balanagar
-
కోకాపేట ధరలో సగానికే లగ్జరీ ఫ్లాట్లు..!
ఐటీ రంగంలో దాదాపు 80 శాతం వరకు హైటెక్ సిటీ, కొండాపూర్, మాదాపూర్ ప్రాంతాల్లోనే పనిచేయాల్సి ఉంటుంది. అక్కడకు సుమారు 10 కిలోమీటర్ల పరిధిలో నివాసం ఉండాలంటే.. కోకాపేట ప్రాంతం చూసుకుంటే అక్కడ చదరపు అడుగు ధర దాదాపు రూ.12–14 వేల వరకు ఉంటోంది. మిగిలిన ప్రాంతాలన్నీ ఇప్పటికే బాగా రద్దీగా ఉంటున్నాయి. దాంతో ఇప్పుడు చాలామంది బాలానగర్ వైపు చూస్తున్నారు. - సాక్షి, సిటీబ్యూరోఒకప్పుడు బాలానగర్ అంటే పారిశ్రామికవాడ అని, భూగర్భ జలాలు కలుషితం అయ్యాయని, గాలి కూడా కాలుష్యంతో ఉంటుందని అనుకునేవారు. కానీ ఇప్పుడు అలాంటి అభిప్రాయాలు అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉన్నవి.. కేవలం నైఫర్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ), సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ వంటి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు మాత్రమే.ఒకప్పుడు ఇక్కడ ఉండే ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ (ఐడీపీఎల్) వంటి కంపెనీలు కొన్ని వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించినా, అది చాలాకాలం క్రితమే మూతపడింది. పైపెచ్చు, ఈ కంపెనీకి చెందిన 100 ఎకరాల భూముల్లో పచ్చదనం విస్తరించింది. ఇంతకుముందు బాలానగర్ దాటి చింతల్, గుండ్లపోచంపల్లి ప్రాంతాల వరకు గేటెడ్ కమ్యూనిటీలు విస్తరించాయి గానీ, బాలానగర్లో ఇంతకుముందు రాలేదు.లగ్జరీ నిర్మాణాలు షురూ.. ఇప్పుడిప్పుడే బాలానగర్ వైపు కూడా లగ్జరీ నిర్మాణాలు మొదలవుతున్నాయి. కోకాపేటతో సహా ఇతర ప్రాంతాల్లో లభించే సదుపాయాలన్నీ ఇక్కడ కూడా లభిస్తున్నాయి. కానీ, కోకాపేటలో చదరపు అడుగు దాదాపు రూ.12–14 వేలు ఉండగా, ఇక్కడ దాదాపు రూ.6 నుంచి రూ.7 వేలకే లభ్యమవుతున్నాయి. అంటే ఇంచుమించు కోకాపేట ధరలో సగానికే లగ్జరీ ఫ్లాట్లు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.హైటెక్ సిటీకి బాలానగర్ ప్రాంతం కూడా దాదాపు 12–13 కిలో మీటర్ల దూరంలోనే ఉంది. అయితే, ఫ్లై ఓవర్లు, అండర్పాస్లు వంటి మౌలిక సదుపాయాలు రావడంతో అర గంటలోపే బాలానగర్ నుంచి హైటెక్ సిటీకి చేరుకోవచ్చు. పైగా ఈ ప్రాంతంలో మంచి పెద్ద పెద్ద స్కూళ్లు, ఇంజినీరింగ్ కాలేజీలు కూడా ఇక్కడ ఉండటంతో పిల్లల చదువుల గురించి ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు. మాల్స్, మల్టీప్లెక్సులు కూడా ఉండటంతో వినోదం, విహారానికి కూడా మంచి అవకాశాలున్నాయి.బాలానగర్ వైపు.. మాదాపూర్, కొండాపూర్ వంటి ప్రాంతాల్లో లగ్జరీ ఫ్లాట్లు కావాలంటే ఎంత లేదన్నా కనీసం రూ.6 నుంచి రూ.7 కోట్లకుపైగా పెట్టాలి. అదే బాలానగర్లో లగ్జరీ ఫ్లాటు అంటే దాదాపు 2 వేల చ.అ. విస్తీర్ణం ఉండే ఫ్లాటు అన్ని సౌకర్యాలతో కలిపి కూడా సుమారు రూ.కోటిన్నర– రెండు కోట్లలోపే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైటెక్ సిటీకి సమీపంలో ఇంత తక్కువ ధరలో, అన్ని సదుపాయాలు ఉన్న ప్రాంతంలో దొరకడం దాదాపు ఇంకెక్కడా లేదు. కాబట్టి, ఐటీ జనాలు క్రమంగా ఇప్పుడు బాలానగర్ వైపు చూస్తున్నారు. గతంలో వేర్వేరు ప్రాంతాల్లో పనిచేసినా, చివరకు హైదరాబాద్ వచ్చి స్థిరపడాలని అనుకుంటున్నవారు కూడా బాలానగర్ ప్రాంతం వైపు మొగ్గు చూపుతున్నారు. -
ఎల్బీనగర్ నుంచి కూకట్పల్లి తరలిస్తుండగా కిందపడ్డ దరఖాస్తులు
-
హైదరాబాద్ బాలానగర్ లో అగ్నిప్రమాదం
-
బాలానగర్: ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో చెలరేగిన మంటలు
సాక్షి, హైదరాబాద్: బాలానగర్ ప్రధాన రహదారిపై ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. కూకట్పల్లి నుంచి సుచిత్ర వైపు వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఐడీపీఎల్ సమీపంలోకి రాగానే బస్సు ఇంజిన్ నుంచి దట్టమైన పొగలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ బస్సును ఆపి, ప్రయాణికులను కిందకు దించేశాడు. క్షణాల్లో మంటలు వ్యాపించి బస్సు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది. బస్సులో మంటలు చెలరేగడంతో ఆ రహదారిపై కాసేపు మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రెండు మూడు గంటల పాటు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా ప్రమాద సమయంలో డ్రైవర్తో పాటు ఇద్దరు ప్రయాణికులు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా సురక్షితంగా బయటపడ్డారు. -
బాలానగర్లో అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ
సాక్షి, హైదరాబాద్: నిర్మాణ రంగంలో మూడున్నర దశాబ్దాల అనుభవం కలిగిన రఘురామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరో అద్బుతమైన ప్రాజెక్ట్కు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే బాలానగర్లో ఏ2ఏ లైఫ్ స్పేసెస్ అపార్ట్మెంట్, సెంటర్ మాల్ ప్రాజెక్ట్లను విజయవంతంగా పూర్తి చేసిన సంస్థ.. తాజాగా ఏ2ఏ హోమ్ ల్యాండ్ ప్రీమియం అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ను నిర్మిస్తుంది. బాలానగర్లోనే అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఇదేనని కంపెనీ తెలిపింది. రఘురామ్ ఇన్ఫ్రా ఇప్పటివరకు 40 లక్షలకు పైగా చ.అ.లలో 38 పైగా ప్రాజెక్ట్లను నిర్మించింది. సుమారు 4 వేలకు పైగా కస్టమర్లున్నారు. ►ఫేజ్–1లో 12 ఎకరాలలో నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్లో మొత్తం 7 బ్లాకులుంటాయి. మొత్తం 1,158 ఫ్లాట్లుంటాయి. అన్నీ త్రీ బీహెచ్కే ప్రీమియం ఫ్లాట్లే. 1,700 చ.అ. నుంచి 2,260 చ.అ. మధ్య ఫ్లాట్ల విస్తీర్ణాలుంటాయి. (ఈస్ట్ హైదరాబాద్ రయ్ రయ్! ఎందుకో తెలుసా?) ► ఈ ప్రాజెక్ట్లో 93 వేల చ.అ. విస్తీర్ణంలో రెండు క్లబ్హౌస్లతో పాటు క్రచ్, ఇండోర్ గేమ్స్, లెర్నింగ్ సెంటర్, బిజినెస్ లాంజ్, గెస్ట్ రూమ్స్, మల్టీపర్పస్ హాల్, స్విమ్మింగ్ పూల్, కిడ్స్ ప్లే ఏరియా, లైబ్రరీ, జిమ్, బ్యాడ్మింటన్ కోర్టు, యోగా సెంటర్ వంటి అన్ని రకాల ఆధునిక వసతులుంటాయి. ► బాలానగర్ మెట్రో జంక్షన్, కూకట్పల్లి వై జంక్షన్లకు కూతవేటు దూరంలో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. ప్రధాన నగరంలో ఉండటంతో ఇంటర్నేషనల్ స్కూళ్లు, ఆసుపత్రులు, షాపింగ్ మాల్స్ వంటి వాటికి కొదవే లేదు. (మరో సంచలనం: బ్రెయిన్ చిప్, మస్క్కు గ్రీన్ సిగ్నల్) మరిన్ని రియల్ ఎస్టేట్ వార్తలకు,బిజినెస్ అప్డేట్స్ కోసం చదవండి సాక్షి బిజినెస్ -
Hyderabad: 90 రోజులు ట్రాఫిక్ మళ్లింపు
సాక్షి, హైదరాబాద్: బాలానగర్ పరిధిలోని ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ సమీపంలో నాలా పనుల దృష్ట్యా ట్రాఫిక్ను మళ్లించనున్నారు. ఏజీ కాలనీ నుంచి లక్ష్మీ కాంప్లెక్స్ వరకు 65వ జాతీయ రహదారి మీదుగా నాలా పనుల నిమిత్తం.. బాలానగర్ పరిసర ప్రాంతాల్లో ఈ నెల 28 నుంచి జూన్ 28 వరకు 90 రోజుల పాటు ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. కూకట్పల్లి నుంచి అమీర్పేట, బేగంపేట వైపు, బాలానగర్ నుంచి కూకట్పల్లి వై జంక్షన్ మీదుగా అమీర్పేట్ వైపు, మూసాపేట గూడ్స్ షెడ్ రోడ్డు నుంచి అమీర్పేట వైపు వచ్చే వాహనాలను మళ్లించనున్నట్లు బాలానగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నరహరి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ►కూకట్పల్లి నుంచి అమీర్పేట వైపు వెళ్లే వాహనాలు కూకట్పల్లి మెట్రో రైల్ స్టేషన్ వద్ద యూ టర్న్ తీసుకుని ఐడీఎల్ లేక్ రోడ్డు, గ్రీన్హిల్స్ రోడ్డు, రెయిన్బో విస్టాస్, ఖలాపూర్ ఫ్లైఓవర్, పర్వతనగర్, టాడీ కాంపౌండ్, కావూరిహిల్స్, నీరూస్ జంక్షన్, జూబ్లీహిల్స్ చెక్పోస్టు, యూసుఫ్గూడ రోడ్, మైత్రివనం, అమీర్పేట్ మీదుగా వెళ్లాలి. ►కూకట్పల్లి నుంచి బేగంపేట వైపు వెళ్లే ట్రాఫిక్ను కూకట్పల్లి వై జంక్షన్లో బాలానగర్ ఫ్లైఓవర్, న్యూ బోయిన్పల్లి జంక్షన్, తాడ్బండ్, ప్యారడైజ్ జంక్షన్, బేగంపేట ఫ్లై ఓవర్ మీదుగా మళ్లిస్తారు. ►బాలానగర్ నుంచి కూకట్పల్లి వై జంక్షన్ మీదుగా అమీర్పేట వైపు వెళ్లే వాహనాలను బాలానగర్ ఫ్లైఓవర్ కింద, న్యూబోయిన్పల్లి జంక్షన్, తాడ్బండ్, ప్యారడైజ్ జంక్షన్, బేగంపేట్ ఫ్లైఓవర్, అమీర్పేట్ నుంచి మళ్లిస్తారు. ►మూసాపేట, గూడ్స్ షెడ్ నుంచి అమీర్పేట వైపు వెళ్లే వాహనాలను మళ్లిస్తారు ఐడీఎల్ లేక్ రోడ్, గ్రీన్ హిల్స్ రోడ్, రెయిన్బో విస్టాస్, ఖైత్లాపూర్ ఫ్లైఓవర్, పర్వత్నగర్, టోడీ కాంపౌండ్, కావూరి హిల్స్, నీరూస్ జంక్షన్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, యూసుఫ్గూడ రోడ్, మైత్రివనం, అమీర్పేట్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. -
బాలానగర్లో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: బాలానగర్లో బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సరిగ్గా చదువుకోవడం లేదంటూ తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపం చెందిన శివప్రసాద్.. ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి గదిలో సూసైడ్ నోట్, సెల్ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు హైదరాబాద్కు చేరుకున్నారు. ఆత్మహత్యపై బాలానగర్ పోలీసులు విచారణ చేపట్టారు. చదవండి: ‘టీచర్ కొట్టడం వల్లే మా బిడ్డ చనిపోయాడు!’ -
ఫార్మాలో భారత్ ‘విశ్వగురు’
