Suicide
-
ఆమె మాట్లాడితేనే టవర్ దిగుతా
కరీంనగర్(రామగుండం): తనతో చనువుగా ఉన్న ఆమె ఇప్పుడు తనతో మాట్లాడడం లేదని, ఆమె మాట్లాడితేనే టవర్ దిగుతానని, లేదంటే దూకి ఆత్మహత్య చేసుకుంటానని బిహార్కు చెందిన వలసకూలీ గేదెం అజయ్ భీష్మించుకు కూర్చున్నాడు. మంగళవారం ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లోని హైటెన్షన్ విద్యుత్ టవర్ పైకి ఎక్కి హల్చల్ చేశాడు. సమాచారం అందుకున్న ఎస్సై ఉదయ్కిరణ్, ఏసీపీ రమేశ్, సీఐ ప్రవీణ్కుమార్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసు అధికారులు మైక్సెట్ ద్వారా యువకుడిని సంప్రదించగా.. కొద్దిరోజులుగా ఆ యువతి తనతో మాట్లాడడం లేదన్నారు. స్పందించిన పోలీసులు యువతిని ఘటనా స్థలానికి తీసుకొచ్చి మైక్లో మాట్లాడించగా, అజయ్ టవర్ దిగాడు. పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు.. అజయ్ తనను కొంతకాలంగా శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కాగా, పోలీసుల అప్రమత్తంగా వ్యవహరించి సదరు యువతిని సంఘటనా స్థలానికి తీసుకొచ్చి మాట్లాడించడంతో యువకుడి ప్రాణాలు దక్కాయి. -
2020: హైదరాబాద్లోనే మారుతిరావు ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్ : ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అమృత తండ్రి మారుతిరావు హైదరాబాద్లో ఆత్మహత్య చేసుకున్నారు. 2020 మార్చి 7న ఖైరతాబాద్లో ఉన్న వైశ్య భవన్లో బస చేసిన ఆయన మరుసటి రోజు విగతజీవిగా కనిపించారు. న్యాయవాదిని కలవడానికి వచ్చి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తేల్చారు. అప్పట్లో మారుతిరావు బస చేసిన గది నుంచి పోలీసులు సూసైడ్ నోట్ సైతం స్వా«దీనం చేసుకున్నారు. మారుతిరావు తన వాహనంలో డ్రైవర్ బెల్లంకొండ రాజేష్ తో కలిసి నగరానికి వచ్చారు. 2020 మార్చి 7 సాయంత్రం 6:40 గంటలకు ఖైరతాబాద్ చింతల్బస్తీలో ఉన్న ఆర్య వైశ్య భవన్ రూమ్ నెం.306లో బస చేశారు. న్యాయవాది వస్తారంటూ డ్రైవర్తో చెప్పిన మారుతిరావు అతడిని కారులోనే ఉండమన్నారు. ఆ రోజు రాత్రి 8 గంటల ప్రాంతంలో బయటకు వచ్చిన మారుతిరావు డ్రైవర్ను పిలిచి ఎదురుగా ఉన్న మిర్చీ బండీ నుంచి గారెలు, కారులో కొన్ని కాగితాలు తెప్పించుకున్నారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో తన గదిలో ఏసీని బాగు చేయించుకున్న మారుతిరావు.. లోపల నుంచి తలుపులు వేసుకుని పడుకున్నారు. మరుసటి రోజు (2020 మార్చి 8) ఉదయం మిర్యాలగూడలో ఉన్న ఆయన భార్య గిరిజ ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో డ్రైవర్ రాజేష్కు ఫోన్ చేయగా..అతడు పైకి వెళ్లి ప్రయత్నించిన అతడు చివరకు వైశ్య భవన్ నిర్వాహకుల ద్వారా సైఫాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి వచ్చిన పోలీసులు గదిలోకి ప్రవేశించగా...మంచంపై విగతజీవిగా పడి ఉన్న మారుతిరావు కనిపించారు. ఆ గదిలో ఓ సూసైడ్నోట్ పోలీసులకు లభించింది. అందులో ‘గిరిజా క్షమించు...అమ్మా అమృత అమ్మ దగ్గరకు రా అమ్మా’ అని మాత్రమే ఉన్నట్లు పోలీసులు చెప్పారు. అప్ప ట్లో వైశ్య భవన్ వద్దకు వచ్చిన మారుతిరావు సోదరుడు శ్రవణ్ మీడియాతో మాట్లాడుతూ... వాస్తవాలు తెలుసుకొని వార్తలు రాయా లని, ఊహా కల్పనతో వార్తలు రాయవద్దని దురుసుగా మాట్లాడారు. తాజాగా ప్రణయ్ కేసులో శ్రవణ్కు జీవితఖైదు పడటం గమనార్హం. -
పోలీస్ అక్క భద్రత.. భరోసా
‘అక్క’ అనే మాటలో ఆప్యాయత మాత్రమే కాదు... ‘భద్రత’ను ఇచ్చే ‘భరోసా’ కూడా ఉంటుంది. చిన్నప్పుడు స్కూల్లో తోటిపిల్లలు ఏడిపిస్తుంటే...‘మా అక్కకు చెబుతాను’ అనడం సాధారణం. అవును. అక్క అంటే ఫ్రెండ్ కాని ఫ్రెండ్. ఏ దాపరికాలు లేకుండా మనసులోని మాటను పంచుకునే అమ్మ కాని అమ్మ! ఇంట్లో కుటుంబ సభ్యులు ఉంటారు. వారితో అన్నీ పంచుకుంటారు. ఇంటికి దూరంగా హాస్టల్లో ఉండే ఆడపిల్లలకు తోడెవరు? చుట్టూ ఎంతోమంది ఉన్నా, వారితో అన్ని విషయాలు పంచుకోలేక ‘నేను ఒంటరిని’ అనే భావన ఎటైనా దారితీయవచ్చు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకీ షర్మిల ‘పోలీస్ అక్క’కు ప్రాణం పోసింది.ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాలలో విద్యార్థినులు వేధింపులు, దాడులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో చాలామంది అమ్మాయిలు తమలో తామే కుమిలిపోతూ చివరకు ఆత్మహత్య వరకు వెళ్తున్నారు. ఇలాంటివి నివారించడానికి ‘నేనున్నాను’ అంటూ ముందుకు వచ్చింది పోలీసు అక్క.దత్తత తీసుకుంటారు...ఒక్కో మహిళా కానిస్టేబుల్కు ఒక్కో విద్యాలయం, వసతిగృహం బాధ్యతను అప్పగించారు. ‘మీరు అక్కడి విద్యార్థులను దత్తత తీసుకున్నట్లు భావించాలి. వారు మీ కుటుంబ సభ్యులే’ అని ఒకటికి రెండుసార్లు చె΄్పారు. ప్రతినెలా ఒకటో శనివారం మహిళా కానిస్టేబుళ్లు తమకు అప్పగించిన గురుకులానికి వెళతారు. ఆ రోజంతా అక్కడే ఉంటూ విద్యార్థినులతో కలిసి భోజనం చేస్తారు. సొంత అక్కలా వారి యోగక్షేమాలు తెలుసుకుంటారు.సైబర్క్రైమ్, ఉమెన్ ట్రాఫికింగ్, గుడ్టచ్–బ్యాడ్టచ్, మహిళల భద్రత, చట్టాలు.. మొదలైన విషయాలపై చర్చిస్తారు. రాత్రిపూట అక్కడే బస చేస్తారు. ప్రస్తుతం 18 పాఠశాలలకు 18 మంది మహిళా కానిస్టేబుళ్లను నియమించారు. వీరి పని తీరును ఎస్పీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు.ఆ బాధ నుంచే...ఎస్పీగా నిర్మల్ జిల్లాలోనే తొలి పోస్టింగ్ తీసుకున్న జానకీ షర్మిలకు ఇక్కడి బాసర ట్రిపుల్ ఐటీలో కొందరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం కలచి వేసింది. విద్యార్థులకు అండగా నిలవడానికి, తనవంతుగా ఏదైనా చేయాలని, వారిలో భరోసా నింపాలనీ అనుకున్నారు. స్వయంప్రతిపత్తి కలిగిన ట్రిపుల్ఐటీని మూడునెలల పాటు దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అప్పటినుంచి విద్యార్థులతో మమేకమవుతూ వారి సమస్యల గురించి తెలుసుకుంటూ పరిష్కారంపై దృష్టి పెట్టారు. ప్రతి సీనియర్ ఒక జూనియర్ని గైడ్ చేయాలని సూచించారు. విజేతలుగా నిలిచిన పూర్వ విద్యార్థులు, ట్రెండింగ్ సెలబ్రిటీలు, మోటివేషనల్ స్పీకర్లతో సమావేశాలు, క్రీడాపోటీలు నిర్వహించారు. ఇవి విద్యార్థులలో ఉత్సాహాన్ని నింపాయి. ధైర్యాన్ని ఇచ్చాయి.పెట్రోలింగ్ బాధ్యతలు...తనలాగే మహిళా పోలీసులు ప్రత్యక్ష పోలీసింగ్ చేయాలని ఎస్పీ జానకీ షర్మిల నిర్ణయించారు. మహిళాదినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోనే తొలిసారి మహిళా కానిస్టేబుళ్లకు ప్రత్యక్ష పోలీసింగ్ బాధ్యతలు అప్పగించారు. కేవలం స్టేషన్ లో పనులు చేయడానికి, రిసెప్షనిస్టులుగానే పరిమితమైన ఉమెన్ కానిస్టేబుళ్లు ఇక నుంచి వారానికోసారి పెట్రోలింగ్, డయల్ 100, ఎమర్జెన్సీ, డెయిలీ రూట్ చెకింగ్, వాహనాల తనిఖీలాంటి బాధ్యతలను చేపడతారు. పెట్రోలింగ్లో తొలిరోజే సత్తా చాటారు. భైంసా మండలం వట్టోలి గ్రామంలో పేకాట రాయుళ్లను పట్టుకున్నారు. ‘పోలీసులు ప్రజల్లో కలిసిపోయినప్పుడే... ప్రజలకు భరోసా, భద్రత’ అంటారు. ‘పోలీసు అక్క’లాంటి వినూత్నమైన కార్యక్రమాలు ఆ మాటకు బలాన్ని ఇస్తాయి.అందుకే... పోలీస్ అక్కఎక్కడైనా మహిళలకు ఇబ్బందులు, అడ్డంకులు ఉంటూనే ఉంటాయి. చాలామంది మహిళలకు కాస్త భరోసా, కాసింత ్రపోత్సాహం ఇస్తే చాలు దేన్నైనా సాధించగలరు. నిర్మల్ జిల్లాలో ప్రత్యేకంగా విద్యార్థినులకు అండగా నిలవాలనుకున్నాం. ఇందుకోసమే ‘పోలీస్ అక్క’ కార్యక్రమం చేపట్టాం. ఎన్నోఏళ్లుగా స్టేషన్ లకే పరిమితమైన మహిళా కానిస్టేబుళ్లు సైతం తాము పోలీసులం అని గర్వపడేలా ప్రత్యక్ష పోలీసింగ్ చేసేలా డ్యూటీలను అప్పగించాం.– జానకీ షర్మిల, ఎస్పీ, నిర్మల్– రాసం శ్రీధర్, సాక్షి ప్రతినిధి, నిర్మల్ -
విద్యాశాఖ మంత్రి.. విడ్డూర వ్యాఖ్యలు
అమరావతి, సాక్షి: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Nara Lokesh Babu) కార్పొరేట్ కళాశాలలపై తన ప్రేమను ప్రదర్శించారు. ఈ క్రమంలో విడ్డూరమైన వ్యాఖ్యలు చేశారాయన. విద్యార్థుల ఆత్మహత్యల అంశంపై శాసన మండలిలో గురువారం చర్చ జరగ్గా.. ఇందుకు తల్లిదండ్రుల ధోరణినే కారణమనే రీతిలో మాట్లాడారాయన.మండలిలో విద్యార్ధుల ఆత్మహత్యలపై చర్చ సందర్భంగా.. టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి మాట్లాడారు. ‘‘ఏపీలో రైతుల ఆత్మహత్యల కంటే విద్యార్ధుల ఆత్మహత్యలే(Students Suicides) ఎక్కువ ఉన్నాయి. కార్పొరేట్ కళాశాలల్లోనే ఎక్కువగా చనిపోతున్నారు. ఇటీవల ఇంటర్ విద్యార్ధుల ఆత్మహత్యలు పెరిగిపోయాయి. .. తీవ్రమైన ఒత్తిడితోనే విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రైవేట్ కాలేజీలపై ప్రభుత్వానికి నియంత్రణ లేకుండా పోయింది. చక్రపాణి కమిటీని బయటపెట్టాలి. విద్యార్ధుల ఆత్మహత్యలను నియంత్రించాలి’’ అని అన్నారాయన.దీనికి విద్యా శాఖ మంత్రి నారా లోకేష్(AP Education Minister Nara lokesh) బదులిచ్చారు. ‘‘విద్యార్థుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి.. కాదనడం లేదు. కానీ, కార్పొరేట్ కళాశాలల్లో మాత్రమే కాదు యూనివర్శిటీల్లోనూ ఆత్మహత్యలు జరుగుతున్నాయి. కొంత మంది తల్లిదండ్రులు ఫీజులు కట్టేస్తున్నాం.. ఇంక మీదే బాధ్యత అనేలా వ్యవహరిస్తున్నారు. ఇది చాలా తీవ్రమైన అంశం. కాబట్టి ప్రైవేట్ యాజమాన్యాలతో పాటు తల్లిదండ్రులకూ బాధ్యత ఉంటుందని అన్నారాయన.రాష్ట్రంలో కార్పొరేట్ కళాశాల్లో యాజమాన్యాల వేధింపులతో విద్యార్థులు బలవన్మరణాలు పాల్పడుతుంది చూస్తున్నాం. అయితే ఈ అంశాన్ని సొంత పార్టీ వాళ్లే లేవనెత్తితే.. యూనివర్సిటీల్లోనూ జరుగుతున్నాయంటూ చెప్పడం విడ్డూరం. -
ప్రాణాలతో బెట్టింగ్.. గేమింగ్ భూతానికి బతుకులు బలి
‘ఆన్లైన్ రమ్మీ’ చంపే వరకు వదల్లేదుకరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం గద్దపాక గ్రామానికి చెందిన బూస శంకరయ్య, స్వరూప దంపతుల కుమారుడు కార్తీక్ ఆన్లైన్ రమ్మీకి అలవాటు పడ్డాడు. సంపాదన అంతా పోగొట్టుకుని, అప్పుల పాలయ్యాడు. రైలుపట్టాలపై పడుకుని, ఆత్మహత్యకు ప్రయత్నించాడు. తల్లిదండ్రులు అప్పుడు కార్తీక్ను కాపాడుకోగలిగారు. రెండెకరాల భూమి అమ్మి మరీ అప్పులు తీర్చారు. అయినా కార్తీక్ను ఆన్లైన్ రమ్మీ భూతం వదల్లేదు. కార్తీక్ మళ్లీ అప్పులు చేసి, ఆవేదనతో గత నెలలో గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.సాక్షి, హైదరాబాద్: అవసరాలు తీరాలంటే డబ్బు కావాలి. కానీ ఆ డబ్బు సంపాదించేందుకు ఎంచుకునే మార్గాలు చాలా ముఖ్యం. కష్టార్జితం కొంతే అయినా జీవితం సాఫీగానే సాగుతుంది. కానీ కూర్చున్నచోటే శ్రమ లేకుండానే భారీగా డబ్బుకావాలని వెంపర్లాడితే జీవితం గాడి తప్పుతుంది. ఇటీవల వరుసగా జరుగుతున్న ఆత్మహత్యలు ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి. సులభంగా డబ్బు వస్తుందని ఆన్లైన్ బెట్టింగ్లు, గేమ్లు, పేకాట, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్కు అలవాటు పడి.. సంపాదన అంతా పోయి, అప్పుల పాలవుతున్నవారు ఎందరో. తెలిసినవారి దగ్గరే కాకుండా.. క్రెడిట్ కార్డులు, లోన్ డబ్బు తీసుకుంటున్నారు. చివరికి అది యమపాశమై ఆత్మహత్యలకు ప్రేరేపిస్తోంది. కుటుంబాలను కన్నీటి సంద్రంలో ముంచేస్తోంది. జీవితాలను తలకిందులు చేస్తోంది. రోజురోజుకు జడలు విప్పి కరాళ నృత్యం చేస్తున్న ఈ జాడ్యంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. ఆన్లైన్ బెట్టింగ్లు.. మానలేని వ్యసనం.. ఒకసారి కొంత మొత్తంలో డబ్బులు రాగానే ఆన్లైన్ బెట్టింగ్, రమ్మీ వంటి ఆటలు మంచి ఆదాయ మార్గమని యువత భావిస్తున్నారు. కూర్చున్న చోటే రోజూ వేలకువేలు సంపాదించవచ్చనుకుంటూ ఉచ్చులో పడుతున్నారు. కొద్దిపాటి లాభాలు చూసిన తర్వాత అసలు ‘ఆట’ మొదలవుతుంది. ఆన్లైన్ బెట్టింగ్లు, గేమ్స్ కొద్దిపాటి లాభాలు ఇస్తూ.. వీలైనంత దోచుకునేలా ప్రోగ్రామింగ్ చేసి ఉంటాయి. దీనిపై అవగాహన లేక బానిస అవుతారు. డబ్బులు పోగొట్టుకుంటారు. ఆ డబ్బులు వచ్చే వరకు మళ్లీ బెట్టింగ్లు చేద్దాం, తర్వాత మానేద్దాం అనుకుంటూ... పూర్తిగా ఈ ఊబిలో కూరుకుపోతారు. యువత మాత్రమేకాదు.. రిటైరైన ఉద్యోగులు, పెద్దవాళ్లు కూడా ఆన్లైన్ జూదం, గేమ్స్ బారినపడుతున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయామని గుర్తించే సరికే.. అప్పులు ఇచి్చన వాళ్ల నుంచి, కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిళ్లు పెరిగి, తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వేలం వెర్రిగా పుట్టుకొస్తున్న ఆన్లైన్ లోన్ యాప్లతో.. మనకు అవసరమున్నా, లేకున్నా నిమిషాల్లోనే అప్పులు ఇస్తామంటూ వస్తున్న ఆన్లైన్ లోన్యాప్లతో సమస్య మరింత పెరుగుతోంది. అందులో లోన్ పేరిట మోసగించేవి కొన్నయితే.. నిజంగానే లోన్ ఇచ్చి అడ్డగోలు వడ్డీలు, జరిమానాలతో, బలవంతపు వసూళ్ల ప్రయత్నాలతో వేధించేవి మరికొన్ని. సులువుగా సొమ్ము చేతికి వస్తుండటంతో.. ఇలాంటి యాప్ల నుంచి అప్పులు చేసి ఆన్లైన్ జూదంలో పోగొట్టుకుంటున్నవారి సంఖ్య పెరుగుతోంది. నిజానికి రిజర్వు బ్యాంకు నిబంధనల ప్రకారం లోన్ యాప్లు వినియోగదారుడి ఫొటోలు, వీడియోలు, కాంటాక్ట్ నంబర్ల లిస్ట్ తీసుకోకూడదు. కేవలం రుణమిచ్చే సమయంలో కేవైసీ కోసం ఒక్కసారి మాత్రమే కెమెరా, మైక్రోఫోన్, లొకేషన్ యాకెŠస్స్ చేయాలి. కానీ ఆన్లైన్ లోన్యాప్ కంపెనీలు అప్పులు తీసుకున్నవారి వ్యక్తిగత వివరాలన్నీ సేకరించి, వారి వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నాయి. ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నాయి. ఆన్లైన్ బెట్టింగ్ వెనుక భయపెట్టే నిజాలు.. ⇒ మన దేశంలో అక్రమ బెట్టింగ్ మార్కెట్ విలువ రూ.8.7 లక్షల కోట్లు అని అంచనా. ఇది ఏటా 30 శాతం పెరుగుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ⇒ విదేశాల్లో, ప్రధానంగా చైనా కేంద్రంగా ఉండే ఆన్లైన్ బెట్టింగ్, లోన్ యాప్ కంపెనీలు.. ఇక్కడి మనవారి కష్టార్జితాన్ని దోచుకుని దేశవ్యతిరేక కార్యకలాపాలకు ఫండింగ్ చేస్తున్నాయి. ⇒ గేమింగ్, బెట్టింగ్.. యాప్ ఏదైనా సరే. వాటి వెనుక సూత్రధారులు మాత్రం చైనీయులే ఉంటున్నారు. ⇒ మనీలాండరింగ్, ఉగ్రమూకలకు నిధులు కూడా ఈ బెట్టింగ్ యాప్లు సమకూర్చుతున్నట్టు దర్యాప్తు సంస్థలు వెల్లడిస్తున్నాయి. ⇒ ‘ఫైవిన్’ అనే బెట్టింగ్ యాప్ మన దేశంలో రూ.400 కోట్ల మేర దోపిడీకి పాల్పడింది. ఆ సొమ్మంతా చైనా కంపెనీలకు చేరవేసిన కేసులో నలుగురు వ్యక్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇటీవలే అరెస్టు చేసింది. మన దగ్గర నిషేధం ఉన్నా.. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ సాధారణంగా రెండు రకాలు. మన దేశంలో ఆపరేట్ అయ్యేవి. చైనా కంపెనీలకు చెందినవి. అయితే ఈ ఆన్లైన్ బెట్టింగ్, డబ్బులు పెట్టి ఆడే గేమింగ్లపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అస్సాం రాష్ట్రాల్లో నిషేధం ఉంది. అందువల్ల మన దేశానికి చెందిన ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు ఈ రాష్ట్రాల్లో పనిచేయవు. ఫోన్లు ఈ రాష్ట్రాల్లోని లొకేషన్లో ఉంటే.. ఇక్కడ అందుబాటులో ఉండవని మెసేజీ చూపిస్తాయి. అందుకే ఆన్లైన్ బెట్టింగ్ చేయడం కోసం నకిలీ జీపీఎస్ యాప్లతో తప్పుడు లొకేషన్స్ చూపేలా చేస్తుంటారు. అదే చైనా యాప్స్ ఏ నిబంధనలు పాటించవు కాబట్టి యథేచ్ఛగా వాటిలో ఆడుతున్నారు. మీ వాళ్లను ఇలా గమనించండి! ఆన్లైన్లో బెట్టింగ్లు, రమ్మీ వంటి జూదానికి అలవాటుపడే వారిని జాగ్రత్తగా గమనించడం ద్వారా గుర్తించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. వారి సూచనల మేరకు.. ఎవరైనా స్థాయికి మించి అప్పులు చేస్తున్నా, తరచూ ఏదో కారణాలతో డబ్బులు అడుగుతున్నా ఓ కన్నేసి ఉంచాలి. ఆ డబ్బు ఎలా ఖర్చు చేస్తున్నారో గమనిస్తూ ఉండాలి. కుటుంబ సభ్యులను, స్నేహితులను పక్కనపెట్టి అదేపనిగా మొబైల్ ఫోన్లో గడుపుతున్నా.. ఫోన్లో ఏం చేస్తున్నారన్నది ఇతరులకు తెలియకుండా జాగ్రత్తపడుతున్నా అనుమానించాలి. నష్టపోయినప్పుడు చిరాకు, ఆగ్రహం, ఆందోళన వంటివాటికి లోనవుతుంటారు. ఒంటరిగా గడుపుతుంటారు. ఇలాంటి లక్షణాలను గమనించాలి. ఆత్మహత్యలు వద్దు.. మీ బాధ పంచుకోండి.. ⇒ మీ సమస్య ఏదైనా, ఎలాంటిదైనా.. ప్రతిదానికీ పరిష్కారం ఉంటుందన్నది మర్చిపోవద్దు. ఆత్మహత్యలకు పాల్పడకుండా మీ బాధలను ఈ హెల్ప్లైన్ సెంటర్లతో పంచుకోవాలని, మీకు సమాధానం దొరకవచ్చని నిపుణులు చెబుతున్నారు. ⇒ రోష్నీ సూసైడ్ ప్రివెన్షన్ హెల్ప్లైన్: 040–66202000 ⇒ హైదరాబాద్కు చెందిన వన్లైఫ్ ఎన్జీఓ: 7893078930 ⇒ ఎయిమ్స్ (బీబీనగర్): 9493238208 ⇒ నేరుగా పోలీస్ సహాయం కోసం..: డయల్ 100 బెట్టింగ్, గేమింగ్ యాడ్స్ను పూర్తిగా నిషేధించాలి సులభంగా డబ్బు సంపాదన, అదీ పెద్ద మొత్తంలో ఆర్జించాలనే కోరిక కొందరిని ఆవహిస్తుంది. దీనిని ‘ఇన్పల్స్ కంట్రోల్ డిజార్డర్’అంటారు. క్రెడిట్ కార్డులు, లోన్యాప్ల ద్వారా సులభంగా డబ్బు సమకూరుతోంది. బెట్టింగ్, గేమింగ్లో కొంత కోల్పోయినా... మరోసారి ప్రయతి్నస్తే డబ్బు రావొచ్చన్న ఆశ వారిని నిలవనీయదు. లక్షల్లో అప్పుల్లో పడిపోతే దానిని తీర్చేయాలని మళ్లీ అప్పులు చేసి బెట్టింగ్ చేస్తున్నారు. ఈ విష వలయం నుంచి బయటికి రాలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. స్మోకింగ్కు సంబంధించిన ప్రకటనలను ఎలా నిషేధించారో అలా అన్ని ప్రచార, ప్రసార సాధనాల్లో బెట్టింగ్ కంపెనీల యాడ్లు, యాప్ల ప్రచారాన్ని నిషేధించాలి. వెచి్చంచే వ్యయంపై పరిమితి పెట్టడం, ఆధార్–పాన్ కార్డులతో అనుసంధానం చేయడం వంటివాటితో డబ్బు అతి వినియోగాన్ని నియంత్రించవచ్చు. ఎక్కువ మొత్తంలో అప్పులు చేయడం, రాత్రంతా ఫోన్లో గడుపుతూ ఆందోళనతో కనిపించడం వంటి వాటిని కుటుంబ సభ్యులు గుర్తించి వారిని నియంత్రించాలి. – డాక్టర్ నిషాంత్ వేమన, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, కేర్, చేతన హాస్పటల్స్ అత్యాశకు పోయి ఊబిలో చిక్కుకోవద్దు సులభంగా డబ్బు సంపాదించాలనే సంస్కృతి పెరగడంతో ఆన్లైన్ గ్యాంబ్లింగ్, బెట్టింగ్, గేమింగ్ వంటి వాటికి అలవాటు పడుతున్నారు. గత 15, 20 ఏళ్లలో రియల్ ఎస్టేట్లో భారీగా డబ్బు సంపాదించిన వారు.. డాబుగా ఖర్చుచేయడం, విలాసవంతమైన కార్లు, భవనాలు కొనడంతో సంపాదన ప్రదర్శన జరుగుతోంది. మిగతావారు సైతం దీనిని ఓ మోడల్గా అనుకరించడం మొదలుపెట్టారు. కష్టపడి పనిచేయాలనే తత్వం మరుగున పడి, ఏదో ఒక విధంగా లక్షలు, కోట్లు సంపాదించాలనే ఆశలు పెరిగిపోతున్నాయి. సులభంగా డబ్బు సంపాదనే ధ్యేయంగా ప్రయత్నాలు చేసి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. కరోనా అనంతర పరిస్థితుల్లో మధ్య తరగతి ప్రజల ఆదాయం తగ్గి అప్పులు పెరిగాయి. పర్సనల్ లోన్ యాప్స్ అధిక వడ్డీలతో సగటు జీవిని చిదిమేస్తున్నాయి. పాత అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేస్తూ ఊబిలో కూరుకుపోతున్నారు. – డి.పాపారావు, ఆర్థిక రంగ విశ్లేషకుడు బెట్టింగ్, గ్యాంబ్లింగ్ యాప్లలో లాభాలు భ్రమే ఆన్లైన్ బెట్టింగ్ మన రాష్ట్రంలో నిషిద్ధం. అలాంటి ఆన్లైన్ యాప్లు వాడితే చట్టప్రకారం శిక్ష తప్పదు. బాధితులపైనా కేసులు తప్పవన్నది గుర్తుంచుకోవాలి. బెట్టింగ్ యాప్లలో లాభాలు వస్తాయన్నది భ్రమ అని గుర్తించాలి. మొదట కొద్దిపాటి లాభాలు చూపి.. తర్వాత కచి్చతంగా మోసం చేస్తారు. దీనితో అప్పుల ఊబిలో కూరుకుపోవడంతోపాటు కుటుంబాలు చిక్కుల్లో పడతాయి. ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ రమ్మీ వంటి ఆటలకు దూరంగా ఉండడం మంచిది. – కవిత, డీసీపీ, సైబర్క్రైమ్స్, హైదరాబాద్ -
విద్యార్థుల మరణాలు దురదృష్టకరం: సుప్రీం
న్యూఢిల్లీ: ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీలు), ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెట్(ఐఐఎంల)లో విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడటం అత్యంత దురదృష్టకరమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇటువంటి ఘటనల నివారణకు బలమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరముందని నొక్కిచెప్పింది. ఐఐటీలు, ఐఐఎంల్లో గడిచిన 14 నెలల్లో 18 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడినట్లు సీనియర్ లాయర్ ఇందిరా జైసింగ్ తెలపడంతో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటీశ్వర్ సింగ్ల ధర్మాసనం పైవిధంగా వ్యాఖ్యానించింది. ఈ అంశానికి న్యాయపరమైన ముగింపు ఇస్తామని పేర్కొంది. హైదరాబాద్లోని సెంట్రల్ యూనివర్సిటీ పీహెచ్డీ స్కాలర్ రోహిత్ వేముల 2017లో, మహారాష్ట్రలోని టీఎన్ టోపీవాలా మెడికల్ కాలేజీ విద్యార్థిని పాయల్ తాడ్వి 2019లో బలవన్మరణం చెందారు. తమ విద్యాసంస్థల్లో కులపరమైన వివక్షను భరించలేకే ప్రాణాలు తీసుకున్నారంటూ వీరి తల్లులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఇటువంటి ఘటనల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే, కోర్టు ఆదేశాలున్నా విద్యార్థుల ఆత్మహత్యల ఘటనల వివరాలను ఇచ్చేందుకు విద్యాసంస్థలు ససేమిరా అంటున్నాయని లాయర్ జైసింగ్ శుక్రవారం ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. -
ఇంటర్ విద్యార్థిని బలవన్మరణం
ఖమ్మం సహకారనగర్: ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఇంటరీ్మడియెట్ ప్రథమ సంవత్సరం(ఎంపీసీ) చదువుతున్న విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఏటపాకకు చెందిన యోగ నందిని (16) ఖమ్మంలోని ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతూ కాలేజీ హాస్టల్లోనే ఉంటోంది. ఆమె ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తుండగా సంక్రాంతి సెలవులకు వెళ్లి చాన్నాళ్ల తర్వాత కాలేజీకి తిరిగి వచ్చినట్లు తెలిసింది. ఆపై మళ్లీ ఇంటికి వెళ్లగా గురువారమే హాస్టల్కు చేరుకుంది. శుక్రవారం ఉదయం ప్రత్యేక తరగతులకు హాజరైన నందిని ఆపై రెగ్యులర్ తరగతులకు కూడా వెళ్లింది. మధ్యలో తన ఆరోగ్యం బాగాలేదని హాస్టల్ గదికి వెళ్లి ఎంతసేపటికీ రాకపోవడంతో హాస్టల్ సిబ్బంది వెళ్లి చూడగా తలుపులు వేసి ఉన్నాయి. పిలిచినా పలకకపోవడంతో తలుపులు పగలగొట్టి చూడగా ఉరికి వేలాడుతోంది. అపస్మారక స్థితికి చేరుకున్న ఆమెను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా, నందిని మృతి సమాచారం తెలుసుకుని వచ్చిన ఆమె తల్లిదండ్రులు రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. కాగా, యోగనందిని కుడి చేతికి సర్జరీ కావడం, ఆ బాధతో పరీక్షలు రాయలేక మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుందని ఆమె తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఖమ్మం అర్బన్ పోలీసులు తెలిపారు -
Moinabad: పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడు పాడె ఎక్కాడు..
