకు వెళ్లడించారు. కర్నూలు చిత్తారి వీధికి చెందిన వీరిద్దరు సయూద్ బ్రదర్స్ పేరిట బంగారు షాపు, టైర్లు, వీఎస్ టెక్స్టైల్ బట్టల షాపులు నిర్వహించారు. వీటి ముసుగులో వీరు చేస్తున్న చీకటి వ్యాపారం మట్కా. వీరు పదేళ్ల క్రితం కర్నూలులో పేరొందిన మట్కాడాన్ అసదుల్లా దగ్గర బీటర్లుగా పని చేశారు. అసదుల్లాతో విభేదాలు రావడంతో 2007లో విడిపోయి సొంతంగా కంపెనీ ప్రారంభించారు. ఆన్లైన్ నెట్ వర్క్ పెంచుకుని మట్కా సామ్రాజ్యాన్ని విస్తరింపజేశారు. అంతా ఆన్లైన్లోనే.. మట్కాడాన్ బ్రదర్స్ హైదరాబాద్లోని మలక్పేటలో సయూద్ అండ్ బ్రదర్స్ ఎంటర్ ప్రైజెస్ పేరిట ఆఫీసు తెరిచారు. ల్యాప్టాప్లు, కంప్యూటర్ల ఏర్పాటుతోపాటు వాటి నిర్వహణకు ప్రవీన్కుమార్రెడ్డి, ధరణీధర్, చిన్న, రాజును నియమించారు. ప్రాంతాల వారీగా మట్కా బీటర్లకు కోడ్ నెంబర్లు కేటాయించారు. బీటర్ల నుంచి రూ.50 వేలు మొదలు రూ.5లక్షల వరకు డిపాజిట్లు సేకరించారు. కర్నూలు, కడప, అనంతపురం, బళ్లారి, చిత్రదుర్గ జిల్లాలతోపాటు సౌదీ, మస్కట్, దుబాయ్, సింగపూర్, హాంకాంగ్ నుంచి బీటర్లు ఆన్లైన్లోనే మట్కా కోడ్ అందిస్తారు. హైదరాబాద్ శ్రీపురం, మలక్పేట, సలీంనగర్ ఎస్బీఐ బ్రాంచ్ ఖాతాలకు డబ్బు జమ చేస్తారు. భారీ మొత్తంలో డబ్బు వసూలైతే ముంబాయి చైతన్షేట్కు అందజేస్తారు. వీరికి ప్రతి రోజూ కనీసం రూ.10 లక్షలు తగ్గకుండా కలెక్షన్ వచ్చేది. అయితే వీరిపై నిఘా పెరగడంతో కార్యాలయాన్ని నంద్యాల సలీంనగర్కు మార్చారు. నిర్వహణ బాధ్యతలను ఓర్వకల్లు మండలం హుసేనాపురానికి చెందిన మిత్రుడు గఫూర్ అహ ్మద్కు అప్పగించారు. ఈ క్రమంలో 2013 నవంబర్ 21న కార్యాలయంపై దాడి చేసిన పోలీసులు కంప్యూటర్ ఆపరేటర్లు ధరణీధర్, ప్రవీణ్కుమార్రెడ్డి అరెస్టు చేశారు. బళ్లారి చౌరస్తా వద్ద అరెస్టు.. సయూద్ అహ్మద్, షరీఫ్ అహమ్మద్ కర్నూలు బళ్లారి చౌరస్తా వద్ద ఉండగా పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో పూర్తి వివరాలు బయపడ్డాయి. వీరికి చెందిన 41బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేశారు. వీరిద్దరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. కర్నూలుకు సంబంధించి సుదర్శన్గౌడ్(చున్నావాలిగల్లి), అన్వర్(నిమిషాబగుడి ఏరియా), కలీమ్, నాసీర్(గనీగల్లి ఏరియా), కరీమ్షేక్షా(పెద్దమార్కెట్), అన్వర్(జెమ్మిచెట్టు ఏరియా), విటల్(చిన్నమార్కెట్), అక్బర్, నిషార్అహ్మద్(బేకారిపేట), గని అహ్మద్(నంద్యాల), కరీమ్, పగిడ్యాలరాముడు, వహాబ్(నందికొట్కూరు), వహాబ్, శ్రీనివాసరెడ్డి(వెల్దూర్తి), మల్లికార్జున(డోన్) వీరి ఏజెంట్లుగా ఉన్నారు. -
కోడి పందాలు నిర్వహిస్తున్న 23 మంది అరెస్ట్