బాలానగర్: ఫార్మసీ రంగంలో భారతదేశం ఎంతో పురోగతి సాధించిందని, ప్రస్తుతం విశ్వగురువుగా కూడా మారిందని కేంద్ర ఇంధన శాఖ సహాయ మంత్రి భగవత్ కూబా అన్నారు. శుక్రవారం బాలానగర్లోని నైపర్ 10వ స్నాతకోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఫార్మసీ విద్యార్థులు పరిశోధనల్లో పాలుపంచుకుని విజయం సాధించాలని, దేశాభివృద్ధికి పాటుపడాలని కోరారు. కరోనా లాంటి కష్టకాలంలోనే మన ఫార్మసీలో ఎన్నో ఆవిష్కరణలు జరిగాయని అన్నారు. 2017 సంవత్సరంలో ప్రారంభమైన నైపర్ కేవలం 16 సంవత్సరాల కాలంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్లో అధునాతన అధ్యయనాలు, అభ్యాసానికి అత్యుత్తమ కేంద్రంగా స్థిరపడటం మంచి పరిణామమన్నారు. ‘నా కెరీర్లో నాకెప్పుడూ గోల్డ్మెడల్ రాలేదు...కానీ నేను విద్యార్థులకు గోల్డ్మెడల్స్ ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందని’ ఆయన పేర్కొన్నారు. లారస్ ల్యాబ్స్ చైర్మన్ చావా సత్యనారాయణ మాట్లాడుతూ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఫార్మా రంగంలోకి రావడానికి ఇదే సరైన సమయం అన్నారు. దేశ ఖ్యాతిని పెంచేలా విద్యార్థులు పనిచేయాలని కోరారు. అనంతరం స్నాతకోత్సవంలో 187 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. అందులో 25 మంది పీహెచ్డీ, 162 మంది ఎంఎస్ (ఫార్మ్), ఎంబీఏ(ఫార్మ్) విద్యార్థులు ఉన్నారు. కార్యక్రమంలో నైపర్ హైదరాబాద్ డైరెక్టర్ డా.శశిబాలా సింగ్, డీన్ డా.ఎం. శ్రీనివాసరావు, రిజిస్ట్రార్ డాక్టర్ గణనాథం తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్ బాలానగర్ లో దారుణం.. రూ.400 కోసం వ్యక్తి హత్య
-
Hyderabad: ఈ ప్రాంతాల్లో జనవరి 31 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: సనత్నగర్ రైల్వేస్టేషన్ సమీపంలోని జింకలవాడ ఎదురుగా ఉన్న నాలా కల్వర్టు స్థానంలో బాక్స్ టైప్ కల్వర్టు నిర్మాణం చేపడుతున్న దృష్ట్యా ఆ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. డిసెంబర్ 1 నుంచి జనవరి 31 వరకు రెండు నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని వాహనదారులు తాము సూచించిన మార్గాల్లో వెళ్లాలని ఆయన సూచించారు. ►బాలానగర్ నర్సాపూర్ క్రాస్రోడ్డు నుంచి జింకలవాడ మీదుగా భరత్నగర్ మార్కెట్కు వచ్చే ద్విచక్ర వాహనాలను అనుమతిస్తారు. అయితే ఖైతాన్నగర్ వద్ద వాహనాలను కుడివైపు మళ్లించి సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఐటీఐ కళాశాల, ట్రాన్స్కాన్ ఇండస్ట్రీస్, జింకలవాడ నాలా, దుర్గామాత ఆలయం, సనత్నగర్ రైల్వే క్వార్టర్స్ మీదుగా భరత్నగర్ మార్కెట్కు వెళ్లాల్సి ఉంటుంది. ►మినీ ట్రాన్స్పోర్ట్ వాహనాలు, గూడ్స్ వాహనాలు, హెవీ గూడ్స్ వాహనాలు, బస్సులను నర్సాపూర్ క్రాస్ రోడ్డు నుంచి జింకలవాడ మీదుగా భరత్నగర్ మార్కెట్ వైపు అనుమతించరు. వాటిని నర్సాపూర్ క్రాస్రోడ్డు నుంచి కూకట్పల్లి వైపు మళ్లిస్తారు. వై జంక్షన్ వద్ద ఎడమ వైపు తీసుకుని మూసాపేట క్రాస్రోడ్డు మీదుగా భరత్నగర్ మార్కెట్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. ► ద్విచక్ర వాహనాల రాకపోకలు మాత్రమే భరత్నగర్ మార్కెట్ నుంచి జింకలవాడ మీదుగా నర్సాపూర్ క్రాస్ రోడ్డు వైపునకు అనుమతిస్తారు. ఈ వాహనాలను సనత్నగర్ రైల్వే క్వార్టర్స్ (ఎదురుగా ఎడమ వైపునకు), దుర్గామాత ఆలయం(కుడి మలుపు), జింకలవాడ నాలా, ట్రాన్స్కాన్ ఇండస్ట్రీస్(కుడి మలుపు), సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఐటీఐ కళాశాల, ఖైతాన్నగర్ రహదారిలో ఎడమవైపు తీసుకుని నర్సాపూర్ క్రాస్రోడ్డుకు చేరుకోవాల్సి ఉంటుంది. ►ద్విచక్ర వాహనాలు మినహా ఇతర వాహనాలు, లైట్ మోటార్ వాహనాలు, మినీ ట్రాన్స్పోర్ట్ వాహనాలు, గూడ్స్ వాహనాలు, హెవీ గూడ్స్ వాహనాలు, బస్సులను భరత్నగర్ మార్కెట్ నుంచి జింకలవాడ మీదుగా నర్సాపూర్ క్రాస్రోడ్డు వైపు అనుమతించరు. వాటిని భరత్నగర్ మార్కెట్ నుంచి కూకట్పల్లి వై జంక్షన్ వైపు మళ్లిస్తారు. వై జంక్షన్ వద్ద కుడివైపు మళ్లి ఐడీపీఎల్ కంపెనీ మీదుగా నర్సాపూర్ క్రాస్రోడ్డు వైపు వెళ్లాల్సి ఉంటుంది. చదవండి: జైళ్లో పెట్టుకోండి.. అంతకంటే ఏం చేయగలరు?: ఎమ్మెల్సీ కవిత ఫైర్ -
Hyderabad: ఇద్దరు యువతుల అదృశ్యం
సాక్షి, హైదరాబాద్: కిరాణాషాపునకు వెళ్లి వస్తానని చెప్పి ఇంట్లోనుంచి బయటకు వెళ్లిన యువతి అదృశ్యమైంది. గురువారం సీఐ భాస్కర్ తెలిపిన మేరకు.. మహమ్మద్ కాజా పటేల్ తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతని చిన్న కుమార్తె సైదియా బేగం (20) ఈ నెల 15 సాయంత్రం 4 గంటలకు ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. బంధువులు,స్నేహితుల ఇళ్లల్లో గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బాలానగర్ పోలీసులు తెలిపారు. ఇంట్లో నుంచి వెళ్లిన ఓ యువతి అదృశ్యమైంది. ఈ సంఘటన కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని గురువారం చోటు చేసుకుంది. ఎస్ఐ ప్రేమ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం మూసాపేట సఫ్దార్నగర్లో అన్నీ బేగం తన కుమార్తెలతో కలిసి నివాసముంటోంది. పెద్ద కుమార్తె ముస్కాన్ ఇంటివద్దే ఉంటుంది. బుధవారం తెల్లవారుజామున అన్నీ బేగం నిద్ర లేచేసరికి తన పెద్ద కుమార్తె ముష్కాన్ కనిపించలేదు. దీంతో కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
చదువుకునే సమయంలో రాజేష్తో ప్రేమ.. ఇంట్లో వాళ్లకు చెప్పకుండా..
సాక్షి, హైదరాబాద్: ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఓ యువతి అదృశ్యమైన ఘటన బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. సోమిరెడ్డి సత్తిబాబు తన కూతురు రాధిక(19)ను స్వస్థలం ఆంధ్రపదేశ్లోని విశాఖపట్నం జిల్లాలోని మచ్చవాని పాలెంలో చదివిస్తున్నాడు. అయితే అక్కడ రాజేష్ అనే యువకుడు, రాధికలు ప్రేమించుకుంటున్నారనే విషయం తెలిసి రాధికను బాలానగర్లోని సాయినగర్కు ఆరు నెలల క్రితం తీసుకువచ్చాడు. అయితే 17వ తేదీ ఉదయం 10.30 గంటలకు రాధిక ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన సోమిరెడ్డి సత్తిబాబు బంధువులు, స్నేహితుల వద్ద వాకబు చేసినా ఆచూకీ తెలియకపోవటంతో బాలానగర్ పోలీస్లను ఆశ్రయించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: పెళ్లయిన యువతితో యువకుని ప్రేమ వ్యవహారం.. చివరకు.. -
హైదరాబాద్: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిపై లైంగిక దాడి
సాక్షి, బాలనగర్: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతిపై లైంగిక దాడిచేసిన ఓ యువకుడు కటకటాల పాలయ్యాడు. ఈ సంఘటన బాలనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ ఎండి వాహుత్ దిన్ తెలిపిన మేరకు.. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన అనిల్ కుమార్ అనే యువకుడు బాలనగర్ లోని వినాయక్ నగర్ లో నివసిస్తున్నాడు. సొంతంగా వ్యాపారం నిర్వహించుకుంటున్నాడు. ఈ క్రమంలో అదే కాలనీకి చెందిన ఓ యువతి అతనికి పరిచయం అయింది. ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి ఆమెపై లైంగికదాడి చేశాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదుచేసి దర్యాప్తు చేసిన పోలీసులు ఆ యువకుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. చదవండి: మహిళా ప్రొఫెసర్కు అశ్లీల వీడియోలు, అసభ్యకర మెసేజ్లు.. -
ఆలనాపాలనా చూడలేక..
బాలానగర్: బిడ్డ ఆలనా.. పాలనా చూడాల్సిన కన్న తల్లి చనిపోయింది. నడవలేని స్థితిలో ఉన్న ఆ చిన్నారిని కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కాలయముడయ్యాడు. కూతురిని పెంచడం భారంగా భావించి.. బాధ్యతలు విస్మరించిన ఆ తండ్రి చిన్నారిని నదిలోకి తోసేసి కడతేర్చిన సంఘటన మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలం సూరారంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. సూరారం గ్రామానికి చెందిన రావుల రాజుకు, రంగారెడ్డి జిల్లా ఫరూఖ్నగర్ మండలం దేవల్లికి చెందిన మంజులతో వివాహమైంది. ఇద్దరూ దినసరి కూలీలుగా పనిచేస్తున్నారు. వీరికి ముగ్గురు అమ్మాయిలు. పెద్ద కూతురు పూజ షాద్నగర్లో ఏడో తరగతి, చిన్న కూతురు రూప గ్రామంలోనే నాలుగో తరగతి చదువుతుండగా రాజు మధ్యలోనే వారి చదువు మాన్పించాడు. పేదరికం, ఆర్థిక ఇబ్బందుల వల్ల భార్యాభర్తలు ఇంట్లో తరచూ గొడవ పడుతుండేవారు. చిన్నకూతురు స్నేహ పుట్టిన రెండు నెలలకే ఇంట్లో కింద పడి నడుము దెబ్బతినడంతో ఆరేళ్లు దాటినా ఇంకా నడవలేకపోతోంది. ఈ నేపథ్యంలో నెల రోజుల క్రితం భార్య అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో నడవలేని స్థితిలో ఉన్న స్నేహ తనకు భారంగా మారుతుందని భావించి.. మంగళవారం తెల్లవారుజామున ఎవరికీ తెలియకుండా ఆ చిన్నారిని తీసుకెళ్లి గ్రామ సమీపంలో ఉన్న దుందుభినదిలో తోసి వచ్చాడు. ఇంట్లో స్నేహ కనిపించకపోవడంతో చుట్టుపక్కల వారు రాజును నిలదీశారు. అతను పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రాజును అదుపులోకి తీసుకుని విచారించడంతో పాపను దుందుభినదిలో తోసి వేసినట్లు ఒప్పుకున్నాడు. జడ్చర్ల రూరల్ సీఐ జమ్ములప్ప, ఎస్ఐ వెంకటేశ్వర్లు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించగా.. స్నేహ మృతదేహం తేలుతూ కనిపించింది. ఈ సంఘటనపై పాప బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ప్రేమ పేరుతో మోసం.. శారీరకంగా లొంగదీసుకొని.. చివరకు
సాక్షి, హైదరాబాద్: ప్రేమ పేరుతో ఓ యువతిని మోసం చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ సంఘటన బాలానగర్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. సీఐ ఎండీ వాహిదుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. బాలానగర్లోని ఓ యువతితో ఆరు నెలల నుంచి వీరేందర్ (29) పరిచయం ఏర్పరుచుకొని పెళ్లి పేరుతో ఆమెను శారీరకంగా కలిసి పెళ్లి చేసుకోకుండా మోసగించాడు. చదవండి: (కుమార్తె నిశ్చితార్థం రద్దు.. తండ్రి ఆత్మహత్య!) వినాయక్నగర్లో ఉంటు వీరేందర్ కూరగాయల వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఎప్పుడు పెళ్లి ప్రస్తావన తెచ్చినా వీరేందర్ మాటదాట వేస్తున్నాడు. పెళ్లి చేసుకోకుండా తనని వీరేందర్ మోసం చేశాడని ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి వీరేందర్ను రిమాండ్కు తరలించినట్లు బాలానగర్ పోలీసులు తెలిపారు. చదవండి: (ప్రియురాల్ని స్నేహితులకు విందుగా మార్చిన ప్రియుడు..) -
‘అమ్మా ఫోన్ రిపేర్ చేయించుకుని వస్తా’..! యువతి అదృశ్యం..
