హయత్ నగర్ : నగరంలోని హయత్ నగర్ బృందావన్ కాలనీలో బుధవారం పేకాటస్థావరంపై పోలీసులు దాడులు జరిపారు. అందిన సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు పేకాట ఆడుతున్న ఐదుగురు పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 4 సెల్ ఫోన్లు, రూ. 9, 300 లను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.