మచిలీపట్నం: కోడిపందాలు నిర్వహిస్తున్న 23 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 4.30 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసు అధికారి తెలిపారు. కోడి పందాలను నిర్వహించకుండా కృష్ణా జిల్లాలో ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేసి తనఖీలను చేపట్టామని పోలీసులు తెలిపారు. తనిఖీల్లో భాగంగా కైకలూరు చెక్ పోస్ట్ వద్ద 23 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 4.30 లక్షల్ని, 19 కోళ్లను స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ జె ప్రభాకర రావు తెలిపారు. జిల్లాలో కోడి పందాలను నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభాకర్ రావు హెచ్చరించారు. -
ఆకాశవంతెనలు నిరుపయోగం
సాక్షి, ముంబై: నగరంలోని అనేక ప్రాంతాల్లో నిర్మించిన ఆకాశవంతెన (స్కైవాక్)లు నిరుపయోగంగా మారుతున్నాయి. అవి యాచకులు, మాదకద్రవ్యాల బానిసలు, మద్యప్రియులు, జూదగాళ్లు, ప్రేమికులు, ఆకతాయిలకు అడ్డాలుగా మారుతున్నాయి. వీరంతా స్కైవాక్లపైనే తిష్టవేస్తున్నారు. వాటిని దుర్గంధమయం చేస్తున్నారు. దీంతో వాటిని వినియోగించుకునేందుకు బాటసారులు, మహిళలు, పిల్లలు జంకుతున్నారు. రాత్రి వేళల్లో వెళ్లేందుకు పురుషులు కూడా జంకుతున్నారు. కాగా నగర రహదారులను హాకర్లు ఆక్రమిస్తున్నారు. సమస్య రైల్వేస్టేషన్ల వద్ద తీవ్రంగా ఉంది. రైలు దిగిన ప్రయాణికులు రోడ్డెక్కాలంటే నానా తంటాలు పడాల్సి ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ముంబై ప్రాంతీయ అభివృద్ధి సంస్థ (ఎమ్మెమ్మార్డీయే) స్కైవాక్ల నిర్మాణం చేపట్టింది. వీటి ద్వారా రైలు దిగిన ప్రయాణికులు నేరుగా ఆటో, బస్టాండ్ లేదా రహదారి చేరుకుంటారని ఆ సంస్థ భావించింది. అయితే అనుకున్నదొక్కది.... అయ్యిందొక్కటి అనే చందంగా స్కైవాక్ల పరిస్థితి మారింది. స్కైవాక్లను ఎక్కడం బాగా కష్టంగా ఉండడంతో వృద్ధులు, గర్భిణులు, వికలాంగులు రహదారులనే ఆశ్రయిస్తున్నారు. దీంతో వీటి నిర్మాణానికి అర్థమే లేకుండాపోయింది. ఈ కారణంగా ఇవి అలంకార ప్రాయంగా మారాయి. -
ఎల్బీనగర్లో సితార హోటల్పై పోలీసుల దాడులు
హైదరాబాద్ : ఎల్బీనగర్లో సితారా హోటల్పై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్బంగా పేకాడుతున్న 9మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి మూడు కార్లు, లక్షా 50వేలు నగదు, 9 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పేకాటరాయుళ్లపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. పక్కా సమాచారంతో పోలీసులు ఈ దాడులు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మట్కా గ్యాంగ్ ఆట కట్టు