బాలానగర్: మొబైల్ ఫోన్ రిపేర్ చేయించుకొని వస్తానని ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఓ యువతి తిరిగి ఇంటికి రాని సంఘటన బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. సీఐ ఎన్.డి.వాకింగ్ ఇన్ తెలిపిన వివరాలు.. బాలానగర్ డివిజన్ పరిధిలోని గౌతమ్ నగర్కు చెందిన ఎ.విష్ణు తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నాడు. అతని కుమార్తె లావణ్య (20) ప్రైవేట్ జాబ్ చేస్తోంది. ఈ నెల 7న సాయంత్రం 6 గంటల సమయంలో ఫోన్ రిపేర్ చేయించుకొని వస్తానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్ళి తిరిగి రాలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఎంత వాకబు చేసినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. చదవండి: ఐదేళ్ల పోరాటం: బాలికపై అత్యాచార కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష! -
చీరకు నిప్పంటుకొని తొమ్మిది నెలల నిండు గర్భిణి మృతి
సాకక్షి, బాలానగర్: ప్రమాదవశాత్తు చీరకు నిప్పంటుకొని ఓ గృహిణి మృతి చెందిన సంఘటన బాలానగర్ పోలీస్స్టేసన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ వాహిదుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం బాలానగర్లోని దాసరి బస్తీకి చెందిన శివరాణి, భర్త పిల్లలతో కలిసి నివాసముంటోంది. ఈ నెల 7వ తేదీన భర్త ఊరికి వెళ్లగా 9 నెలల గర్భవతి అయిన శివరాణి తల్లిదండ్రులతో కలిసి ఉంది. చదవండి: ముసురు వానకు పాడైన పంట.. ఆగిన రైతు గుండె అదే రోజు ఉదయం ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్ స్టవ్ నుంచి మంటలు చెలరేగి శివరాణి (23) కడుపు, కళ్లకు గాయాలయ్యాయి. కాలిన గాయాలతో ఉన్న ఆమెను మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఆర్ఎన్సీ ఆస్పత్రికి తరలించారు. గర్భంలో ఉన్న శిశువు మృతి చెందటంతో శివరాణికి ఆపరేషన్ చేస్తుండగా 23వ తేదీ ఉదయం ఆమె మృతి చెందింది. ఈ మేరకు ఫిర్యాదు నమోదు చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: తెలంగాణలో 67,820 ఉద్యోగ ఖాళీలు.. విభజన పూర్తయ్యేది ఎప్పుడో? -
ఆన్లైన్లో ఫోన్ బుక్ చేసి.. నగదు పోగొట్టుకున్న యువతి
సాక్షి, బాలానగర్: ఆన్లైన్లో ఫోన్ను బుక్ చేసి డబ్బులు పోగొట్టుకున్న సంఘటన జరిగింది. బాలానగర్ డివిజన్ ఫిరోజ్గూడకు చెందిన మౌనిక (24) ఐసీఐసీఐ బ్యాంక్లో ఉద్యోగం చేస్తోంది. ఈ నెల 3న ఆన్లైన్లో ఫోన్ బుక్ చేసి నగదు చెల్లించింది. కాగా ఆ నగదు జమ అయినట్లుగా ఫోన్కు సమాచారం రాలేదు. దీంతో ఆన్లైన్లో బజాజ్ ఫైనాన్స్ కస్టమర్ కేర్ నంబర్ గురించి సెర్చ్ చేస్తుండగా గుర్తు తెలియని నంబర్ నుంచి ఆమెకు ఫోన్ వచ్చింది. చదవండి: కూకట్పల్లి: రెండు వ్యభిచార గృహాలపై దాడులు, ఇద్దరు అరెస్టు మెబిక్విక్ బజాజ్ ఫైనాన్స్ వ్యాలెట్ను డౌన్లోడ్ చేసి అందులో నుంచి 5 రూపాయలు పంపిస్తే మీరు నగదు చెల్లించినట్లుగా మెసేజ్ వస్తుందని చెప్పారు. ఆమె గుర్తు తెలియని వ్యక్తి చెప్పినట్లుగా 5 రూపాయలు పంపించింది. ఆమెకు ఓటీపీ వచ్చింది. ఆ కొద్ది సేపటికే ఆమె అకౌంట్ నుంచి 23,154 రూపాయల నగదు డెబిట్ అయినట్లుగా మెసేజ్ వచ్చింది. ఆ నంబర్కు ఫోన్ చేయగా పని చేయడం లేదు. దీంతో మౌనిక బాలానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఎండీ వాహిదుద్దీన్ తెలిపారు. -
తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో పాలమూరు బుడ్డోడు
బాలానగర్: మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థి తన ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. తాజాగా ఆ విద్యార్థి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి. బాలానగర్ మండలంలోని నేరళ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న పాత్లావత్ పురందాస్ విద్యార్థి తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించాడు. చదవండి: కీడు శంకించిందని గాంధీ విగ్రహాన్ని పక్కన పడేశారు ప్రముఖ కవి గిడుగు రామమూర్తి జయంతి (ఆగస్టు 29) సందర్భంగా ఆగస్టు 21 నుంచి 29వ తేదీ వరకు వారోత్సవాలు నిర్వహించారు. జూమ్ ఆప్ ద్వారా నిర్వహించిన కవితా పఠనంలో పురందాస్ పాల్గొని ప్రతిభ చాటాడు. ఈ సందర్భంగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకున్నాడు. నిర్వాహకులు విద్యార్థికి ప్రశంసా పత్రాన్ని అందించారు. చదవండి: మద్యం తాగితే రూ.10 వేల జరిమానా ఈ కార్యక్రమంలో దేశ విదేశాల నుంచి సుమారు వెయ్యి మందికి పైగా వ్యక్తులు ఇందులో పాల్గొన్నారు. ఈ విషయమై పాఠశాల తెలుగు అధ్యాపకురాలు చైతన్య భారతిని పాఠశాల హెచ్ఎం పాండురంగారెడ్డితో పాటు సర్పంచ్ ఖలీల్, గోపి, ఎంఎంసీ చైర్మన్ శేఖర్, ఉపాధ్యాయులు శ్రీనివాస్, ఉమాదేవి, రాజేందర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, శారదాదేవి తదితరులు హర్షం వ్యక్తం చేశారు. -
మరుగుదొడ్డిలో నివాసం.. ‘సాక్షి’ చొరవతో సుజాతకు పక్కా ఇల్లు
బాలానగర్: మరుగుదొడ్డిలో నివసిస్తున్న ఆ కుటుంబ కష్టాలను సాక్షి వెలుగులోకి తీసుకువచ్చింది. సాక్షి కథనానికి స్పందించిన మానవతామూర్తులు ఆ కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇస్తున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని తిరుమలగిరికి చెందిన సుజాతకు పక్కా ఇల్లు కట్టించేందుకు పలువురు దాతలు ముందుకు వచ్చారు. గ్రామానికి చెందిన సుజాత భర్త ఆరేళ్ల కిందట మృతి చెందాడు. అయితే వారి ఇల్లు మూడేళ్ల కిందట కూలిపోయింది. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం కావడంతో ఇల్లు నిర్మించుకోవడం కష్టమవడంతో ఇంటి ముందు ఉన్న మరుగుదొడ్డిలోనే నివసిస్తున్నారు. చదవండి: మగువ, మందుతో ఖాకీలకు వల.. సవాల్గా కార్పొరేటర్ భర్త కేసు సుజాతతోపాటు తన ఇద్దరు పిల్లలు, అత్తతో కలిసి మరుగుదొడ్డిలో ఉంటున్నారు. వీరి కష్టాలను ‘సాక్షి’ వెలుగులోకి తీసుకువచ్చింది. ఇటీవల ఓ కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన హైదరాబాద్ ఇబ్రహీంపట్నం ఆదిబట్లకు చెందిన ప్రభాకర్రెడ్డి, ఆస్ట్రేలియాలో ఉన్న ఆయన బంధువు రాఘవరెడ్డి, రత్నాకర్రెడ్డి ముందుకు వచ్చారు. తమ స్నేహితుల సహకారంతో సుజాతకు ఇల్లు కట్టించేందుకు ఆర్థిక సహాయం అందించారు. ప్రస్తుతం ఇంటి నిర్మాణం చురుకుగా సాగుతోంది. ఇందుకు సంబంధించి గ్రామానికి చెందిన మోహన్నాయక్కు రూ.1.60 లక్షలు అందజేసి ఇంటి నిర్మాణం పూర్తి బాధ్యతను అప్పగించారు. రెండు నెలల్లోగా ఇంటి నిర్మాణం పూర్తిచేయాలని వారు కోరారు. చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద ఎకో అర్బన్ పార్క్ ‘తెలంగాణలో..’ -
తిరుమలగిరి బాలానగర్లో బాత్రూమ్లో నివసిస్తున్న కుటుంబం.
-
టీవీ రీచార్జ్ : రూ. 1.18 లక్షలు హాంఫట్
బాలానగర్: బ్యాంకు అకౌంట్ల వివరాలు, పిన్ నెంబర్లు, పాస్వర్డ్స్ ఎవరికీ చెప్పొద్దని ఎంత మొత్తుకుంటున్నా, వినియోగదారులు మళ్లీ మళ్లీ మోసపోతూనే ఉన్నారు. కష్టపడి సంపాదించుకున్న డబ్బును క్షణాల్లో పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఆన్లైన్ ద్వారా టీవీ రీచార్జ్ చేసిన మహిళ రూ.1.18 లక్షలు పోగొట్టుకున్న ఘటన బాలానగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ ఎండీ వాహిదుద్దీన్ వివరాల ప్రకారం.. ఏపీహెచ్బీ కాలనీకి చెందిన సంధ్య గత నెల 30న సన్ డైరెక్ట్ రీచార్జ్ చేయడానికి ప్రయత్నించగా కాలేదు. దీంతో ఆమె గూగూల్లో కస్టమర్ కేర్ నంబర్ వెతికి కనిపించిన నంబర్కు ఫోన్ చేసింది. తమ సన్ డెరెక్ట్ రీచార్జ్ కావడం లేదని తెలుపగా టీమ్వీవర్ యాప్ను డౌన్ లోడ్ చేసుకొని చేయాలని అవతలి వ్యక్తి చెప్పడంతో ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని ప్రయత్నించినా కాలేదు. మళ్లీ రీచార్జ్ కావడం లేదని బాధితురాలు చెప్పగా మీ యూనో యాప్ పిన్ నెంబర్, పాస్వర్ట్ చెప్పండి, ఎలా చేయాలో చెబుతానని కోరగా ఆమె చెప్పడంతో ఐదు దఫాలుగా రూ. 1,18,000 ఆమె అకౌంట్లో నుంచి డెబిట్ అయ్యాయి. మోసపోయినట్లు గ్రహించిన మహిళ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఏం ఐడియా రా బాబు.. వంటింటినే ల్యాబ్గా మార్చి..
సాక్షి, సిటీబ్యూరో: బాలానగర్లో ఉన్న నివాస ప్రాంతంలోని ఓ ఇంటిని అద్దెకు తీసుకున్న సుధాకర్ అనే వ్యక్తి అందులో ఆల్ఫాజోలమ్ మాదకద్రవ్యం తయారు చేస్తున్నాడు. వంటింటినే ల్యాబ్గా మార్చి ఈ నిషేధిత డ్రగ్ ఉత్పత్తి చేసి విక్రయిస్తున్నాడు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) బృందాలు శని, ఆదివారాల్లో జరిపిన దాడుల్లో ఈ విషయం బహిర్గతమైంది. సుధాకర్ సహా అయిదుగురు నిందితుల్ని అరెస్టు చేసిన అధికారులు 3.25 కేజీల మాదకద్రవ్యం, రూ.12.75 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నాయి. తడవకు 5 కిలోల చొప్పున.. ► సుధాకర్ స్నేహితుడికి సాధారణ ఔషధాల తయారీకి సంబంధించిన లైసెన్స్ ఉంది. బాలానగర్కు చెందిన సుధాకర్తో కలిసి దీన్ని దుర్వినియోగం చేసిన ఇతగాడు తన కంపెనీ పేరుతో చిన్న పరిమాణంలో ఉన్న ఫ్లాస్క్, రియాక్టర్, డ్రయ్యర్ కొనుగోలు చేశాడు. వీటిని సుధాకర్ వంటింట్లో బిగించారు. ఆల్ఫాజోలమ్ తయారీకి అవసరమైన ముడి పదార్థాలకు వివిధ మార్గాల్లో సేకరిస్తున్న ఈ ద్వయం వాటిని వినియోగించి ఒక్కో తడవకు 4 నుంచి 5 కేజీల ఆల్ఫాజోలమ్ తయారు చేస్తోంది. దీన్ని స్థానికంగా ఉన్న ముఠాలతో పాటు కర్ణాటకలోని బెంగళూరు సహా వివిధ ప్రాంతాలకు చెందిన వారికి విక్రయిస్తున్నారు. ►ఇటీవలే 3.25 కేజీల డ్రగ్ ఉత్పత్తి చేసిన సుధాకర్ దాన్ని బెంగళూరుకు చెందిన నరేష్కు విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. సరుకు తీసుకోవడానికి డబ్బు తీసుకుని శనివారం రాత్రి హైదరాబాద్కు రమ్మని సూచించాడు. దీనిపై బెంగళూరు ఎన్సీబీ జోనల్ యూనిట్కు సమాచారం అందింది. అక్కడ నుంచి వచ్చిన ఓ ప్రత్యేక బృందంతో పాటు హైదరాబాద్ సబ్–జోనల్ యూనిట్ అధికారులూ హైదరాబాద్–మెదక్ రహదారిలోని గండి మైసమ్మ వద్ద ఉన్న ఉజ్వల గ్రాండ్ హోటల్ సమీపంలో కాపుకాశారు. ► సరుకు తీసుకుని ఓ కారులో వచ్చిన సుధాకర్తో పాటు మరో వ్యక్తిని, మరో కారులో వచ్చిన నరేష్ సహా ఇద్దరిని అదుపులోకి తీసుకుని నగదు, డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు. వీరి విచారణలోనే సుధాకర్ ఇంట్లో ఈ డ్రగ్ తయారవుతున్నట్లు వెలుగులోకి రావడంతో అక్కడా దాడి చేసి ఉపకరణాలు సీజ్ చేశారు. ఈ దందాను మరింత పెంచాలనే విస్తరించాలనే ఉద్దేశంతో సుధాకర్ ఇటీవలే తన పక్క ఇంటినీ అద్దెకు తీసుకున్నాడని, అందులో కొత్తగా రియాక్టర్, డ్రయ్యర్ ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. దీంతో ఆ ఇంటినీ సీజ్ చేసిన ఎన్సీబీ టీమ్ ఔషధాల తయారీ లైసెన్స్ కలిగిన సుధాకర్ స్నేహితుడినీ అరెస్టు చేసింది. బాలానగర్లోని ఇంటి కేంద్రంగా దాదాపు అయిదేళ్లుగా ఆల్ఫాజోలమ్ తయారీ చేస్తున్నట్లు తేల్చారు. -
దేశంలోనే మనది నెంబర్ వన్ సిటీ: కేటీఆర్
బాలానగర్: ‘దేశంలో ఏ నగరంలో జరగని అభివృద్ధి హైదరాబాద్ నగరంలో జరిగింది. అందుకే మన సిటీ నెంబర్ వన్ స్థానంలో ఉందని గర్వంగా చెప్పగలం..’ అని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం కూకట్పల్లి నియోజకవర్గం ఫతేనగర్ డివిజన్ పరిధిలోని ఎల్బీఎస్ నగర్లో జలమండలి ఆధ్వర్యంలో నిర్మించనున్న మురుగునీటి శుద్ధి కేంద్రానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ గ్రేటర్ నగరం రోజు రోజుకి విస్తరిస్తోందని, ఉపాధి అవకాశాలు పెరిగాయని, పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు వస్తుండటంతో ప్రజలు నగరం నలుమూలలకు తమ కార్యకలాపాల్ని విస్తరిస్తున్నారని చెప్పారు. ఒకప్పుడు ఎంసీహెచ్ 150 నుంచి 160 చదరపు కిలోమీటర్ల మేరకు ఉండేదని, జీహెచ్ఎంసీగా రూపాంతరం చెందిన తర్వాత నగరం 625 చదరపు కిలోమీటర్ల మేరకు పెరిగిందన్నారు. దీంతో ప్రతిరోజు నగరంలో 1950 మిలియన్ లీటర్ల మురుగునీరు ఉత్పన్నమవుతోందని, దీనిలో 94 శాతం మురుగు నీరు గ్రావిటి ద్వారా మూసీనదిలోకి వెళుతుందని పేర్కొన్నారు. మురుగు నీటిని శుద్ధి చేయకుంటే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని తెలుపుతూ గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల భోలక్పూర్లో మంచినీరు కలుషతిమై 9 మంది చనిపోయారని మంత్రి గుర్తుచేశారు. హైదరాబాద్లో ప్రస్తుతం 40 శాతం మురుగునీటిని శుద్ధి చేస్తున్నామని అన్నారు. నగరం చుట్టూ ఉన్న చెరువులను సుందరీకరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ‘మూసీ నదిని జీవనదిగా మార్చాలి. మన నగరాన్ని విశ్వనగరంగా మార్చాలి. ఇందుకు అందరూ సహకరించాలి’ అని కేటీఆర్ పునరుద్ఘాటించారు. ప్రజలు నాలాలు, మురికి కాల్వల్లో చెత్తను వేయవద్దని చెప్పారు. మనందరం కలిసి మన పిల్లలకు మెరుగైన భవిష్యత్తును అందిద్దాం అన్నారు. ఈ సందర్భంగా హాజరైన మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా జరగని అభివృద్ధి మన రాష్ట్రంలో జరుగుతోందన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళిత బంధు పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ తాను అడిగిన వెంటనే నియోజకవర్గంలోని 9 చెరువులకు నిధులు మంజూరు చేశారని కేటీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు నవీన్కుమార్, శంభీపూర్ రాజు, డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్రెడ్డి, జలమండలి ఎండీ దానకిషోర్, కార్పొరేటర్లు పండాల సతీష్ గౌడ్, ఆవుల రవీందర్ రెడ్డి, ముద్దం నర్సింహయాదవ్, శిరీష బాబురావు, సబిహా బేగం, జూపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
బాలానగర్ వంతెనపై దారుణం
-
బాలానగర్ వంతెనపై దారుణం: సేప్టీ గోడకు గుద్దుకుని..