మొయినాబాద్ (రంగారెడ్డి జిల్లా): త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నేను చనిపోతున్నా అంటూ వీడియో రికార్డు చేసి బంధువులకు పంపి చెట్టుకు ఉరేసుకున్నాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పరిధిలో మంగళవారం వెలుగుచూసింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. చిలుకూరుకు చెందిన వీఎం సాయికుమార్(32)కు వికారాబాద్ జిల్లా కొడంగల్కు చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది. మార్చి 6న పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు. వివాహం కుదిరిన రోజు నుంచి సాయికుమార్ తన కు కాబోయే భార్యతో నిత్యం ఫోన్ మాట్లాడేవాడు. ఉన్నట్టుండి ఏం జరిగిందో తెలియదు కానీ సోమవారం రాత్రి 7 గంటల సమయంలో నేను చనిపోతున్నా అంటూ వీడియో రికార్డ్ చేసి బంధువులకు పంపించాడు.వారు వెంటనే ఈ విషయాన్ని సాయికుమార్ తల్లి లక్ష్మికి తెలియజేశారు. కుటుంబసభ్యులు రాత్రంతా వెతికారు. మంగళవారం ఉదయం 9.50 గంటల సమయంలో గండిపేట ్త సమీపంలోని ఓ చెట్టుకు ఉరేసుకొని కనిపించాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు చెప్పారు. సాయికుమార్ ఆత్మహత్యకు అమ్మాయి తరఫు కుటుంబసభ్యుల వేధింపులే కారణమని తల్లి లక్ష్మి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
ఆన్లైన్ బెట్టింగ్లో రూ.కోటి రూపాయలు పోగొట్టుకున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి!
కామారెడ్డి క్రైం: ఆన్లైన్ బెట్టింగ్కు బానిసైన ఓ యువకుడు.. అప్పుల ఊబిలో కూరుకుపోయి చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. కామారెడ్డి మున్సిపా లిటీ పరిధిలోని దేవునిపల్లికి చెందిన దేవుల సంజయ్ (28)సాఫ్ట్ వేర్ ఉద్యోగి. అతడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కొద్ది రోజులుగా ఆన్లైన్ బెట్టింగ్కు అలవాటు పడ్డాడు. ఆన్లైన్ బెట్టింగ్ కోసం అప్పులు చేశాడు. ఆరు నెలల కిందట అప్పుల విషయంలో భార్యా భర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో భార్య పుట్టింటికి వెళ్లిపో యింది. అప్పులు సుమారు రూ. కోటి వరకు చేరుకోవడంతో వాటిని ఎలా తీర్చాలో తెలియక, జీవితంపై విరక్తి చెంది సోమవారం ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య శ్రీలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని దేవుని పల్లి ఎస్సై రాజు తెలిపారు. -
ఉరేసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య
రాంగోపాల్పేట్: అనారోగ్యంతో బాధపడుతూ మనస్తాపానికి లోనైన ఓ పోలీస్ కానిస్టేబుల్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగులోకి వచి్చంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సిటీ పోలీస్ ఐటీసెల్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న రంగనాథ్రావు (36) కళాసీగూడ కామాక్షి దేవాలయం ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. అతడికి భార్య గాజుల దాక్షాయణి, కుమార్తె ఉన్నారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అతను అందు కు సంబంధించి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. అ యినా ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో డిప్రెషన్కు లోనయ్యాడు. ఆదివారం కుమార్తెతో కలిసి బోయిన్పల్లిలోని పుట్టింటికి వెళ్లిన అతడి భార్య దాక్షాయణి అక్కడి నుంచి భర్తకు వీడియో కాల్ చేయగా లిఫ్ట్ చేయలేదు. దీంతో రాత్రి ఇంటికి వచ్చి చూడగా రంగనాథ్ వెంటిలేటర్ గ్రిల్కు ఉరివేసుకుని కనిపించాడు. స్థానికుల సహాయంతో అతడిని కిందకు దించి చూడ గా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. దీనిపై సమాచారం అందడంతో మహంకాళి ఇన్స్పెక్టర్ పరశురాం సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేపట్టారు. -
ప్రేమికుల రోజే ప్రియుడి బలవన్మరణం
సంతోష్ నగర్: ప్రేమికుల రోజునే ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇన్స్పెక్టర్ కె.సత్యనారాయణ కథనం ప్రకారం... సంతోష్ నగర్ కళంధర్నగర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఇమ్రాన్ (21) చాంద్రాయణగుట్ట జీఎం కాలనీకి చెందిన మహ్మద్ ఆబిద్ అలీ కూతురు రబియా ఫాతిమాలు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇది రబియా తండ్రి అబిద్ అలీకి తెలియడంతో ఆయన ఈ నెల 14న చాంద్రాయణగుట్ట పోలీస్స్టేషన్లో తన కూతురును ఇమ్రాన్ వేధిస్తున్నాడని రబియాతో ఫిర్యాదు చేయించాడు. దీంతో పోలీసులు ఇమ్రాన్ను స్టేషన్కు పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ పరిణామంతో మనస్తాపానికి గురైన ఇమ్రాన్ ఇంటికి వచ్చి.. తన మృతికి రబియా తండ్రి కారణమని సూసైడ్ నోట్ రాసి సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
భర్త వికృత చేష్టలు.. విశాఖలో నవ వధువు..
సాక్షి, విశాఖ జిల్లా: గోపాలపట్నంలో నవ వధువు అనుమానాస్పదంగా మృతిచెందింది. అశ్లీల వీడియోలకు బానిసగా మారిన భర్త నాగేంద్ర.. వికృత ప్రవర్తనకు భార్య బలైంది. భర్త చేష్టలు భరించలేక భార్య ఆత్మహత్యకు పాల్పడింది. నాగేంద్ర సైకోలాగా మారి లైంగికంగా వేధించాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. తన కూతురిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారంటూ మృతురాలి తల్లి ఆరోపిస్తున్నారు.మితిమీరిన కోరికలు, శృతిమించిన అసహజ శృంగార వాంఛలతో నాగేంద్ర వేధించేవాడు. నాగేంద్రలో కామం వికృత రూపం దాల్చడంతో టార్చర్ను భార్య భరించలేకపోయింది. భర్తను మార్చే ప్రయత్నం చేసినా కానీ మార్పు రాలేదు. భర్త వేధింపులు తట్టుకోలేక తల్లిదండ్రుల వద్ద కూడా బాధితురాలు వాపోయింది. నిత్యం భర్త పెట్టే వేధింపులు భరించలేక చివరికి ఆ ఇల్లాలు ఆత్మహత్యకు పాల్పడింది.తన భర్త నాగేంద్రబాబు అశ్లీల వీడియోలు చూపిస్తూ టార్చర్ చేస్తున్నాడని కొన్ని రోజులుగా తమకు చెబుతోందన్నారు కుటుంబ సభ్యులు అన్నారు. గత రాత్రి కూడా ఫోన్ చేసిందని.. రేపు వచ్చి మాట్లాడతామని చెప్పామని.. ఇంతలోనే ఘోరం జరిగిపోయిందని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఆత్మహత్య కాదని.. హత్య అంటూ మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.ఇదీ చదవండి: ఒకే దెబ్బతో చంపడం ఎలా?.. యూట్యూబ్లో సెర్చ్ చేసి.. -
విశాఖ: ‘సీజ్ ద నారాయణ కాలేజ్’
విశాఖపట్నం, సాక్షి: సీజ్ ద నారాయణ కాలేజ్ నినాదంతో మధురవాడ పరదేశి పాలెం నారాయణ కాలేజ్ క్యాంపస్ మారుమోగుతోంది. యాజమాన్యం ఒత్తిడితో ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడగా.. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని విద్యార్థి సంఘాలు ఈ ఉదయం ఆందోళనకు దిగాయి.ఒడిశా రాయ్పూర్కు చెందిన చంద్రవంశీ(17) అనే విద్యార్థి.. మధురవాడ పరదేశి పాలెం నారాయణ కాలేజీలో సెకండ్ఇయర్ చదువుతున్నాడు. ఏం జరిగిందో తెలియదుగానీ.. కాలేజీ మేడ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే.. కాలేజీ యాజమాన్యం నుంచి ఒత్తిడి భరించలేకనే అతను చనిపోయినట్లు విద్యార్థి సంఘాలు ఇప్పుడు ధర్నాకు దిగాయి.చంద్ర వంశీ ఆత్మహత్యపై కళాశాలలో నిన్న రాత్రి(బుధవారం) స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు. దీంతో యాజమాన్యం విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడింది. గేట్లు వేసి, హాస్టల్ రూమ్లకు తాళాలు వేసి విద్యార్థులను లోపలే బంధించింది. ఆపై రంగ ప్రవేశం చేసిన పోలీసులు సైతం విద్యార్థులను బెదిరించినట్లు సమాచారం.విషయం తెలిసిన ఎస్ఎఫ్ఐ, ఇతర విద్యార్థి సంఘాలు కాలేజ్ దగ్గరకు చేరుకుని ధర్నాచేపట్టాయి. చంద్ర వంశీ మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని, కాలేజీని తక్షణమే సీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వ అండదండలతో నారాయణ కళాశాల యాజమాన్యం రెచ్చిపోతుందని ఆరోపించాయవి. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
కాకినాడలో మెడికల్ విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, కాకినాడ: కాకినాడలో మెడికల్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రంగరాయ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్న రావూరి సాయిరాం తన గదిలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.డాక్టర్ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, 21 నుంచి పరీక్షలు ఉన్నాయని.. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనేదానిపై తెలియలేదన్నారు. ఎగ్జామ్స్ ముందు కౌన్సిలింగ్ ఉంటుంది. చాలా ఈజీ సబ్జెక్ట్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తెలియాలి. ఫస్ట్ ఇయర్లో మంచి మార్కులు వచ్చాయి.. స్పోర్ట్స్ కూడా బాగా ఆడతాడని ఉమామహేశ్వరరావు అన్నారు.రైలు కిందపడి..శ్రీకాకుళం జిల్లా: కాశీబుగ్గ ఎల్సీ గేటు దగ్గర గూడ్స్ రైలు క్రింద పడి గుర్తు తెలియని యువకుడు (30) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి వివరాల కోసం రైల్వే పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పలాస రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
తల్లి సెల్ఫోన్ ఇవ్వలేదని కూతురు..
కౌటాల(సిర్పూర్): తల్లి తనకు సెల్ఫోన్ ఇవ్వలేదని పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కుమురంభీం జిల్లా కౌటాల మండల కేంద్రంలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఎస్సై మధుకర్ కథనం ప్రకా రం.. కౌటాలలోని ప్రగతి కాల నీకి చెందిన బొమ్మకంటి సదానందం, రమాదేవి దంపతులకు కుమారుడు, కుమార్తె స్ఫూర్తి (16) ఉన్నారు. స్ఫూర్తి స్థానిక ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువు తోంది. శనివారం మధ్యాహ్నం కాగజ్నగర్ నవోదయలో నిర్వహించిన ఇంటర్ ప్రవేశ పరీక్ష రాసింది. పరీక్ష అనంతరం తండ్రి సదానందం స్ఫూర్తిని ఇంటివద్ద దించి బయ టకు వెళ్లాడు. కాగా, పదో తరగతి స్టడీ మెటీరియల్ను చూసుకోవడానికి సెల్ఫోన్ ఇవ్వాలని స్ఫూర్తి తన తల్లి రమాదేవిని కోరింది. అయితే సెల్ఫోన్ ఇస్తే గేమ్స్ ఆడి సమయం వృథా చేస్తావని, మెటీరియల్ను జిరాక్స్ తీసుకు వస్తానని ఆమె తెలిపింది. కాసేపటి తర్వాత తల్లి జిరాక్స్ సెంటర్కు వెళ్లింది. ఈ క్రమంలో తల్లి తనకు సెల్ఫోన్ ఇవ్వ లేదని మనస్తాపం చెందిన స్ఫూర్తి.. ఫ్యాన్కు ఉరేసుకుంది. జిరాక్స్ పత్రాలతో ఇంటికి వచ్చిన తల్లికి కుమార్తె ఉరి వేసుకుని ఉండడంతో భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పింది. వెంటనే ఇంటికి వచ్చిన అతను కుమార్తెను కిందకు దింపి కౌటాల పీహెచ్సీకి తరలించాడు. వైద్యులు పరీక్షించి సిర్పూర్(టీ) ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి రెఫర్ చేశారు. అక్కడికి బాలికను తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సిర్పూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో స్ఫూర్తి మృతదేహాన్ని ఎస్సై మధుకర్ పరిశీలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. తండ్రి సదానందం ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
Hyderabad: నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య
బౌద్ధనగర్,హైదరాబాద్: ప్రేమించిన వ్యక్తి తరచూ అనుమానిస్తూ..వేధింపులకు పాల్పడడంతో భరించలేక ఓ నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. వారాసిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం..బౌద్ధనగర్లోని అంబర్నగర్కు చెందిన నాగయ్య కుమార్తె ప్రవళిక (23) కోఠి ఉమెన్స్ కాలేజీలో బీఎస్సీ ఫైనలియర్ చదువుతుంది. కాలేజీ అయ్యాక సాయంత్రం 6 నుండి రాత్రి 10 గంటల వరకు వారాసిగూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పార్ట్టైమ్ జాబ్ చేస్తుంది. కాగా నాలుగేళ్లుగా ప్రవళిక..సృజన్ అనే యువకుడిని ప్రేమిస్తోంది. ఈ క్రమంలో కొద్ది రోజులుగా సృజన్ ఆమెను వేధిస్తూ వేధింపులకు దిగాడు. మరో యువకుడితో మాట్లాడుతున్నావని అనుమానించేవాడు. ఇదే విషయంపై పలుమార్లు గొడవలు జరిగాయి. ఈ నెల 6వ తేదీన సాయంత్రం ఉస్మానియా యూనివర్సిటీలోని ఓ బేకరీలో ప్రవళిక, సృజన్ల మధ్య వాగి్వవాదం జరిగింది. దీంతో మరో స్నేహితుడు మధుకర్ వచ్చి ఇద్దరిని సముదాయించాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి 10 గంటల సమయంలో ఇంటికి వచ్చిన ప్రవళిక తన తండ్రి నాగయ్యకు ఫోన్ చేయగా, తాను ఫంక్షన్కు వెళ్తున్నానని ఆలస్యంగా వస్తానని చెప్పాడు. అర్థరాత్రి ఒంటి గంటకు ఇంటికి వచ్చిన నాగయ్యకు బెడ్రూమ్లో ప్రవళిక దుప్పటితో సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకొని కనిపించింది. వెంటనే స్థానికుల సహాయంతో ప్రవళికను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రవళిక స్నేహితుడు మధుకర్..సృజన్తో ప్రేమ, గొడవల గురించి నాగయ్యకు తెల్పగా..ఆయన ఫిర్యాదు మేరకు సృజన్పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పాఠశాల భవనం పైనుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య
షాద్నగర్రూరల్: ప్రిన్సిపాల్ మందలించాడని ఓ విద్యార్థి పాఠశాల భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బుధవారం పట్టణంలో కలకలం రేపింది. స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకారం.. పట్టణంలోని సీఎస్కే వెంచర్లో నివాసం ఉంటున్న హరిభూషణ్ పటేల్, భాగ్య దంపతుల కుమారుడు నీరజ్(15) స్థానిక శాస్త్ర పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఉదయం స్కూల్కు వెళ్లిన నీరజ్ స్నేహితుడితో కలిసి క్లాస్రూం నుంచి కారిడార్కు వచ్చాడు. ఇది గమనించిన ప్రిన్సిపాల్ నరేందర్రాయ్ వారిని మందలించాడు. దీంతో సాయంత్రం 4గంటలకు సుమారు 20 ఫీట్ల ఎత్తులో ఉన్న స్కూల్ అంతస్తు పైనుంచి నీరజ్ కిందికి దూకాడు. రక్తపు మడుగులో.. పాఠశాల భవనం పైనుంచి దూకిన నీరజ్ రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతుండగా.. పాఠశాల సిబ్బంది వెంటనే అతన్ని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ విషయాన్ని విద్యార్థి తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు వెంటనే చికిత్స కోసం హైదరాబాద్కు తరలించగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. విద్యార్థి నేతల ఆందోళన..విద్యార్థి ఆత్మహత్య విషయం తెలుసుకున్న ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ యువసత్తా యూత్ నాయకులు పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు. పాఠశాల ఫర్నిచర్, అద్దాలు, బోర్డులు ధ్వంసం చేశారు. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పాఠశాల ఎదుట బైఠాయించారు. వార్షికోత్సవం మరుసటి రోజే విషాదం.. హరిభూషణ్ పటేల్, భాగ్య దంపతులకు నీరజ్తో పాటు ఓ కూతురు ఉన్నారు. మంగళవారం హరిభూషణ్ దంపతుల పెళ్లి రోజు కావడంతో వారు కుటుంబ సభ్యులతో ఘనంగా వేడుక జరుపుకొన్నారు. మరుసటి రోజే కొడుకు మృతిచెందడంతో గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. ఆర్మీ జవాన్గా పని చేసిన హరిభూషణ్ రిటైర్మెంట్ తీసుకుని, ప్రస్తుతం ప్రస్తుతం బీజేపీ పట్టణ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. -
కేపీ చౌదరి ఆత్మహత్య.. టాలీవుడ్ నటి కూతురు ఎమోషనల్ నోట్
టాలీవుడ్ నిర్మాత కేపీ చౌదరి ఆత్మహత్యపై ప్రముఖ నటి సురేఖ వాణి కూతురు సుప్రీత ఎమోషనల్ పోస్ట్ చేసింది. అతనితో ఉన్న చిత్రాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఇక్కడ సమాజం విఫలమైందని.. నిన్ను మిస్ అవుతున్నందుకు చాలా బాధగా ఉంది అన్న అంటూ తీవ్ర భావోద్వేగానికి గురైంది. ఇక నుంచి నా బాధలు ఎవరికీ చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేసింది. నీ బాధలు కూడా వినడానికి లేకుండా చేశావ్ కదా అన్న అంటూ సుప్రీత తన నోట్లో రాసుకొచ్చింది.నీకోసం చెల్లి ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటుంది.. వెనక్కి వచ్చేయ్ అన్న అంటూ తన బాధను వ్యక్తం చేసింది. 'మిస్ యూ కేపీ అన్న.. నువ్వు ఎక్కడ ఉన్నా సరే పులిలాగే ఉంటావ్.. ఐ లవ్ యూ సో మచ్.. రెస్ ఇన్ పీస్' అంటూ తీవ్ర భావోద్వేగంతో పోస్ట్ చేసింది. ప్రస్తుతం సుప్రీత చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.(ఇది చదవండి: 'కబాలి' నిర్మాత కే.పీ చౌదరి ఆత్మహత్య.. కారణం ఇదే)కాగా.. కేపీ చౌదరి నిర్మాతగా కబాలి చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో రజినీకాంత్ హీరోగా నటించారు. కబాలి’ తెలుగు వర్షన్కు నిర్మాతగా ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. అయితే గతేడాదిలో డ్రగ్స్ కేసులో సైబరాబాద్ పోలీసులు ఆయన్ను పట్టుకున్నారు. 2016లో సినిమా రంగంలోకి వచ్చిన కేపీ చౌదరి తెలుగు, తమిళ చిత్రాలను డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఈ క్రమంలో సర్ధార్ గబ్బర్ సింగ్, అర్జున్ సురవరం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాలను ఆయన డిస్ట్రిబ్యూషన్ చేశారు. View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) -
ఎస్సై ఆత్మహత్యకు ఆ ఫ్యాక్టరీయే కారణం: కారుమూరి
సాక్షి,పశ్చిమగోదావరిజిల్లా:తణుకు రూరల్ ఎస్సై మూర్తి తుపాకీతో కాల్చుకొని చనిపోవడం చాలా బాధాకరమని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి అన్నారు. ఈ విషయమై కారుమూరి ఆదివారం(ఫిబ్రవరి2) మీడియాతో మాట్లాడారు. ‘ఆ ఎస్సై చాలా మంచివాడు ధైర్యవంతుడు..కానీ అలా చేసుకోవడం బాధాకరం. దీనంతటికీ మూలకారణం తేతలిలో ఉన్న పశువధ ఫ్యాక్టరీనే అన్నది నూరు శాతం నిజం. కొన్ని నెలల క్రితం గేదెలు దొంగతనం జరిగిన ఘటనలో దొంగను పట్టుకొన్నారు ఎస్సై మూర్తి. గతంలో గేదెలు దొంగిలించినా గానీ దొరికేవి. ఇప్పుడు గేదెలు దొంగిలించిన ఐదు నిముషాల్లోనే తేతలి ఫ్యాక్టరీలో అమ్మేస్తున్నారు. ఫ్యాక్టరీ లోపలికెళ్లిన రెండునిముషాల్లో మాంసానికి మాంసం ఎముకలకు ఎముకలు చర్మానికి చర్మం వేరు చేసేస్తున్నారు.అలా గేదెలు దొంగను పట్టుకొన్నా కానీ అప్పటికే వాటిని ఫ్యాక్టరీలో అమ్మేశాడు. ఆ దొంగ నుంచి ఎమౌంట్ రికవరీ చేసి గేదెలు యజమానికి న్యాయం చేశారు ఎస్సై మూర్తి. గతంలో ఆ ఆరోపణలతో సస్పెండ్ అయినా ఎస్సై మూర్తి మనస్తాపంతో ఇలా బలవన్మరణం చెంది ఉండచ్చు. ఎస్సై ఆత్మహత్యకు కారణమైన పశువధ ఫ్యాక్టరీని ఇప్పటికైనా ఇక్కడి కూటమి ఎమ్మెల్యే మూయించాలి.ఇంకా ఎన్ని ప్రాణాలు బలికొంటారు. అక్కడ ప్రజలు అన్నం కూడా తినలేని పరిస్థితిలో అల్లాడిపోతున్నారు. కానీ ఇక్కడి కూటమి ఎమ్మెల్యే రాధాకృష్ణ ఉత్తర్ ప్రదేశ్ నుంచి వచ్చిన కసాయి వ్యాపారికి కొమ్ముకాస్తున్నాడు. పర్మిషన్లు లేని పశువధ శాలకు పోలీసులతో కాపలాకాయిస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాడు.ఆ ఫ్యాక్టరీకి ఎటువంటి పర్మిషన్లు లేవని మేం ఎన్నిసార్లు నిరూపించాలి. ఇక్కడి ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణకు డబ్బే ప్రధానమా ప్రజలు అక్కర్లేదా’అని కారుమూరి ప్రశ్నించారు. -
అమ్మానాన్నా.. నన్ను క్షమించండి..!
పెద్దపల్లి జిల్లా: ‘చదువుల్లో రాణించలేకపోతున్నా.. ఎంత చదివినా ఎక్కువ మార్కులు రావడం లేదు. టెన్త్లో 10 జీపీఏ సాధించాలనుకున్నా అది సాధ్యం అయ్యేలా లేదు. నా వల్ల కాదు.. నేను చనిపోతున్నా. అమ్మానాన్నా.. నన్ను క్షమించండి..’అంటూ చదువు ఒత్తిడిని తట్టుకోలేక పదో తరగతి విద్యార్థిని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణం రాంనగర్లో శనివారం చోటుచేసుకుంది. సీసీసీ నస్పూర్ ఎస్సై సుగుణాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. చిలువేరి దేవేందర్, జ్యోతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమలాపురంలో నివాసం ఉంటున్నారు. వీరి కూతురు యోగిత (15) చిన్నప్పటి నుంచి రాంనగర్లో ఉన్న అమ్మమ్మ వద్ద ఉంటోంది. స్థానిక ఆదిత్య స్కూల్లో టెన్త్ చదువుతోంది. పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తుండటంతో ఆవేదన చెంది.. శనివారం తెల్లవారుజామున ఐదు గంటలకు వంట గదిలో ఉరేసుకుంది. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. కూతురు మరణ వార్త తెలుసుకుని అమలాపురం నుంచి వచి్చ న తల్లిదండ్రులు మృతదేహంపై పడి బోరున విలపించడం అందరినీ కలచివేసింది. -
డబ్బులు తీసుకుని ఇవ్వడం లేదని..
