రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం మండలం మర్రివాడ గ్రామంలో పేకాట శిబిరంపై శనివారం తెల్లవారుజామున పోలీసులు దాడి చేశారు. ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 3 వేల నగదుతోపాటు మూడు బైకులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్కు తరలించారు.