సాక్షి, హైదరాబాద్: అతి వేగం ప్రమాదకరం.. హెల్మెట్ లేని ప్రయాణం వద్దు అని ఎంత ప్రచారం చేసినా పట్టించుకోరు కొందరు. చివరకు ఏం అవుతుంది.. అంటే ఇదిగో ఇలా ఊహించని విధంగా ప్రమాదాలకు గురై మరణించే పరిస్థితులు తలెత్తుతాయి. బాలానగర్లో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. ఫ్లైఓవర్ మీద బైక్పై అతి వేగంగా వెళ్తూ.. అదుపుతప్పి సేఫ్టీ గోడకు గుద్దుకుని బుధవారం ఓ యువకుడు మృతి చెందాడు. లైసెన్స్ తీసుకునేందుకు ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లి వస్తుండగా.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ వివరాలు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా కొనిదెన గ్రామానికి చెందిన అశోక్(24) అనే యువకుడు లారీ డ్రైవర్గా చేస్తున్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్ కేపీహెచ్బీలో ఉండే తన సోదరుడు ఇంటికి వచ్చిన అశోక్.. లైసెన్స్ తీసుకునేందుకు బైక్ మీద తిరుమలగిరిలోని ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లాడు. బాలానగర్ వంతెనపై నుంచి అతి వేగంగా వెళ్తూ అదుపు తప్పి ఎడమవైపు ఉండే సేఫ్టీ డివైడర్ను ఢీ కొట్టాడు. ఇది గమనించిన స్థానికుల వెంటనే 108లో అశోక్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న బాలానగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిద్రమత్తు కారణంగానే బైక్ అదుపుతప్పి ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. -
బాలానగర్లో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: బాలానగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని గాంధీ నగర్ పారిశ్రామికవాడలో గల ఓ గోదాములో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రేరణి ఇండస్ట్రీస్ ప్లైవుడ్ గోదాములో మంటలు చెలరేగాయి. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తున్నారు. -
బాలానగర్ : ఫ్లై వుడ్ గోదాములో చెలరేగిన మంటలు
-
బాలానగర్ ఫ్లైఓవర్ ఓపెనింగ్: ప్రత్యేక ఆకర్షణగా శివమ్మ..
సాక్షి, హైదరాబాద్: బాలానగర్ ఫ్లైఓవర్ను మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించిన విషయం తెలిసిందే. నగరంలో ట్రాఫిక్ రద్దీ రోజురోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జి ప్రారంభంతో స్థానికులకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. రూ.387 కోట్లతో 1.13 కి.మీ. పొడవుతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఫ్లైఓవర్ రిబ్బన్ కటింగ్ ఎవరు చేశారో తెలుసా.. మంత్రి కేటీఆర్ ఓ కూలీ చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ చేయించారు. ఆమెనే వనపర్తి జిల్లాకు చెందిన శివమ్మ. గత రేండేళ్ల నుంచి ఈ ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల్లో ఆమె పాలు పంచుకుంది. శివమ్మ చేతుల మీదుగా ఫ్లై ఓవర్ను ప్రారంభించుకోవడంతో కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది శివమ్మ. కాగా. 6 లైన్లు, 24 మీ. వెడల్పు, 26 పిల్లర్లతో ఫ్లైఓవర్ను నిర్మించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. త్వరలో రహదారుల విస్తరణ చేపడతామన్నారు. ప్యాట్నీ నుంచి సుచిత్ర వరకు స్కైవే నిర్మిస్తామని తెలిపారు. ఫతేనగర్ ఫ్లైఓవర్ను విస్తరిస్తామని కేటీఆర్ వెల్లడించారు. ప్రారంభోత్సవ క్యార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
Hyderabad: బాలానగర్ ఫ్లైఓవర్ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
-
ట్రాఫిక్ కష్టాలకు చెక్.. బాలానగర్ ఫ్లై ఓవర్ సిద్ధం!
సాక్షి, బాలానగర్: బాలానగర్ డివిజన్లోని నర్సాపూర్ చౌరస్తా రద్దీగా ఉండే నాలుగు రోడ్ల కూడలి. కూకట్పల్లి, సికింద్రాబాద్, జీడిమెట్ల వెళ్లే రహదారి. పారిశ్రామిక కేంద్రం కావటంతో నిత్యం వేలాది వాహనాల రాకపోకలు కొనసాగుతూ ఉంటాయి. బాలానగర్లో ట్రాఫిక్ దాటితే చాలు అని ప్రజలు అనుకుంటారు. అంతగా ఉంటుంది రద్దీ. ఇక్కడి ప్రజలకు ట్రాఫిక్ కష్టాలకు పరిష్కారం చూపారు. బాలానగర్ ఫ్లై ఓవర్ నిర్మించారు. రయ్ రయ్న బాలానగర్పై ఓవర్ బ్రిడ్జిపై వాహనాలు పరుగులు తీయడానికి అంతా సిద్ధం చేశారు. ఈ నెల 6న మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. సాకారమిలా.. 2017 ఆగస్టు 21న బాలానగర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. రూ.385 కోట్లతో మూడున్నరేళ్ల వ్యవధిలో బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేశారు. బ్రిడ్జి ఇరువైపులా రెండు డివిజన్లు ఉన్నాయి. ఒకటి ఫతేనగర్, మరొకటి బాలానగర్. రెండు డివిజన్లతో వందలాది పరిశ్రమలు ఉన్నాయి. దీంతో నిత్యం కార్మికులు, లారీలు, ఆటో ట్రాలీలతో రద్దీగా ఉంటుంది. బ్రిడ్జి పొడవు 1.13 కిలోమీటర్లు, 24 మీటర్లు వెడల్పు 26 పిల్లర్లతో నిర్మించారు. ఈ బ్రిడ్జికి ఒక ప్రత్యేకత ఉంది. హైదరాబాద్ నగరంలోని అతి ప్రధాన రహదారుల్లో ఒకటి, 6 లేన్లతో సిటీలోనే నిర్మించిన మొట్టమొదటి బ్రిడ్జి ఇది. 2050 సంవత్సరం వరకు ట్రాఫిక్ను దృష్టిలో ఉంచుకొని నిర్మాణం చేశారు. దీనికి బాబూ జగజ్జీవన్రామ్ బ్రిడ్జిగా నామకరణం చేయనున్నారు. ప్రజలకిచ్చిన హామీని నెరవేర్చాం.. బాలానగర్, ఫతేనగర్ డివిజన్ల ప్రజలకిచ్చిన హామీని నెరవేర్చాం. గత 40 సంవత్సరాలు ప్రజలు ట్రాఫిక్ బాధలు పడ్డారు. ట్రాఫిక్ సమస్య తీరనుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనిచేశాం. – మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్యే బాలానగర్ రూపురేఖలే మారిపోయాయి.. ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తయ్యాయి. వాహనదారులకు అందుబాటులోకి వచ్చింది. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాం. ఈ బ్రిడ్జి నిర్మాణంతో బాలానగర్ రపురేఖలే మారిపోయాయి. – యూసఫ్ హుస్సేన్, హెచ్ఎండీఏ ఎస్ఇ∙ -
ఇన్స్టా పరిచయం.. ప్రేమ అంగీకరించలేదని ప్రియుడి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: ప్రియురాలు తన ప్రేమను అంగీకరించకపోవటంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బాలానగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వాహిదుద్దీన్ వివరాల ప్రకారం.. కూకట్పల్లిలోని రెయిన్బో విస్తా అపార్టుమెంట్లో కె.శుభమ్ (27), తన తల్లిదండ్రులతో కలిసి నివాసముంటూ అమెజాన్లో ఉద్యోగం చేస్తున్నాడు. గత మూడేళ్లుగా బాలానగర్ శోభనా కాలనీలో రోడ్డు నెంబర్ –1 లో నివాసముండే ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఈ నెల 20వ తేదీన రాత్రి 10.30 గంటల సమయంలో తన ప్రేమ విషయం తెలిపేందుకు యువతి నివాసానికి వెళ్లాడు. నాలుగో అంతస్తులో ఉంటున్న ఆమెను కలిసి తనను ప్రేమించమని, పెళ్లి చేసుకోమని కోరగా ఆమె ఒప్పుకోకపోవడంతో శుభమ్ అక్కడి నుంచి దూకి మృతి చెందాడు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: శ్రీకాంత్ ఫ్రమ్ సీఎం పేషీ.. బీసీ కమిషన్ చైర్మన్ పోస్టు కావాలా? -
ఎమ్మెల్సీ ఎన్నికలు: ఓటేసి వచ్చేసరికి ఇల్లు గుల్ల
బాలానగర్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసి ఇంటికి వచ్చేసరికి దొంగలు ఇల్లుగుల్ల చేసిన ఘటన బాలానగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ ఎండీ. వాహిదుద్దీన్ వివరాల ప్రకారం.. బాలానగర్ డివిజన్ పరిధిలోని పద్మానగర్ ఫేజ్ –1 లో ముక్కు పద్మ దంపతులు నివాసముంటున్నారు. ఈ నెల 11న బీరువాలో 5.5. తులాల బంగారు ఆభరణాలు దాచి పెట్టారు. అయితే.. ఆదివారం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసి వచ్చి బీరువా తెరచి చూడగా అందులో బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో పద్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
ఓ మై గాడ్.. బీ కేర్ఫుల్!
బాలానగర్ : తల్లి చేయి పట్టుకుని వెళుతున్న ఓ బాలుడు హఠాత్తుగా రోడ్డు దాటేందుకు యత్నించాడు..అదే సమయంలో వేగంగా దూసుకువచ్చిన ఓ బైక్ ఆ చిన్నారిని ఢీకొట్టింది. రెప్పపాటు కాలంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో చిన్నారి తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు..ఒక్కసారిగా రోడ్డుకు అడ్డంగా బాలుడు రావడంతో షాక్కు గురైన వాహనదారుడు సొమ్మసిల్లి పడిపోయాడు. వివరాల్లోకి వెళితే..బాలానగర్, వినాయక్నగర్ ప్రాంతంలో సాల్మాన్, కుమారి దంపతులు నివాసం ఉంటున్నారు. శుక్రవారం క్రిస్మస్ నేపథ్యంలో కుమారి తన కుమారుడు విలియంకేర్తో కలిసి సమీపంలోని చర్చికి బయలుదేరింది. బీబీఆర్ ఆస్పత్రి వద్దకు రాగానే తల్లి చేయిపట్టుకుని నడుస్తున్న విలియంకేర్ ఒక్కసారిగా రోడ్డు అవతలి వైపునకు వెళ్లేందుకు పరుగెత్తాడు. అదే సమయంలో స్నేహితుడితో కలిసి బైక్పై బాలానగర్ వైపు వస్తున్న వివేక్ వర్మ అనే వ్యక్తి సడెన్గా రోడ్డు మధ్యలోకి వచ్చిన బాలుడిని ఢీకొనడంతో చిన్నారి కిందపడ్డాడు. గిలగిలా తన్నుకుంటున్న బాలుడిని స్థానికులు అక్కున చేర్చుకుని సపర్యలు చేశారు. ఈ ఘటనతో షాక్కు గురైన తల్లి కుమారి బోరున విలపించింది. అదృష్టవశాత్తూ బాలుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఇదిలా ఉండగా ఈ ఘటనతో షాక్కు గురైన వాహనదారుడు వివేక్ వర్మ అక్కడే రోడ్డుపై కుప్పకూలిపోయాడు. తనతో వచ్చిన స్నేహితుడితో పాటు స్థానికులు అతనికి సైతం సపర్యలు చేయడంతో షాక్ నుంచి కోలుకుని తన గమ్యం వైపు సాగిపోయాడు. -
ఏందిరా సామి ఇది, ఆటోనేనా?!