జీడిమెట్ల: డబ్బులు తీసుకున్న వ్యక్తి తిరిగి ఇవ్వకపోవడం , ఈ విషయమై ఇంట్లో గొడవలు జరుగుతుండటంతో మనస్తాపానికి లోనైన ఓ మహిళ ఉరివేసుకుని అత్మహత్యకు పాల్పడిన సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేష్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జీడిమెట్ల టీఎస్ఎస్ఐసీ కాలనీలో నివాసం ఉంటున్న చందు భార్య లావణ్య(35) స్థానికంగా టైలరింగ్ షాప్ నిర్వహిస్తోంది. కొద్ది నెలల క్రితం ఆమెకు శివరాం అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. లావణ్యతో స్నేహంగా ఉండే శివరాం తన వ్యాపార నిమిత్తం రూ.5లక్షలు అప్పుగా ఇవ్వాలని కోరాడు. దీంతో ఆమె తన నగలు తాకట్టు పెట్టి రూ.5 లక్షలు ఇచ్చింది. నెలలు గడుస్తున్నా శివరాం డబ్బులు చెల్లించకపోవడంతో ఆమె ఈ విషయాన్ని తన భర్త దృష్టికి తీసుకెళ్లింది. దీంతో చందు శుక్రవారం శివరాంను ఇంటికి పిలిచి డబ్బుల విషయమై నిలదీయగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో లావణ్య శివరాంకు ఫోన్చేసి నువ్వు డబ్బులు ఇవ్వనందునే తమ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని నీ కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పింది. దీంతో ఆందోళనకు గురైన శివరాం, చందు ఇంటికి వెళ్లి చూడగా లావణ్య చీరతో ఫ్యాన్కు ఉరి వేసుకుని కనిపించింది. ఇద్దరూ కలిసి ఆమెను కిందికి దింపి సమీపంలోని అస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
సూర్యాపేటలో విషాద ఘటన
మిర్యాలగూడ అర్బన్: తను చదువుకున్న చదువుకు.. చేసే కొలువుకు సంబందం లేని ఉద్యోగం.. వచ్చిన ఉద్యోగం చేసేందుకు ఇష్టం లేని యువకుడు సాగర్ కాల్వలో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. త్రిపురారం మండలం బెజ్జికల్ గ్రామానికి చెందిన నూనె రాములు, నిర్మల రెండవ కుమారుడు ప్రవీణ్కుమార్ (30) బీటెక్ పూర్తి చేసి గ్రూప్–4 పరీక్ష ఫలితాల్లో మెరిట్ సాధించాడు. దీంతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఎంపికై గత డిసెంబర్ 28న మిర్యాలగూడ తహశీల్దార్ కార్యాలయంలో ఉద్యోగంలో చేరి మిర్యాలగూడ పట్టణంలో నివాసం ఉంటున్నాడు.అయితే ప్రవీణ్ ఉద్యోగంలో చేరిన సమయంలోనే ప్రభుత్వ సంక్షేమ పధకాల క్షేత్రస్థాయి సర్వే ప్రారంభం కావడంతో క్షేత్ర స్తాయిలో పని ఒత్తిడి పెరిగి మానసికంగా ఇబ్బంది పడుతున్నట్లు పలు సందర్బాల్లో తన తల్లిదండ్రులతో చెప్పుకున్నాడు. అయితే తెలంగాణ జెన్కో నిర్వహించిన పరీక్షలో విద్యుత్ ఏఈ పోస్టు ఇంటర్వూకు 1:2 లో ఎంపికైన అతడు కొద్ది తేడాతో ఏఈ ఉద్యోగం చేజారింది. దీంతో తీవ్ర మానసిక క్షోభకు గురయ్యాడు. అంతే కాకుండా వచ్చే నెలలో గ్రూప్స్ రిజల్ట్స్ కూడా ఉండటంతో తాను కచ్చితంగా గ్రూప్స్ సాధిస్తాననే నమ్మకం ఉందని.. ఈ ఉద్యోగం వదిలేస్తానని తల్లిదండ్రులకు చెప్పినట్లుగా తెలుస్తుంది. అయితే గ్రూప్స్ ఉద్యోగం వచ్చే వరకు ఎలాగైనా ఓపిక పట్టుకుని ఉండమని తల్లిదండ్రులు అతడిని సముదాయించారు. ఉన్నత చదువులు తనకు చదవుకు తగ్గ కొలువు దక్కలేదని గత కొద్ది రోజులుగా తన తోటి సిబ్బంది వద్ద వాపోయేవాడని కూడా కార్యాలయంలో చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం డ్యూటికి వచ్చిన ప్రవీణ్కుమార్ రాత్రి ఇంటికి ఫోన్చేసి తల్లితో తన భాదను చెప్పగా.. ఎప్పటిలాగే వారు సర్దిచెప్పారు. అయితే, బుధవారం ప్రవీణ్కుమార్కు తల్లిదండ్రులు ఎన్నిసార్లు ఫోన్చేసినా కలవకపోవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు మిర్యాలగూడ వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు మంగళవారం రాత్రి 11గంటల సమయంలో వేములపల్లి సమీపంలోని సాగర్ కాల్వ వద్ద చివరి సారిగా సెల్ఫోన్ సిగ్నల్స్ చూపించాయి. ప్రవీణ్కుమార్ స్కూటీ సాగర్ కాల్వ వద్ద నిలిపి ఉంచడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. గురువారం దొండవారిగూడం వద్ద సాగర్కాల్వలో ప్రవీణ్కుమార్ మృతదేహం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా, జూనియర్ అసిస్టెంట్ ప్రవీణ్కుమార్ది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సైదిరెడ్డి తెలిపారు. -
పెళ్లికి నిరాకరించడం ఆత్మహత్యకు పురిగొల్పినట్లు కాదు: సుప్రీం
న్యూఢిల్లీ: వివాహానికి ఆమోదం తెలపక పోవడాన్ని ఆత్మహత్యకు పురిగొల్పినట్లుగా భావించలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. తన కుమారుడితో పెళ్లికి నిరాకరించడం వల్లే అతడి ప్రియురాలు ఆత్మహత్యకు పాల్పడిందంటూ ఓ మహిళపై దాఖలైన కేసుపై విచారణ సందర్భంగా జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మల ధర్మాసనం ఈ మేరకు అభిప్రాయపడింది. ఐపీసీలోని సెక్షన్–306 ప్రకారం ఆత్మహత్యకు ప్రేరేపించినట్లుగా భావించలేమని స్పష్టం చేస్తూ కేసును కొట్టివేసింది. పిటిషనర్ కుమారుడు, అతడి ప్రియురాలికి మధ్య ఉన్న విభేదాలే ఆధారంగానే ఈ ఆరోపణలు చేసినట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి చార్జిషీటు, సాక్షుల వాంగ్మూలాలు వంటి నమోదైన ఆధారాలు సరైనవే అని భావించినా, పిటిషనర్కు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవని ధర్మాసనం పేర్కొంది. ఆత్మహత్యకు మినహా మరే ప్రత్యామ్నాయం కూడా మృతురాలికి లేకుండా పిటిషనర్ చేశారనే ఆరోపణలు కూడా లేవని స్పష్టం చేసింది. అదేవిధంగా, పిటిషనర్, కుటుంబంతో కలిసి తన కుమారుడితో బంధం తెంచుకోవాలని మృతురాలిపై ఒత్తిడి చేసినట్లు కూడా చూపలేకపోయారని ధర్మాసం తెలిపింది. ప్రియురాలితో తన కుమారుడి వివాహానికి పిటిషనర్ నిరాకరించినా ఆమె ఆత్మహత్యకు పాల్పడేలా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఒత్తిడి చేసినట్లుగా భావించలేమని తెలిపింది. వాస్తవానికి మృతురాలి కుటుంబానికే ఈ పెళ్లి ఇష్టం లేదన్నది నిజమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘నా కుమారుడిని పెళ్లి చేసుకోకుండా నీవు బతకలేవా?’అంటూ పిటిషనర్ చేసిన వ్యాఖ్యలను కూడా ఐపీసీలోని సెక్షన్ 306ను అనుసరించి తీవ్రమైన ఆత్మహత్య నిర్ణయానికి కారణమని చెప్పలేమంది. -
చెరువులోకి దూకిన వృద్ధ దంపతులు
-
ఉద్యోగం పోవడం, ఫైనాన్స్ వేధింపులతో మహిళా వాలంటీర్ సూసైడ్
-
భార్యపై అనుమానం.. మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య
ఆదోని అర్బన్: పట్టణంలోని పూలబజార్లో నివాసముంటున్న శైలజ (22) అనే వివాహిత ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై మృతురాలి తండ్రి కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వన్టౌన్ సీఐ శ్రీరామ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మూడున్నర సంవత్సరాల క్రితం విక్టోరియాపేటకు చెందిన కృష్ణ కుమార్తె శైలజ, శక్తిగుడి ప్రాంతంలో నివాసముంటున్న నాగరాజు ప్రేమ పెళ్లి చేసుకున్నారు. నాగరాజు ఓ ప్రయివేట్ కంపెనీలో గుమస్తాగా పనిచేస్తుండగా, శైలజ లేడీస్ కార్నర్లో పని చేస్తోంది. వీరికి రెండేళ్ల కుమార్తె మౌనిక ఉంది. భర్త ప్రతిరోజూ భార్యపై అనుమానం పడడం, లేడీస్ కార్నర్లో పనిచేయగా వచ్చిన డబ్బు తనకే ఇవ్వాలని వేధించేవాడు. దీంతో శైలజ మనస్తాపానికి గురై సోమవారం రాత్రి గదిలోకి వెళ్లి ఫ్యాన్కు ఉరి వేసుకుంది. కాపేపటికి గమనించిన కుటుంబసుభ్యులు కిందకు దింపి ఆదోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి తండ్రి కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు వన్టౌన్ సీఐ తెలిపారు. -
12 మందిని కాల్చి ఆపై ఆత్మహత్య
పొడ్గొరిక(మాంటెనెగ్రో): నూతన సంవత్సర సంబరాలు జరుగుతున్న వేళ మాంటెనెగ్రోలోని సెటింజె పట్టణంలో బుధవారం ఘోర విషాదం చోటుచేసుకుంది. అకో మార్టినోవిక్(45) అనే వ్యక్తి ఉన్మాదిగా మారి బార్ యజమాని, అతడి ఇద్దరు పిల్లలతోపాటు సొంత కుటుంబ సభ్యులను సైతం పొట్టనబెట్టుకున్నాడు. స్థానిక బార్లో బుధవారం ఉదయం నుంచి మార్టినోవిక్ గడిపాడు. సాయంత్రం గొడవకు దిగి ఇంటికి వెళ్లిపోయాడు. తిరిగి తుపాకీ తీసుకుని బార్లోకి ప్రవేశించిన అతడు బార్లోని వారిపైకి కాల్పులకు దిగాడు. అనంతరం బయటకు వెళ్లి మరో మూడు చోట్ల కాల్పులు జరిపాడు. పోలీసులు వెంబడించడంతో అక్కడికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొడ్గొరికకు వెళ్లాడు. పోలీసులు చుట్టుముట్టడంతో తనను తాను కాల్చుకున్నాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. హింసా ప్రవృత్తి, చంచల స్వభావి అయిన మార్టినోవిక్పై గతంలో పలు కేసులున్నాయని పోలీసులు తెలిపారు. యూరప్లోని చిన్న దేశం మాంటెనెగ్రో జనాభా 6.20 లక్షలు. ఆయుధాలను కలిగి ఉండటం ఇక్కడో సంప్రదాయం. తుపాకీ సంస్కృతి కారణంగా తరచూ నేరాలు జరుగుతుంటాయి. తాజా ఘటన జరిగిన సెటింజెలోనే 2022 ఆగస్ట్లో ఓ దుండగుడు ఇద్దరు చిన్నారులు సహా 10 మందిని కాల్చి చంపాడు. ఓ వ్యక్తి సకాలంలో అతడిని కాల్చి చంపడంతో మారణ హోమానికి పుల్స్టాప్ పడింది. -
విశాఖ జిల్లాలో విషాదం.. దంపతుల ఆత్మహత్య
-
పెళ్లైన ఆటో డ్రైవర్తో యువతి ప్రేమ.. చివరకు
తిరువళ్లూరు: వివాహితుడితో ప్రేమ వ్యవహరం నడుపుతున్న కుమార్తెను తల్లిదండ్రులు మందలిండంతో మనస్తాపం చెందిన విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలు..తిరువళ్లూరు జిల్లా తన్నీర్కులం రామాపురం గ్రామానికి చెందిన శివకుమార్ కుమార్తె ఆర్తి (21). ఈమె చైన్నె భక్తవత్సలం మహిళ కళాశాలలో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతోంది. కాగా ఆర్తికి అదే ప్రాంతంలో ఆటో డ్రైవర్ అయిన వివాహితుడైన వ్యక్తితో గత రెండేళ్ల నుంచి ప్రేమ వ్యవహరం నడుపుతున్న తెలుస్తోంది. వీరి ప్రేమ వ్యవహరం ఇద్దరి ఇంటి పెద్దలకు తెలియడంతో మందలించినట్లు తెలుస్తోంది. దీంతో యువతి మంగళవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆలస్యంగా విషయాన్ని గుర్తించిన బంధువులు ఉరికి వేలాడుతున్న యువతిని కిందకు దింపి స్థానికంగా ఉన్న ప్రైవేటు వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. ఈ ఘటనపై తాలుకా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును చేపట్టారు. కాగా ఆటో డ్రైవర్పై చర్యలు తీసుకోవాలని మహిళ పోలీసులకు యువతి బంధువులు ఫిర్యాదు చేశారు. -
ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్ల బలవన్మరణం
సిద్దిపేటకమాన్/ కొల్చారం (నర్సాపూర్): ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆదివారం ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. సిద్దిపేట పట్టణంలో అప్పుల బాధ భరించలేక ఒకరు, మెదక్ జిల్లా కొల్చారం మండలంలో తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని మనస్తాపానికి గురై మరొకరు ఉరేసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేటకు చెందిన బండారి బాలకృష్ణ (34).. భార్య మానస, ఇద్దరు కుమారులతో కలసి సిద్దిపేట పట్టణం కాళ్లకుంట కాలనీలో నివాసం ఉంటున్నారు. బాలకృష్ణ రాజన్న సిరిసిల్ల జిల్లా 17వ బెటాలియన్లో హెడ్ కానిస్టేబుల్ ఆర్మర్గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రతి రోజూ సిద్దిపేట నుంచి విధులకు వెళ్లి వస్తుంటారు. కాగా, బాలకృష్ణ ఫోనిక్స్ అనే ఓప్రైవేటు కంపెనీలో ఫోన్ పే, గూగుల్ పే, నెఫ్ట్ ద్వారా పలు విడతలుగా సుమారు రూ.25 లక్షలు పెట్టుబడిగా పెట్టారు. ఈ క్రమంలో చాలా అప్పులు చేశారు. అయితే పెట్టుబడులపై ఆశించిన ఆదాయం రాకపోవడంతో అప్పులు తీర్చే మార్గం లేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయాన్ని భార్యతో చెప్పి శనివారం రాత్రి ఎలుకల మందు కలిపిన టీని ఇద్దరు పిల్లలకు తాగించి, భార్యాభర్తలు కూడా తాగారు. ఆదివారం తెల్లవారుజామున మేలుకున్న బాలకృష్ణ లేచి చూడగా అందరూ స్పృహలోనే ఉన్నారు. ఇది గుర్తించి అతడు పక్క గదిలోకి వెళ్లి ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు బాలకృష్ణ భార్య మానస, ఇద్దరు కుమారులను సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. మృతుడు రాసిన సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్ టౌన్ సీఐ వాసుదేవరావు తెలిపారు. బ్లాక్ మెయిల్ చేస్తున్నారని..మరో ఘటనలో మెదక్ జిల్లా కొల్చారం పోలీస్స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న కాటూరి సాయికుమార్ (55) బలవన్మరణానికి పాల్పడ్డారు. ఎస్ఐ మహమ్మద్ గౌస్ కథనం ప్రకారం.. హెడ్ కానిస్టేబుల్ సాయికుమార్ భార్య శైలజ, ఇద్దరు కుమార్తెలతో కలసి నర్సాపూర్లో ఉంటున్నారు. రోజూ అక్కడి నుంచే డ్యూటీకి వచ్చి వెళ్తుంటారు. శనివారం మధ్యాహ్నం కొల్చారం స్టేషన్కు డ్యూటీకి వచ్చారు. రాత్రి క్వార్టర్ రూమ్లో ఉన్నారు. ఆదివారం ఉదయం భార్య శైలజకు ఫోన్ చేసి, ‘నేను చనిపోతున్నాను. నన్ను కొందరు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు’అని చెప్పి స్టేషన్ ఆవరణలోని చెట్టుకు ఉరేసుకొన్నారు. విషయం తెలుసుకున్న మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారుతీవ్రంగా వేధించారు: మృతుడి భార్య శైలజకొంతకాలంగా నర్సాపూర్లోని ఓ మహిళతో సాయికుమార్ తరచూ ఫోన్లో మాట్లాడేవారని ఆయన భార్య శైలజ తెలిపారు. ఇది తెలిసిన ఆ మహిళ భర్త.. వివాహేతర సంబంధం అంటగట్టడంతోపాటు కేసు పెడతానంటూ వేధించేవాడని పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా అతడి అల్లుడితో కలసి చంపుతామంటూ తరచూ బెదిరించేవారని పేర్కొంది. తన భర్త మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదు చేశారు. -
అప్పుల బాధ తాళలేక.. రైతు కుటుంబం బలవన్మరణం
సాక్షి ప్రతినిధి, కడప/సింహాద్రిపురం (పులివెందుల రూరల్)/కడప కోటిరెడ్డి సర్కిల్: వైఎస్సార్ జిల్లాలో అప్పుల బాధతో ఓ రైతు కుటుంబం శుక్రవారం రాత్రి బలవన్మరణానికి పాల్పడింది. ఆశించిన స్థాయిలో దిగుబడులులేక ఆదాయం రాకపోవడంతో అప్పుల భారం పెరిగిపోయింది. దీంతో అప్పులిచ్చిన వారి ఒత్తిళ్లు అధికమవడం.. కౌలుకిచ్చిన భూ యజమానులకు ముఖం చూపించలేక రాత్రి భార్యాపిల్లలను తన పొలానికి విడివిడిగా తీసుకెళ్లి రైతు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం మండలం దిద్దేకుంట్ల గ్రామంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. కలిసిరాని వ్యవసాయం..వ్యవసాయం చేసుకుంటూ సాఫీగా జీవనం సాగిస్తున్న నాగేంద్ర (45)కు భార్య వాణి (38), కుమారుడు భార్గవ్ (13), కుమార్తె గాయత్రి (11) ఉన్నారు. అతనికి భార్య వ్యవసాయ పనుల్లో చేదోడుగా ఉంటోంది. నాగేంద్ర తనకున్న 1.50 ఎకరాల సొంత పొలంతోపాటు ఆరేళ్ల క్రితం ఆరు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని పంటలు సాగుచేశాడు. కౌలు భూమిలో ఆశించిన దిగుబడి రాకపోవడంతో అప్పులపాలయ్యాడు. రెండేళ్ల క్రితం సుంకేసుల గ్రామానికి చెందిన మరో ఇద్దరి నుంచి 13 ఎకరాలను కౌలుకు తీసుకున్నాడు. ఈ ఏడాది ఖరీఫ్లో సోయా చిక్కుడు పంట సాగుచేశాడు. ఎకరాకు రూ.20వేల చొప్పున మొత్తం రూ.2.50 లక్షల పెట్టుబడి ఖర్చయింది. ఈసారీ ఆశించిన స్థాయిలో దిగుబడులు రాకపోవడంతో తీవ్రంగా నష్టపోయాడు.మళ్లీ రబీలో కొర్ర పంటను సాగుచేసేందుకు ఎకరాకు రూ.20వేల చొప్పున మొత్తం రూ.2.60 లక్షలు ఖర్చుచేసి పంటను సాగుచేశాడు. తెగుళ్ల నివారణకు పెద్ద మొత్తంలో మందులు కొన్నాడు. అయినా, ఈ పంట కూడా దిగుబడి రాకపోవడంతో తీవ్రనష్టం చవిచూశాడు. అప్పటికే అప్పులు ఉండడంతో సొంత భూమి ఒకటిన్నర్ర ఎకరాల్లో సాగుచేసిన చీనీ పంట పొలాన్ని నాగేంద్ర కుదవపెట్టాడు. దీనికితోడు.. సేద్యం కోసం కొన్న ట్రాక్టర్ను కంతులు చెల్లించలేదని స్వాధీనం చేసుకున్నారు. అవమానభారంతో ఉన్న నాగేంద్రకు కౌలుకు ఇచ్చిన యజమానులకు మోహం ఎలా చూపించాలి.. అప్పులెలా తీర్చాలన్న ఆవేదన వేధిస్తోంది.క్రమం తప్పకుండా ఆర్థిక ఇబ్బందులు..వ్యవసాయానికి అనుబంధంగా పాడి ఉంటే వేడి నీళ్లకు చన్నీళ్లు తోడు అన్నట్లుగా ఉంటుందని నాగేంద్ర సుమారు రూ.4లక్షలతో నాలుగు పాడి గేదెలు కొని పోషించేవాడు. కానీ, రెండేళ్ల క్రితం గుర్తుతెలియని వ్యక్తులు దూడలతో సహా వీటిని అపహరించారు. వరుసగా ఇలా ఆటుపోట్లతో నాగేంద్ర ఆర్థికంగా బాగా చితికిపోయాడు. రూ.15 లక్షల వరకు అప్పులు పెరిగిపోయాయి. అప్పులిచ్చిన వారు సైతం పదేపదే అడగడం ప్రారంభించారు.ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి తన పొలంలో భార్య వాణి, ఇద్దరు పిల్లలకు ఉరివేసి నాగేంద్ర సైతం బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇంటినుంచి వెళ్లిన వీరు ఎంతకు రాకపోయేసరికి తల్లి సిద్దమ్మ ఆందోళన చెందింది. ఇరుగు పొరుగు వారిని విచారించగా.. పొలం వైపు వెళ్లారని తెలుసుకుని అదే గ్రామంలో ఉన్న పెద్ద కొడుకు నాగరాజుకు తెలిపింది. గ్రామస్తులతో కలిసి అక్కడికి వెళ్లి చూడగా అప్పటికే నలుగురూ విగతజీవులుగా మారారు.భార్య, పిల్లలు తనలాగ కష్టపడకూడదనే..విగతజీవులుగా పడిపోయి ఉన్న నాగేంద్ర కుటుంబాన్ని చూసిన బంధువులు, గ్రామస్తులు పోలీసు లకు సమాచారం ఇచ్చారు. డీఎస్పీ మురళీనాయక్, ఎస్ఐ ఓబన్న ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. తానుపడ్డ కష్టాలు తన భార్యకు, పిల్లలకు రాకూడదనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు రైతు నాగేంద్ర తల్లి సిద్ధమ్మ కన్నీరుమున్నీరవుతోంది. మృతుడు ఉపయోగించిన తాళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో దిద్దేకుంట్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.అప్పుల బాధతోనే ఆత్మహత్య : డీఎస్పీఅప్పుల బాధతోనే రైతు కుటుంబం ఆత్మహత్యకు పాల్పడినట్లు డీఎస్పీ మురళీ నాయక్ శనివారం మీడియాకు తెలిపారు. ముందు భార్యను.. ఆ తర్వాత కుమార్తెను, అనంతరం కుమారుడికి ఉరివేసి చివరికి రైతు ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. రాత్రి 10గంటలకు మృతుడి బావమరిది రాజేష్, బంధువులు సంఘటనాస్థలికి వెళ్లి పోలీసులకు సమాచారమిచ్చారని చెప్పారు. మృతదేహాలను పులివెందుల సర్వజన ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ మార్చురీలోని మృతదేహాలను డీఎస్పీతో కలిసి పరిశీలించారు. రైతు కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అలాగే, రైతు కుటుంబం ఆత్మహత్యకు పాల్పడడం బాధాకరమని, ఈ విషయమై కలెక్టర్, ఇన్చార్జి ఎస్పీతో మాట్లాడామని, విచారించాలని ఆదేశించినట్లు జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత ఒక ప్రకటనలో తెలిపారు.ఎవరూ అధైర్యపడొద్దు.. మంచిరోజులొస్తాయి : ఎంపీ అవినాష్రైతు నాగేంద్ర కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. అప్పుల బాధ తాళలేక రైతన్న తనతోపాటు భార్య, ముక్కుపచ్చలారని పిల్లలకు కూడా ఉరివేయడం బాధాకరమన్నారు. రైతన్నలు ఎవరూ అధైర్యపడొద్దని, దేవుడి దయతో మంచిరోజులు వస్తాయని, ధైర్యంగా ఉండాలని తెలిపారు.నంద్యాల జిల్లాలో మరో రైతు ఆత్మహత్యకొత్తపల్లి : అప్పుల బాధ తాళలేక నంద్యాల జిల్లాకు చెందిన మరో రైతు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొత్తపల్లి మండలం ఎం. లింగాపురం గ్రామానికి చెందిన చిమ్మె నడిపి మారెన్న (68) తనకున్న ఐదెకరాలతో పాటు మరో 17 ఎకరాల పొలం కౌలుకు తీసుకుని వివిధ రకాల పంటలను సాగుచేసుకుంటున్నాడు. ఇందుకు నాలుగేళ్ల నుంచి సుమారు రూ.10 లక్షల వరకు అప్పుచేశాడు. దీంతోపాటు కుటుంబ అవసరాలు, పిల్లల చదువులు, ఇంటి నిర్మాణానికీ మరికొంత అప్పుచేశాడు. వీటిని తీర్చేందుకు తన ఐదెకరాల్లో మూడెకరాలను అమ్మి కొంతమేర అప్పులు కట్టాడు.ఇక ఈ ఏడాది సాగుచేసిన పొగాకు, మినుము, మొక్కజొన్న పంటలు అధిక వర్షాలతో దిగుబడిలేక నష్టపోయాడు. దీంతో అప్పులు ఎలా తీర్చాలో తెలీక మనోవేదనకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో.. శుక్రవారం రాత్రి ఇంట్లో ఎవరూలేని సమయంలో పురుగుమందు తాగాడు. కుటుంబ సభ్యులు మారెన్నను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుని కుమారుడు అల్లెన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఏఎస్ఐ బాబా ఫకృద్దీన్ తెలిపారు. తహసీల్దార్ ఉమారాణి, మండల వ్యవసాయాధికారి కె. మహేష్లు శనివారం లింగాపురం చేరుకుని వివరాలు సేకరించారు. కుటుంబానికి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు వర్తింపజేస్తామన్నారు. -
హైదరాబాద్ నాచారంలో యువతి ఆత్మహత్య
-
నా చావుకు కానిస్టేబుల్, ఆయన భార్యే కారణం.. యువతి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: నగరంలో యువతి ఆత్మహత్య తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చేయని తప్పునకు కానిస్టేబుల్ వేధింపులు భరించలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సెల్ఫీ వీడియో తీసుకొని చనిపోయింది. తన చావుకు కానిస్టేబుల్, ఆయన భార్యే కారణమని కన్నీరు పెట్టుకుంది. ఈ ఘటన నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాచారంలోని బాపూజీనగర్ సరస్వతి కాలనీకి చెందిన పులివర్తి దీప్తి హబ్సిగూడలోని ఐఐసీటీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ)లో ప్రాజెక్టు అసిస్టెంట్గా పని చేస్తున్నారు. దీప్తి తండ్రి సంగీతరావు ఐఐసీటీలో పని చేసి రిటైర్ అయ్యారు. తండ్రితో వేరుగా దీప్తి రెండు సంవత్సరాల నుండి తన తల్లితో కలిసి ఉంటోంది. సంగీతరావుకు డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న బెల్లా అనిల్తో పరిచయముంది.అయితే, బిల్ల అనిల్ అనే వ్యక్తి తన భార్య కోసం ఐఐసీటీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగం కోసం, దీప్తి తండ్రి సంగీత రావుకు రూ.15 లక్షలు డబ్బులు ఇచ్చినట్లు సమాచారం. రెండేళ్ల క్రితమే ఈ డబ్బులు ఇచ్చినట్టు సమాచారం. అయితే, తన తండ్రి సంగీతరావు.. అనిల్ వద్ద డబ్బు తీసుకున్న విషయం దీప్తికి తెలియదు. కాగా, ఈ సంవత్సరం సెప్టెంబర్ వరకూ ఉద్యోగం ఇప్పించలేదు. దీంతో అనిల్ తన డబ్బు తిరిగివ్వాలని దీప్తిని అడిగేవాడు. డబ్బు తన తండ్రి తీసుకున్నాడని, ఆయన తమతో చాలా ఏళ్ల నుంచి కలిసి ఉండటం లేదని, తనను డబ్బులు అడగవద్దని అనిల్కు సమాధానం చెప్పింది. ఆయన పట్టించుకోకుండా నాచారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించాడు. దీంతో, దీప్తి, సంగీత రావుపై ఛీటింగ్ కేసు నమోదైంది. అనిల్ దంపతులు న్యాయస్థానంలో సివిల్ దావా కూడా వేశారు.ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన దీప్తి, బుధవారం రాత్రి 10 గంటల సమయంలో చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తల్లి వచ్చి చూసేసరికి దీప్తి మృతి చెందింది. ఆమె ఫోన్ చూడగా సెల్ఫీ వీడియో ఉంది. సెల్ఫీ వీడియో ప్రకారం ఆమె మాటలు.. ‘నేను చనిపోవడానికి అనిల్, ఆయన భార్య అనిత, ఆమె తండ్రి సోమయ్య కారణం. మా నాన్న డబ్బులు తీసుకుంటే నన్ను అడిగి నా మీద నకిలీ కేసు పెట్టారు. నా జీవితం నాశనం చేశారు. ఈ కేసుల మీద పోరాడే స్తోమత లేదు. నా మరణంతోనైనా కుటుంబానికి న్యాయం జరుగుతుంది. నా చావునకు కారణమైన వాళ్లకు శిక్షపడాలి. నా మృతదేహాన్ని వైద్య పరిశోధనకు ఇచ్చేయండి అంటూ కన్నీరు పెట్టుకుంది. అనంతరం, పోలీసులు అనిత, అనిల్, సోమయ్య, సైదులు మీద కేసు బుక్ చేశారు. -
అశోక్నగర్లో గ్రూప్–2 అభ్యర్థి బలవన్మరణం
గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని అవుసులకుంట తండాకు చెందిన గిరిజన యువతి గుగులోత్ సురేఖ(22) సోమవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తండావాసులు తెలిపారు. యువతి ఉన్నత చదువులు చదివి హైదరాబాద్లో ఉంటూ వివిధ పరీక్షలకు ప్రిపేర్ అవుతుంది. వారం క్రితం నిర్వహించిన గ్రూప్–2 పరీక్షలకు సైతం హాజరైనట్లు తెలిపారు. వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. ఎంతో భవిష్యత్ ఉన్న యువతి ఆత్మహత్య చేసుకోవడంతో తండాలో విషాదచాయలు అలుముకున్నాయి. Hanumakonda: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
ఏడో తరగతి విద్యార్థి ఆత్మహత్య
హయత్నగర్ (హైదరాబాద్)/గోపాల్పేట: ప్రైవేటు పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి జరిగిన ఈ సంఘటనపై పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా రేవల్లి మండలం శానాయిపల్లికి చెందిన పండగ మధుసూదన్రెడ్డి రైతు. ఆయన కొడుకు లోహితస్యరెడ్డి (12) హయత్నగర్లోని నారాయణ రెసిడెన్షియల్ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. సోమవారం రాత్రి భోజనం అనంతరం 8 గంటలకు తోటి విద్యార్థులంతా స్టడీ అవర్లో చదువుకునేందుకు వెళ్లగా.. లోహితస్యరెడ్డి ఒక్కడే గదిలో ఉన్నాడు.స్టడీ అవర్ తర్వాత గదిలోకి వచి్చన విద్యార్థులకు.. ఫ్యాన్కు వేలాడుతూ లోహితస్యరెడ్డి కనిపించాడు. దీంతో వారు హాస్టల్ సిబ్బందికి చెప్పగా.. హయత్నగర్లోని సన్రైజ్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు విద్యార్థి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.ఉపాధ్యాయుల ఒత్తిడి, నిర్లక్ష్యం కారణంగానే తన కొడుకు ఆత్యహత్యకు పాల్పడ్డాడని మృతుని తండ్రి మధుసూధన్రెడ్డి ఆరోపించారు. ఇక్కడ చదవనంటే.. ఈ ఏడాది పూర్తయ్యేవరకు చదవమని నచ్చజెప్పానని చెప్పారు. సోమవారం రాత్రి 7 గంటల సమయంలో కూడా ఫోన్ చేసి మాట్లాడాడని.. ఆ తర్వాతే ఉరివేసుకుని మరణించాడనే వార్త తెలిసిందని వాపోయారు. మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల గేటు ముందు ఆందోళన చేశారు. -
‘ఓయ్.. సుఖంగా ఉండు!’
