హైదరాబాద్: బాలానగర్లోని ఓ లాడ్జిపై పోలీసులు శుక్రవారం దాడి చేశారు. ఈ సందర్భంగా ఏడుగురు పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి భారీగా నగదుతోపాటు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇటీవల కాలంలో బాలానగర్ పరిధిలో పేకాట స్థావరాలు అధికమయ్యాయి. ఈ నేపథ్యంలో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ క్రమంలో పోలీసులు ఆ ప్రాంతంలో లాడ్జిలపై దాడులు నిర్వహించారు.