సాక్షి, హైదరాబాద్: అమాయకుల అవసరాలే పెట్టుబడిగా ఆటో డ్రైవరన్నలు సాహసాలు చేస్తున్నారు. పరిమితికి మించి అనేకంటే అంతకు మించి ప్రయాణికులతో బండి లాగించేస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రతియేడు లక్షా 50 వేలకు పైగా ప్రజలు రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని ఓ వైపు గణాంకాలు హెచ్చరిస్తున్నా అటు ప్యాసెంజర్ వాహనాలు, ఇటు ప్రజల నిర్లక్ష్య వైఖరి మారడం లేదు. పైన కనిపిస్తున్న ఫొటోనే ఇందుకు నిదర్శనం. బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 17 మందితో వెళ్తున్న ఈ ఆటో ‘విన్యాసం’ బయటపడింది. మహబూబ్నగర్ పోలీసులు ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ స్పందించింది. ‘ఏందన్నా..! అది ఆటో నా ? మినీ బస్సా ? 7 సీటరా లేక 14 సీటరా ? ఆటో నీది !, ప్రాణం ఆ అమాయకులది !, మరి ఆటోలో ప్రయాణించే సమయంలో వారి ప్రాణాలకు భరోసా ఎవరిది ?’ అంటూ కామెంట్ చేసింది. ఈ ఫొటోపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు డ్రైవర్ తీరుపై విస్మయం వ్యక్తం చేయగా.. మరికొందరు ఆటో ఎక్కే ప్రయాణికులకు కూడా సోయి ఉండాలి కదా అని విమర్శిస్తున్నారు. మరికొందరేమో ప్రభుత్వం సరిపడా రవాణా సదుపాయాలు కల్పిస్తే ప్రజలెందుకు ప్రాణాలకు తెగించి మరి ఇలా ఎందుకు వెళ్తారని అంటున్నారు. అన్ని రూట్లలో బస్సులు నడపొచ్చుగా అని సూచనలు ఇస్తున్నారు. -
బాలానగర్ ఫ్లైఓవర్ పనులకు బ్రేక్
సాక్షి, సిటీబ్యూరో: నగరవాసుల ట్రాఫిక్ కష్టాలను తీర్చే బాలానగర్ ఫ్లైఓవర్ పనులకు కరోనా కారణంగా బ్రేక్ పడింది. పనులకు ఆదిలో ఆస్తుల సేకరణతో ఆలస్యం కాగా.. లాక్డౌన్ నేపథ్యంలో పనులు వేగిరంగా సాగాయి. ప్రస్తుతం సిబ్బందిని కరోనా వెంటాడుతోంది. పనులు చేస్తున్న బీఎస్సీపీఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, ప్రాజెక్ట్ మేనేజర్, కిందిస్థాయి సిబ్బందితో పాటు దాదాపు 10 మందికిపైగా కోవిడ్ నిర్ధారణ అయినట్లు సమాచారం. దీంతో పనుల్లో వేగిరం తగ్గింది. మిగిలిన 40 మందిలోనూ కలవరం మొదలవడంతో వారికి కూడా కరోనా టెస్టులు చేస్తున్నారు. అక్టోబర్ నాటికి ఫ్లైఓవర్ పనులు పూర్తి కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మరింత ఆలస్యమయ్యే పరిస్థితి నెలకొంది. . కొనసాగుతున్న స్లాబ్ వర్క్.. బాలానగర్లోని శోభనా థియేటర్ నుంచి ఐడీపీఎల్ వరకు 1.13 కిలోమీటర్ల మేర ఆరు లేన్ల ఫైఓవర్ నిర్మాణానికి హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) రూ.387 కోట్లు కేటాయించింది. ఆస్తుల సేకరణకు రూ.265 కోట్లు, నిర్మాణానికి రూ.122 కోట్లు వ్యయం చేస్తోంది. 2017 ఆగస్టు 21న ఫ్లైఓవర్ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. దాదాపు రెండేళ్లకుపైగా ఆస్తుల సేకరణ జరగడంతో ఆ తర్వాత ఇంజినీరింగ్ పనులు మొదలయ్యాయి. ఇటీవల లాక్డౌన్ కాలంలో కమిషనర్ అర్వింద్కుమార్ ఆదేశాల మేరకు పనుల్లో వేగిరం పెంచారు. మొత్తం 26 పిల్లర్ల నిర్మాణం పూర్తయ్యింది. మూడు స్లాబ్లు పూర్తి చేశారు. మిగిలిన పనులు కొనసాగుతున్న క్రమంలోనే కాంట్రాక్ట్ చేపట్టిన కంపెనీ సిబ్బందికి కరోనా రావడంతో మిగిలినవారిలో అలజడి మొదలైంది. దీనిపై హెచ్ఎండీఏ ఇంజినీరింగ్ విభాగం అధికారులు మాట్లాడుతూ.. కొంతమంది సిబ్బందికి కరోనా వచ్చినట్టుగా తెలిపారు. అక్టోబర్ ఆఖరునాటికి ఫ్లైఓవర్ పనులు పూర్తి చేయాల్సి ఉందన్నారు. -
పరిశ్రమలో పేలిన రియాక్టర్..
సాక్షి, హైదరాబాద్: బాలానగర్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఐడీఏ గాంధీ పారిశ్రామిక వాడలోని ఓ ఫార్మా స్యూటికల్ పరిశ్రమలో రియక్టర్ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు చేలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో పేలుడు ధాటికి ఫ్యాక్టరీ మొదటి అంతస్తులోని గోడలు పగిలిపోయాయి. ప్రమాదంపై పోలీసులు, అధికారులు ఆరా తీస్తున్నారు. -
విజయారెడ్డి కేసు: అటెండర్ మృతి
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన విజయారెడ్డి హత్య కేసులో మరో విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో గాయపడిన అటెంబర్ చంద్రయ్య సోమవారం కన్నుమూశారు. నవంబర్ 4న విజయారెడ్డికి అంటుకున్న మంటలను ఆర్పేస్తూ... చంద్రయ్య తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. చంద్రయ్య నెలరోజులుగా..డీఆర్డీఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ తహశీల్దార్ విజయా రెడ్డిని సజీవ దహనం చేసిన ఘటన రాష్ట్రాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. చంద్రయ్య మృతితో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నరవుతున్నారు. సరైన వైద్యం అందించకే చంద్రయ్య చనిపోయాడని బంధువులు ఆరోపిస్తున్నారు. చనిపోయిన విషయాన్ని కూడా గోప్యంగా ఉంచారని.. కనీస సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారని ఆగ్రహిస్తున్నారు. చంద్రయ్య కుటుంబానికి ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. కాగా విజయారెడ్డిపై సురేష్ పెట్రోల్ పోసి నిప్పంటిచగా ఆమె ఘటనా స్థలంలోనే కన్నుమూసింది. ఎమ్మార్వోను కాపాడేందుకు ప్రయత్నించిన ఆమె కారు డ్రైవర్ గురునాథానికి మంటలంటుకోవడంతో మరుసటిరోజే మృతి చెందాడు. అలాగే ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నిందితుడు సురేష్ డిఆర్డిఓలో చికిత్స పొందుతూ నవంబర్ 7న మరణించాడు. ఈ ఘటనలో మొత్తంగా నలుగురు మరణించారు. చికిత్స పొందుతూ ఏఎస్ఐ నర్సింహులు మృతి.. బాలాపూర్: ఆత్మహత్యాయత్నం చేసిన ఏఎస్ఐ నర్సింహులు ఆసుపత్రిలో సోమవారం మృతి చెందాడు. కొన్నిరోజుల క్రితం బాలాపూర్ పోలీసు స్టేషన్ ఎదుట పెట్రోలు పోసి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. తీవ్రంగా గాయపడిన నర్సింహులు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ఇవాళ ఉదయం మరణించాడు. కాగా ఆయన మృతికి సీఐ సైదులు వేధింపులే కారణమంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో చర్యలు చేపట్టిన పోలీసు కమిషనర్ సీఐపై బదిలీ వేటు వేశారు. చదవండి.. తహశీల్దార్ సజీవదహనం: డాడీ.. మమ్మీకి ఏమైంది? దారుణం: మహిళా తహశీల్దార్ సజీవదహనం -
బాల్యం.. వారికి మానని గాయం
సాక్షి సిటీబ్యూరో: నగరంలోని గాజుల తయారీ పరిశ్రమల్లో బాల కార్మికులు మగ్గిపోతున్నారు. పేదరికంలో ఉన్న వారిని గుర్తించి కార్మికులుగా చేర్చుకుని వారిచేత వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారు. ఏడాదికి రెండు సార్లు మొక్కుబడిగా జనవరి, జూలై నెలల్లో ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాలు చేపట్టి కొంత మంది బాల కార్మికులకు విముక్తి కల్పిస్తున్నా అది పూర్తి స్థాయిలో అమలుకావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారుల దాడులు ముగిసిన వెంటనే రూటు మార్చి పిల్లలను తీసుకువచ్చి యథావిధిగా పనులు చేయిస్తున్నారు. దీంతో ఎప్పటిలాగానే ఆడుతూ, పాడుతూ తిరుగుతూ, విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన బాలలు కార్మికులుగా మారిపోతున్నారు. గతంలో ఈ గాజుల పరిశ్రమలు నగరంలోని పాతబస్తీ ప్రాంతంలో అధికంగా ఉండేవి. అధికారులు ఏటా దాడులు చేసి బాల కార్మికులను వారి తల్లిదండ్రులకు అప్పగిస్తుండటం, కేసులు నమోదు చేస్తుండటంతో పరిశ్రమలను గ్రేటర్ శివారు ప్రాంతాలైన కాటేదాన్, బాలాపూర్, మైలార్ దేవ్ పల్లి ప్రాంతాలకు తరలించారు. నగరంలో వందల సంఖ్యలో గాజుల తయారీ పరిశ్రమలు ఉంటాయని అనధికారిక అంచనా. అంతా 16 ఏళ్ల లోపు వారే..... గాజులకు లప్పం అద్దడం, చమ్కీలు అద్దడానికి బాలలు అయితేనే బాగుటుందని పరిశ్రమల నిర్వాహకులు భావిస్తున్నారు. అందుకే గాజుల తయారీ పరిశ్రమల్లో 8 సంవత్సరాల నుంచి 16 ఏళ్ల లోపు వారే పనిచేస్తున్నట్లు దాడుల్లో తేలింది. బీహార్, ఉత్తర్ ప్రదేశ్, ఛత్తీస్ గడ్, జార్ఖండ్ వంటి రాష్ట్రాలలో కడుపేదరికంలో ఉండి తినడానికి తిండి లేని వారిని కార్మికులుగా చేర్చుకుంటున్నారు. అంతకుముందు పనిచేసినటువంటి వారి ద్వారా లేదా అదే రాష్ట్రాలకు చెందిన బ్రోకర్ల ద్వారా గుర్తించి వారిని నగరానికి రప్పిస్తున్నారు. తల్లిదండ్రులకు అడ్వాన్స్ రూపంలో కొంత మొత్తంలో చెల్లించి మిగతా జీతాన్ని నెల నెల ఇస్తుంటారు. 8 నుంచి 10 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న వారికి నెలకు రూ. 1500, 10 నుంచి 14 సంవత్సరాల లోపు వారికి రూ.2000, 14 నుంచి 16 లోపు వారికి రూ. 2500 జీతాన్ని చెల్లిస్తున్నారు. అనారోగ్యంలో ‘బాల్యం’ బాలలైతే వారికి అదే కంపెనీలలోని గోదాంలలో ఉండటానికి వసతి కల్పించి తినడానికి తిండి పెడితే చాలు ఎన్ని గంటల పాటు అయినా పని చేయించుకోవచ్చనేది పరిశ్రమల నిర్వాహకుల ఆలోచన. గాజులకు అద్దేటువంటి రసాయనాల వల్ల చిన్నతనంలోనే ఆనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. కెమికల్స్ను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా గాజులకు చేతులతో అద్దడం వల్ల చర్మ వ్యాధులకు గురవుతున్నారు. పూర్తిగా గాజు సంబంధిత ముడి పదార్ధాలతో కూడి ఉండటం వాటిని గాజుల తయారీ కోసం ఫర్నేస్ లో వేడిచేయడం వల్ల బాల కార్మికులు అరోగ్యం పాడవుతుంది. ఒకేసారి 54 మందికి విముక్తి..... బీహర్కు చెందిన మహ్మద్ అస్లామ్ బాలాపూర్కు వలస వచ్చి శాహిమ్ నగర్లో గాజుల పరిశ్రమ నడుపుతున్నాడు. రేణుకాపూర్, అబీద్ నగర్, అబ్దుల్లా నగర్కు చెందిన మహ్మద్ రియాజ్, మహ్మద్ అస్సామ్, షేక్ హబీబ్, మహ్మద్ ముస్లామ్, అస్డర్, నజీమ్ అక్రమ్ వీరితో మరికొంత మంది బీహార్, ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రాల నుంచి బాల కార్మికులను తీసుకువచ్చి గాజుల తయారీ పరిశ్రమలలో పనిచేయిస్తున్నారన్న పక్కా సమాచారంతో ఆపరేషన్ స్మైల్, కార్మిక శాఖ, చైల్డ్ వెల్ఫేర్ కార్పొరేషన్, ప్రజ్వల స్వచ్చంద సంస్థ సభ్యులతో కలిసి రాత్రి వేళల్లో దాడులు చేసి ఒకేసారి 54 మంది బాల కార్మికులను గుర్తించి వారి చేత పనిచేయిస్తున్నటువంటి వారిపైన కేసులు నమోదు చేశారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 176 మంది..... 2014 సంÐసంవత్సరంలో 39 మంది, 2015లో అత్యధిక ంగా 282 మంది, 2016 లో 124 మంది 2017 లో 22 మం దిని 2018లో 190 మందిని గుర్తించి వారికి విముక్తి కల్పించారు. అదేవిధంగా 2019లో ఇప్పటి వరకు 176 మంది బాల కార్మికులను కాపాడారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, ఛైల్డ్ వెల్ఫేర్ అధికారు లు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, కార్మిక శాఖ అధికారు ల మధ్య సమన్వయ లోపం కూడ బాల కార్మిక వ్యవస్థ కొనసాగడానికి కారణం అవుతుందనే ఆరోపణులు ఉన్నాయి. 1098 నెంబర్కు ఫోన్ చేస్తే చాలు.... బాల కార్మికులు మీ కంట పడినా, ఎక్కడైనా పని చేస్తున్నట్లు సమాచారం ఉన్నా నేరుగా 1098 చైల్డ్ లైన్ టోల్ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. వెంటనే బాల కార్మిక నిర్మూలన అధికారులు వచ్చి పిల్లాడిని ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరు పరుస్తారు. వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి చిల్డ్రన్స్ హోమ్కు తరలిస్తారు. ఆ చిన్నారి తల్లిదండ్రుల వివరాలను సేకరించి వారికి కౌన్సిలింగ్ ఇప్పించి పిల్లాడిని బడికి పంపేలా చర్యలు తీసుకుంటారు. ఎవరు లేకపోతే ప్రభుత్వ హాస్టళ్లకు పంపించి విద్యను అందిస్తారు. -
బాలానగర్లో కార్డెన్ సర్చ్
