గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలం రాజాపూర్ శివారులో జరిగింది.
బాలానగర్ : గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలం రాజాపూర్ శివారులో జరిగింది. సోమవారం ఉదయం రైలు పట్టాలపై సుమారు 30 ఏళ్ల వ్యక్తి మృతదేహాన్ని చూసిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోలీసులు మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు భావిస్తున్నారు.