యుక్తవయసులో మానసిక ఆరోగ్యంపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. క్షణాకావేశంలో తీసుకుంటున్న తీవ్ర నిర్ణయాలే అందుకు కారణం. నిన్నగాక మొన్న.. అతుల్ సుభాష్ అనే వ్యక్తి మరణ ఉదంతం ఇందుకొక ఉదాహరణగా నిలిచింది. తాజాగా.. గుజరాత్లో ఓ యువతి తన ప్రియుడిని సుఖంగా ఉండాలని కోరుకుంటూ బలవన్మరణానికి పాల్పడడం చర్చనీయాంశమైంది.27 రాధా ఠాకూర్కు గతంలోనే వివాహం, విడాకులు అయ్యాయి. ఆ తర్వాత తన సోదరితో బనస్కాంత జిల్లా పలాన్పూర్లో ఉంటూ ఓ బ్యూటీపార్లర్ నడిపిస్తోంది. ఈ క్రమంలో ఓ యువకుడితో ఆమె ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. అయితే ఏం జరిగిందో తెలియదు.. సోమవారం ఉదయం కల్లా రాధ తన గదిలో విగతజీవిగా పడి ఉంది. దీంతో ఆమె సోదరి పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో.. రాధ ఫోన్లో కొన్ని రికార్డింగులు దొరికాయి. అందులో ఆమె ఎవరికో క్షమాపణలు చెప్పినట్లు ఉంది.‘‘ఏడు గంటలలోపు ఫొటో పంపకపోతే ఏం జరుగుతుందో చూస్తావు!’’ అంటూ ఓ ఆడియో క్లిప్ను సదరు వ్యక్తి వాట్సాప్ సందేశానికి తొలుత పంపినట్లు ఉంది. అయితే కాసేపటికే ఆమె సెల్ఫీ వీడియో చిత్రీకరించుకుంది.‘‘ ఓయ్.. నన్ను క్షమించమని రెండు చేతులు జోడించి వేడుకుంటున్నా. నిన్ను అడగకుండానే ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నా. నేను ఆత్మహత్య చేసుకున్నా అని అనుకోకు. పని, జీవితంలో విరక్తి చెంది ఈ నిర్ణయం తీసుకున్నా. నా ఈ పనితో నువ్వు బాధపడకు. పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు. అప్పుడే నా ఆత్మ సంతోషిస్తుంది అని వీడియోలో పేర్కొందామె. మృతిరాలి సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సదరు వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
యువతి ఆత్మహత్య.. ఆమెను రక్షించబోయి స్నేహితురాలి దుర్మరణం
పెనుకొండ: ఓ యువతి ఆత్మహత్యచేసుకుంటుంటే.. ఆమెను కాపాడుకునే క్రమంలో మరో యువతి దుర్మరణం పాలైంది. మృతులిద్దరూ ఒడిశాకు చెందిన యువతులు. ఒడిశాలోని గంజాం జిల్లాకు చెందిన సంధ్యారాణి మహారాజ్(24), సుల్లుబుల్లు బెహరా(28)లు స్నేహితులు. బతుకు తెరువు కోసం ఇద్దరూ బెంగళూరులోని ఓ గార్మెంట్స్ పరిశ్రమలో పనిచేస్తున్నారు. 3 రోజుల కిందట సంధ్యారాణి తండ్రి కుటుంబ సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నాడు.విషయం తెలుసుకున్న సంధ్యారాణి సొంతూరికి పయనమైంది. ఆమెకు తోడుగా సుల్లుబుల్లు బెహరా కూడా బయలుదేరింది. ఆదివారం బెంగళూరు నుంచి ప్రశాంతి ఎక్స్ప్రెస్లో వీరు బయలుదేరారు. తానూ నాన్న దగ్గరికే వెళతానంటూ స్నేహితురాలితో సంధ్యారాణి చెప్పింది. పెనుకొండ రైల్వేస్టేషన్కు రైలు చేరగానే సంధ్యారాణి రైలు దిగేసింది. బెహరా కూడా రైలు దిగి ఆమెను ఓదార్చేందుకు ప్రయత్నించింది. ఈ లోపు సంధ్యారాణి ప్లాట్ఫారం దాటి ముందుకు వెళుతుండడంతో వెనుకనే బెహరా అనుసరించింది. అటుగా వచి్చన గూడ్స్ రైలును గమనించగానే సంధ్యారాణి పట్టాల మీదికి దూకేసింది. ఆమెను పట్టుకునే క్రమంలో బెహరా సైతం అడుగు ముందుకేయడంతో.. రైలు ఇంజన్ ఢీకొట్టి బెహరా ఎగిరి పట్టాలు పక్కనే పడి ప్రాణాలు విడిచింది. రైలు కిందపడిన సంధ్యారాణి శరీరం ఛిద్రమై ప్రాణాలు కోల్పోయింది. -
పోలీసులు కౌన్సెలింగ్కు పిలిచారని..
బౌద్ధనగర్: పోలీసులు కౌన్సెలింగ్కు పిలవడంతో ఆందోళనకు గురైన ఓ వ్యక్తి ఉరి వేసుకుని అత్మహత్యకు పాల్పడిన సంఘటన వారాసిగూడ పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అడ్మిన్ ఎస్సై సుధాకర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రాంనగర్ రామాలయం ప్రాంతానికి చెందిన మచ్చ శ్రీకాంత్ (32) ముషీరాబాద్ జీహెచ్హెంసీ సర్కిల్లో కాంట్రాక్టు పారిశుద్ధ్య కారి్మకుడిగా పని చేస్తున్నాడు. అతడి భార్య శృతి క్యాటరింగ్లో పని చేస్తుంది. గత కొన్నాళ్లుగా మద్యానికి బానిసైన శ్రీకాంత్ తరచూ భార్యతో గొడవ పడుతున్నాడు. ఈ నెల 13న ఆమె మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో 16న కౌన్సెలింగ్కు హాజరుకావాలని పోలీసులు శ్రీకాంత్కు సమాచారం అందించారు. దీంతో భయాందోళనకు గురైన శ్రీకాంత్ ఆదివారం చున్నీతో ఉరేసుకుని అత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిని గుర్తించిన అతడి తండ్రి స్థానికుల సహాయంతో కిందకు దించి 108కు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది అతడిని పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి తండ్రి లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వాజేడు ఎస్సై ఆత్మహత్యకు అనూషే కారణం
వాజేడు: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ములుగు జిల్లా వాజేడు ఎస్సై హరీశ్ ఆత్మహత్య కేసు మిస్టరీ వీడింది. ఎస్సై ఆత్మహత్యకు కారణమైన యువతిని శనివారం అరెస్టు చేసినట్టు వెంకటాపురం(కె) సీఐ బండారి కుమార్ వెల్లడించారు. ఈ మేరకు కేసు వివరాలు, అరెస్ట్ చూపిన ఫొటోలను మీడియాకు ఒక ప్రకటన రూపంలో పంపారు. వాజేడు ఎస్సై రుద్రారపు హరీశ్(29) ఈ నెల 2వ తేదీ తెల్లవారుజామున తన సర్వీస్ పిస్టల్తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అదేరోజు అతని తల్లిదండ్రులు రుద్రారపు రాములు, మల్లికాంబలు వాజేడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసును ఛేదించడానికి దర్యాప్తు ముమ్మరం చేశారు. పూర్తి ఆధారాలను పోలీసులు, క్లూస్టీమ్ సభ్యులు సేకరించారు. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం దుదియతండాకు చెందిన బానోత్ అనసూర్య (అనూష) కారణమని గుర్తించారు. ఈ మేరకు ఆమెను వెంకటాపురం(కె) సీఐ బండారి కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు అరెస్టు చేశారు. పెళ్లి చేసుకోవాలని..అనూష హైదరాబాద్లోని వీబీఐటీ కాలేజీలో అడ్మిన్ స్టాఫ్గా పనిచేస్తోంది. ఏడు నెలల క్రితం రాంగ్ నంబర్ కాలింగ్ ద్వారా వాజేడు ఎస్సై రుద్రారపు హరీశ్ను అనూష పరిచయం చేసుకుంది. ఎస్సై కావడంతో అతడిని పెళ్లి చేసుకుంటే జీవితం బాగుంటుందని భావించింది. తరచూ ఫోన్ చేసి సాన్నిహిత్యం పెంచుకోవడంతోపాటు పెళ్లికి ఒప్పించాలని నిర్ణయానికి వచ్చింది. ఆ దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేసి తనను పెళ్లి చేసుకోకపోతే శారీరకంగా వాడుకున్నట్టు మీడియాతోపాటు పైఅధికారులకు ఫిర్యాదు చేస్తానని బ్లాక్ మెయిల్ చేయడంతోపాటు బెదిరించింది. ఇలా ఎస్సై హరీశ్పై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చింది. ఈ క్రమంలో ఈ నెల 1వ తేదీ రాత్రి వాజేడు మండలం పూసూరు గ్రామ సమీపంలోని గోదావరి బ్రిడ్జి వద్ద ఉన్న ఓ రిసార్ట్లో హరీశ్తోపాటు అనూష ఉన్నారు. తనను పెళ్లి చేసుకోవాలి లేదా చచ్చిపోవాలని ఒత్తిడి తెచ్చింది. దీంతో భావోద్వేగానికి లోనైన హరీశ్.. 2వ తేదీ తెల్లవారుజామున ఆమెను బయటకు పంపి తన సర్వీస్ రివాల్వర్తో గదువ కింది భాగంలో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి ఆధారాలను సేకరించిన పోలీసులు అనూష ప్రమేయం ఉండడంతో ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చనున్నట్టు వెల్లడించారు. -
అనుమానంతో ఉన్మాదిలా మారాడు
గన్పౌడ్రీ: ఇల్లాలిపై అనుమానంతో ఉన్మాదిగా మారాడు ఓ భర్త. కట్టుకున్న భార్యను, కన్న కొడుకును చంపేసి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన బేగంబజార్ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. అబిడ్స్ ఏసీపీ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్కు చెందిన ఎండీ సిరాజ్ (38), ఏలియా (35) దంపతులు. వీరికి నాలుగు, మూడేళ్ల వయసున్న ఇద్దరు కుమారులు ఆజాన్, హైజాన్ ఉన్నారు. ఈ కుటుంబం కొన్నేళ్ల క్రితం ఉపాధిని వెతుక్కుంటూ నగరానికి వలస వచి్చంది. బేగంబజార్లోని తోపుఖాన్పేటలో అద్దె ఇంటిలో ఉంటోంది. సిరాజ్ సమీపంలోని ఓ గాజుల దుకాణంలో పని చేస్తున్నాడు. అతడు తన భార్య ప్రవర్తనపై కొన్నాళ్లుగా అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి దంపతుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ గొడవ శుక్రవారం తెల్లవారుజాము సుమారు 4 గంటల దాకా కొనసాగింది. ఈ నేపథ్యంలోనే కోపోద్రిక్తుడైన సిరాజ్ ఇంట్లోని కత్తితో భార్య ఏలియా గొంతు కోసి చంపేశాడు. అనంతరం చిన్న కుమారుడు హైజాన్ (3) గొంతు నులిమి హత్య చేశాడు. తమ్ముడిని తండ్రి చంపుతున్న దృశ్యాన్ని చూసిన పెద్ద కుమారుడు ఆజాన్ ప్రాణ భయంతో అరుస్తూ బయటకు పారిపోయాడు. స్థానికులు వెంటనే స్పందించి ఇంటి లోపలికి వెళ్లి చూడగా సిరాజ్ అప్పటికే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే వారు డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. బేగంబజార్ ఠాణా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఉత్తరప్రదేశ్లోని మృతుడి బంధువులకు సమాచారం అందించారు. తన భార్య ఏలియా మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో సిరాజ్ ఇంతటి దారుణానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రతి రెండేళ్లకోసారి వీరు స్వగ్రామానికి వెళ్లి వస్తుంటారని, ఇటీవలే అక్కడికి వెళ్లి వచి్చనట్లు చెప్పారు. ఘటనా స్థలంలో సిరాజ్ రాసిన సూసైడ్ నోట్ లభించిందని, మృతదేహాలను ఉత్తరప్రదేశ్లోని తమ గ్రామానికి తరలించాలని సిరాజ్ అందులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. -
పురుషుల ప్రాణాలూ ముఖ్యమే
బెంగళూరు: ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బెంగళూరు టెక్కీ సోదరుడు భావోద్వేగంతో ప్రకటన చేశారు. మహిళల ప్రాణాలు ఎంత ముఖ్యమో పురుషుల ప్రాణాలూ అంతే ముఖ్యమని, పురుషుల రక్షణ కోసమూ చట్టం చేయాలని భారత ప్రభుత్వాన్ని కోరారు. తన సోదరుడి ఆత్మహత్య సంఘటన తీవ్రత ఉన్నప్పటికీ, ఈ కేసులో ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వేధింపులు అనుభవిస్తున్న పురుషుల కోసం చట్టాలు రూపొందించాలన్నారు. ‘నా సోదరుడికి న్యాయం చేయాలి. పురుషులు కూడా వేధింపులకు గురవుతున్నారు. వారి కోసం కూడా చట్టాలు చేయాలి. ఈ విషయాన్ని భారత ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. స్త్రీ ప్రాణం ఎంత ముఖ్యమో పురుషుడి ప్రాణాలు కూడా అంతే ముఖ్యం. ఈ కేసులో ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదు. చట్టపరంగా ముందుకెళ్తాం’అని తెలిపారు. సుభాష్ను అత్తమామలు చిత్రహింసలకు గురిచేస్తున్నారని తమకు తెలుసని, కానీ అతను ఇలాంటి చర్యకు పాల్పడతాడని తాము ఊహించలేదని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా... భార్య, ఆమె కుటుంబ సభ్యుల వేధింపుల కారణంగానే బెంగళూరు టెక్కీ ఆత్మహత్యకు పాల్పడినట్లు వైట్ ఫీల్డ్ డీసీపీ శివకుమార్ ధ్రువీకరించారు. ‘అతనిపై ఉత్తరప్రదేశ్లో పలు కేసులు నడుస్తున్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి అతని భార్య, ఆమె కుటుంబ సభ్యులు అతని నుంచి డబ్బు డిమాండ్ చేశారు. ఆ కారణాలతోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ మేరకు మారతహళ్లి ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. దర్యాప్తు కొనసాగుతోంది’అని ఆయన వెల్లడించారు. ఛితాభస్మాన్ని కలపొద్దు డిసెంబర్ 9న బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ 34 ఏళ్ల అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకున్నారు. చనిపోవడానికి ముందు ఆయన 24 పేజీల సూసైడ్ నోట్ రాశారు. ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్ ఫ్యామిలీ కోర్టు జడ్జి తన వాదనను వినడం లేదని, కోర్టులోని ఓ అధికారి జడ్జి ముందు లంచం తీసుకున్నారని ఆయన ఆరోపించారు. తాను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించిన సంఘటనలను ఆయన పూసగుచ్చినట్లు వివరించారు. భార్య నికిత తనపై హత్య, లైంగిక వేధింపులు, డబ్బు కోసం వేధించడం, గృహ హింస, వరకట్నం సహా తొమ్మిది కేసులు పెట్టిందని సుభాష్ తన సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. తన నాలుగేళ్ల కుమారుడిని తనకు దూరంగా ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. తన బిడ్డను తన తల్లిదండ్రులకు అప్పగించాలని కోరారు. న్యాయం జరిగేవరకు తన చితాభస్మాన్ని నిమజ్జనం చేయొద్దని కుటుంబ సభ్యులను కోరుతూ సుభాష్ ఓ వీడియోను రికార్డు చేశారు. మృగంలా ప్రవర్తించారు: నికిత ఆరోపణ ఆత్మహత్యపై నేపథ్యంలో 2022లో అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసిన వివరాలు బయటకొచ్చాయి. జౌన్పూర్కు చెందిన నికితకు 2019లో బిహార్కు చెందిన సుభాష్తో వివాహం జరిగింది. వీరు బెంగళూరులో ఉంటూ అక్కడే పనిచేసేవా రు. తన భర్త అతుల్ తనను కొట్టేవాడని, భార్యాభర్తల సంబంధం విషయంలో మృగంలా ప్రవర్తించేవాడని నికితా సింఘానియా ఫిర్యాదులో పేర్కొన్నారు. పెళ్లిలో ఇచి్చన కట్నంతో సంతృప్తి పొందక మరో 10 లక్షలు డిమాండ్ చేశారన్నారు. కట్నంకోసం తనను శారీరకంగా, మానసికంగా హింసించారని పేర్కొన్నారు. తన తల్లిదండ్రులకు చెబితే సర్దుకుని పోవాలని సూచించేవారని ఫిర్యాదులో వెల్లడించారు. అయినా పరిస్థితి మెరుగుపడలేదని, మద్యం తాగి భర్త తనను కొట్టడం ప్రారంభించాడని, బెదిరించి తన జీతం మొత్తాన్ని అతని ఖాతాకు బదిలీ చేసుకునేవారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. తన అత్తామామలు పదేపదే వేధించడం వల్లే తన తండ్రి ఆరోగ్యం క్షీణించిందని, 2019 ఆగస్టు 17న గుండెపోటుతో మరణించారని ఆమె తెలిపారు. -
మాయలేడి.. జగత్ కిలాడి!
సాక్షి ప్రతినిధి, వరంగల్: ములుగు జిల్లా వాజేడు ఎస్ఐ రుద్రారపు హరీశ్ మృతికి కారణమైన యువతిపై ఆరా తీస్తున్న పోలీసులకు, నిఘావర్గాలకు విస్తుపోయే విషయాలు వెల్లడవుతున్నాయి. యువతి గత మూడేళ్లలో ప్రేమ పేరిట ట్రాప్ చేసిన వారిలో ఎస్ఐ హరీశ్ నాలుగో వ్యక్తిగా చెబుతున్నారు. పూర్వ నల్లగొండ జిల్లా సూర్యాపేట ప్రాంతానికి చెందిన యువతి స్కెచ్ వేస్తే చాలు.. ఎదుటివారికి దిమ్మతిరిగి పోవాల్సిందే. కొంతకాలం హైదరాబాద్ హయత్నగర్ ప్రాంతంలోని ఓ హాస్టల్లో ఉంటూ ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్ ద్వారా పలువురిని ఆకట్టుకుని, ఆపై వారిని అష్టకష్టాలు పెట్టినట్లు ఒక్కొక్కొటిగా విషయాలు బయటకొస్తున్నాయి. ఇప్పటికే ఆ యువతిపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఐదు కేసులు నమోదైనట్లు సమాచారం. ముగ్గురిపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు కావడానికి కారణంతో పాటు ఓ ఎస్ఐ, మరో న్యాయమూర్తిపై ప్రైవేట్ కంప్లయింట్ చేయడం పూర్వ నల్లగొండ జిల్లాలో అప్పట్లో సంచలనంగా మారింది. విజయనగరానికి చెందిన ఓ యువకుడిపై సూర్యాపేట జిల్లాతో పాటు హయత్నగర్లోనూ తనను ప్రేమించి మోసం చేసినట్లుగా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అన్నీ గుర్తించే దూరం పెట్టిన హరీశ్? కొద్దిరోజులుగా ఇన్స్ట్రాగామ్ ద్వారా చిట్చాట్ చేసిన ఎస్ఐ హరీశ్.. ఆమె గురించి పలు విషయాలు తెలిశాకే దూరం పెట్టారన్న చర్చ జరుగుతోంది. తనకున్న సోర్స్ ద్వారా ఆమె ప్రవర్తన తెలుసుకున్న హరీశ్ ఆమెను దూరం పెట్టారని మరో వాదన వినిపిస్తున్నది. అయితే ఇటీవల హరీశ్కు హనుమకొండ ప్రాంతానికి చెందిన ఓ యువతితో సంబంధం కుదిరి ఈనెల 14న నిశి్చతార్థం కూడా జరగబోతున్నదని తెలుసుకున్న సదరు యువతి మళ్లీ వెంటబడినట్లు సమాచారం. ఇదే క్రమంలో ఈనెల 1న నేరుగా వాజేడు పోలీసుస్టేషన్కే చేరుకున్న ఆమె.. హంగామా చేసి పరువు తీసే ప్రయత్నాన్ని హరీశ్ పసిగట్టాడు. ఈ క్రమంలో రాజీ ప్రయత్నాలు చేసినా కుదరలేదు. దీంతో ఆ మాయలేడి పన్నాగంలో చిక్కుకుని విలవిల్లాడిన హరీశ్.. ప్రాణంకంటే పరువుకే అధిక ప్రాధాన్యం ఇచ్చి తనువు చాలించడం అందరినీ కలచి వేసింది. కాగా, తమ కుమారుడి ఆత్మహత్యపై తమకు అనుమానాలు ఉన్నాయని, ఆ యువతిని విచారించి న్యాయం చేయాలని హరీశ్ తండ్రి రుద్రారపు రాములు తాజాగా పోలీసు అధికారులను కోరారు. ఇదే సమయంలో హరీశ్ సోదరుడు, సీఆర్పీఎఫ్లో ఎస్ఐగా పనిచేస్తున్న కుమారస్వామి కూడా గురువారం పోలీసు ఉన్నతాధికారులను కలిసి తన సోదరుడి ఆత్మహత్యపై విచారణ జరిపి దోషులను శిక్షించాలని విజ్ఞప్తి చేశారు. -
ఒత్తిడే శత్రువై.. మృత్యువై..
సాక్షి, హైదరాబాద్: మార్కులు తక్కువ వచ్చాయని ఆత్మహత్య.. అమ్మ తిట్టిందని.. సూసైడ్.. సెల్ఫోన్ కొనివ్వలేదని.. టీచర్ మందలించారని బలవన్మరణం.. ఇలా ప్రతిదానికీ చనిపోవడమే శరణ్యమని భావిస్తున్నారు ప్రస్తుత విద్యార్థులు. ముఖ్యంగా మార్కులు తక్కువ వచ్చాయని, ఎంత చదివినా గుర్తుండట్లేదని.. ఇలా పలు కారణాలతో సూసైడ్ చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇటీవల నగరంలో ఇంటర్మీడియట్ విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్య చేసుకోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఒత్తిడిని భరించలేక.. సాధారణంగా పలు కాలేజీల్లోని హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న పిల్లలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని మానసిక నిపుణులు చెబుతున్నారు. తల్లిదండ్రులకు దూరంగా ఉండటం.. ఒంటరితనంతో బాధపడుతుండటం.. వేరే వారితో వెంటనే కలవలేకపోవడం వంటి కారణాలతో ఇలాంటి సమస్యలు పెరుగుతున్నాయని పేర్కొంటున్నారు. ఇక, హాస్టళ్లలో ఉండే వారికి ఎప్పుడూ చదువు గురించే చెబుతుండటం.. విశ్రాంతి లేకుండా ఉదయం నుంచి రాత్రి వరకు స్టడీ అవర్స్, క్లాసులు, హోంవర్కు.. రాత్రి చాలా ఆలస్యంగా పడుకొని, ఉదయమే నిద్రలేచి మళ్లీ క్లాసులు ఇలా తీవ్ర ఒత్తిడి తెస్తుంటారని, అందుకే విద్యార్థుల్లో తెలియని నైరాశ్యం ఏర్పడుతోందని అంటున్నారు. రోజంతా వేరే వాళ్లు చెప్పింది వినడమే తప్ప తమ సొంత ఆలోచనలు కూడా చేయలేని పరిస్థితుల్లో మానసికంగా కుంగిపోతుంటారు. మార్కుల గోల.. పోల్చడం సబబేనా? కాలేజీల్లో పెట్టే పరీక్షల వేళ.. మార్కుల విషయంలో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారు. అంతేకాకుండా వేరే వారితో పోల్చడంతో మరింత నిరాశకు లోనై.. తనకు చదువు రాదని, ఎంత చదివినా గుర్తుండదని ఆత్మ న్యూనతా భావంతో బాధపడుతుంటారు. ఆ సమయంలో ఒకవేళ మార్కులు తక్కువ వచ్చాయని ట్యూటర్ కానీ టీచర్ కానీ మందలిస్తే దారుణమైన నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉండది. ఇతరులతో పోల్చడం సరికాదు.. తల్లిదండ్రులు, టీచర్లు, మెంటార్లు, బంధువులు కూడా మార్కులు ముఖ్యమని చెబుతుండటం.. అందుకోసం తీవ్రంగా కష్టపడ్డా కూడా మార్కులు రాకపోవడంతో తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారు. అయితే మానసిక స్థైర్యం, మైండ్సెట్ అనేది మార్కుల కన్నా ముఖ్యమని ఎవరూ చెప్పరు. పాజిటివిటీ నింపాల్సిన వారు కూడా ఎప్పుడూ తెలియకుండానే ఒత్తిడి తీసుకొచ్చేలా మాట్లాడటం అస్సలు చేయకూడదని మానసిక నిపుణులు చెబుతున్నారు. వేరే వారితో పోల్చడం, తక్కువ చేసి మాట్లాడటం, బ్లేమ్ చేస్తుండటం వల్ల వారిలోని శక్తిసామర్థ్యాలు మరింత తగ్గుతాయి. ప్రేమతో అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేయకుండా, కరుకుగా మాట్లాడుతుండటం వల్ల ఆత్మన్యూనత పెరుగుతుంది. గది వాతావరణం గుంపులు గుంపులుగా.. ఎప్పుడూ చదువుకుంటూ ఒకే గదిలో వెలుతురు లేని ప్రాంతాల్లో ఒకే దగ్గర ఉండటంతో మానసికంగా ఇబ్బంది. స్ట్రెస్ వచ్చేలా వాతావరణం.. ప్రశాంతత ఉండకపోవడంతో కుంగిపోయి ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచిస్తుంటారు. మెడిటేషన్తో ప్రశాంతత ప్రశాంతమైన వాతావరణంలో విద్యార్థులు ఉండేలా చూడాలి. ఉదయమే యోగా లేదంటే మెడిటేషన్ చేస్తుండాలి. కనీస శారీరక వ్యాయమం చేసినా కూడా శరీరంతో పాటు మానసిక ఆరోగ్యం చేకూరుతుంది. ఇక, సరైన ఆహారం తీసుకోకపోవడంతోనూ మానసిక దృఢత్వంతో ఉండరు. ప్రశాంత వాతావరణం కల్పించాలి విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో ఉండేలా చూడాలి. ప్రకృతికి దగ్గరగా ఉండేలా చూడాలి. చదువు మాత్రమే కాకుండా వారిలో ఉన్న నైపుణ్యాలను గుర్తించి, ఆ దిశగా ప్రోత్సహించాలి. వారానికోసారి మానసిక ఎదుగుదలకు సంబంధించి.. ఆత్మన్యూనతను తగ్గించేందుకు క్లాసులు పెట్టాలి. సృజనాత్మకత పెంపొందించేలా విద్యార్థులను ప్రోత్సహించాలి. వ్యక్తిగత లక్ష్యాలపై దృష్టి సారించేలా.. వాటిని సాధించే దిశగా కృషి చేసేలా ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలి. – డాక్టర్ కృష్ణ ప్రసాద్ దేవరకొండ, సైకాలజిస్టు, న్యూరో మైండ్సెట్ కోచ్ -
భవనంపై నుంచి దూకి ప్రేమికుల ఆత్మహత్య
సాక్షి,విశాఖపట్నం:గాజువాక అక్కిరెడ్డిపాలెంలో ప్రేమికుల ఆత్మహత్య కలకలం రేపింది. మంగళవారం(డిసెంబర్3) తెల్లవారుజామున వెంకటేశ్వర కాలనీలోని అపార్ట్మెంట్ మూడవ అంతస్తు పైనుంచి దూకి యువ జంట ఆత్మహత్య చేసుకుంది.మృతులను పిల్లి దుర్గారావు,సాయి సుష్మితలుగా గుర్తించారు. ఇద్దరూ అమలాపురానికి చెందినవారేనని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.ఇదీ చదవండి: ఏం కష్టం వచ్చింది తల్లీ.. -
నటి శోభిత సూసైడ్ నోట్ లభ్యం..