బాలానగర్ (జడ్చర్ల): మండల కేంద్రంలో బుధవారం రాత్రి ఎస్పీ అనురాధ ఆధ్వర్యంలో ఏఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీ భాస్కర్, సీఐలు, ఎస్ఐలు, 90 మంది ప్రత్యేక బలగాలతో కార్డెన్ సర్చ్ నిర్వహించారు. ముందుగా వీధుల్లో తిరిగి కాలనీవాసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి వ్యక్తికి సంబంధించిన ఆధార్కార్డు, ఇతర గుర్తింపు కార్డులను పరిశీలించారు. అనుమానస్పదంగా ఉన్న 7 మందిని అదుపులోకి తీసుకుని విచారించారు. అంతేకాకుండా 21 ద్విచక్రవాహనాలను అదుపులోకి తీసుకున్నారు గ్రామస్తులతో ముఖాముఖి గ్రామ ముఖ్య కూడలిలో గ్రామ ప్రజలతో ఎస్పీ ముఖాముఖి నిర్వహించారు. గ్రామంలో ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతున్నా.. కొత్తవారు కనిపించినా వెంటనే 100 నెంబరుకుగాని, పోలీసులకు గాని సమాచారం అందించాలని సూచించారు. గుర్తు తెలియని వక్తులకు ఇళ్లు అద్దెకు ఇచ్చేటప్పుడు ఆధార్ కార్డు చూసి ఇవ్వాలని సలహాఇచ్చారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మరాదని, బిహార్ ముఠాలు తిరుగుతున్నా యని చెప్పడం అంతా కల్పితాలే కొట్టిపారేశారు. ఫ్రెండ్లీ పోలిసింగ్లో ఏవైనా లోపాలుంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. కార్డెన్ సర్చ్లో జడ్చర్ల రూరల్ సీఐ రవిందర్ రెడ్డి, సీఐలు బాల్ రాజ్, సంపత్, బాలానగర్ ఎస్ఐ శ్రీనివాస్, రాజా పూర్ నర్సయ్య, మక్తల్ ఎస్ఐ అశోక్, నావాబ్పేట్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాలనీల్లో అనుమాని యువకులను విచారిస్తున్న ఎస్సీ అనురాధ, అధికారులు -
పైపులైనే రహదారి
ఫతేనగర్ శివాలయం రోడ్డు నాలాపై ఉన్న పైప్లైనే వారికి దారి..స్థానికులు దానిపైనే రాకపోకలు సాగిస్తుంటారు. ఫతేనగర్ నుండి బాలనగర్కు వేళ్లే కార్మికులు ఈ మార్గాన్నే ఎంచుకుంటున్నారు. బ్రిడ్డి పనులు ప్రారంభం కాకపోవడంతో ఈ సమస్య నెలకొంది. గతంలో అనేకమంది ఇందులో పడి గాయపడిన సంఘటనలూ ఉన్నాయి. – ఫొటోలు : నోముల రాజేష్ రెడ్డి -
బాలానగర్ పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం
-
కెపాసిటర్ పేలి యువతికి తీవ్రగాయాలు
సాక్షి, హైదరాబాద్: బాలానగర్ పారిశ్రామికవాడలోని టిప్కాన్ కంపెనీలో అగ్నిప్రమాదం సంభవించింది. కెపాసిటర్ పేలి టిన్నర్పై పడడంతో మంటలు భారీగా ఎగసిపడ్డాయి. ఈ మంటల్లో చిక్కుకొని స్పందన అనే యువతి తీవ్రంగా గాయపడింది. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
బాలానగర్ స్టేషన్ పేరు మార్పు
హైదరాబాద్: కూకట్పల్లి వైజంక్షన్లో ఉన్న బాలానగర్ మెట్రో స్టేషన్ పేరును డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలానగర్ స్టేషన్గా శనివారం నామకరణం చేశారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావులు కలసి పేరును అధికారికంగా మార్చారు. ఈ సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన సభపై మెట్రో ఎండీ ఎన్వీఎస్.రెడ్డి స్టేషన్ పేరు మారుస్తున్నట్లుగా ఉన్న పత్రాలను కలెక్టర్, కమిషన్ చైర్మన్, ఎంపీ, ఎమ్మెల్యేలకు అందజేశారు. అనంతరం ఎన్వీఎస్.రెడ్డి మాట్లాడుతూ, అంబేడ్కర్ మహామేధావి అని, ఆయన పేరు మెట్రో స్టేషన్కు పెట్టడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ఎల్ అండ్ టీని ఒప్పించి పేరు మార్చామని చెప్పారు. దళిత ఐక్యవేదిక నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పేరు మార్పునకు ఎంతో కృషి చేశారన్నారు. -
మ్యాన్హోల్ మింగేసింది
-
విషవాయువులతో ఇద్దరు కార్మికులు మృతి
హైదరాబాద్: బాలానగర్లోని బయోకెమికల్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో విషాదం చోటుచేసుకుంది. విషవాయువు కారణంగా ఇద్దరు కార్మికులు మృతిచెందారు. కంపెనీలోని డ్రైనేజీని శుభ్రం చేయడానికి మ్యాన్హోల్లోకి ముగ్గురు కార్మికులు దిగారు. అయితే అందులోని విషవాయువుల కారణంగా ఇద్దరు కార్మికులు మృతిచెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. అగ్నిమాపక సిబ్బంది చేరుకుని సహాయక కార్యక్రమాలు చేపట్టారు. మృతులను మూసాపేట్ జనతానగర్కు చెందిన అల్లాడి రామారావు(50), అల్లాడి సీతారామ్(30) (బాబాయ్, అబ్బాయ్)గా గుర్తించారు. -
బాలానగర్ మెట్రోస్టేషన్ పేరు మార్పు
సాక్షి, హైదరాబాద్: బాలానగర్ మెట్రోస్టేషన్ పేరు మార్పు చేస్తూ హైదరాబాద్ మెట్రో రైలు(హెచ్ఎంఆర్) గురువారం నిర్ణయం తీసుకుంది. దళితుల ఐక్య వేదిక, పలు ప్రజా సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు బాలానగర్ మెట్రోస్టేషన్ పేరును అంబేద్కర్ మెట్రోస్టేషన్గా మారుస్తూ హెచ్ఎంఆర్ మేనేజింగ్ డైరెక్టర్ శివానంద్ నింబార్గి ఉత్తర్వులు జారీ చేశారు. అసలు బాలానగర్ ఉన్న ప్రాంతానికి, మెట్రో స్టేషన్ ప్రస్తుతం కట్టిన దానికి మూడున్నర కిలో మీటర్ల దూరం ఉంది. భవిష్యత్తులో మెట్రోను విస్తరించినపుడు అమోమయానికి గురికాకుండా ఉండేందుకు మెట్రో స్టేషన్ పేరును మారుస్తున్నట్లు హెచ్ఎంఆర్ తెలిపింది. -
గంజాయి స్వాధీనం.. మహిళ అరెస్టు
బాలానగర్: హైదరాబాద్లోని బాలానగర్ ఎక్సైజ్ ప్రొహిబిషన్ ఆధ్వర్యంలో ఫతేనగర్ పిట్టల బస్తీ బస్స్టాప్లో గంజాయి అమ్ముతున్న స్వరూప (32) అనే మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఆమె కొద్ది కాలంగా గంజాయిని అమ్ముతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం అందటంతో పోలీసులు మాటు వేసి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సోదాలు చేయగా ఆమె నుంచి 2 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఆ మహిళను రిమాండ్కు తరలించారు. కార్యక్రమంలో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
ఏడ్చి ఏడ్చి పసికందు మృతి
బాలానగర్: పేగు బంధం మరచిన కొందరు అప్పుడే పుట్టిన పసిబిడ్డను పొదల్లో పడేసిపోయారు. బాలానగర్ పోలీసుల కథనం ప్రకారం... బాలానగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఐడీపీఎల్ కాలనీ సమీపంలో గల వాటర్ట్యాంక్ దగ్గర పొదల్లో గురువారం పసికందు ఏడుపు వినిపించింది. స్థానికులు వెంటనే 108కు సమాచారం ఇచ్చారు. వారు వచ్చేసరికి పాప చనిపోయింది. చిన్నారి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు బాలానగర్ సీఐ పెండ్యాల భిక్షపతిరావు తెలిపారు. -
బాలానగర్లో భారీ అగ్నిప్రమాదం
-
బాలానగర్లో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్: నగరంలోని బాలానగర్ పారిశ్రామికవాడలో శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక కృష్ణ ప్లాస్టిక్ కంపెనీలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో.. భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇది గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మూడు ఫైరింజన్ల సాయంతో మంటలు ఆర్పుతున్నారు. -
వెజిటేరియన్ గణపతి
బాలానగర్: పలు ఆహార పదార్థాలు బాల గణపతి రూపంలో ఒదిగాయి. కేపీహెచ్బీ డివిజన్ సాయి నగర్లో గల పినాకిల్ కాలేజ్ ఆఫ్ హøటల్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో ఆదివారం ఈ ఫుడ్డీ గణపతి రూపుదిద్దుకున్నాడు. ఫ్రూటీ, కొబ్బరికోరు, చెర్రీస్, షుగర్ బాల్స్ వంటి పదార్థాలను వినియోగించి ఎటువంటి ఎగ్ వాడకుండా, వంద శాతం వెజిటేరియన్ పదార్థాలతో 40 కేజీల ప్రతిమను తయారు చేశారు. 50 మంది విద్యార్థులు రెండు రోజుల పాటు కష్టపడి దీనిని తయారు చేశారని ప్రిన్సిపల్ వై. శ్రీదేవి, డైరెక్టర్ మధుసూదన్రావు తెలిపారు. -
బాలానగర్లో చైన్ స్నాచింగ్
హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలో మరో చైన్ స్నాచింగ్ జరిగింది. బాలానగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం నడిచి వెళ్తున్న మహిళ మెడలోని బంగారు గొలుసును బైక్పై వచ్చిన దుండగులు లాక్కుని... అక్కడి నుంచి పరారైయ్యారు. దాంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి... సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. -
కీమెన్ సమయస్ఫూర్తి
బాలానగర్ : రైల్వే కీమెన్ సమయస్ఫూర్తితో పెను ప్రమాదం తప్పిన ఘటన బాలానగర్ మండలం పెద్దాయపల్లి గ్రామ శివారులో చోటు చేసుకుంది. వివరాలిలాఉన్నాయి. మం గళవారం ఉద యం లక్నో ఎక్్సప్రెస్ రైలు మహబూబ్నగర్ నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా పెద్దాయపల్లిగ్రామ శివారు హరిఓం పరిశ్రమ సమీపంలో పట్టా విరిగిన విషయాన్ని కీమెన్ అబ్బులు గమనించాడు. వెంటనే చేతిలోని ఎర్రజెండాను ఊపుతూ డ్రైవర్కు సిగ్నల్ ఇచ్చాడు. రైలు ఆగిపోయింది. తాత్కాలికంగా మరమ్మతు చేసి లక్నో ఎక్్సప్రెస్ను బాలానగర్ స్టేష¯Œæకు తీసుకెళ్లారు. అనంతరం వచ్చిన నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ను కూడా నిలిపివేశారు. రైల్వే అధికారులు, సిబ్బంది తెగిన పట్టాకు మరమ్మతులు చేసిన అనంతరం రెండురైళ్లను పంపారు. దీంతో అరగంట ఆలస్యంగా రైళ్లు వెళ్లాయి. -
సనత్నగర్లో కార్డన్ సెర్చ్: 45 మంది అరెస్ట్
హైదరాబాద్ : సనత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్లాపూర్లో పోలీసులు ఆదివారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 45 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేని 64 బైక్లు, 20 ఆటోలు, ఓ జీపు స్వాధీనం చేసుకున్నారు. బాలానగర్ ఆడిషనల్ డీసీపీ శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 200 మంది పోలీసులు ఈ విస్తృత తనిఖీల్లో పాల్గొన్నారు. -
బాలానగర్లో ప్రైవేట్ బస్సు దగ్ధం
హైదరాబాద్: ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు గురువారం రాత్రి హైదరాబాద్ బాలానగర్లో దగ్ధమైంది. ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ప్రయాణికులతో సుచిత్ర నుంచి బెంగళూరుకు బయలుదేరింది. ఇది బాలానగర్ నర్సాపూర్ చౌరస్తా వద్దకు చేరుకున్న సమయంలో ఏసీ ప్లోనర్ జామ్ అయింది. ఫలితంగా స్వల్పంగా మంటలు రావడాన్ని గమనించిన డ్రైవర్ విజయ్కుమార్ అప్రమత్తమయ్యారు. వెంటనే బస్సును రోడ్డు పక్కకు తీసి ఆపేశారు. ప్రయాణికుల్ని కిందకు దింపేసిన కొద్దిసేపటికే పెద్ద ఎత్తున మంటలు చెలరేగి బస్సు మొత్తం కాలిపోయింది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో గంట పాటు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. -
కల్తీ నెయ్యి స్వాధీనం: నిర్వాహకుడు అరెస్ట్
హైదరాబాద్ : నగరంలోని బాలానగర్లో కల్తీ నెయ్యి తయారీ కేంద్రంపై పోలీసులు గురువారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 300 లీటర్ల కల్తీ నెయ్యిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిర్వాహకుడిని పోలీసులు అరెస్ట్ చేసి.... పోలీస్ స్టేషన్కి తరలించారు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలానగర్లో కల్తీ నెయ్యి తయారు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు దాడులు నిర్వహించారు. -
రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య
బాలానగర్ : గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలం రాజాపూర్ శివారులో జరిగింది. సోమవారం ఉదయం రైలు పట్టాలపై సుమారు 30 ఏళ్ల వ్యక్తి మృతదేహాన్ని చూసిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోలీసులు మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. -
విద్యుదాఘాతంతో రైతు మృతి
బాలనగర్ (మహబూబ్నగర్) : విద్యుదాఘాతంతో రైతు మృతి చెందాడు. ఈ సంఘటన మహబూబ్నగర్ జిల్లా బాలనగర్ మండలం రాంరెడ్డి గూడలో శనివారం జరిగింది. వివరాల ప్రకారం.. రాంరెడ్డి గూడ గ్రామానికి చెందిన ఓ రైతు శనివారం వ్యవసాయ బావి వద్ద మోటర్ మరమ్మత్తులు నిర్వహిస్తుండగా.. ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
లాడ్జిపై పోలీసుల దాడి: పేకాటరాయుళ్లు అరెస్ట్
హైదరాబాద్: బాలానగర్లోని ఓ లాడ్జిపై పోలీసులు శుక్రవారం దాడి చేశారు. ఈ సందర్భంగా ఏడుగురు పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి భారీగా నగదుతోపాటు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల కాలంలో బాలానగర్ పరిధిలో పేకాట స్థావరాలు అధికమయ్యాయి. ఈ నేపథ్యంలో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ క్రమంలో పోలీసులు ఆ ప్రాంతంలో లాడ్జిలపై దాడులు నిర్వహించారు. -
సర్టిఫికెట్ ఇవ్వకుండా యువకుడిపై దాడి
హైదరాబాద్: సర్టిఫికెట్ కోసమని ఎమ్మార్వో ఆఫీసుకు వచ్చిన యువకుడిపై చేయిచేసుకోవడంతో నగరంలోని బాలానగర్ ఎమ్మార్వో ఆఫీసు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కుల ధ్రువీకరణ పత్రం కోసం శుక్రవారం ఎమ్మార్వో ఆఫీసుకు వచ్చిన ఓ యువకుడిపై కార్యాలయ సిబ్బంది దాడిచేసి, కొట్టారు. ఘటనకు సంబంధించి పూర్తివివరాలు తెలియాల్సి ఉంది. -
గ్యాస్ ట్యాంకర్ బీభత్సం...