నంద్యాల టౌన్, న్యూస్లైన్: వ్యవసాయ కూలీలు, కార్మికులు, చిల్లర వ్యాపారులు కష్టార్జితాన్ని జలగల్లా పీల్చుకు తింటున్న మట్కా గ్యాంగ్ సభ్యులు పోలీసులకు పట్టుబడ్డారు. పాణ్యం సర్కిల్ పరిధిలోని రెండు ముఠాలను అరెస్ట్ చేసి, రూ.75వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ అమర్నాథ్నాయుడు, పాణ్యం సీఐ శ్రీనాథరెడ్డి బుధవారం విలేకరుల సమావేశంలో మట్కాగ్యాంగ్ల గురించి వివరించారు. పాణ్యం పరిధిలోని నెరవాటి వెంకటేశ్వర్లు, సాలబోయిన రాము, షేక్ఫ్రి, నాగేంద్ర, అచ్చకోట్ల జమాల్బాష, కాట్రావత్ రేఖానాయక్, పాణ్యం, సుగాలిమెట్ట ప్రాంతంలో మట్కా నిర్వహించేవారు. నంద్యాల పట్టణంలోని బషీర్(బొగ్గులైన్), షేక్ఫ్రి(కోటవీధి), పులిమద్ది వేణుగోపాల్(పెద్దబండ) జత కలిశారు. ఈ ముగ్గురు పట్టణంలో మట్కా కలెక్షన్లను సేకరించి, పాణ్యం గ్యాంగ్కు అప్పజెప్పేవారు. ఎవరికైనా మట్కా నెంబర్ తగిలినా ఈ గ్యాంగ్ గెలిచిన సొమ్మును ఇవ్వకుండా బెదిరించేవారు. ఈ గ్యాంగ్ సభ్యులను పాణ్యం సీఐ శ్రీనాథరెడ్డి పాణ్యంలోని మౌలాలిస్వామి దర్గావద్ద అరెస్ట్ చేసి రూ.53,320, 8సెల్ఫోన్లు, మట్కా చీటీలు స్వాధీనం చేసుకున్నారు. మట్కా నిర్వాహకుడు, అనుచరుల అరెస్ట్.. నందివర్గం ప్రాంతంలో పేరొందిన మట్కా నిర్వాహకుడు సయ్యద్ రఫీద్ అహ్మద్, అతని అనుచరులను అరెస్ట్ చేశారు. రామకృష్ణపురంకు చెందిన సయ్యద్ రషీద్ అహ్మద్ కొన్నేళ్లుగా మట్కా నిర్వహిస్తూ ప్రస్తుతం బనగానపల్లెలో నివాసముంటున్నాడు. ఆయన పలుకూరు, రామతీర్థం, టంగుటూరు గ్రామాల్లో అనుచరులు షేక్ ఇస్మాయిల్, దళిత హుసేని, వడ్డగోగుల సుబ్బరాయుడు, మొల్లి మహ్మద్ హుసేన్లను బీటర్లుగా ఏర్పాటు చేసుకొని దందాను నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ గ్యాంగ్ను రామతీర్థంలోని ఆంజనేయస్వామి గుడి వద్ద వలపన్ని పట్టుకున్నారు. వీరి నుంచి రూ.22వేలు, మూడు సెల్ఫోన్లు, మట్కా చీటీలను స్వాధీనం చేసుకున్నామన్నారు. మట్కా గ్యాంగ్ల అరెస్ట్లో కీలక పాత్రను వహించిన కానిస్టేబుల్ రమేష్కు డీఎస్పీ అమర్నాథ్నాయుడు, సీఐ శ్రీనాథరెడ్డి నగదు రివార్డును అందజేశారు. సమావేశంలో పాణ్యం, నందివర్గం ఎస్ఐలు సుబ్రమణ్యం, గోపాల్రెడ్డి పాల్గొన్నారు. -
పేకాటరాయుళ్లపై కఠిన చర్యలు
తాండూరు రూరల్, న్యూస్లైన్: వచ్చే దీపావళి పండుగ నేపథ్యంలో ఎవరైనా పేకాట అడితే..ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తి లేదని జిల్లా ఎస్పీ రాజకుమారి హెచ్చరించారు. మంగళవారం తాండూరు రూరల్ కార్యాలయం(కరన్కోట్ పోలీస్స్టే షన్)లో ఆమె నాలుగు మండలాల రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ... దీపావళి పండుగకు ప్రత్యేక పోలీసు బృందాలతో తనిఖీలు చేపడతామన్నారు. తాండూరు రూరల్ సర్కిల్లో నేరాలు తగ్గాయని, హత్యలు పెరిగాయని చె ప్పారు. 