-
ములుగు జిల్లా వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్య
-
TG: తుపాకీతో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్య
సాక్షి,ములుగు: వాజేడు మండల ఎస్ఐ రుద్రారపు హరీష్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం(డిసెంబర్2) ఉదయం వెలుగు చూసింది. పూసూరు గోదావరి బ్రిడ్జి సమీపంలోని ఫెరిడో రిసార్ట్లో హరీష్ తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం ఉదయం రిసార్ట్ గదిలోకి ఒంటరిగా వెళ్లిన ఎస్ఐ రాత్రి వరకు కూడా బయటికి రాకపోవడంతో అక్కడి సిబ్బంది వేచి చూశారు. ఉదయం ఫెరిడో రిసార్ట్ సిబ్బంది గదిలోకి వెళ్ళి చూడగా విగత ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్న విషయం బయటపడింది. వెంటనే ఈ విషయాన్ని వాజేడు పోలీసులకు ఫెరిడో రిసార్ట్ సిబ్బంది తెలియజేశారు. ప్రేమ వ్యవహారమే కారణమా..?సోమవారం ఉదయం 6 గంటలకు తన డ్రైవర్కు ఫోన్ చేసిన ఎస్సై హరీశ్ తనను హోటల్ నుంచి పిక్ అప్ చేసుకొమని చెప్పారు. డ్రైవర్ హోటల్కు వచ్చేేసరికే తుపాకీతో కాల్చుకుని హరీశ్ మృతి చెందాడు. ఉదయం హోటల్లో హరీష్, మరో అమ్మాయి గొడవపడినట్లు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. తనను వదలిపెట్టాలని హరీశ్ ఎంత బతిమిలాడినా అమ్మాయి వినకపోవడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. హరీష్కు ఇంట్లో ఇటీవలే పెళ్లి సంబంధాలు చూస్తుండడంతో ఎటూ తేల్చుకోలేక అతడు మానసికఒత్తిడికి గురైనట్లు పోలీసులు భావిస్తున్నారు. -
సినీ ఇండస్ట్రీలో విషాదం..
-
విషాదం.. అనుమానాస్పదస్థితిలో బుల్లితెర నటి ఆత్మహత్య
సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో కన్నడ బుల్లితెర నటి ఆత్మహత్య చేసుకుంది. పలు కన్నడ సీరియల్స్లో నటించిన ఆమె సూసైడ్కు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం శోభిత మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.(ఇది చదవండి: నాలుగు పెళ్లిళ్లు కాదు.. నాది రెండోపెళ్లి మాత్రమే.. నటుడు యూటర్న్)కన్నడ సీరియల్స్లో నటిస్తోన్న శోభిత తన భర్తతో కలిసి గచ్చిబౌలిలోని శ్రీరాంనగర్ కాలనీలో నివాసం ఉంటోంది. అయితే శోభిత మృతిపై కారణాలను ఆమె కుటుంబసభ్యులు వెల్లడించలేదు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇంట్లోనే సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే తన పెళ్లి తర్వాత సినిమాలకు, సీరియల్స్కు శోభిత. దూరంగా ఉంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శోభిత మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.బ్రహ్మగంతు సీరియల్తో గుర్తింపు శాండల్వుడ్లో బ్రహ్మగంతు సీరియల్ ద్వారా శోభిత శివన్న పాపులారిటీ తెచ్చుకుంది. గతేడాది మే 22న పెళ్లి చేసుకున్న శోభిత ఆ తర్వాత బుల్లితెరకు దూరమైంది. అయితే తన పెళ్లి ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేయలేదు.కర్ణాటకలోని సకలేష్పూర్కి చెందిన శోభిత మొదట్లో రాజ్ మ్యూజిక్ ఛానల్లో వీజేగా పనిచేసింది. ఆ తర్వాత మంచి ఆర్టిస్ట్గా సినిమాలతో పాటు బుల్లితెరపై తనదైన ముద్ర వేసింది. కన్నడ సీరియల్ బ్రహ్మగంతులో విలన్ పాత్రలో మెరిసిన శోభిత.. నీనిదలే అనే సీరియల్లో కూడా నటించింది. అంతేకాకుండా ఇతర భాషా సీరియల్స్లో కూడా కనిపించింది. బుల్లితెరతో పాటు అటెంప్ట్ టు మర్డర్, జాక్పాట్ సినిమాల్లోనూ నటించింది. కన్నడలో శతభిషే అనే సినిమాలో కూడా కీలక పాత్ర పోషించింది. ఆమె మరణంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులు షాకింగ్కు గురయ్యారు. -
విడిపోవడం ఆత్మహత్యకు ప్రేరేపించడం కాదు
న్యూఢిల్లీ: ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న బంధం విచ్ఛిన్నమై వారిలో ఒకరు ఆత్మహత్యకు పాల్పడితే.. ఆ బంధం విడిపోవడమే ఆ ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు పరిగణించలేమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఇద్దరి మధ్య సంబంధం తెగిపోవడం అనేది నేరం కాదని, అందుకు శిక్ష విధించలేమని స్పష్టంచేసింది. సెక్షన్ ప్రకారం 306 ప్రకారం ఉద్దేశపూర్వకంగా ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు నిర్ధారణ అయితేనే శిక్ష విధించగలమని వెల్లడించింది. ఒక వ్యక్తికి ఐదేళ్ల జైలుశిక్ష విధిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. కర్ణాటకకు చెందిన కమ్రుద్దీన్ దస్తగిర్ సనాదీ, మరో మహిళ ఎనిమిదేళ్లపాటు సహజీవనం చేశారు. 2007 ఆగస్టులో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కమ్రుద్దీన్ అరెస్టయ్యాడు. అతడిౖపై ఐపీసీ సెక్షన్ 417(మోసం), సెక్షన్ 306(ఆత్మహత్యకు పురికొల్పడం), సెక్షన్ 376(అత్యాచారం) కింద కేసు నమోదు చేశారు. కమ్రుద్దీన్ నిర్దోషి అని గుర్తిస్తూ కింది కోర్టు తీర్పు ఇచ్చింది. సవాల్ చేస్తూ పోలీసులు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కమ్రుద్దీన్ను దోషిగా తేల్చింది. ఐదేళ్లపాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. రూ.25 వేల జరిమానా సైతం విధించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ అతడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఇది బంధం విడిపోయిన కేసు తప్ప నేరం కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. -
కన్సల్టెన్సీ ఆఫీస్లో లా విద్యార్థిని ఆత్మహత్య
మలక్పేట: ఎల్ఎల్బీ చదువుతున్న ఓ గిరిజన విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మలక్పేట పరిధిలో ఆదివారం రాత్రి జరిగింది. మృతురాలి తల్లిదండ్రులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం తక్రాజ్గూడ తండాకు చెందిన ఇస్లావత్ రమేశ్– కంసీ దంపతులకు శ్రావ్య(20), శ్రుతి, సాయికిరణ్ సంతానం. శ్రావ్య ఎల్బీనగర్లోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ ఎన్టీఆర్నగర్ మహాత్మాగాంధీ లా కాలేజీలో మూడో సంవత్సరం చదువుతోంది. మలక్పేటలోని నందిని రెసిడెన్సీలో నవీన్, విజయ్లు జయదుర్గా ఎడ్యుకేషన్స్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నారు. శ్రావ్య మూడు నెలలుగా నవీన్ వద్ద పనిచేస్తోంది. ఆదివారం కన్సల్టెన్సీకి వెళ్లిన శ్రావ్య సాయంత్రం తన తమ్ముడు సాయికిరణ్కు ఫోన్ చేసి రూ.20 వేలు ఫోన్ పే చేయాలని కోరింది. సాయికిరణ్ మనీ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత శ్రావ్యకు ఫోన్ చేయగా ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు.దీంతో అతను హాస్టల్లో శ్రావ్యతోపాటు ఉంటున్న శిరీషకు ఫోన్ చేశాడు. దీంతో శిరీష తన స్నేహితురాలైన సోనికి విషయం చెప్పింది. దీంతో సోనీ తన స్నేహితుడైన కార్తీక్తో కలిసి కన్సల్టెన్సీకి వెళ్లింది. పక్క ఫ్లాట్లో ఉన్న రవీందర్, గ్రౌండ్ఫ్లోర్లో ఉన్న మరో మహిళతో కలిసి ఆఫీస్రూమ్ వద్దకు వెళ్లారు. ఆఫీసురూమ్ బయట శ్రావ్య చెప్పులు ఉండటం గమనించారు. వారు తలుపులు తీసి లోపలికి వెళ్లడానికి ప్రయత్నించారు. లోపలి నుంచి గడియపెట్టి ఉండటంతో అది సాధ్యం కాలేదు. కిటికీలో నుంచి చూడగా శ్రావ్య సీలింగ్ ఫ్యాన్కు స్కార్ఫ్తో ఉరేసుకొని కనిపించింది.దీంతో తలుపులు పగులగొట్టి శ్రావ్యను కిందకు దించారు. రవీందర్ కారులో మలక్పేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా, శ్రావ్య మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోస్ట్మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులు స్వగ్రామానికి తీసుకెళ్లారు. ఎస్సై సురేశ్ అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆందోళనకు దిగిన గిరిజన సంఘాలు శ్రావ్య మరణవార్త తెలుసుకున్న గిరిజన సంఘాలు, మృతురాలి బంధువులు సోమవారం పెద్ద సంఖ్యలో మలక్పేట పీఎస్ వద్దకు చేరుకొని ధర్నా చేశారు. అనంతరం కన్సల్టెన్సీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. అనంతరం జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా గిరిజన సంఘాల నాయకులు మాట్లాడుతూ ఆదివారం సెలవురోజు కన్సల్టెన్సీ నిర్వాహకుడు నవీన్ కార్యాలయానికి శ్రావ్యను ఎందుకు పిలిపించారని ప్రశ్నించారు. శ్రావ్యపై అత్యాచారం చేసి హత్య చేశారని, చున్నీతో ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపించారు. పోలీసులు మృతురాలి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండానే మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారన్నారు. కన్సల్టెన్సీ నిర్వాహకులపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విచారణ కొనసాగుతోంది గిరిజన విద్యార్థి మృతి చెందిన విషయంపై ఆదివారం రాత్రి మలక్పేట పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే ఇన్స్పెక్టర్ నరేష్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కన్సల్టెన్సీ నిర్వాహకులు నవీన్, విజయ్ని అదుపులోకి తీసుకున్నాం. శ్రావ్యను ఆస్పత్రికి తరలించిన కార్తీక్, సోనిలను కూడా విచారిస్తాం. క్లూస్ టీమ్ కన్సల్టెన్సీ కార్యాలయాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించింది.నిçష్పక్షపాతంగా విచారణ కొనసాగుతుంది. – శ్యామ్సుందర్, మలక్పేట ఏసీపీ -
ఆర్టీసీ బస్సులో విషాదం
-
ఇంటర్ విద్యార్థి అనుమానాస్పద మృతి
మియాపూర్: మియాపూర్ పరిధి మాతృశ్రీనగర్ కాలనీలోని ఓ కార్పొరేట్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. బాధితులు, పోలీసులు తెల్పన మేరకు..షాద్నగర్కు చెందిన గౌరిశెట్టి శ్రీనివాస్, మాధవి దంపతుల కుమారుడు కౌశిక్ రాఘవ (17) ఈ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ ఫస్టియర్ చదువుతూ కళాశాల హాస్టల్లో ఉంటున్నాడు. ప్రతి రోజు మాదిరిగానే కౌశిక్ శుక్రవారం రాత్రి 10 గంటలకు స్టడీ అవర్ పూర్తిచేసుకుని స్నేహితులతో కలిసి గదికి వెళ్లాడు. అక్కడ 11 గంటల వరకు స్నేహితులతో కలిసి గేమ్స్ ఆడుకున్నారు. ఆ తర్వాత నిద్రించేందుకు ఎవరి గదికి వారు వెళ్లిపోయారు. 10వ తరగతి స్నేహితులను మిస్ అవుతున్నానని, వారు ఇప్పుడు తనతో మాట్లాడడం లేదని స్నేహితుడు ఫరూఖ్తో చెబుతూ బాధపడ్డాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం 5:15 గంటల ప్రాంతంలో ప్రతిరోజు మాదిరిగానే కళాశాల వార్డెన్ విద్యార్థులను నిద్రలేపుతుండగా 238 నంబర్ గదిలో రాఘవ బెడ్పై మెడకు తాడుతో పడి ఉన్నాడు. వెంటనే కళాశాల సిబ్బంది దగ్గర్లో ఉన్న ల్యాండ్ మార్క్ ఆసుపత్రికి ద్విచక్రవాహనంపై తీసుకువెళ్లారు. అక్కడి డాక్టర్లు పరిశీలించి విద్యార్థి మృతి చెందాడని తెలిపారు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి గాంధీ ఆసుపత్రికి తరలించామని తెలిపారు. కళాశాల నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే కౌశిక్ మృతి చెందాడని, కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, మాకు న్యాయం చేయాలని విద్యార్థి తల్లి మాధవి మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కౌశిక్ ఆత్మహత్య చేసుకోలేదన్నారు. మృతిపై అనుమానం ఉందని పేర్కొన్నారు. కాగా కళాశాల ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే విద్యార్థి మృతి చెందాడని ఆరోపించారు. -
అమ్మా.. నీకు భారమయ్యా.. క్షమించు!
శివ్వంపేట(నర్సాపూర్): జులాయిగా తిరుగుతున్న కుమారుడిని తల్లి మందలించడంతో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. మండల పరిధి దంతన్పల్లి గ్రామానికి చెందిన కుల్ల లక్ష్మీ నర్సింలు దంపతులకు సంతానం కలగకపోవడంతో ఓ బాబుని దత్తత తీసుకున్నారు. కొన్నేళ్ల తర్వాత దంపతులకు కూతురు పుట్టింది. పిల్లలు చిన్నతనంలోనే నర్సింలు మృతి చెందాడు. అప్పటి నుంచి లక్ష్మీ కూలి పనులు చేసుకుంటూ దత్తత కుమారుడు వెంకటేశ్(24)తోపాటు కూతురు అఖిలను పోషిస్తుంది. కుమారుడు ఎలాంటి పనులు చేయకుండా జులాయిగా తిరుగుతుండటంతో తల్లి గురువారం మందలించింది. ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన అతడు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికారు. శుక్రవారం ఉదయం గ్రామ శివారులో చెట్టుకు ఉరి వేసుకొని కనిపించాడు. అమ్మ నన్ను క్షమించు నీకు భారమయ్యాను. నా చావుకు కారణం ఎవరు కాదు. నీవు, చెల్లి ఆనందంగా ఉండండి అంటూ రాసిన సూసైట్ నోట్ మృతుడి జేబులో లభ్యమైంది. మృతుడు తల్లి లక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు.ఉరేసుకొని వ్యక్తి..సిద్దిపేటరూరల్: చెట్టుకు ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నారాయణరావుపేట మండల పరిధిలోని జక్కాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. చిన్నకోడూరు ఎస్ఐ బాలక్రిష్ణ కథనం మేరకు.. జక్కాపూర్ గ్రామానికి చెందిన కారంకంటి రాజు (32) కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రాజుకు నాలుగేళ్లుగా మానసిక స్థితి సక్రమంగా లేదు. ఆస్పత్రుల్లో వైద్యం చేయించినప్పటికీ ఫలితం లేదు. శుక్రవారం ఉదయం పొలం వద్దకు వెళ్తున్నానని వెళ్లి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
కొండారెడ్డి పల్లి మాజీ సర్పంచ్ ఆత్మహత్య
సాక్షి, నాగర్ కర్నూల్ జిల్లా: వంగూరు మండలం కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ ఆత్మహత్యకు పాల్పడటం వెనుక.. ఇటీవల గ్రామంలో నూతనంగా నిర్మించబడిన పశు వైద్యశాల ప్రహరీ గోడ నిర్మాణమేనని సమాచారం.పశు వైద్యశాల వెనకాలే సాయిరెడ్డి ఇల్లు ఉండగా, ఆయన ఇంటికి దారి లేకుండా పశు వైద్యశాల ప్రహరీ గోడను నిర్మించారంటూ వివాదం నెలకొంది. దీంతో మనస్తాపానికి గురైన సాయి రెడ్డి కల్వకుర్తి వచ్చి పురుగుల మందు తాగాడు. అదే సమయంలో పెట్రోలింగ్ పోలీసులు గమనించి ఆసుపత్రికి తరలించే లోపు సాయిరెడ్డి మృతి చెందాడు. సాయిరెడ్డి రాసినట్లుగా చెబుతున్న సూసైడ్ నోట్లో తనను సీఎం రేవంత్ రెడ్డి అన్నదమ్ములు వేధింపులు తట్టుకోలేక చనిపోతున్నట్లు పేర్కొనడం సంచలనంగా మారింది. -
మాదాపూర్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య
-
ప్రేమ.. పెళ్లి.. వేధింపులు.. ఆత్మహత్య
ధారూరు: ఓ అనాథ బాలికకు మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకోవడంతో పాటు వేధింపులకు గురిచేసి, ఆత్మహత్యకు ప్రేరేపించిన యువకుడు, అతని కుటుంబ సభ్యులపై పోక్సోతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఎస్ఐ వేణుగోపాల్గౌడ్, గ్రామస్తుల వివరాలు ఇలా ఉన్నాయి.. ధారూరు మండల కేంద్రానికి చెందిన కె.మంజుల, యాదయ్య దంపతులకు కొడుకు, కూతురు సంతానం. మంజుల, యాదయ్య కొన్నేళ్ల క్రితం మరణించారు. మూడేళ్ల క్రితం వీరి కొడుకు కూడా మృతిచెందడంతో కూతురు స్వాతి(16) అనాథగా మిగిలింది. దోర్నాల్ గ్రామంలో ఉంటున్న అమ్మమ్మ బాలికను చేరదీసి, స్థానిక కస్తూర్బా విద్యాలయంలో చేరి్పంచింది. ఇదే సమయంలో కుక్కింద గ్రామానికి చెందిన యువకుడు శ్రీకాంత్ తా ను స్వాతిని ప్రేమిస్తున్నానంటూ తీసుకెళ్లి, పెళ్లి చేసుకున్నాడు. ఏడాది పాటు వీరి కాపురం సజావు గానే సాగింది. ఆ తర్వాత భర్త శ్రీకాంత్తో పాటు అత్త, మామలు వెంకటమ్మ, యాదయ్య, ఆడపడుచులు స్వాతిని వేధించడం ప్రారంభించారు.వీరి ఆగడాలు భరించలేక ఈనెల 16న సాయంత్రం స్వాతి ఇంట్లో ఉన్న పురుగు మందు తాగి, స్పృహ కోల్పోయింది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందింది. స్వాతి ఆత్మహత్యకు కారణమైన భర్త, అత్త, మామ, ఆడపడుచులపై బాల్య వివాహం, వేధింపులు, పోక్సో, ఆత్మహత్యకు ప్రేరేపించడం తదితర సెక్షన్ల కింద కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు. -
రోజుకో చావుతో తెలంగాణ తెల్లారుతోంది: రేవంత్ సర్కారుపై కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అసమర్థ పాలనలో తెలంగాణలో రోజుకు ఎంతోమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెండ్ మండిపడ్డారు. కాంగ్రెస్ కుట్రలకు బడుగు బలహీన వర్గాలు బలైపోతున్నాయని అన్నారు. రైతులు, ఆటోడ్రైవర్లతోపాటు వివిధ వర్గాలకు చెందిన వారు నిత్యం ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు ఎక్స్లో స్పందిస్తూ..రోజుకో చావుతో తెలంగాణ తెల్లారుతోందని, కాంగ్రెసోడి కుట్రలకు బలైపోతున్నదని మండిపడ్డారు. రాజ్యహింసతో రాష్ట్రం నిత్యం తల్లడిల్లుతోందని, గాయాలతో గోడుగోడునా విలపిస్తోందని విమర్శించారు. రైతు రారాజుగా బ్రతికిన తెలంగాణలో అన్నదాతల ఆత్మహత్యలు నిత్యకృత్యమాయెనని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధికి చిరునామాగా మారిన రాష్ట్రంలో జీవనోపాధి కరువై బడుగులు బలిపీఠం ఎక్కవట్టెనని ఆయన వాపోయారు. ఇది ఎవడు చేసిన పాపమని, ముమ్మాటికీ మార్పు తీసుకొచ్చిన శాపమేనని పేర్కొన్నారు.రోజుకో చావుతో తెలంగాణ తెల్లారుతోంది కాంగ్రెసోడి కుట్రలకు బలైపోతుంది!రాజ్యహింసతో నిత్యం తల్లడిల్లుతోందిగాయాలతో గోడుగోడునా విలపిస్తోంది!రైతు రారాజుగా బ్రతికిన తెలంగాణలో... అన్నదాతల ఆత్మహత్యలు నిత్యకృత్యమాయే!ఉపాధికి చిరునామాగా మారిన రాష్ట్రంలో..జీవనోపాధి కరువై బడుగులు… pic.twitter.com/KPHWnAg7PN— KTR (@KTRBRS) November 19, 2024 -
ఆర్ధిక ఇబ్బందులు తాళలేక.. వ్యాపారవేత్త ఆత్మాహుతి
బెంగళూరు: ఆర్థిక ఇబ్బందులు నిండు ప్రాణాల్ని బలి తీసుకున్నాయి. ఓ వ్యాపారి ఆర్థిక ఇబ్బందులు తాళలేక బతికుండగానే ఆత్మాహుతికి పాల్పడ్డాడు.పోలీసుల వివరాల మేరకు.. ప్రదీప్ హోటల్ కన్సల్టెంట్ బిజినెస్ చేస్తున్నారు. అయితే వ్యాపారంలో నష్టం రావడంతో ఆర్ధిక ఇబ్బందులు తలెత్తాయి. తీసుకున్న అప్పులకు వడ్డీలు పెరిగిపోవడం, అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి ఎక్కువైంది. దీంతో ఆర్ధిక ఇబ్బందులు తాళలేక ప్రదీప్ బతికుండగానే ఆత్మాహుతి చేసుకోవడంతో విషాదం చోటు చేసుకుంది.బెంగళూరు నగర శివారు ప్రాంతమైన ముద్దీన్పాళ్యకు ప్రదీప్ తన స్కోడా కారులో వచ్చాడు. అనంతరం కారు సీట్లో ఉన్న ప్రదీప్ కారుకు నిప్పంటించాడు. అయితే కారు నుంచి మంటలు రావడంతో భయాందోళనకు గురైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కారులో ఉన్న ప్రదీప్ ఊపిరాడక ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు. అంనతరం బాధితుడి కుటుంబానికి సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. On Saturday afternoon,a 42 yr old businessman Mr Pradeep was charred to death inside his car at Muddinpalya in Bengaluru. Prima Facie suggests a case of death by suicide.Police have registered the case of Unnatural Death.. pic.twitter.com/JOCTeYLBif— Yasir Mushtaq (@path2shah) November 16, 2024 -
గురుకుల విద్యార్థిని ఆత్మహత్య
సంగారెడ్డి టౌన్: గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సంగారెడ్డి మండలం కొత్లాపూర్లోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 9వ తరగతి చదువుతున్న స్వాతి (14) శనివారం ఉదయం పాఠశాల రెండో అంతస్తు భవనంలోని గదిలో ఫ్యాన్కు ఉరివేసుకొని ఉంది. సమాచారం అందుకున్న డీఎస్పీ సత్తయ్య ఘటన స్థలానికి చేరుకొని.. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మృతురాలి కుటుంబం మదీనాగూడ ఎంఏ నగర్ కాలనీలో నివాసం ఉంటోంది. స్వాతి తండ్రి పండు రాజు, తల్లి దివ్యవాణి హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. కాగా, తమ కూతురు ఆత్మహత్య వెనుక హాస్టల్ వారిపైనే అనుమానం ఉందని మృతురాలి తల్లి ఆరోపించారు. ఈ ఘటనపై విచారణ జరిపించాలని ఆమెతో పాటు విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని వార్డెన్ హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. -
మరదలిపై వదిన దుర్మార్గం
అన్న భార్య తల్లితో సమానం అంటారు. అలాంటిది ఆ వదిన తప్పుడు దోవలో వెళ్తుంటే ఆ యువతి ఆపాలని చూసింది. కానీ, అదే ఆ యువతి పాలిట మృత్యువైంది. బేగంపేటలో బలవన్మరానికి పాల్పడిన యువతి సూసైడ్ కేసులో.. వదినతో పాటు ఆమె ప్రియుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. రసూల్పురా ఇందిరమ్మనగర్కు చెందిన విఠల్ కూతురు స్రవంతి(19) ఈ నెల 11వ తేదీన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పొరుగున ఉండే ఓ యువకుడి వేధింపులతోనే కూతురు ఆత్మహత్య చేసుకుందని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు స్రవంతి సెల్ఫోన్లోని మెసేజ్ల ఆధారంగా.. యూసుఫ్గూడ రహమత్నగర్లో ఉంటున్న నవీన్కుమార్ను అదుపులోకి తీసుకుని విచారించారు.అయితే.. స్రవంతి వదిన శైలజకు నవీన్కుమార్తో పెళ్లికి ముందే సంబంధం ఉన్నట్లు గుర్తించారు. అతను ఇటీవల మళ్లీ శైలజను కలవడం ప్రారంభించాడు. ఈ విషయాన్ని స్రవంతి గుర్తించింది. అన్నను చెప్పనని, ఇప్పటికైనా తీరు మార్చుకోమని స్రవంతి, శైలజతో మంచిగా చెప్పింది. అయితే.. శైలజ తన తీరు మార్చుకోలేదు. ఈ విషయం ఎక్కడ బయటపడుతుందోనని భావించింది. ఈ క్రమంలో.. స్రవంతికి ఇంటి పక్కనే ఉండే ఓ యువకుడితో సంబంధం ఉందంటూ ప్రచారం చేస్తూ వేధింపులకు దిగింది. అతను తనకు సోదరుడి వంటివాడని చెప్పినా వినిపించుకోలేదు.పైగా తనతో సంబంధం ఉన్న నవీన్కుమార్ను రంగంలోకి దించి అతనితో స్రవంతి ఫోన్కు సందేశాలు పంపిస్తుండేది. వదిన, నవీన్కుమార్లు పెట్టే వేధింపులు తట్టుకోలేక స్రవంతి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే కోడలే తన కూతురు ఆత్మహత్యకు కారణమైనట్లు పోలీసుల విచారణలో బయటపడటంతో స్రవంతి తల్లిదండ్రులు షాక్కి గురయ్యారు. శైలజతో పాటు నవీన్కుమార్ను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. -
ఏపీలోనూ ‘కోటా ఫ్యాక్టరీ’లు
సాక్షి, అమరావతి: ఐఐటీ, నీట్ లాంటి పోటీ పరీక్షల శిక్షణకు రాజస్థాన్లోని కోటా నగరం ప్రసిద్ధి చెందింది. అక్కడ ప్రతి ఇల్లూ ఓ శిక్షణ సంస్థే. కోటా ఇన్స్టిట్యూట్స్లో శిక్షణ తీసుకుంటే ర్యాంక్ గ్యారంటీ అనే ప్రచారం బలంగా ఉండడంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల విద్యార్థులు వస్తుంటారు. అయితే అక్కడి పరిస్థితులు ఎంత దయనీయంగా ఉంటాయో ఇతరులకు తెలియదు. శిక్షణ కోసం కోటా వచ్చిన విద్యార్థులు ఒత్తిడి తట్టుకోలేక గతేడాది 26 మంది ఆత్మహత్యకు పాల్పడగా ఈ ఏడాది ఇప్పటి వరకు 13 మంది ప్రాణాలు వదిలారు. వీరంతా 17–19 ఏళ్ల వయసువారే. ఇక సివిల్స్ శిక్షణకు బ్రాండ్ సిటీ లాంటి ఢిల్లీలో ఇటీవల ఓ పేరొందిన స్టడీ సర్కిల్ను వరద ముంచెత్తడంతో ముగ్గురు అభ్యర్థులు మృతి చెందారు. తెలుగు రాష్ట్రాల్లోనూ పరిస్థితి వీటికి భిన్నంగా ఏమీ లేదు. మన వద్ద కూడా అన్ని కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఇంటర్, పోటీ పరీక్షల్లో ర్యాంకుల కోసం విద్యార్థులపై ఇదే తరహా ఒత్తిడి నెలకొంది.పర్యవేక్షణకు ప్రత్యేక వ్యవస్థకోచింగ్ సెంటర్ కంట్రోల్ అండ్ రెగ్యులేషన్ బిల్లు ఆధారంగా ప్రత్యేక చట్టాన్ని రాజస్థాన్ ప్రభుత్వం తేనుంది. శిక్షణ సంస్థలపై పర్యవేక్షణకు 12 మంది అధికారులతో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి నేతత్వంలో పాఠశాల, వైద్య, సాంకేతిక విద్య కార్యదర్శులు, డీజీపీ సభ్యులుగా ఉంటారు. కోచింగ్ సంస్థల ప్రతినిధులు కూడా సభ్యులుగా ఉంటారు. కోచింగ్ సెంటర్లు తమ వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే రెండుసార్లు వరకు జరిమానా, ఆ తరువాత సంస్థ రిజిస్ట్రేషన్ను రద్దు చేస్తారు. విద్యార్థి శిక్షణ మధ్యలో మానేస్తే దామాషా ప్రకారం ఫీజు రీఫండ్ చేయాల్సి ఉంటుంది. కోటాలో వరుసగా విద్యార్థుల ఆత్మహత్యలపై అధ్యయనం అనంతరం ఐఐటీ, నీట్ ఇతర పోటీ పరీక్షలకు శిక్షణ పేరుతో 16 ఏళ్లలోపు విద్యార్థులను చేర్చుకోవడం, సాధారణ పాఠశాలల్లో చేరిన వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించడంపై రాజస్థాన్ ప్రభుత్వం నిషేధం విధించింది.బలవన్మరణాలు..విశాఖ పీఎం పాలెంలోని ఓ కార్పొరేట్ స్కూల్లో ఈ ఏడాది జనవరిలో 9వ తరగతి చదివే ఓ విద్యార్థికి టెన్త్ పాఠ్యాంశాలు బోధిస్తూ టెస్టుల పేరుతో తీవ్ర ఒత్తిడికి గురి చేయడంతో భరించలేక ప్రాణాలు తీసుకున్నాడు. గతేడాది ఫిబ్రవరిలో తిరుపతి జిల్లా గూడూరులో ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో తనిఖీల సందర్భంగా రికార్డులు సమర్పించాలని యాజమాన్యం ఒత్తిడి చేయడంతో 21 ఏళ్ల విద్యార్థి హాస్టల్ భవనంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాలు 2021లో ఏపీలో 523 మంది విద్యార్థులు వివిధ కారణాలతో బలవన్మరణాలకు పాల్పడినట్లు వెల్లడిస్తున్నాయి. వాస్తవానికి ఈ సంఖ్య మూడింతలు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 2014 తరువాత 57 శాతానికి పైగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. విద్యార్థులపై మార్కులు, ర్యాంకుల ఒత్తిడి పెరగడంతో అంచనాలను అందుకోలేక సగటున వారానికి ఒక్కరు ప్రాణాలు కోల్పోతున్నట్లు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ తరహాలో ప్రత్యేక చట్టం తెచ్చి కార్పొరేట్ విద్యాసంస్థల వేధింపులను నియంత్రించాలని నిపుణులు సూచిస్తున్నారు. రాజస్థాన్లో ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేయడంతో పాటు కోచింగ్ సెంటర్ల నియంత్రణకు ‘‘కంట్రోల్ అండ్ రెగ్యులేషన్ బిల్లు–2024’’ పెద్ద ముందడుగుగా భావిస్తున్నారు. -
అమ్మా సారీ.. నేను చదవలేకపోతున్నా
నెల్లూరు సిటీ: ‘అమ్మా.. సారీ నేను చదవలేకపోతున్నాను.. నేను బతికినా ఒకటే.. చచ్చినా ఒకటే’ అంటూ పదో తరగతి విద్యార్థి హాస్టల్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. ముత్తుకూరు మండలం ఆర్ఆర్ కాలనీలో దువ్వూరు హరనాథ్రెడ్డి, అనిత దంపతులు నివాసం ఉంటున్నారు. వీరి జీవనాధారం వ్యవసాయం. ఇద్దరు కుమారులున్నారు. పెద్ద కుమారుడు పనత్రెడ్డి (15) ధనలక్ష్మీపురంలోని వీబీఆర్ స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. అతను చిన్నప్పటి నుంచే చదువుల్లో కొంత వెనుకబడ్డాడు. ఇంట్లో ఉంటే ఆటల్లో పడి పుస్తకాలపై శ్రద్ధ పెట్టే అవకాశం తక్కువగా ఉంటుందని, హాస్టల్లో చేర్చితే సహచర విద్యార్థులతో కలిసి మంచి మార్కులు సాధిస్తాడని తల్లిదండ్రులు భావించారు. దీంతో ఎనిమిదో తరగతిలోనే హాస్టల్లో చేర్పించారు. చదువు విషయంలో పనత్పై ఎక్కువ ఒత్తిడి చేయొద్దని, పాస్ మార్కులు వస్తే చాలని అక్కడి ఉపాధ్యాయులకు తల్లిదండ్రులు చెప్పారు. అయితే పనత్రెడ్డికి ఒక పక్క పాఠాలు అర్థం కాక, తల్లిదండ్రులకు చెబితే తిడతారని భయపడ్డాడు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక తీవ్ర ఒత్తిడికి లోనవుతూనే చదువు కొనసాగించాడు. మంచి మార్కులు రావడం లేదన్న ఆందోళన అతన్ని వెంటాడుతూనే ఉంది. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం భోజనం చేశాక పనత్రెడ్డి నేరుగా హాస్టల్లోని తన గదికి వెళ్లాడు. నైలాన్ తాడుతో ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన సహచర విద్యార్థులు పాఠశాల సిబ్బందికి సమాచారం అందించారు. వారు కిందకు దించి అతడిని చికిత్స నిమిత్తం నారాయణ హాస్పిటల్కు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే పనత్రెడ్డి మృతి చెందాడని నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు హుటావుటిన ఘటనా స్థలానికి చేరుకుని విగతజీవిగా పడి ఉన్న పనత్ను చూసి కన్నీటి పర్యంతమయ్యారు.పాఠశాల ఎదుట ఆందోళనపనత్రెడ్డి మృతిపై విద్యార్థి సంఘ నాయకులు పాఠశాల వద్ద ఆందోళన చేశారు. ఉపాధ్యాయుల ఒత్తిడితోనే అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపించారు. నెల్లూరు రూరల్ ఇన్స్పెక్టర్ వేణు ఘటనా స్థలానికి చేరుకుని వారికి సర్ది చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమత్తం నెల్లూరు జీజీహెచ్కు తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కన్నా.. నువ్వున్న చోటుకే వచ్చేస్తున్నాం!