- బైక్, కారు, రెండు ఆర్టీసీ బస్సులు ధ్వంసం - కూలిన ప్రహరీ - ఐదుగురికి గాయాలు - స్తంభించిన ట్రాఫిక్ బాలానగర్: గ్యాస్ ట్యాంకర్ బీభత్సం సృష్టించింది... అదుపుతప్పి ద్విచక్రవాహనాన్ని, కారును, రెండు ఆర్టీసీ బస్సులను ఢీకొని తర్వాత ఓ ప్రహరీని గుద్దుకొని నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలు, నలుగురికి స్వల్పగాయాలయ్యాయి. గ్యాస్ ట్యాంకర్ డ్రైవర్ మద్యం మత్తులో వాహనాన్ని నడపడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రమాదం కారణంగా సుమారు 5 గంటల పాటు ఈ ప్రాంతంలో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసుల కథనం ప్రకారం... తమిళనాడుకు చెందిన ఎల్పీ గ్యాస్ ట్యాంకర్ (టీఎన్88ఏ 5706) జీడిమెట్ల నుంచి బాలానగర్ వైపు వెళ్తోంది. వేగంగా వెళ్తున్న ట్యాంకర్ నర్సాపూర్ చౌరస్తా చిత్తారమ్మ బస్తీ ఎదురుగా ఉన్న బస్టాప్ వద్ద అదుపుతప్పి.. ముందు వెళ్తున్న యాక్టివా వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఆ బండిపై వెళ్తున్న అశోక్పాండే కిందపడిపోయాడు. ట్యాంకర్ మరికాస్తా ముందుకు వెళ్లి ఒక కారుతో పాటు ఒక ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా ముందుకు వెళ్లి రోడ్డుపై నిలిపి ఉన్న మరో ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఆ తర్వాత పక్కనే ఉన్న ఎన్ఆర్ఎస్సీ ప్రహరీ గోడను ఢీకొట్టి నిలిచిపోయింది. ఈ ఘటనలో ప్రహరీ కూలిపోయింది. కాగా, ప్రమాదం జరిగినప్పడు బస్సు లో ఉన్న 20 మంది ప్రయాణికులున్నారు. వీరిలో నలుగురికి స్వల్పగాయాలయ్యాయి. యాక్టివా వాహనంపై ప్రయాణిస్తున్న అశోక్పాండేకు తీవ్రగాయాలు కావడం తో బాలానగర్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ట్యాంకర్లో ఎల్పీ గ్యాస్ ఉందని, ప్రమాదం జరిగినప్పడు గ్యాస్ లీక్ కాకపోవడంతో పెనుప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొన్నారు. ట్యాంకర్ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఐదు గంటలు ట్రాఫిక్ జామ్.... ఈ ప్రమాదం కారణంగా జీడిమెట్ల నుంచి బాలానగర్ వచ్చే వాహనాలు ఐదు గంటల పాటు ట్రాఫిక్లో చిక్కుకున్నాయి. పోలీసులు ప్రమాదానికి గురైన వాహనాలను రెండు ప్రొక్లైనర్లతో పక్కకు తొలగించి ట్రాఫిక్ను పునరుద్ధరించారు. -
రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి
బాలానగర్: మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన దంపతులు మృతి చెందారు. మృతులను గోపాల్, శ్యామలగా గుర్తించారు. వీరు మరో ఇద్దరితో కలసి కారులో హైదరాబాద్ వైపు వస్తుండగా 44వ నంబర్ జాతీయ రహదారిపై బాలానగర్ సమీపంలోని పెద్దాయపల్లి వద్ద లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గోపాల్, శ్యామల అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా ఇద్దరికి గాయాలయ్యాయి. -
‘అమ్మా’నుషం
ముగ్గురు చిన్నారులను చంపి.. ఆత్మహత్యకు యత్నించిన తల్లి బాలానగర్: ఓ తల్లి తన ముగ్గురు చిన్నారులను చంపేసి, తానూ ఆత్మహత్యకు యత్నించింది. ఈ సంఘటన మంగళవారం మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలం గంగాధర్పల్లిలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన భిక్షపతి, కౌసల్య దంపతులు భిక్షాటన చేసి జీవనం సాగిస్తున్నారు. వారికిఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అయితే సోమవారం రాత్రి కౌసల్యతో ఆమె అత్త, ఆడబిడ్డ ఘర్షణ పడ్డారు. తిరిగి మంగళవారం ఉదయం కూడా వారు గొడవకు దిగారు. దీంతో మనస్తాపం చెందిన కౌలస్య తన పిల్లలతో పాటు తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా ఉదయం చెన్నమ్మ (05), కుమార్ (03)ను ఉరివేసి, జ్యోతి (01)ని గొంతు పిసికి చంపేసింది. అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకోవడానికి చెరువు వద్దకు పరుగెడుతుండగా స్థానికులు అడ్డుకున్నారు. దీంతో ఆమె బతికి బయటపడింది. ఈ సంఘటనపై కౌసల్య మాట్లాడుతూ తన అత్తింటివారు అదనపు కట్నం కోసం వేధిస్తుండడం వల్లే ఈ దారుణానికి ఒడి గట్టినట్లు తెలిపింది. -
బ్యాంకులో భారీ చోరీ
బ్యాంకులకు భద్రత ఏదీ? - కలకలం రేపిన ఏపీజీవీబీ దొంగతనం - ఆందోళనలో ఖాతాదారులు జడ్చర్ల : ఆర్థికపరమైన లావాదేవీలకు సంబంధించి ప్రధాన వనరులుగా ఉన్న బ్యాంకులకే భద్రత కరువైతే ఎలా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి బాలానగర్లోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు (ఏపీజీవీబీ) లో జరిగిన దొంగతనం ఒక్కసారిగా కలకలం రేపింది. ఈ బ్యాంకులో కుదువ పెట్టుకున్న బంగారు నగలకు సంబంధించి 13.5 కిలోల బంగారు నగలను, *15 లక్షలను దొంగలు అపహరించిన ఘటన ఈ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. పోలీస్ స్టేషన్కు అతి సమీపంలో జాతీయ రహదారిని అనుసరించి ఉన్న బ్యాంకులో దొంగతనం చోటుచేసుకోవడం పోలీసులను సైతం కలవరపాటుకు గురిచేసింది. ఇందులో బంగారం కుదువపెట్టి రుణాలు తీసుకున్న ఖాతాదారులు ఆందోళనకు గురయ్యారు. తమ సొమ్ము ఇక చేతికి అందుతుందా లేదోనన్న అనుమానాలు వ్యక్తం చేశారు. రికార్డులను పరిశీలించి తమ బంగారం తూకం ప్రకారం ఇచ్చినా వాటిని నగలుగా మార్చుకోవడానికి కూడా తయారీ ఖర్చులు భారమవుతాయన్నారు. ఇదిలాఉండగా గత ఏడాది సెప్టెంబర్ 23వ తేదీ రాత్రి జడ్చర్ల మండలం గంగాపూర్లోని ఏపీజీవీబీలో గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనానికి యత్నించారు. అలాగే బాదేపల్లి ఎస్బీహెచ్ ఏటీఎం యంత్రాన్ని ధ్వంసం చేసి నగదును ఎత్తుకు వెళ్లేందుకు విఫలయత్నం చేశారు. పోలీసులు విచారణ చేసి సీసీ కెమెరాల ద్వారా నిందితుడిని గుర్తించి చర్యలు తీసుకున్నారు. అక్కడక్కడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నా అటు బ్యాంకు అధికారులు గాని, ఇటు పోలీసులుగాని బ్యాంకుల భద్రతపై దృష్టి సారించడంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా రాత్రివేళ పోలీసులు బ్యాంకుల దగ్గర బందోబస్తు చర్యలు చేపట్టి దొంగతనాలను అరికట్టాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. కాలనీలలో, ప్రధాన రహదారులపై గస్తీ పెంచాలన్నారు. చోరీ అయిన ఆభరణాల విలువ రూ.4 కోట్లు నిందితులను కఠినంగా శిక్షించాలి : టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాలానగర్ : తమ అవసరాల నిమిత్తమో లేక బ్యాంకులో భద్రంగా ఉంటాయన్న ఆలోచనతోనో మండల కేంద్రంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు (ఏపీజీవీబీ) లో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎంతో విలువైన తమ బంగారు ఆభరణాలను పెట్టి రుణాలు తీసుకున్నారు. అయితే ఈ బ్యాంకులో దొంగలు పడ్డట్లు తెలియడంతో ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. వివరాలు.. బాలానగర్ బస్టాండు కూడలిలో పోలీస్స్టేషన్కు కూతవేటు దూరంలో ఉన్న ఈ బ్యాంకులో ఆదివారం అర్ధరాత్రి దొంగలు చొరబడి 15 లక్షలతో పాటు 13.5 కిలోల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఇదిలాఉండగా అక్కడ సెక్యూరిటీ గార్డు గాని, అల్లారం ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈ దోపిడీ జరిగిందనే ఆరోపణలున్నాయి. రాత్రివేళలో పెట్రోలింగ్ లేకపోవడమే వల్లే తరచూ దొంగతనాలు జరుగుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. బ్యాంకులో మొత్తం 2.4 కోట్ల బంగారు రుణాలు ఇచ్చామని, వాటి విలువ నాలుగు కోట్లకు పైనే ఉంటుందని మేనేజర్ రవికిశోర్రెడ్డి తెలిపారు. ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బంగారం సంబంధించిన రికార్డులు భద్రంగానే ఉన్నాయన్నారు. అనంతరం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, మర్రి జనార్దన్రెడ్డి, గువ్వల బాల్రాజు, శ్రీనివాస్గౌడ్ ఈ బ్యాంకును పరిశీలించారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. -
ఏపీజీవీబీలో రూ.4.50 కోట్ల సొత్తు చోరీ
మహబూబ్నగర్: మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు (ఏపీజీవీబీ) శాఖలో శనివారం అర్థరాత్రి భారీ చోరీ జరిగింది. సుమారు రూ.15 లక్షలతో పాటు సుమారు నాలుగున్నర కోట్ల విలువైన 13.5 కిలోల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. వివరాలిలా ఉన్నాయి...బాలానగర్ పోలీస్స్టేషన్కు కూతవేటు దూరంలోనే ఏపీజీవీబీ శాఖ ఉంది. శనివారం అర్థరాత్రి దాటాక కొందరు దుండగులు గ్రిల్ ను విరగ్గొట్టి లోపలికి ప్రవేశించారు. అక్కడి సీసీ కెమెరా ఫుటేజీల కనెక్షన్లు తొలగించి సేఫ్ లాకర్ను గ్యాస్ కట్టర్ సాయంతో కోశారు. అందులో ఉన్న 13.5 కిలోల బంగారు ఆభరణాలు, రూ.15 లక్షల నగదుతోపాటు సీసీ కెమెరా ఫుటేజీలు, ఐపీ స్టార్లను సైతం తమ వెంట తీసుకెళ్లారు. ఆదివారం సెలవు కావటంతో ఈ విషయం ఎవరూ గమనించలేదు. సోమవారం ఉదయం ఉద్యోగులు బ్యాంకుకు రాగా దొంగతనం బయటపడింది. దీని వెనుక పెద్ద ముఠా హస్తమే ఉండొచ్చని, పక్కా ప్రణాళికతోనే దుండగులు దోపిడీకి పాల్పడ్డారని డీఐజీ శశిధర్రెడ్డి తెలిపారు. ముందుగా రెక్కీ నిర్వహించి దుండగులు ఈ దోపిడీకి పాల్పడినట్లు వారు భావిస్తున్నారు. క్లూస్టీం అధికారులు, డాగ్ స్క్వాడ్ విచారణ జరిపారు. ఇదిలా ఉండగా, బ్యాంకులో రూ. 2.4 కోట్ల బంగారు రుణాలను ఇచ్చామని, చోరీకి గురైన బంగారమంతా ఖాతాదారులు దాచుకున్నదానితో పాటు రుణాల కోసం తాకట్టు పెట్టిందేనని మేనేజర్ రవికిశోర్రెడ్డి చెప్పారు. -
గ్రామీణ వికాశ్ బ్యాంకులో భారీ చోరి
-
బాలానగర్ బ్యాంకులో భారీ దోపిడీ!