2013 సంవత్సరంలో వార్షిక తనిఖీల్లో భాగంగా రూరల్ కార్యాలయాన్ని తనిఖీ చేయడం జరిగిందన్నారు. నాలుగు మండలాల్లో కలిపి 2011 సంవత్సరంలో 11 హత్యలు, 2012లో 10, 2013 ప్రస్తుతం అక్టోబర్ వరకు 15 హత్య కేసులు నమోదయ్యాయన్నారు. ఈ సంవత్సరం 11 హత్య కేసులు రూరల్ సీఐ రవి ఛేదించారని, 4 కేసులు పెండింగ్లో ఉన్నాయన్నారు. అలాగే రూరల్ సర్కిల్లో రోడ్డు ప్రమాదాలు 2011 సంవత్సరంలో 74 (కేసులు), 2012లో 79, 2013( ప్రస్తుతం)- 52 కేసులు నమోదైనట్లు ఆమె తెలిపారు. దారి దోపిడీ 2 కేసులు నమోదయ్యాయని అందులో ఒక కేసు ఛేదించి రూ.21 వేలు, 1సెల్ ఫొన్ రికవరి చేశామని చెప్పారు. రాత్రి పూట దొంగతనం కేసుల్లో 30 శాతం రీకవరి చేశామని ,70 శాతం రికవరీ అలాగే ఉందన్నారు. రాత్రి వేళల్లో పెట్రోలింగ్ పెంచామని చెప్పారు. మట్కా కేసులో ఓ వ్యక్తిపై రెండో కేసు నమోదైతే అతనిపై రౌడీ షిట్ తెరుస్తామని ఆమె హెచ్చరించింది. వికారాబాద్ డివిజన్కు శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుల్స్ 109 మంది వచ్చారని చెప్పారు. ఏమైనా సమస్య ఉంటే ‘100’కు ఫోన్ చేయండి గ్రామాల్లో, పట్టణాల్లో ఎమైనా గొడవలకు సంబంధించిన సమస్యలు , భార్యా భర్తల మధ్య గొడవ, ఈవ్ టీజీంగ్, పేకాట, మట్కా ఇలాంటి పోలీసుల అవసరం ఉన్నదనిపిస్తే చాలు 100 నంబర్కు డయల్ చేయాలని ఎస్పీ రాజకుమారి ప్రజలకు సూచించారు. 108 మాదిరిగానే స్పందిస్తామని చెప్పారు. పోలీసులు స్పందించకపోతే వారిపై చర్యలు ఉంటాయని చెప్పారు. బెల్టు షాపులపై కఠిన చర్యలు గ్రామాల్లో గొడవలకు దారి తీస్తున్న బెల్టు షాపులపై దాడు చేస్తామని ఆమె హెచ్చరిం చింది. గ్రామాల్లో దాడులు జరపాలని డీఎస్పీ షేక్ ఇస్మాయిల్ను ఆదేశించారు. అలాగే మండల పరిధిలోని రాజీవీర్ ఇండస్ట్రీలో జరిగిన అగ్ని ప్రమాదాలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని డీఎస్పీని కోరారు. త్వరలోనే గ్రామాల్లో మూఢనమకాలపై చైతన్య సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు. అక్రమంగా ఎవరైనా నాపరాతి గనుల్లో బ్లాస్టిం గ్కు పాల్పడితే ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఆమె వెంట డీఎస్పీ షేక్ ఇస్మాయిల్, కరన్కోట్ ఎస్ఐ పవన్, యాలాల ఎస్ఐ రాజేంధర్రెడ్డిలు ఉన్నారు. -
శ్రీనగర్ కాలనీలో 13 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్
అమీర్పేటలోని శ్రీనగర్ కాలనీలో పలు పేకాట శిబిరాలపై పోలీసులు గత అర్థరాత్రి దాడులు నిర్వహించారు. ఆ దాడిలో 13 మంది పేకటరాయుళ్లను అరెస్ట్ చేశారు. పేకాట రాయుళ్ల నుంచి రూ.50 వేలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్కు తరలించారు. వారిపై కేసు నమోదు చేశారు.