సేలం: అనారోగ్యంతో ఏడేళ్ల కుమారుడి మృతి చెందడాన్ని తట్టుకోలేక ఆవేదనతో ఉన్న దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కోవైలో కలకలం రేపింది. వివరాలు.. విరుదునగర్ జిల్లా శివకాశి సమీపంలోని పూలావూరని గ్రామానికి చెందిన పళని స్వామి (39). ఈయన ఇంటిలో విద్యార్థులకు ట్యూషన్ నిర్వహిస్తూ వస్తున్నాడు. ఆయన భార్య వత్సలా (35). ఈమె అదే ప్రాంతంలో ఉన్న ప్రైవేటు బ్యాంకులో పని చేస్తున్నారు. వీరికి ఏడేళ్ల వయస్సులో కుమారుడు ఉండేవాడు. అయితే గత ఏప్రిల్ నెల మెదడు జ్వరం కారణంగా మృతి చెందాడు. కుమారుడు చనిపోయినప్పటి నుంచి పళనిస్వామి, వత్సలాలు అమిత వేదనతో ఉంటూ వచ్చారు. వారిని బంధువులు సముదాయిస్తూ వచ్చారు. అయినప్పటికీ తీవ్ర ఆవేదనతో ఉన్న దంపతులను కోవైలో ఉన్న బంధువుల ఇంటికి తీసుకువెళ్లారు. కొన్ని రోజులు బంధువుల ఇంటిలో ఉన్న వారు ఇటీవల వేట్టపట్టి వీకేవీ శ్రీనగర్ ప్రాంతంలో అద్దెకు ఇల్లు తీసుకుని నివసిస్తూ వచ్చారు. అయినా కొడుకు పోయాడనే ఆవేదనతో కనిపిస్తూ వచ్చారు.ఆత్మహత్య..ఈ క్రమంలో సోమవారం ఉదయం ఇంటి నుంచి బయలుదేరి గాంధీపురం కోట్టూర్ ప్రాంతంలో ఒక లాడ్జ్లో ఇద్దరు బస చేశారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి వరకూ ఇద్దరు గదిలో నుంచి బయటకు రాకపోవడంతో సందేహించిన లాడ్జ్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాట్టూర్ పోలీసులు తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా గదిలో దంపతులు ఇద్దరు నోటిలో నురగలు కక్కున్న స్థితిలో మృతదేహాలుగా పడి కనిపించారు. దీంతో వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు శవపంచనామా నిమిత్తం కోవై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో పోలీసులు ఆ గదిని తనిఖీ చేయగా, అక్కడ రెండు కూల్ డ్రింక్స్ బాటిళ్లు ఉన్నాయి. ఒక లేఖ చిక్కింది. ఆ లేఖలో.. తమ మృతికి ఎవరూ కారణం కాదని, తమ కుమారుడి వద్దకే వెళుతున్నామని రాసి ఉన్నట్టు పోలీసులు తెలిపారు. -
ప్రాణం తీస్తున్న ప్రేమ
ప్రేమ, దాని కారణంగా వివాహేతర సంబంధాలు మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి. హత్యలు,ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి. కిడ్నాపులకు దారితీస్తున్నాయి. ప్రేమ కారణంగా గత పదేళ్లలో లక్షకుపైగా హత్యలు, ఆత్మహత్యలు జరిగాయి.⇒ దేశంలో ప్రేమ, తత్సంబంధ కారణాల వల్ల 201322 మధ్య ఆత్మహత్య చేసుకున్నవారు 74,180⇒ మొత్తం ఆత్మహత్యల్లో ప్రేమ కారణంగా జరిగినవి 76.1%⇒ వివాహేతర సంబంధాల వల్ల జరిగిన ఆత్మహత్యలు 13.3% ⇒ ప్రేమ కారణంగా హత్యకు గురైనవారు 30,012⇒ మొత్తం హత్యల్లో అక్రమ సంబంధాల కారణంగా జరిగినవి 46.6%⇒ పెళ్లిళ్ల కోసం చేసిన కిడ్నాపులు 2.8 లక్షలు⇒ పరువు హత్యలు 517ఆధారం: నేషనల్ర్ కైమ్ రికార్డ్స్ బ్యూరో -
‘నన్ను క్షమించండి’.. జేఈఈ పరీక్ష ఫెయిల్ అవ్వడంతో..!
న్యూఢిల్లీ: చిన్న చిన్న కారణాలతోనే విలువైన ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. అమ్మానాన్న తిట్టారని, మొబైల్ కొనివ్వలేదని, పరీక్షలో ఫెయిల్ అయ్యామని, ప్రేమ విఫలమైందని, డిప్రెషన్ వంటి కారణాలతో తనువు చాలిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా యువత నుంచి పెద్దవాళ్ల వరకు క్షణికావేశంలో తమను తామే చంపేసుకుంటున్నారు. తాజాగా ఓ యువతి కూడా ఇలాంటి తప్పుడు నిర్ణయమే తీసుకుంది.జేఈఈ మెయిన్స్ పరీక్షలో పాస్ కాలేదని మనస్తాపం చెందిన 17 ఏళ్ల యువతి బలవన్మరణానికి పాల్పడింది. బిల్డింగ్పై నుంచి దూకి ప్రాణాలు విడిచింది. దేశ రాజధాని ఢిల్లీలోని జామియా నగర్లో ఈ విషాదం చోటుచేసుకుంది. యువతి తన ఇంటర్ పూర్తికాగానే ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ జేఈఈ మెయిన్స్కు ప్రిపేర్ అవుతోంది. అయితే చదువులో ఒత్తిడి కారణంగా పరీక్ష పాస్ కాలేదు. ఆమె అనుకున్న అంచనాలను చేరుకోలేదు. దీంతో తీవ్ర మనస్తాపంతో శుక్రవారం రాత్రి షాహిన్ భాగ్లోని బిల్డింగ్లోని ఏడో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది.సమాచారం అందుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతురాలి వద్ద సూసైడ్ లేఖను స్వాధీనం చేసుకున్నారు. అందులో‘ నన్ను క్షమించండి.. నేను సాధించలేకపోయాను. జేఈఈ పరీక్షను క్లియర్ చేయలేకపోయాను’ అని రాసి ఉంది. అయితే పరీక్షలో ఫెయిల్ అయితే ప్రాణాలు తీసుకుంటానని బాలిక గతంలో తన తల్లికి తెలియజేసిందని పోలీసులు తెలిపారు. ఆమె తండ్రి ప్రైవేట్ ఉగ్యోగి కాగా, ఆమె తల్లి గృహిణి. -
హైదరాబాద్ లో విషాదం.. సాఫ్ట్ వేర్ ఇంజనీర్...
-
యువతపై కృత్రిమ మేధ ప్రభావం!
అమెరికాలో ఓ యువకుని జీవితంలో అలాంటి ఘటనే జరిగింది. తన కొడుకు ఆత్మహత్యకు ఏఐ చాట్బాట్ కారణమంటూ ఫ్లోరిడాలో ఓ తల్లి కోర్టుకెక్కారు. తన 14 ఏళ్ల కొడుకు చాట్బాట్తో మానసికంగా అనుబంధాన్ని ఏర్పరుచుకున్నాడని, దాన్నుంచి భావోద్వేగపూరితమైన మెసేజ్ వచ్చిన కాసేపటికే ఆత్మహత్య చేసుకున్నాడని ఆమె ఆరోపించారు. కృత్రిమ మేధ యాప్లతో పొంచి ఉన్న కొత్తతరహా పెను ప్రమాదాలు, ఆయా యాప్లపై ఇంకా సరైన నియంత్రణ లేకపోవడాన్ని ఈ అంశం మరోసారి తెరపైకి తీసుకొచి్చంది. పట్టభద్రుడైన థెరపిస్ట్లా ప్రభావం చూపింది: తల్లి 14 ఏళ్ల సెవెల్ సెట్జర్ తరచుగా ‘క్యారెక్టర్.ఏఐ’అనే చాట్బాట్ యాప్ను ఉపయోగిస్తున్నాడు. ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’పాత్ర డేనెరిస్ టార్గేరియన్ను పోలిన పాత్రను సృష్టించుకుని సంభాషిస్తున్నాడు. చాట్బాట్తో వర్చువల్ సంబంధాన్ని ఏర్పరుచుకున్నాడు. క్యారెక్టర్.ఏఐ చాట్బాట్ టీనేజర్ అయిన తన కొడుకును లక్ష్యంగా చేసుకుందని, అతను ఆత్మహత్య ఆలోచనలను వ్యక్తం చేసిన తర్వాత ఆ యాప్ అదేపనిగా ఆత్మహత్య అంశాన్ని లేవనెత్తి పిల్లాడు ఆత్మహత్య చేసుకునేలా ఉసిగొలి్పందని అతని తల్లి అమెరికాలోని ఓర్లాండోలో ఫిర్యాదుచేశారు. చాట్బాట్ తన పిల్లాడిపై ఒక పట్టభద్రుడైన థెరపిస్ట్గా తీవ్ర ప్రభావం చూపించిందని ఆమె ఆరోపించారు. చనిపోవడానికి ముందు ఏఐతో జరిగిన చివరి సంభాషణలో సెవెల్ చాట్బాట్ను ప్రేమిస్తున్నానని, ‘మీ ఇంటికి వస్తాను’అని చెప్పాడని దావాలో పేర్కొన్నారు. తన కుమారుడి మరణంలో క్యారెక్టర్.ఏఐ చాట్బాట్ ప్రమేయం ఉందని తల్లి మేగన్ గార్సియా ఆరోపించారు. మరణం, నిర్లక్ష్యం, ఉద్దేశపూర్వకంగా మానసిక క్షోభను కలిగించినందుకు నిర్దిష్ట నష్టపరిహారాన్ని కోరుతూ గార్సియా దావా వేశారు. గూగుల్పై దావా ఈ దావాలో సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్, దాని మాతృసంస్థ ఆల్ఫాబెట్ను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఆగస్టులో క్యారెక్టర్.ఏఐలో గూగుల్ భారీ స్థాయిలో వాటాలను కొనుగోలుచేసింది. గూగుల్ ఆగమనంతో ఈ యాప్ అంకురసంస్థ మార్కెట్ విలువ ఏకంగా 2.5 బిలియన్ డాలర్లకు పెరిగింది. అయిఏత క్యారెక్టర్.ఏఐ అభివృద్ధిలో తమ ప్రత్యక్ష ప్రమేయం లేదని గూగుల్ ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే తమ యాప్ వినియోగదారుల్లో ఒకరిని కోల్పోవడం హృదయవిదారక విషయమని సంస్థ తన ‘ఎక్స్’ఖాతాలో ఒక ప్రకటన చేసింది. సెవెల్ కుటుంబానికి సంతాపం తెలిపింది. ‘కృత్రిమ మేధ అనేది నిజమైన వ్యక్తి కాదు. ఈ విషయాన్ని వినియోగదారులకు మరోసారి స్పష్టంగా గుర్తుచేస్తున్నాం. ఈ మేరకు డిస్క్లైమర్ను సవరిస్తున్నాం. భద్రతను పెంచడానికి అదనపు ఫీచర్లను జోడిస్తాం’అని సంస్థ తెలిపింది. అయితే చాట్బాట్ కారణంగా వ్యక్తి మరణం అమెరికాలో పెద్ద చర్చను లేవనెత్తింది. ఇలాంటి కృత్రిమమేథ కారణంగా ఎవరికైనా హాని జరిగితే దానికి బాధ్యులు ఎవరు?. ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారు? అన్న చర్చ మొదలైంది. ఇతర నియంత్రణ చట్టాల వంటి సెక్షన్ 230 అనేది కృత్రిమ మేథకు వర్తిస్తుందా అనే అంశమూ డిజిటల్ నిపుణుల చర్చల్లో ప్రస్తావనకొచి్చంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
తొమ్మిదో అంతస్తు నుంచి దూకి టెకీ ఆత్మహత్య
సాక్షి,హైదరాబాద్:సాఫ్ట్వేర్ ఉద్యోగిని హరిత హైదరాబాద్ నగరం ఉప్పల్లోని బహుళ అంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. సోమవారం(అక్టోబర్21) అర్ధరాత్రి ఉప్పల్ డీఎస్ఎల్ మాల్ పక్కన ఉన్న ఐటీ కంపెనీ భవనం తొమ్మిదవ అంతస్తు నుంచి దూకడంతో ఆమెను చికిత్స కోసం రామంతాపూర్లోని మ్యాట్రిక్స్ ఆస్పత్రికి తరలించారు.అయితే ఆస్పత్రికి తీసుకెళ్లేసరికే హరిత మృతి చెందిందని డాక్టర్లు నిర్ధారించారు. ఐటీ ఉద్యోగిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.ఇదీ చదవండి: పెళ్లి చేయడం లేదని తండ్రి హత్య -
బైక్ కొనలేదని విద్యార్థి ఆత్మహత్య
పీఎంపాలెం: పుట్టిన రోజు నాడు విషాద సంఘటన చోటుచేసుకుంది. తండ్రి బైక్ కొనలేదని కోపంతో ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చాడు. ప్రాణస్నేహితులను దుఃఖ సాగరంలో ముంచెత్తాడు. పీఎంపాలెం గాయత్రీనగర్ జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో సోమవారం జరిగిన సంఘటనకు సంబంధించిన సీఐ బాలకృష్ణ తెలిపిన వివరాలు.. పేరిశెట్టి సూర్యనారాయణ విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కోమటిపల్లి గ్రామం నుంచి సుమారు ఆరేళ్ల క్రితం నగరానికి వలస వచ్చాడు. ప్రస్తుతం ఓ కళాశాలలో హాస్టల్ కుక్గా పనిచేస్తూ పీఎంపాలెం గాయత్రీనగర్లో భార్య గంగ, పెద్ద కుమారుడు గణేష్ , 9వ తరగతి చదువుతున్న చిన్న కుమారుడు లోకేష్తో కలిసి నివసిస్తున్నాడు. పెద్ద కుమారుడు నగరంలోని ఓ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం పుట్టిన రోజు కావడంతో సాయంత్రం కేక్ కట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇంతలో ఏమైందో ఏమో ఇంటి తలుపులు వేసుకుని ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్మకు పాల్పడ్డాడు. అనుకోని పరిణామంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు, స్థానికులు వేలాడుతున్న గణేష్ను కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెందాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ బాలకృష్ణ తెలిపారు.బైక్ కొనమని తండ్రితో గొడవవిద్యార్థి గణేష్ ఎప్పటి నుంచో బైక్ కొనమని తల్లిదండ్రులను వేడుకుంటున్నాడు. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం. బైక్ కొనే స్థోమత ఆ కుటుంబానికి లేదు. ఇదే విషయం తల్లిదండ్రులు గణేష్ నచ్చచెప్పినప్పటికీ వినేవాడు కాదు. ఈ విషయంపైనే తండ్రితో గొడవ పడినట్టు స్థానికులు చెబుతున్నారు. బైక్ కొనే స్థోమత లేకపోవడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
పెళ్లింట విషాదం.. భార్యకు పురుగులమందు కలిపి
సాక్షి, నల్లగొండ: పెళ్లింట విషాదం చోటుచేసుకుంది. పురుగులమందు కలిపిన కూల్డ్రింక్ను భార్యకు తాగించి.. ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఏఎస్ఐ ప్రభాకర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం మొసంగి గ్రామానికి చెందిన బడుగుల వెంకటయ్య(43)– జ్యోతి దంపతులు ఈనెల 16న కుమార్తె వివాహం జరిపించారు. ఆదివారం తమ కుమార్తెను అత్తగారి ఇంటి నుంచి తీసుకురావాల్సి ఉండగా, పురుగుల మందు కలిపిన కూల్ డ్రింక్ను భార్య జ్యోతికి ఇచ్చి, తాను గదిలోకి వెళ్లి తలుపులు వేసుకొని గడియ పెట్టుకున్నాడు. అప్పటికే కొంచెం కూల్డ్రింక్ తాగిన జ్యోతి పురుగుల మందు వాసన ఉండడంతో పారబోసింది. అనుమానం వచ్చి చుట్టుపక్కల వారిని పిలిచింది. వారు వచ్చి తలుపులు తెరిచారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో హుటాహుటిన నల్లగొండకు తరలించారు. వెంకటయ్య మృతి చెందగా, జ్యోతి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు సమాచారం. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు.ఇంగ్లిష్ మీడియంలో పాఠాలు అర్థం కావడంలేదని.. చిలుకూరు: ఇంగ్లిష్ మీడియంలో పాఠాలు అర్థం కావడం లేదని, దీంతో మార్కులు తక్కువ వస్తున్నాయని ఇంటర్ విద్యార్థి మనస్తాపంతో ఉరివేసుకొని ఆత్యహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల పరిధిలోని కవిత జూనియర్ కళాశాలలో ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం సజ్జాపురానికి చెందిన బీమన శేఖర్ కుమారుడు బీమన వినయ్ (17) చిలుకూరు మండల పరిధిలోని కవిత జూనియర్ కళాశాలలో ఎంపీసీ గ్రూప్లో చేరాడు. 10వ తరగతి వరకు తెలుగు మీడియంలో చదివిన వినయ్.. ఇంటర్లో ఇంగ్లిష్ మీడియంలో సబ్జెక్టులు అర్థంకాక మార్కులు తక్కువగా వస్తున్నాయని కొంతకాలంగా బాధపడుతున్నాడు. ఈ క్రమంలో దసరా సెలవులకు ఇంటికి వెళ్లిన వినయ్ తిరిగి కళాశాలకు వెళ్లడానికి ఇష్టపడలేదు. దీంతో తల్లిదండ్రులు సర్ది చెప్పి ఆదివారం అతడిని మేనమామ, బంధువులు తీసుకొని వచ్చి కళాశాలలో విడిచి పెట్టి వెళ్లారు. ఆ సమయంలో స్టడీ అవర్స్ నడుస్తుండటంతో విద్యార్థులు, అధ్యాపకులు తరగతి గదుల్లో ఉన్నారు. హాస్టల్ గదిలో లగేజీ పెట్టి వస్తానని వెళ్లిన వినయ్ అక్కడున్న ఫ్యాన్కు టవల్తో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అరగంట తరువాత గమనించిన తోటి విద్యార్థులు, అధ్యాపకులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం కోదాడలోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వినయ్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాంబాబు తెలిపారు. దసరా సెలవులు ముగించుకుని తిరిగి వెళ్లిన రోజే ఇలా జరగడంతో కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. -
ఇంగ్లిష్ మీడియంలో పాఠాలు అర్థం కావడంలేదని..
చిలుకూరు: ఇంగ్లిష్ మీడియంలో పాఠాలు అర్థం కావడం లేదని, దీంతో మార్కులు తక్కువ వస్తున్నాయని ఇంటర్ విద్యార్థి మనస్తాపంతో ఉరివేసుకొని ఆత్యహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల పరిధిలోని కవిత జూనియర్ కళాశాలలో ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం సజ్జాపురానికి చెందిన బీమన శేఖర్ కుమారుడు బీమన వినయ్ (17) చిలుకూరు మండల పరిధిలోని కవిత జూనియర్ కళాశాలలో ఎంపీసీ గ్రూప్లో చేరాడు. 10వ తరగతి వరకు తెలుగు మీడియంలో చదివిన వినయ్.. ఇంటర్లో ఇంగ్లిష్ మీడియంలో సబ్జెక్టులు అర్థంకాక మార్కులు తక్కువగా వస్తున్నాయని కొంతకాలంగా బాధపడుతున్నాడు. ఈ క్రమంలో దసరా సెలవులకు ఇంటికి వెళ్లిన వినయ్ తిరిగి కళాశాలకు వెళ్లడానికి ఇష్టపడలేదు. దీంతో తల్లిదండ్రులు సర్ది చెప్పి ఆదివారం అతడిని మేనమామ, బంధువులు తీసుకొని వచ్చి కళాశాలలో విడిచి పెట్టి వెళ్లారు. ఆ సమయంలో స్టడీ అవర్స్ నడుస్తుండటంతో విద్యార్థులు, అధ్యాపకులు తరగతి గదుల్లో ఉన్నారు. హాస్టల్ గదిలో లగేజీ పెట్టి వస్తానని వెళ్లిన వినయ్ అక్కడున్న ఫ్యాన్కు టవల్తో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అరగంట తరువాత గమనించిన తోటి విద్యార్థులు, అధ్యాపకులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం కోదాడలోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వినయ్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాంబాబు తెలిపారు. దసరా సెలవులు ముగించుకుని తిరిగి వెళ్లిన రోజే ఇలా జరగడంతో కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. -
నేను నిన్ను మోసం చేసాను..
జవహర్నగర్: ఉరి వేసుకొని ట్రాన్స్జెండర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..జవహర్నగర్ కార్పొరేషన్ సంతోష్నగర్ కాలనీలో దొంతి సంతోష్ (31), భార్య బాలమణి, కుమారుడితో కలిసి నివసించేవారు. 2012 సంవత్సరంలో వీరికి వివాహం అయింది. కాగా గత నాలుగు సంవత్సరాల క్రితం సంతోష్ ట్రాన్స్జెండర్గా మారి సరితగా పేరు పెట్టుకున్నాడు. అప్పటి నుండి కుటుంబానికి దూరంగా ఉంటూ వికలాంగుల కాలనీ రేణుకానగర్లో అద్దె ఇంట్లో ఉంటూ అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. కాగా ఇటీవల భార్య కుషాయిగూడలోని పుట్టింటికి వెళ్లిపోయి తల్లితో ఉంటోంది. శుక్రవారం ఉదయం ట్రాన్స్జెండర్ సరిత భార్య బాలమణితో వీడియోకాల్లో మాట్లాడారు. ‘నేను నిన్ను మోసం చేశానని, నువు లేకుండా ఉండలేకపోతున్నానని, నువ్వు వెంటనే రావాలని, లేకుంటే చనిపోతానని’ చెప్పాడు. వెంటనే ఫోన్ కట్ చేసిన భార్య బాలమణి చుట్టుపక్కల వారికి ఫోన్ చేసి చెప్పింది. అయితే ఇంటి పక్కనవారు వెళ్లి చూసేసరికి సరిత చున్నీతో ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించింది. బాలమణి సంఘటన స్థలానికి వచ్చి చూడగా అప్పటికే సరిత మృతిచెందింది. తన భర్త ట్రాన్స్జెండర్గా మారి కుటుంబానికి ద్రోహం చేశాడని మనస్థాపం చెంది ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తుననారు. -
ఒకే రోజు ఐఏఎఫ్, ఆర్మీ దంపతుల ఆత్మహత్య..