మహబూబ్నగర్ జిల్లాలోని బాలానగర్ గ్రామీణ వికాస్ బ్యాంకులో భారీ దోపిడీ జరిగింది. గ్యాస్ కట్టర్లతో లాకర్లను కట్ చేసి నగలు, నగదును దుండగులు దోచుకెళ్లారు. 4 కోట్ల రూపాయల విలువైన బంగారు నగలతో పాటు 16-18 లక్షల రూపాయల నగదు కూడా ఈ దోపిడీలో అపహరణకు గురైంది. బ్యాంకు వెనకభాగం నుంచి దొంగలు ప్రవేశించారు. నిత్యం రద్దీగా ఉండే జాతీయరహదారి పక్కనే ఉంటుంది. జనవాసాల మధ్య, పోలీసు స్టేషన్కు కూతవేటు దూరంలోనే ఉంటుంది. రైతులు రుణాల కోసం కుదువపెట్టిన బంగారమే పెద్ద ఎత్తున పోయినట్లు తెలుస్తోంది. బ్యాంకు సిబ్బంది ప్రమేయం, సెక్యూరిటీ గార్డు ప్రమేయం ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బ్యాంకు విషయాలు బాగా తెలిసినవాళ్లే ఈ దోపిడీకి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో బ్యాంకులలో చోరీలు, దోపిడీలకు ప్రయత్నాలు జరిగినా.. ఇంత పెద్ద ఎత్తున పోవడం మాత్రం ఇదే మొదటిసారి. -
బాలానగర్లో దారుణం
-
ఎంటీఆర్ కంపెనీలో అగ్నిప్రమాదం
హైదరాబాద్ : హైదరాబాద్ బాలానగర్లోని ఎంటీఆర్ కంపెనీలో బుధవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కంపెనీ పూర్తిగా దగ్ధం అయ్యింది. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడటంతో చుట్టుపక్కల భారీగా పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కాగా షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. భారీగా ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. -
ఉలిక్కిపడ్డ చిన్నరేవల్లి
బాలానగర్, న్యూస్లైన్ : ఉన్నత విద్యలో రాణిం చి ఉన్నత స్థాయిలో స్థిరపడతాడనుకున్న యువకుడి తల్లిదండ్రుల ఆశలు తలకిందులయ్యాయి. పై చదువుల కోసం అమెరికా వెళ్లిన విద్యార్థి గురువారం అనుమానాస్పదంగా మృతి చెందడంపై త ల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగి తేలారు. తండ్రి బ్రాంచ్ పోస్టుమాస్టర్ శ్రమించి కుమారుడిని ఉన్నత విద్య కోసం అమెరికా పం పాడు. చదువు పూర్తిచేసి మంచి ఉద్యోగం దొరి కిందని ఫోన్ చేస్తారని అనుకున్న సమయంలో హఠాత్తుగా మరణ వార్త రావటం కలచివేసింది. బాలానగర్ మండలం చిన్నరేవల్లికి చెందిన శ్రీధర్రెడ్డి బ్రాంచ్ పోస్టుమాస్టర్గా పనిచేస్తున్నాడు. అతడికి ఇద్దరు సంతానం. మొదటి సంతానం కూతు ర అ ఖిల, రెండో సంతానం అరవింద్రెడ్డి. అఖిల బీఈడీ పూర్తిచేయగా అరవింద్రెడ్డి జే పీఎన్సీ కళాశాలలో బీటెక్ పూర్తిచేసి ఎంఎస్ కోసం ఫిబ్రవరి 14, 2011లో అమెరికాకు వెళ్లాడు. అక్కడ కాలిఫోర్నియా సంజూస్పట్టణంలో యూనివర్సిటీలో చేరి కోర్సు చేస్తున్నాడు. గత ఏడాది మార్చ్లో గ్రీన్కార్డు కూడా సంపాదించాడు. మంచి ఉద్యోగంతో తిరిగి వస్తాడనుకున్న అరవింద్రెడ్డి ఇలా దుర్మరణం చెందడం కలచివేస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తచేస్తున్నారు. త్వరలోనే ఇంటికి వస్తానని... త్వరలోనే ఇంటికి వస్తానని భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం ఫోన్ లో మాట్లాడినట్లు అఖిల తెలిపింది. అయితే ఇలా వస్తాడని ఊహించలేదని బోరున విలపించింది. ఫోన్లో మాట్లాడిన కొడుకువి అవే చివరి మాటలు అవుతాయని తాము ఊహించలేదని తల్లిదండ్రులు శ్రీధర్రెడ్డి, వాసుదేవిలు వాపోతున్నారు. షాద్నగర్ వెళ్లిన మృతుడి కుటుంబసభ్యులు... మృతి వార్త తెలియగానే కుటుంబ సభ్యులు షాద్నగర్కు వెళ్లారు. రేషన్కార్డు, ఆధార్కార్డులు తీసుకుని హైదరాబాద్కు వెళ్లాల్సి వస్తుందేమోనని వారు అక్కడే ఉన్నారు. గ్రామస్థులు, బంధువులు ఒక్కొక్కరుగా చిన్నరేవల్లిలోని శ్రీధర్రెడ్డి ఇంటికి చేరుకుంటున్నారు. -
హాయిగా..ఊపిరి పీల్చుకున్న సిటీ
సాక్షి, సిటీబ్యూరో : ట్రాఫిక్ ‘జాం’జాటం... ముక్కుపుటాలదిరిపోయే వాయు కాలుష్యం... ఊపిరాడని దుస్థితి... ఇది రొటీన్గా ఉండే సిటీ సీన్. కానీ వీటి నుంచి నగరవాసికి ఏడు రోజుల పాటు ఉపశమనం లభించింది. ఈ సంక్రాంతికి గ్రేటర్వాసులు అధికశాతం పల్లెబాట పట్టడంతో లక్షలాది వ్యక్తిగత వాహనాలు ఇంట్లోనే విశ్రాంతి తీసుకున్నాయి. ఫలితంగా వాయు కాలుష్యం భారీగా తగ్గింది. ఈ నెల 9 నుంచి 15 వరకు కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) బృందాలు అబిడ్స్, పంజగుట్ట, ప్యారడైజ్, చార్మినార్, జూపార్క్, కేబీఆర్పార్క్, బాలానగర్, జూబ్లీహిల్స్, జీడిమెట్ల, ఉప్పల్ ప్రాంతాల్లో వాయుకాలుష్య మోతాదును నమోదు చేశాయి. కాలుష్య కారకాలు సాధారణ రోజుల్లో కంటే ఈ తేదీల్లో కొన్ని చోట్ల సగానికి, మరికొన్ని చోట్ల భారీగా తగ్గినట్లు పీసీబీ తాజా రిపోర్టు వెల్లడించింది. ముఖ్యంగా ఊపిరాడనీయకుండా చేసే సూక్ష్మ ధూళికణాలు (ఆర్ఎస్పీఎం), స్థూల ధూళికణాలు (టీఎస్పీఎం), ముక్కుపుటాలను అదరగొట్టి, ఊపిరితిత్తులకు పొగబెట్టే సల్ఫర్ డయాక్సైడ్ (ఎస్ఓటూ), నైట్రస్ ఆక్సైడ్ (ఎన్ఓఎక్స్)ల మోతాదులు సాధారణ రోజుల్లో నమోదయ్యే సగటు కంటే బాగా తగ్గడంతో నగరవాసులు ఊపిరి పీల్చుకున్నారు. గ్రేటర్లోని 6111 కి.మీ.ల రహదారులపై నిత్యం 40 లక్షల వాహనాలు (అన్నిరకాలు) రాకపోకలు సాగిస్తాయి. ఈ సెలవుల్లో సింహభాగం వాహనాలు ఇంటికే పరిమితం కావడంతో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ రద్దీ బాగా తగ్గింది. దీంతో ఇంధన వినియోగం తగ్గి కాలుష్య ఉద్గారాలు వెలువడటం తగ్గిందని పీసీబీ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ‘గ్రేటర్’లో సాధారణ రోజుల్లో సగటు వాహన వేగం గంటకు 12 కి.మీ మాత్రమే. ఈ పరిస్థితుల్లో ఇంధనాన్ని మండించడం (వినియోగం) పెరిగి భయంకరమైన పొగ వెలువడుతుందని వారు తెలిపారు. ఇందులో ఆర్ఎస్పీఎం, టీఎస్పీఎం, ఎస్ఓటూ, ఎన్ఓఎక్స్ వంటి ఉద్గారాలు అధిక మోతాదులో ఉంటాయన్నారు. కానీ పండగ సెలవుల్లో ఈ పరిస్థితి లేని కారణంగా వాయుకాలుష్యం తగ్గిందని విశ్లేషించారు. -
వాగులోపడి అన్నదమ్ముల మృతి
బాలానగర్, న్యూస్లైన్: వాగులోకి స్నానం చేసేందుకు వెళ్లిన అన్న గల్లంతయ్యాడు. అతని రక్షించేందుకు వెళ్లిన తమ్ముడు కూడా అన్నతో పాటే వాగులోపడి మృత్యువాతపడ్డాడు. ఈ విషాదకర సంఘటన సోమవారం మండలంలోని ముదిరెడ్డిపల్లి పంచాయతీ నందిగామ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన జంగయ్య(35)ఆదివారం సాయంత్రం గ్రామ శివారులోని దుందుబీ వాగులో బట్టలు ఉతికి స్నానం చేసేందుకు వెళ్లాడు. అతనికి ఈత రాకపోవడంతో ప్రమాదవశాత్తు అందులోనే మునిగిపోయాడు. చీకటిపడుతున్నా ఇంటికి రాకపోవడంతో అతని భార్య కొండమ్మతో పాటు తమ్ముడు అంజయ్య కుటుంబసభ్యులు ఆందోళనకు గురై ఆచూకీ కోసం పరిసరప్రాంతాల్లో వెతికారు. ఆచూకీ లభించకపోవడంతో పొరుగు గ్రామం మల్లేపల్లి వైపు వెళ్లాడేమోనని భావించి అనుమానంతో సోమవారం ఉదయం వెతుకుతుండగా కనిపించలేదు. సమీపంలోని దుందుబీవాగు ఒడ్డుపై జంగయ్య బట్టలు ఉండటంతో చుట్టుపక్కల వెతికినా కనిపించలేదు. వాగులోపడి చనిపోయాడని నిర్ధారించుకున్న తరువాత జంగయ్య సోదరుడు అంజయ్య(28) గ్రామస్తులంతా చూస్తుండగానే వాగులోకి దూకాడు. ఎంతసేపటికీ బయటికిరాకపోవడంతో కంగారుపడ్డ గ్రామస్తులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో బాలానగర్ ఎస్ఐ ప్రవీణ్కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో వాగులో గాలింపుచేపట్టారు. అయినా వారి ఆచూకీ లభించకపోవడంతో గద్వాల, బీచుపల్లి నుంచి జాలర్లు, గత ఈతగాళ్లను రప్పించి గాలింపుచర్యలు చేపట్టి చివరికి జంగయ్య మృతదేహాన్ని వెలికితీశారు. మరో మృతదేహంకోసం గాలించేందుకు వీలుపడకపోవడంతో మంగళవారం ఉదయం గాలించి అంజయ్య మృతదేహాన్ని కనుగొన్నారు. అనంతరం కేసునమోదు చేసుకుని పోస్టుమాస్టం కోసం మృతదేహాలను షాద్నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసునమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. నందిగామలో విషాదం నందిగామ గ్రామానికి చెందిన అన్నదమ్ములు జంగయ్య, అంజయ్యలు ప్రమాదవశాత్తు వాగులో మునిగి మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పండుగరోజు అన్నదమ్ములు మృత్యువాతపడటంతో మరణంలోనూ అన్నదమ్ముల బంధం విడిపోలేదని వారు కన్నీరు మున్నీరయ్యారు. భిక్షాటన చేసుకుని జీవనం గడిపే వీరి కుటుంబాల్లో ఇంటియజమానులు ఇద్దరు ఒకేసారి మృతిచెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.