న్యూఢిల్లీ: భారత సాయుధ దళాల్లో పనిచేస్తున్న ఓ జంట ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర విషాదాన్ని నింపింది. ఇండియన్ ఎయిర్ఫోర్స్, ఆర్మీలో విధులు నిర్వహిస్తున్న వారిద్దరూ.. వేర్వేరు నగరాల్లో ఒకేరోజు ప్రాణాలు కోల్పోయారు. వివరాలు.. బీహార్కు చెందిన దీనదయాల్ దీప్ ఆగ్రాలోని ఎయిర్ఫోర్స్ స్టేషన్లో లెఫ్టెనెంట్గా విధులు నిర్వహిస్తున్నారు. అతని భార్య రేణు తన్వర్ అదే నగరంలోని సైనిక ఆస్పత్రిలో కెప్టెన్గా పనిచేస్తున్నారు. ఈ జంట 2022లో ప్రేమ వివాహం చేసుకున్నారు.ఇటీవల తన్వర్ తన తల్లి, సోదరుడితో కలిసి వైద్య చికిత్స కోసం ఢిల్లీ వెళ్లారు. ఇంతలో ఏమైందో తెలియదు. రాత్రి భోజనం తర్వాత గదిలోకి వెళ్లిన దీప్ మరుసటి రోజు బయటకు రాకపోవడంతో సహోద్యోగులు తలుపు పగలగొట్టి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించారు. భర్త మరణించాడనే విషయాన్ని తట్టుకోలేక అతని ఆర్మీ అధికారి భార్య కూడా ఢిల్లీ కంటోన్మెంట్లోని గెస్ట్ హౌస్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. వీరిద్దరి చావుకి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే తన్వర్ వద్ద పోలీసులు సూసైడ్ లేఖను స్వాధీనం చేసుకున్నారు. తన భర్త దీప్తోమృతదేహంతో కలిపి తనకూ దహన సంస్కారాలు నిర్వహించాలని లేఖలో ఆమె కోరారు. తన్వర్ ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో ఆమె తల్లి, సోదరుడు ఆస్పత్రిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. దీప్ వద్ద ఎలాంటి సూసైడ్ నోటు లభ్యం కాలేదు. దీంతో అతడి మృతిపై పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఈ ఘటనలపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు -
Police Constable suicide: ఇద్దరు పోలీసుల ఆత్మహత్య
బూర్గంపాడు/ఏన్కూరు/మహబూబాబాద్ రూరల్: ఓ కేసులో ఉన్నతాధికారులు తనను బలి పశువును చేశారన్న ఆవేదనతో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోగా, కుటుంబ కలహాలతో మరో కాని స్టేబుల్ తుపాకీతో కాల్చుకుని తనువు చాలించాడు. ఖమ్మం జిల్లా ఏన్కూరుకు చెందిన భూక్యా సాగర్ (34) భద్రాద్రి జిల్లా బూర్గంపాడు పోలీస్స్టేషన్లో గతంలో కానిస్టేబుల్గా విధులు నిర్వహించాడు. ఆ సమయంలో, ఆ తర్వాత లక్ష్మీదేవిపల్లి పోలీస్స్టేషన్లో పని చేసినప్పుడు గంజాయి అక్రమ రవాణా కేసులో సాగర్ ప్రమేయం ఉందంటూ ఉన్నతాధికారులు ఆయనను అరెస్ట్ చేసి, సస్పెండ్ చేశారు. ఇటీవలే సస్పెన్షన్ ఎత్తివేసి ఏడూళ్ల బయ్యారంలో పోస్టింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తన తప్పు లేకున్నా ఎస్సైలు సంతోష్, రాజ్కుమా ర్, బీఆర్ఎస్ నాయకుడు నాని తనను గంజాయి కేసులో ఇరికించారని.. ఆ నింద మోయలేకపోతున్నా.. చచి్చపోతున్నా అంటూ సాగర్ ఏన్కూరులోని ఎన్ఎస్పీ ప్రధాన కాల్వ వద్ద పురుగు మందు తాగి సెల్ఫీ వీడియో తీసి శనివారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయిని బయట విక్రయించేందుకు ఎస్సైలు త నపై ఒత్తిడి చేశారని, తన సెల్ నుంచే గంజాయి కొనుగోలుదారులకు ఫోన్లు చేయించారని తెలిపాడు. ఇది బయటపడుతుందన్న భయంతోనే తనను అరెస్ట్ చేయించారని ఆరోపించాడు. కాగా, పురుగు మందు తాగిన సాగర్ను కుటుంబ సభ్యులు హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం సా యంత్రం మృతిచెందాడు. చికిత్స పొందుతున్న సమయంలో కూడా ‘రేవంతన్నా.. నా కుటుంబానికి న్యాయం చేయండి’అని మరో సెల్ఫీ వీడియో తీశాడు. కాగా, ఈ ఘటనలో ఇద్దరు ఎస్సైలు, ఒక సీఐ, బీఆర్ఎస్ నాయకుడిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్లు ఏన్కూరు ఎస్సై రఫీ తెలిపారు. కుటుంబ విభేదాలతో.. మరో ఘటనలో తుపాకీతో కాల్చుకుని ఓ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడ్డారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రం ఎన్జీఓస్ కాలనీకి చెందిన గుడిబోయిన శ్రీనివాస్ (59)కు భార్య, కుమారుడు ఉన్నారు. అయితే, విబేధాల కారణంగా ఐదేళ్ల నుంచి వారికి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో మహబూబాబాద్ ఐడీఓసీ ఆవరణలోని స్ట్రాంగ్రూం వద్ద ఆదివారం సాయంత్రం 4.30 గంటల సమయంలో తన ఎస్ఎల్ఆర్ తుపాకీతో కాల్చుకుని చనిపోయారు. మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం నల్లబెల్లి: ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురైన ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం పెంబర్తికి చెందిన ధరణికి 2020లో కానిస్టేబుల్ ఉద్యోగం రాగా, వరంగల్ జిల్లా నల్లబెల్లి లోని పోలీస్ క్వార్టర్స్లో నివనిస్తోంది. నాలుగు నెలల క్రితం తన పెద్దన్నకు వివాహం అయింది. ఆర్థిక ఇబ్బందులతో పాటు తన పెళ్లి విషయమై తరచుగా ఆలోచిస్తూ మనస్తాపానికి గురైన ధరణి.. పోలీస్ క్వార్టర్స్లోని తన నివాసంలో ఆదివారం ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. గమనించిన పోలీసులు మంటలార్పి.. చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. -
టీడీపీ వేధింపులతో వైఎస్సార్సీపీ కార్యకర్త ఆత్మహత్య
జగ్గయ్యపేట/జగ్గయ్యపేట అర్బన్: టీడీపీ నాయకుల బెదిరింపులను తాళలేక మనస్తాపానికి గురైన వైఎస్సార్సీపీ కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో చోటుచేసుకుంది. జగ్గయ్యపేటలోని నాగమయ్య బజారుకు చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త గుగ్గిళ్ల శ్రీను (31) సమీపంలోని స్టీల్ ప్లాంట్లోని మినరల్ వాటర్ ప్లాంట్లో రోజువారీ కూలీగా పని చేస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పది రోజుల క్రితం టీడీపీ నేత వీర్ల వెంకన్న ఇంటివద్ద విద్యుత్ స్తంభం అడ్డుగా ఉండటంతో దానిని తొలగించి.. శ్రీను ఇంటి ఎదుట అధికారులకు తెలియకుండా రాత్రికి రాత్రే కొత్త విద్యుత్ స్తంభాన్ని ఏర్పాటు చేశాడు.తన ఇంటిముందు స్తంభం ఎందుకు పెట్టారని, ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారని, విద్యుత్ తీగలు కిటికీలకు తగిలితే ప్రమాదం జరుగుతుందని శ్రీను ప్రశి్నంచాడు. దీంతో శ్రీను, అతడి కుటుంబ సభ్యులను టీడీపీ నాయకులు దుర్భాషలాడుతూ దౌర్జన్యానికి పాల్పడ్డారు. దీంతో శ్రీను ఆ సమస్యను విద్యుత్శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. అధికారుల నుంచి సమాధానం రాకపోగా.. వెంకన్నతో పాటు టీడీపీ నాయకులు షేక్ చాంద్సాహెబ్, మద్దం నరసింహారావు, నాగబాబు, సరస్వతి, రహంతుల్లా శ్రీను ఇంటికి వచ్చి మరోసారి బెదిరించి వెళ్లారు.దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీను ఈ నెల 11న ఇంట్లోంచి వెళ్లిపోయాడు. రాత్రయినా ఇంటికి రాకపోవడం, ఫోన్ చేసినా స్పందించకపోవడంతో కుటుంబ సభ్యులు అతడు పనిచేసే ప్లాంట్ వద్దకు వెళ్లి చూడగా ఉరి వేసుకుని మృతిచెంది ఉన్నాడు. ఎస్ఐ వెంకటేశ్వరరావు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతుడి భార్య గోవిందమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. శనివారం జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి ఇంటూరి రాజగోపాల్ (చిన్నా) తదితరులు శ్రీను మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.టీడీపీ కౌన్సిలర్లు కావేటి కృష్ణ, గొట్టె నాగరాజు ప్రోద్బలంతోనే వీర్ల వెంకన్న, షేక్ చాంద్, మద్దం నరసింహారావు, నాగబాబు, షేక్ బబేబీ, బషీర్, రహీంతుల్లా, వీర్ల సరస్వతి కలిసి తన భర్తను మానసికంగా వేధించడంతోనే ఆత్మహత్య చేసుకున్నారని శ్రీను భార్య గోవిందమ్మ మీడియా ఎదుట కన్నీటి పర్యంతమైంది. ఇద్దరు పిల్లలు ఉన్నారని, నాకు దిక్కెవరంటూ ఆవేదన వ్యక్తం చేసింది. గుగ్గిళ్ల శ్రీను కుటుంబ సభ్యులను ఆదివారం వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ పరామర్శించారు. -
దసరాకి భర్త చీర కొనలేదని వివాహిత ఆత్మహత్య
దుమ్కా: జార్ఖండ్లోని దుమ్కా జిల్లాలో దసరా పండుగపూట విషాదం చోటుచేసుకుంది. భర్త చీర కొనివ్వలేదని 26 ఏళ్ల వివాహిత రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతి చెందిన మహిళను బాగ్జోపా నివాసి సెండో దేవిగా గుర్తించారు. దసరా సందర్భంగా భర్త తనకు కొత్త చీర కొనివ్వలేదని, ఆగ్రహించిన ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడిందని పోలీసులు తెలిపారు. మృతురాలి భర్త ట్రాక్టర్ డ్రైవర్ అని, వారికి ఇద్దరు చిన్న పిల్లలు కూడా ఉన్నారని పోలీసు అధికారి తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించి కేసు విచారణ జరుపుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: తాను కన్నుమూస్తూ... మరో ఐదుగురికి ప్రాణదానం -
ఆన్లైన్ బెట్టింగ్లకు కుటుంబం బలి
సాక్షి,నిజామాబాద్ జిల్లా:జిల్లాలోని ఎడపల్లి మండలం వడ్డేపల్లిలో శనివారం(అక్టోబర్5) విషాదఘటన చోటుచేసుకుంది.ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మ హత్య చేసుకున్నారు.కొడుకు హరీష్ ఆన్లైన్ బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకోని అప్పుల పాలు కావడంతో తల్లి తండ్రితో పాటు హరీష్ ఇంట్లో ఉరివేసుకొని ఆత్మ హత్య చేసుకున్నారు.కొడుకు హరీష్ ఆన్లైన్లో రూ.20 లక్షల వరకు పోగొట్టుకున్నట్లు సమాచారం.ఈ అప్పులు తీర్చేందుకు తల్లిదండ్రులు పొలం కూడా అమ్మారని, అయినా అప్పులు తీరకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.ఇదీ చదవండి: ప్రియుడితో కలిసి మరో ప్రియుడి హత్య -
పిల్లలను తోసి కాలువలోకి దూకిన తల్లి
పటమట(విజయవాడతూర్పు): ఓ తల్లి తన ఇద్దరు కుమార్తెలను కాలువలోకి నెట్టి, తానూ దూకి ఆత్మహత్యకు యత్నంచింది. ఈ ఘటనలో ఓ చిన్నారి మృతదేహం లభించగా.. తల్లి, మరో కుమార్తె ఆచూకీ లభించలేదు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని స్క్రూబ్రిడ్జి వద్ద ఆదివారం ఈ ఘటన జరిగింది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలే దీనికి కారణమని తెలిసింది. పోలీసుల కథనం మేరకు వివరాలు.. గుంటూరు శారద కాలనీకి చెందిన తిరుపతిరావు రోజువారీ పనులకు వెళ్తుంటాడు. అతనికి సుధారాణి(25)తో ఐదేళ్ల కిందట వివాహమైంది. వారికి జాస్వీ (16 నెలలు), బ్లెస్సీ(4 నెలలు) సంతానం.శనివారం గుంటూరులో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. విజయవాడ కృష్ణలంకలోని కళానగర్లో నివసించే తిరుపతిరావు బావ కోటేశ్వరరావు ఇంటికి భార్యాభర్తలు వచ్చారు. మధ్యాహ్నం సమయంలో ఫోను వచి్చందని తిరుపతిరావు బయటకు వెళ్లాడు. ఆ వెంటనే సుధారాణి తన ఇద్దరు పిల్లలను తీసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చి స్క్రూబ్రిడ్జికి చేరుకుని ఇద్దరు పిల్లలను బందరు కాలువలో పడేసి ఆమె కూడా దూకింది.స్థానికులు దీనిని గమనించి వారిని కాపాడే ప్రయత్నం చేయగా బ్లెస్సీ మృతదేహం దొరికింది. విషయం తెలుసుకున్న పటమట సీఐ పవన్కిషోర్ ఎన్డీఆర్ఎఫ్ సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. కాలువలో నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో జాస్వీ, సుధారాణిల ఆచూకీ లభించలేదు. పోలీసులు తిరుపతిరావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
సంక్షోభంలో వజ్రాల పరిశ్రమ
న్యూఢిల్లీ: దేశ వజ్రాల పరిశ్రమ తీవ్ర సంక్షోభంతో కుదేలవుతోందని, పరిశ్రమలు మూత పడుతుండడంతో ఎంతో మంది ఉపాధి కల్పోతున్న పరిస్థితులు నెలకొన్నాయని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) అనే స్వతంత్ర సంస్థ వెల్లడించింది. ఆర్డర్లు తగ్గడంతో ముడి వజ్రాల నిల్వలు పెరుగుతున్నాయని, ల్యాబ్లో తయారైన వజ్రాల నుంచి పోటీ ఎక్కువగా ఉందని వివరించింది. ‘‘ఈ పరిస్థితులు రుణ ఎగవేతలు, పరిశ్రమల మూతకు, ఉపాధి నష్టానికి కారణమవుతోంది. గుజరాత్ వజ్రాల పరిశ్రమకు చెందిన 60 మంది ఇప్పటి వరకు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇది దేశ వజ్రాల పరిశ్రమ ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సమస్యలను తెలియజేస్తోంది’’అని జీటీఆర్ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ తెలిపారు. తక్షణమే ఈ సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, అప్పుడే ఈ పరిశ్రమ భవిష్యత్కు రక్షణ కలి్పంచినట్టు అవుతుందన్నారు. ఎగుమతుల్లో క్షీణత.. జీటీఆర్ఐ నివేదిక ప్రకారం 2021–22లో ముడి వజ్రాల దిగుమతులు 18.5 బిలియన్ డాలర్లుగా ఉంటే, 2023–24 నాటికి 25 శాతం మేర క్షీణించి 14 బిలియన్ డాలర్లకు తగ్గిపోయాయి. ఇక్కడి నుంచి చేసిన ముడి వజ్రాల ఎగుమతులను సర్దుబాటు చేసి చూస్తే, నికర దిగుమతులు 25 శాతం తగ్గి 17.5 బిలియన్ డాలర్ల నుంచి 13.1 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. కట్, పాలి‹Ù్డ వజ్రాల ఎగుమతులు 35 శాతం మేర తగ్గాయి. 2021–22లో 24.4 బిలియన్ డాలర్లుగా ఉంటే, 2023–24లో 13.1 బిలియన్ డాలర్లకు క్షీణించాయి. పైగా ఇదే కాలంలో విక్రయం కాని వజ్రాలను భారత్కు తిప్పిపండం అన్నది 35 శాతం నుంచి 45.6 శాతానికి పెరిగింది. నికర కట్, పాలి‹Ù్డ వజ్రాల ఎగుమతులు 45 శాతం మేర తగ్గి 15.9 బిలియన్ డాలర్ల నుంచి 8.7 బిలియన్ డాలర్లకు తగ్గిపోయినట్టు జీటీఆర్ఐ నివేదిక వివరించింది. నికర ముడి వజ్రాల దిగుమతులు, నికర కట్, పాలిష్ పట్టిన వజ్రాల ఎగమతుల మధ్య అంతరం 2021–22లో 1.6 బిలియన్ డాలర్లు ఉంటే, 2024 మార్చి నాటికి 4.4 బిలియన్ డాలర్లకు పెరిగిపోయినట్టు తెలిపింది. ముడి వజ్రాలను దిగుమతి చేసుకుని, ఇక్కడి పరిశ్రమలు కట్, పాలిష్డ్ రూపంలో, ఆభరణాల రూపంలో విదేశాలకు ఎక్కువగా ఎగుమతి చేస్తుంటాయి. సవాళ్లకు ఎన్నో కారణాలు.. నియంత్రణపరమైన అంశాలకుతోడు, పరిశ్రమలో అంతర్గతంగా ఉన్న సామర్థ్యాల లేమి ప్రస్తుత సవాళ్లకు కారణమని జీటీఆర్ఐ వివరించింది. యూఎస్, చైనా, యూరప్లో ఆర్థిక అనిశి్చతులు, ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు లగ్జరీ ఉత్పత్తులపై వినియోగం తగ్గేందుకు దారితీసినట్టు తెలిపింది. ‘‘అంతర్జాతీయంగా వజ్రాల ధరల్లో అస్థిరతలు అనిశి్చతికి కారణమయ్యాయి. ధరలు మరింత తగ్గుతాయన్న అంచనాతో పరిశ్రమలు ముడి వజ్రాల కొనుగోలుకు దూరంగా ఉన్నాయి’’అని ఈ నివేదిక తెలిపింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం సైతం అంతర్జాతీయంగా వజ్రాల సరఫరా వ్యవస్థలో అవరోధాలకు దారితీసినట్టు శ్రీవాస్తవ తెలిపారు. తక్కువ ధరలకు వచ్చే ల్యాబ్ వజ్రాలవైపు కస్టమర్లు మొగ్గు చూపిస్తుండడం సహజ వజ్రాల డిమాండ్ను ప్రభావం చేస్తున్నట్టు చెప్పారు. పెరిగిపోతున్న కారి్మక, ఇంధన, మెటీరియల్స్ వ్యయాలతో చాలా యూనిట్లు మనుగడ సాగించలేని పరిస్థితులు నెలకొన్నట్టు వివరించారు. ఇదే పరిశ్రమల మూతకు దారితీస్తున్నట్టు పేర్కొన్నారు. ఎగుమతులకు సంబంధించి రుణ సాయం, విదేశీ ముడి వజ్రాల విక్రేతలకు కార్పొరేట్ పన్ను నుంచి మినహాయించడం, ల్యాబ్ వజ్రాల పరిశ్రమను నియంత్రించడం, దుబాయి నుంచి కట్, పాలి‹Ù్డ వజ్రాల దిగుమతులపై సున్నా టారిఫ్ వంటి చర్యలను పరిశీలించాలని ప్రభుత్వానికి జీటీఆర్ఐ సూచించింది.వజ్రాల పరిశ్రమకు గడ్డుకాలం దశాబ్ద కనిష్టానికి ఆదాయం: క్రిసిల్ దేశ వజ్రాల పరిశ్రమ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోందని ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్ రేటింగ్స్ సైతం తెలిపింది. వజ్రాల పాలిషింగ్ పరిశ్రమ ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023–24)లో 25–27 శాతం మేర క్షీణించి, దశాబ్ద కనిష్ట స్థాయి అయిన 12 బిలియన్ డాలర్లకు పరిమితం అవుతుందని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. కీలక ఎగుమతి మార్కెట్లు అయిన యూఎస్, చైనాలో డిమాండ్ తక్కువగా ఉండడం, వినియోగదారులు ల్యాబ్ తయారీ వజ్రాల వైపు మొగ్గు చూపడాన్ని కారణాలుగా ప్రస్తావించింది. దీంతో వజ్రాల సరఫరా పెరిగి ధరలు 10–15 శాతం వరకు తగి్టనట్టు తెలిపింది. ఈ మేరకు పరిశ్రమపై ఒక నివేదికను తాజాగా విడుదల చేసింది. సహజ వజ్రాలను సానబట్టే పరిశ్రమ ఆదాయం తగ్గడం వరుసగా ఇది మూడో ఆర్థిక సంవత్సరం అవుతుందని పేర్కొంది. 2023–24లోనూ 29 శాతం, 2022–23లో 9 శాతం చొప్పున ఆదాయం క్షీణించినట్టు తెలిపింది. తాజా పరిణామాల నేపథ్యంలో వజ్రాల పాలిషర్లు ముడి వజ్రాల కొనుగోళ్లను తగ్గించినట్టు, దీంతో వజ్రాల మైనింగ్ సంస్థలు ఉత్పత్తిని తగ్గించుకున్నట్టు వివరించింది. ఇది ధరల పతనాన్ని కొంత వరకు అడ్డుకున్నట్టు పేర్కొంది. పరిశ్రమ ఆపరేటింగ్ మార్జిన్లు 2024–25లో 4.5–4.7 శాతం మధ్య స్థిరపడొచ్చని తెలిపింది. మొత్తం మీద మూలధన అవసరాలు తగ్గడంతో రుణాలపై ఆధారపడడం తగ్గుతుందని, ఇది కంపెనీల రుణ పరపతికి మద్దతుగా నిలుస్తుందని అంచనా వేసింది. -
హైడ్రా భయంతో మహిళ ఆత్మహత్య
కూకట్పల్లి (హైదరాబాద్): హైడ్రా అధికారులు తమ ఇళ్లు కూడా కూల్చివేస్తారేమో అన్న భయంతో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. కూకట్పల్లి పోలీసుస్టేషన్ పరిధిలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..కూకట్పల్లి రామాలయం సమీపంలోని యాదవబస్తీకి చెందిన గుర్రంపల్లి బుచ్చమ్మ (56 ).. భర్త శివయ్యతో కలిసి సొంత ఇంటిలో నివసిస్తోంది. వీరికి నల్లచెరువు సమీపంలో మరో రెండు ఇళ్లు, కారు షెడ్డు ఉన్నాయి. వీటిని అద్దెకు ఇచి్చన భార్యాభర్తలు పాల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి ముగ్గురు కుమార్తెలకు వివాహాలు కావడంతో తమ ఇళ్లను వారికి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.అయితే గత ఆదివారం హైడ్రా అధికారులు నల్లచెరువు ఎఫ్టీఎల్లో ఉన్న కొన్ని అక్రమ నిర్మాణాలను తొలగించారు. వీటికి ఎదురుగానే రోడ్డుకు ఆవతలి వైపు బుచ్చమ్మ ఇళ్లు, కారు షెడ్డు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఉన్న నిర్మాణాలను సైతం హైడ్రా అధికారులు కూల్చేస్తారని స్థానికులు చర్చించుకుంటున్నారు. దీంతో బుచ్చమ్మ ఆందోళనకు గురై శుక్రవారం సాయంత్రం భర్త హాల్లో ఉండగానే బెడ్రూమ్లోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ‘మా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి కష్టపడి మా కోసం ప్లాట్లు కొని ఇళ్లు కట్టించారు. అయితే హైడ్రా వాళ్లు చుట్టుపక్కల ఇళ్లు పడగొడుతున్నారు. మా ఇళ్లూ అలాగే అవుతాయనే టెన్షన్తో మా అమ్మ ఆత్మహత్య చేసుకుంది..’ అని బుచ్చమ్మ కుమార్తె సరిత చెప్పింది. -
బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
పటాన్చెరు టౌన్: బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ çఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ ప్రవీణ్రెడ్డి కథనం ప్రకారం.. ఏపీలోని అనంతపురంలో విద్యుత్ శాఖలో ఉద్యోగిగా పనిచేస్తున్న నాగరాజు రెండో కూతురు వర్ష (19) పటాన్చెరు మండలంలోని గీతం విశ్వవిద్యాలయంలో బీటెక్ చదువుతోంది.అక్కడే బాలికల హాస్టల్లో ఉంటోంది. శుక్రవారం మధ్యాహ్నం ఆమె తన గదిలోకి వెళ్లి బెడ్షీట్తో ఫ్యాన్కు ఉరేసుకుంది. కొద్దిసేపటి తర్వాత తోటి విద్యార్థినులు తలుపు కొట్టినా తీయకపోవడంతో వాచ్మన్ వచ్చి తలుపు పగులగొట్టి లోపలకు వెళ్లి చూడగా.. వర్ష ఫ్యాన్కు వేలాడుతూ కన్పించింది. -
గీతం యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి,సంగారెడ్డి: గీతం యూనివర్సిటీ సంగారెడ్డి క్యాంపస్ హాస్టల్లో ఇంజినీరింగ్ విద్యార్థిని వర్ష (19) ఆత్మహత్య చేసుకుంది.వర్ష గీతం ఇంజినీరింగ్ కాలేజీలో బీ.టెక్(సీఎస్ఈ) 3వ సంవత్సరం చదువుతోంది.వర్ష స్వస్థలం అనంతపురంగా పోలీసులు గుర్తించారు.ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థిని మృతికి గల కారణాలపై కాలేజీ సిబ్బంది, తోటి విద్యార్థులను ఆరా తీస్తున్నారు.ఇదీ చదవండి: విద్యార్థిని మృతిపై అనుమానాలు నివృత్తి చేయండి -
పని ఒత్తిడితో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య!
చెన్నై: ఇటీవల ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియాకు చెందిన 26 ఏళ్ల ఉద్యోగిని పని ఒత్తిడితో మృతిచెందిన ఘటన మరవక ముందే మరొకటి వెలుగులోకి వచ్చింది. తీవ్రమైన డిప్రెషన్తో బాధపడుతున్న 38 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెన్నైలోని తన ఇంట్లో ఆత్మహత్యకు చేసుకున్నాడు. పని ఒత్తిడి కారణంగానే తన భర్త ఆత్మ హత్య చేసుకొని ఉంటాడని అతని భార్య అనుమానం వ్యక్తం చేసినట్లు పోలిసులు తెలిపారు.పోలీసుల వివరాల ప్రకారం.. తమిళనాడులోని తేని జిల్లాకు చెందిన కార్తికేయన్ తన భార్య, ఇద్దరు పిల్లలతో చెన్నైలో నివసిస్తున్నారు. గత 15 ఏళ్లుగా ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో కార్తికేయ టెక్కీగా పని చేస్తున్నారు. ఇక.. కార్తికేయ తీవ్రమైన పని ఒత్తిడి కారణంగా ఇబ్బంది పడుతున్నారు. రెండు నెలలుగా ఆయన డిప్రెషన్కు చికిత్స పొందుతున్నాడు.ఘటన సమయంలో కార్తికేయ ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. సోమవారం ఆయన భార్య కె జయరాణి.. పిల్లలను తన తల్లి వద్దకు దింపి, చెన్నైకి 300 కిలోమీటర్ల దూరంలోని తిరునల్లూరు ఆలయానికి వెళ్లారు. గురువారం రాత్రి తిరిగి వచ్చి తలుపు కొట్టగా.. ఇంట్లో నుంచి ఎటువంటి స్పందన లేదు. ఇంట్లోకి ప్రవేశించడానికి స్పేర్ కీని ఉపయోగించి లోపలికి వెళ్లగా.. కార్తికేయ కరెంట్ తీగకు చుట్టుకొని విగతజీవిగా పడిఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి.. అసహజ మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఇదికూడా చదవండి: పని ఒత్తిడితో మహిళా ఉద్యోగి షాకింగ్ డెత్, స్పందించిన కేంద్రం -
మెట్రో.. అవుతోందా సూసైడ్ స్పాట్?
సాక్షి, బెంగళూరు: బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలను తీర్చేలా ఉన్న మెట్రో రైలు వ్యవస్థ ఆధునికతగా ప్రతిరూపంగా ఆకర్షిస్తోంది. కానీ ఇలాంటి నమ్మ మెట్రో స్టేషన్లు సూసైడ్ స్పాట్గా మారడం అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. ఈ ఏడాదిలో 9 నెలల్లో 7 ఆత్మహత్యాయత్నాలు జరగడం గమనార్హం. చనిపోతామంటూ మెట్రో రైలు పట్టాలపై దూకుతున్న ఘటనలు తలనొప్పిగా మారాయి. ఫలితంగా మెట్రో రైలు సేవలకు అంతరాయం ఏర్పడడంతో పాటు ప్రయాణికులు భయాందోళనకు గురవుతుంటారు.గ్లాస్ డోర్లు ఎక్కడ?ఈ ప్రమాదాల నివారణ కోసం పీఎస్డీ (ఫ్లాట్ఫారం స్క్రీనింగ్ డోర్)ని ఏర్పాటు చేయాలని గత కొన్నేళ్లుగా డిమాండ్లు వినిపిస్తున్నా ఎందుకు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీ, చైన్నె, కొచ్చి మెట్రోలో ఈ పీఎస్డీ డోర్లను ఏర్పాటు చేశారు. అయితే నమ్మ మెట్రోలో మాత్రం ఇంకా ఆచరణలోకి రాకపోవడం గమనార్హం. ఈ డోర్లను అమర్చితే ట్రాక్పైకి ప్రయాణికులు పడిపోయే, దూకే ఘటనలు తప్పిపోతాయని నిపుణులు తెలిపారు. మెట్రో స్టేషన్కు రైలు వచ్చినప్పుడు మాత్రమే ఈ స్క్రీనింగ్ డోర్లు తెరుచుకుంటాయి. ప్రయాణికులు రైల్లోకి ఎక్కిన తర్వాత తిరిగి మూసుకుపోతాయి. ఇలా ప్రయాణికుల భద్రతలో ఎంతో కీలకమైన పీఎస్డీ డోర్లను వెంటనే బెంగళూరు మెట్రో స్టేషన్లలో కూడా అమర్చాలని చెబుతున్నారు. నమ్మ మెట్రో ప్రారంభమై 13 ఏళ్లు పూర్తి అయింది. ఇంతవరకు రక్షణ గోడలు ఏర్పాటు చేయకపోవడం ఆశ్చర్యకరమని విమర్శలున్నాయి.ఈ ఏడాది జరిగిన కొన్ని సంఘటనలు జనవరి 01– మొబైల్ పడిపోయిందని..ఇందిరా నగర మెట్రో రైల్వే స్టేషన్లో ట్రాక్పై పడిన మొబైల్ను తీసేందుకు ఒక మహిళ ట్రాక్పైకి దిగింది. సిబ్బంది వెంటనే ఆ మహిళను గుర్తించి బయటకు లాగి ప్రాణాన్ని కాపాడారు. పట్టాలకు హై ఓల్టేజ్ కరెంటు అనుసంధానమై ఉంటుంది. తగిలితే ప్రాణాలు పోవచ్చు. ఈ ఘటనతో 15 నిమిషాలు రైలు సేవలు నిలిచిపోయాయి. జనవరి 5 – యువకుడు దూకి..కేరళకు చెందిన షారోన్ (23) అనే యువకుడు జాలహళ్లి మెట్రో స్టేషన్లో ఆత్మహత్య చేసుకోవాలని రైలు వస్తుండగా పట్టాల మీదకు దూకాడు. ఆ వ్యక్తిని చూసిన లోకోపైలట్ వెంటనే అత్యవసర బ్రేకులను ఉపయోగించి రైలు నిలిచిపోయేలా చేయడంతో ప్రాణాపాయం తప్పింది. జనవరి 6 – నల్ల పిల్లి ఆటంకంజేపీ నగర మెట్రో రైల్వే స్టేషన్లో పట్టాలపై నల్లటి పిల్లి ఒకటి కనిపించింది. మెట్రో రైల్వే స్టేషన్ సిబ్బంది ఆ పిల్లిని అక్కడి నుంచి తరిమేసేందుకు నానా తిప్పలు పడ్డారు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా కూడా మారాయి. మార్చి 12– పట్టాలపై నడకజ్ఞానభారతి మెట్రో స్టేషన్–పట్టణగెరె మెట్రో స్టేషన్ మధ్య వయడక్ట్లో ఒక గుర్తు తెలియని వ్యక్తి కనిపించాడు. మెట్రో పట్టాలపై ఉన్న వయడక్ట్పై నడుచుకుంటూ వెళుతున్నాడు. దీంతో కూడా మెట్రో సేవలు కొంత సమయం నిలిచిపోయాయి. మార్చి 21– లా విద్యార్థి ఆత్మహత్యఅత్తిగుప్పే మెట్రోస్టేషన్లో 19 ఏళ్ల ధ్రువ్ టక్కర్ అనే లా విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. స్టేషన్కు రైలు వస్తుండగా నేరుగా పట్టాలపైకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందుకు మానసిక ఒత్తిడి కారణంగా ప్రాథమికంగా నిర్ధారించారు. ఆగస్టు 3 – మరో ఆత్మహత్యదొడ్డకల్లసంద్ర మెట్రో స్టేషన్లో ట్రైన్ రావడాన్ని గమనించిన 35 ఏళ్ల వ్యక్తి ట్రాక్ మీదకు దూకాడు. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. ఈ ప్రమాదంతో చాలా సమయం వరకు మెట్రో రైలు సేవలు నిలిచిపోయాయి.సెప్టెంబర్ 17 – మరో ఆత్మహత్యాయత్నం..జ్ఞానభారతి మెట్రో స్టేషన్లో రైలు రావడాన్ని గమనించి ఆత్మహత్య చేసుకునేందుకు ట్రాక్ మీదకు దూకాడు. ఈసందర్భంలో మెట్రో సెక్యురిటీ సిబ్బంది సిద్ధార్థ జైన్ అతని ప్రాణాలను కాపాడారు. బ్యాంకులో రూ. 3 లక్షల అప్పు చేసి తీర్చలేకనే బాధతో ఆత్మహత్యకు యత్నించినట్లు తెలిసింది.అత్యాధునిక సౌకర్యాలతో కూడిన మెట్రో రైళ్లు, స్టేషన్లకు వెళ్లడం ఒక మంచి అనుభూతిగా ఉంటుంది. అందుకే ఎంతోమంది అవసరం లేకపోయినా మెట్రో రైళ్లలో ప్రయాణిస్తారు. అనేక ఊర్ల నుంచి నిత్యం పెద్దసంఖ్యలో ఔత్సాహికులు మెట్రో సేవల కోసం వస్తుంటారు. కానీ కొందరికి మాత్రం అది ఆత్మహత్యకు అనువైన ప్రాంతంగా కనిపిస్తోంది. చిన్న చిన్న సమస్యలకు కుంగిపోయి మెట్రో పట్టాలపైకి దూకాలని వస్తారు. ఈ సమస్యను నివారించడం మెట్రోకు చిక్కుముడిగా మారింది. -
డిప్లొమా విద్యార్థి ఆత్మహత్య
మధురవాడ: టీడీపీ మాజీ ఎమ్మెల్సీకి చెందిన చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న డిప్లొమా విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. పీఎంపాలెం పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పార్వతీపురం మన్యం జిల్లా నర్సిపురం బీజీ కాలనీకి చెందిన నిండుగొండ శంకరరావు, జ్ఞానేశ్వరి కుమారుడు జ్యోతి ప్రకాశ్ (16) విశాఖ నగర శివారు కొమ్మాది చైతన్య వ్యాలీలోని చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో డిప్లమా మెకానికల్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కళాశాలలోని బాయ్స్ హాస్టల్ బ్లాక్ ఎఫ్–7లో ఏడుగురు విద్యార్థులతో కలిసి ఉంటున్నాడు. శుక్రవారం తల్లితో ఫోన్లో మాట్లాడిన జ్యోతి ప్రకాశ్.. అక్టోబర్ మొదటి వారంలో పరీక్షలు ఉండడంతో ఆందోళనగా ఉందని చెప్పాడు. శనివారం ఉదయం కాస్త కడుపు నొప్పిగా ఉందని, క్లాసుకి వెళ్లలేనని తల్లికి మళ్లీ ఫోన్ చేసి చెప్పాడు. దీంతో ఆమె వార్డెన్కు ఫోన్ చేసి హాస్టల్లో ఉంచాలని చెప్పింది. మధ్యాహ్నం 1.30 సమయంలో ఇదే గదిలో ఉంటున్న సహచర విద్యార్థి తలుపు కొట్టగా తియ్యలేదు. దీంతో హాస్టల్ సిబ్బంది బలవంతంగా తలుపులు తీయగా.. జ్యోతిప్రకాశ్ ఫ్యాన్కి ఉరేసుకుని ఉన్నాడు. వైద్యం నిమిత్తం సమీపంలోని గాయత్రి హాస్పిటల్కి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విద్యార్థి మృతికి గల కారణాలు తెలియరాలేదని పీఎంపాలెం సీఐ గేదెల బాలకృష్ణ చెప్పారు. కాగా కొద్ది నెలల క్రితం ఇదే క్యాంపస్లో ఓ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఒకే ఏడాదిలో ఇద్దరు విద్యార్థులు చనిపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. తల్లి జ్ఞానేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
పాట్నా ఎన్ఐటీలో ఏపీ విద్యార్థిని ఆత్మహత్య
పాట్నా: ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ విద్యార్ధిని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) పాట్నాలో ఆత్మహత్యకు పాల్పడింది. బిహ్తాలో క్యాంపస్లోని శుక్రవారం రాత్రి తన హాస్టల్ గదిలో ఉరి వేసుకొని ప్రాణాలు విడిచింది. ఘటనా స్థలంలో సూసైడ్ లేఖ కూడా లభ్యమైనట్లు పోలీసులు శనివారం తెలిపారు.శుక్రవారం రాత్రి 10.15 గంటల ప్రాంతంలో విద్యార్థిని హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని ఉండటాన్ని గుర్తించిన తోటి విద్యార్ధులు యాజమాన్యానికి తెలియజేశారు. వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. అక్కడికి చేరుకుని విద్యార్ధినిని సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే యువతి చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు.మృతురాలి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ అని, ఆమె కుటుంబసభ్యులకు సమాచారమిచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లభ్యమైందని, ఆ దిశగా కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు. అయితే విద్యార్ధిని మృతికి గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియలేదని చెప్పారు. మరోవైపు విద్యార్థి మరణవార్త తెలియడంతో పెద్ద సంఖ్యలో ఇన్స్టిట్యూట్కు చెందిన విద్యార్థులు క్యాంపస్ వెలుపల ఆందోళన చేపట్టారు. ఇన్స్టిట్యూట్ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
ఫుడ్ డెలివరీ ఆలస్యమైందని చేయి చేసుకుంటే..
చెన్నై: ఫుడ్ డెలివరీ ఆలస్యం కావడం..ఓ విద్యార్థి నిండు ప్రాణాలను బలి తీసుకుంది. చెన్నైకి చెందిన పవిత్రన్(19) బీకాం చదువుకుంటూ తీరిక వేళల్లో డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. ఈ నెల 11వ తేదీన కొరట్టూర్ ప్రాంతం నుంచి వచ్చిన ఆర్డర్ను అందజేయడానికి పవిత్రన్ బయలుదేరాడు. లొకేషన్ గుర్తించి, చేరుకోవడంలో ఆలస్యమైంది. ఈ విషయంలో మహిళా కస్టమర్తో పవిత్రన్కు వివాదం తలెత్తింది. ఈ క్రమంలో ఆమె అతనిపై చేయి చేసుకుంది. ఆ తర్వాత ఆమె సంబంధిత కంపెనీకి ఫిర్యాదు చేశారు. రెండు రోజుల తర్వాత పవిత్రన్ రాయి విసరడంతోనే తన ఇంటికి కిటికీ అద్దం పగిలిందని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం పవిత్రన్ తన ఇంట్లో ఉరి వేసుకుని, తనువు చాలించాడు. ఫుడ్ డెలివరీ ఆలస్యమైనందుకు మహిళా కస్టమర్ తనను కొట్టడంతో తీవ్ర మనస్తాపంతో ఈ విపరీత నిర్ణయం తీసుకున్నట్లు అందులో పేర్కొన్నాడు. పోలీసులు ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
HYD: శ్రుతి కేసులో వీడిన మిస్టరీ
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలిలోని ఓ హోటల్లో నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద రీతిలో మృతి చెందడడం తెలిసిందే. అయితే ఈ కేసులో మిస్టరీ వీడింది. శృతిది రేప్ అండ్ మర్డర్ కాదని.. ఆమె బలవన్మరణానికి పాల్పడిందని పోలీసులు తేల్చేశారు.జడ్చర్లకు చెందిన శ్రుతి (23).. మూడు రోజుల కిందట గచ్చిబౌలి రెడ్ స్టోన్ హోటల్లో ఫ్యాన్కు శవమై వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. గదిలో బీర్ బాటిల్స్ ఉండడం, అంతా చిందరవందరగా ఉండడంతో గొడవ జరిగి ఉంటుందని అనుమానించారు. మరోవైపు.. మృతదేహాన్ని తరలించకుండా ఆమె బంధువులు అడ్డుకున్నారు. ఆమెపై హత్యాచారం జరిగిందన్నది వాళ్ల ప్రధాన ఆరోపణ. దీంతో పోలీసులు వాళ్లకు సర్ధిజెప్పి ఉస్మానియాకు బాడీని పోస్ట్మార్టం నిమిత్తం పంపించారు.ఈలోపు కేసు దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు.. ఆమెది ఆత్మహత్యగానే తేల్చారు. ‘‘శ్రుతి గత కొంతకాలంగా జీవన్ అనే వ్యక్తితో ప్రేమలో ఉంది. అయితే పెళ్లికి ఆ యువకుడు నిరాకరించాడు. దీంతో మాట్లాడుకునేందుకు ఇద్దరూ హోటల్కు వెళ్లారు. అక్కడ మాటామాటా పెరిగి.. ఇద్దరూ గొడవ పడ్డారు. జీవన్ తన తన ఫ్రెండ్ గదికి వెళ్లిపోయాడు. శ్రుతి పక్కనే ఉన్న మరో గదిలోకి వెళ్లి ఉరేసుకుంది’’ అని వివరాలను తెలిపారు. ప్రేమ వ్యవహారం బెడిసి కొట్టడంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని చెబుతున్న పోలీసులు.. జీవన్ను కస్టడీలోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. -
విద్యార్థిని ఆత్మహత్యపై అనుమానాలెన్నో..
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలులోని హర్షిణి జూనియర్ కాలేజీలో ఇంటర్మియెట్ మొదటి సంవత్సరం విద్యార్థిని భావన ఆత్మహత్యపై ఎన్నో అనుమానాలు నెలకొన్నాయి. దీంతో బాలిక తల్లి, సోదరితో పాటు విద్యార్థిసంఘాల నేతలు సైతం విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తండ్రి లేకున్నా తన పిల్లలతో రెక్కల కష్టంతో చదివించానని తల్లి రోదించిన తీరు స్థానికులను సైతం కంటతడిపెట్టించింది.ఆ చీర ఎక్కడిది..?భావన ఉరేసుకున్న చీరపై అటు కళాశాల యాజమాన్యం, ఇటు బాలిక కుటుంబసభ్యులు చెరో మాట చెబుతున్నారు. సెలవులకు ఇంటికి వెళ్లిన భావన ఇంటి నుంచి వచ్చే సమయంలోనే చీర తెచ్చుకుందని కళాశాల యాజమాన్యం చెబుతుంది. ఇంటి నుంచి చీర తెచ్చుకోలేదని, అది ఎక్కడ నుంచి వచ్చిందో మాకు తెలియదని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఇందులో ఎవరి మాట నిజమో పోలీసులే చెప్పాలి. అయితే భావన ఇంటి నుంచి చీర తెచ్చుకొని ఉంటే కళాశాల సిబ్బంది ఎందుకు ప్రశ్నించలేదో, కళాశాలలోకి చీరను ఎందుకు అనుమతిచ్చారో తెలియాల్సి ఉంది. బాలల హక్కుల కమిషన్ చైర్మన్ బత్తుల పద్మావతి కూడా కాలేజీలోకి చీర ఎలా వచ్చిందో విచారణ చేయాలని ఆదేశించారు.మొఖం చాటేసిన చైర్మన్కళాశాలలో ఇంటర్మీడియెట్ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసి కూడా టీడీపీ నాయకుడు, కళాశాల చైర్మన్ గోరంట్ల రవికుమార్ పత్తా లేకుండా పోయారు. ఆయనతో పాటుగా కళాశాల హెచ్ఆర్ సురేష్, కేర్ టేకర్ చాముండేశ్వరి కూడా కనిపించలేదు. కళాశాల ప్రిన్సిపాల్కు బదులుగా డీన్ ఆంజనేయులు మీడియాతో మాట్లాడారు. ఒక్కసారిగా వీరంతా కనిపించకుండా పోవడంపై మృతురాలి సోదరి ఐశ్వర్య అనుమానం వ్యక్తం చేశారు. కళాశాల యాజమాన్యం విద్యార్థిని కుటుంబ సభ్యులతో ఎందుకు మాట్లాడరని నిలదీశారు. పచ్చవ గ్రామానికి చెందిన మరో ఇద్దరు విద్యార్థినులు భావనతో కలిసి చదువుకుంటున్నారని, కనీసం వారితో కూడా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.విచారణకు బాలల హక్కుల కమిషన్ ఆదేశంభావన ఆత్మహత్య సమాచారం తెలిసిన వెంటనే రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి ఘటనా స్థలాన్ని సందర్శించి బాలిక మృతదేహాన్ని పరిశీలించారు. కళాశాలలోని విద్యార్థినులతో మాట్లాడారు. కళాశాల చైర్మన్ అందుబాటులో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాల నిర్వాహణా లోపాలపై ప్రశ్నించారు. ఐదంతస్తుల భవన నిర్మాణానికి ఎవరు అనుమతులు ఇచ్చారని, జూనియర్ కళాశాలను నిర్వహిస్తున్నప్పుడు బాలల హక్కుల పరిరక్షణకు ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదని నిలదీశారు. ప్రతి అంతస్తులోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పర్యవేక్షించాల్సి ఉండగా కనీసం ఒక్క అంతస్తులోనూ సీసీ కెమెరాలను ఎందుకు ఏర్పాటు చేయలేదని, కనీసం భోజనాల దగ్గరైనా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయకుండా నిర్లక్షం వహించారని మండిపడ్డారు. బాలిక ఆత్మహత్య చేసుకున్నప్పుడు కళాశాల యూనిఫాం ధరించడం, ఉరి వేసుకున్న షెడ్డు పై కప్పు పెద్దగా ఎత్తులో లేకపోవడం, ఉరి వేసుకునేందుకు చీర ఎక్కడనుంచి వచ్చిందో తెలియాల్సి ఉందని సందేహాలను వ్యక్తం చేశారు. మూడు రోజుల్లోగా పూర్తి వివరాలతో సమగ్ర నివేదిక ఇవ్వాలని జిల్లా అధికారులకు ఆమె ఆదేశించారు. ఆమెతో పాటుగా ఆర్ఐఓ సైమన్, జిల్లా బాలల హక్కుల కమిటీ సభ్యురాలు నీలిమ, డిస్టిక్ ప్రొటెక్షన్ ఆఫీసర్ దినేష్ కుమార్, సామాజిక కార్యకర్త వీరాంజనేయులు ఉన్నారు. భావన ఆత్మహత్యపై సమగ్ర విచారణ చేయాలని, కళాశాలలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సీహెచ్ వినోద్, పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు రాజశేఖర్ డిమాండ్ చేశారు. -
వారణాసిలో ఏపీకి చెందిన అన్నదమ్ముల బలవన్మరణం
వారణాసి/ఏలూరు: ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇద్దరు అన్నదమ్ములు వారణాసిలో ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక సెల్ఫీ వీడియోలు తీసి ఆత్మహత్య చేసుకోవడంతో విషాదం నెలకొంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఏలూరు జిల్లా ఉంగటూరులోని నారాయణపురానికి చెందిన అన్న దమ్ములు వినోద్, లక్ష్మీనారాయణలు రియల్ ఎస్టేట్,ఫైనాన్స్ వ్యాపారం చేస్తుండేవారు. వ్యాపార నిర్వహణకు స్నేహితులు, స్థానికుల వద్ద అప్పులు చేశారు.అయితే వ్యాపారంలో నష్టాలు రావడం, తమ డబ్బులు ఇవ్వాలంటూ ఒత్తిడి చేయడంతో అన్నదమ్ములు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు .అనంతరం ఏపీ నుంచి వారణాసికి వెళ్లారు. అక్కడ ఆంధ్రా ఆశ్రమంలో గదిని అద్దెకు తీసుకుని.. అందులోనే ఉంటున్నారు.ఇదీ చదవండి : ప్రశ్నార్ధకంగా విశాఖ ఉక్కు పరిశ్రమఈ తరుణంలో వ్యాపారంలో నష్టాలు, అప్పులు ఇచ్చిన వారిని నుంచి ఒత్తిడి పెరిగిపోతుందని, తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సెల్ఫీ వీడియో తీశారు. ప్రాణాలు పోగొట్టుకున్నారు. సెల్ఫీ వీడియోపై సమాచారం అందుకున్న వారాణాసి పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే అన్నదమ్ములిద్దరు ప్రాణాలు విడిచినట్లు నిర్ధారించారు. అన్నదమ్ముల మృతిపై ఏపీలోని వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
ఇంటి దీపాన్ని.. ఇల్లే ఆర్పుతోందా!
సాధారణంగా పేదరికం, నిరుద్యోగం, అప్పులు, అవమానాలు, కుంగుబాటు, వైవాహిక సమస్యలు.. వంటివి ఆత్మహత్యలకు పురిగొల్పుతాయి. అయితే వాటిలో గృహహింస కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఆత్మహత్య అనేది వ్యక్తిగత చర్య అయినప్పటికీ అది అనేక సామాజిక కారణాలతో ప్రభావితం అయ్యి ఉంటుంది. వ్యక్తిగత దుర్బలత్వం సామాజిక ఒత్తిళ్ల నుంచి వచ్చేదై ఉంటుంది. దీనిని మానసిక అనారోగ్యంగానూ అర్థం చేసుకోవచ్చు. ఇందులో కుటుంబ కలహాలు, సామాజిక అస్థిరతలు సమాన పాత్ర పోషిస్తాయి.గృహహింసలో ప్రధానంగా...గృహహింస కారణంగా 64 శాతం మంది మహిళలు ఆత్మహత్య ఆలోచనలు చేస్తున్నట్టు ‘నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్’ జరిపిన అధ్యయనంలో గుర్తించారు. ఈ అధ్యయనం విడాకులు, వరకట్నం, ప్రేమ వ్యవహారాలు, వివాహం రద్దు లేదా వివాహం చేసుకోలేకపోవడం (భారతదేశంలో వివాహ విధానాల ప్రకారం), అవాంఛిత గర్భం, వివాహేతర సంబంధాలు, ఈ సమస్యకు సంబంధించిన విభేదాలు.. ఇలాంటివన్నీ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ‘పరువు’ అనే కారణంతో కుటుంబ ఆత్మహత్య సంఘటనలు తరచు సంభవిస్తుంటాయి.మానసిక రుగ్మతలుఆత్మహత్య కారణంగా మరణించేవారిలో దాదాపు 90 శాతం మంది మానసిక రుగ్మతతో బాధపడుతున్నారని చాలా అధ్యయనాలు సూచిస్తున్నాయి. చెన్నైలో చేసిన అధ్యయనంలో 80 శాతం, బెంగళూరులో 43 శాతం మంది మానసిక రుగ్మతలతో బాధపడతున్నట్లు తెలిసింది. సమాజంలో/ కుటుంబంలో అణచివేతకు గురైనవారు డిప్రెషన్, ఇతర మానసిక వ్యాధి లక్షణాలను ఉన్నట్టు గుర్తించారు. వీరిలో ఎక్కువశాతం మంది డిప్రెషన్వల్లే ఆత్మహత్యకు పాల్పడ్డారు.మద్యపానం వల్ల..ఆత్మహత్యలలో మద్యపానం కీలకమైన పాత్ర పోషిస్తోంది. ఆత్మహత్య చేసుకునే సమయంలో 30–50 శాతం మంది పురుషులు మద్యం మత్తులో ఉండగా, స్త్రీలను వారి భర్తల మద్యపాన వ్యసనమే ఆత్మహత్యకు పురికొల్పుతున్నట్లు వెల్లడైంది. ఆత్మహత్య అనేది ఎన్నో అంశాలు కలిసిన అతి పెద్ద సమస్య. అందుకే నివారణ చర్యలు కూడా అన్ని వైపుల నుంచి జరగాలి. ఇక జాతీయ స్థాయిలో ఆత్మహత్య నివారణ ప్రణాళికలను అభివృద్ధి చేయడానికి, అమలు చేయడానికి, సహకారం, సమన్వయం, నిబద్ధత అవసరం. మానసిక ఆరోగ్య రంగంలో సామాజిక, ప్రజారోగ్యమే లక్ష్యంగా ఉండాలి. మానసిక ఆరోగ్య నిపుణులు ఆత్మహత్యల నివారణలో చురుకైన పాత్ర పోషించాలి.చేయూత అవసరం..→ గృహహింస బాధితులకు వారి చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా కారణం అవుతుంటారు. భరించడం అనే స్థాయి నుంచి తమ బతుకు తాము బతకగల ధైర్యం, స్థైర్యం పెం΄÷ందించుకోవాలి. → టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ నూతన జీవనం వైపుగా అడుగులు వేయాలి. ఇందుకు కుటుంబ సభ్యులు చేయూతను అందించాలి. → స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రజలలో అవగాహన తరగతులు నిర్వహించాలి. → ఉపాధ్యాయులు, పోలీసులు, నాయకులు, నమ్మకమిచ్చే అభ్యాసకులు... ఇలా అందరూ బాధ్యత గా వ్యవహరించాలి.→ ప్రాణాలతో బయటపడిన వారిని సంఘటితం చేసి, వారిని ఈ అవగాహన తరగతులలో పాలుపంచుకునేలా చేయాలి.– పి.జ్యోతిరాజ, సైకాలజిస్ట్గమనిక:ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
అమ్మా! వద్దు.. వద్దంటున్నా..
గోదావరిఖని: ‘అమ్మా.. వద్దు వద్దు! నువ్వు ఏం జేస్తున్నవో నాకు తెలుస్తలేదు.. ఆ పని చేయొద్దమ్మా.. నాకు భయమేస్తుంది అమ్మా!’అని కూతురు వారిస్తున్నా వినకుండా ఓ వివాహిత, ఓ వ్యక్తితో వీడియోకాల్లో మాట్లాడుతూనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో శనివారం ఈ ఘటన జరిగింది.పోలీసుల కథనం ప్రకారం.. పెద్దపల్లి మండలం మూలసాల గ్రామానికి చెందిన చొప్పరి అంజయ్య, మాధవి భార్యాభర్తలు. ఉపాధి కోసం వారు పదేళ్ల క్రితం గోదావరిఖని విఠల్నగర్కు వలస వచ్చారు. అంజయ్య సెంట్రింగ్ పనులు చేస్తున్నాడు. వీరికి ఏడేళ్ల వయసున్న రితిక అనే కూతురు ఉంది. తిలక్నగర్కు చెందిన సింగరేణి ఉద్యోగి ఎండీ యూసుఫ్ కుటుంబసభ్యులతో అంజయ్య, మాధవి కుటుంబానికి ఎనిమిదేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది.ఈ క్రమంలో యూసుఫ్ తరచూ వీరి ఇంటికి వచ్చివెళ్లేవాడు. మాధవి, యూసుఫ్ ఫోన్లో కూడా మాట్లాడుకునేవారు. అంజయ్య శనివారం ఉదయం సెంట్రింగ్ పనులు చేసేందుకు గోదావరిఖని సమీపంలోని సుందిళ్ల గ్రామానికి వెళ్లాడు. ఏం జరిగిందో ఏమోకానీ.. యూసుఫ్తో వీడియోకాల్లో మాట్లాడుతూనే ఉదయం 10 గంటల సమయంలో మాధవి (30) ఉరివేసుకుంది. ఉరివేసుకుంటుండగా పక్కనే ఉన్న ఆమె కూతురు అమ్మా వద్దు వద్దు.. అని వారించినా వినలేదు. తన భార్య మరణం విషయంలో యూసుఫ్పై అనుమానంగా ఉందని మృతురాలి భర్త అంజయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేశ్ తెలిపారు. -
యువరైతును మింగిన వర్షాలు
కురవి: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సాగు చేసిన మిర్చి పంట కుళ్లిపోవడం.. చేసిన అప్పులు తీర్చేమార్గం లేక మనస్తాపానికి గురైన యువ రైతు భూక్య హత్తిరాం (33) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం రాజోలు శివారు హరిదాసు తండా జీపీ పరిధిలోని హర్య తండాలో శుక్రవారం జరిగింది. హత్తిరాం తనకున్న రెండు ఎకరాలకు తోడు మరో ఎకరం భూమిని కౌలుకు తీసుకుని సాగు చేసుకుంటున్నాడు. గతేడాది మిర్చి సాగు చేయగా నల్లి రోగంతో పంట నాశనమైంది. అప్పుడు పంట కోసం రూ.6 లక్షల అప్పులు చేశాడు.ఆ అప్పులు తీరలేదు. ఈ ఏడాది అదే పంటను నమ్ముకుని తిరిగి మిర్చి సాగు చేశాడు. ఇటీవల భారీ వర్షాలు కురవడంతో వేసిన మిరప తోట కుళ్లిపోయి పనికిరాకుండా పోయింది. దీంతో మనస్తాపానికి గురైన హత్తిరాం గురువారం తోట వద్ద పురుగుల మందు తాగి ఇంటికి వచ్చాడు. అస్వస్థతకు గురైన హత్తిరాం కుటుంబ సభ్యులకు మందు తాగినట్లు చెప్పాడు. అప్పటికే పరిస్థితి విషమిస్తుండటంతో కుటుంబసభ్యులు వెంటనే మహబూబాబాద్లోని జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. మృతుడి తండ్రి భూక్య స్వామి (సామ్య) ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కురవి ఎస్సై గండ్రాతి సతీశ్ తెలిపారు. మృతుడికి భార్య మీనా, అరవింద్, అరుణ్ కుమారులున్నారు. -
లోన్యాప్ వేధింపులు.. యువకుడి ఆత్మహత్య
సాక్షి,కుత్బుల్లాపూర్: లోన్యాప్ వేధింపులకు మరో యువకుడు బలయ్యాడు. కుత్బుల్లాపూర్కు చెందిన విద్యార్థి భానుప్రకాష్(22) పేట్బషీరాబాద్ పీఎస్ పరిధిలోని ఫాక్స్ సాగర్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం శుక్రవారం(సెప్టెంబర్6) వెలుగులోకి వచ్చింది. భానుప్రకాష్ మృతిపై గురువారం జీడిమెట్ల పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. భానుప్రకాష్ ఆరోరా కళాశాలలో పీజీ చదువుతున్నాడు. మొబైల్ఫోన్ లొకేషన్ ద్వారా భానుప్రకాష్ ఆచూకీ కనుక్కున్నారు. చెరువు వద్దకు వెళ్లి చూడగా అతని దుస్తులు,వాహనం గట్టుపై ఉండటంతో పోలీసులకు సమాచారమందించారు. దీంతో పోలీసులు చెరువు నుంచి మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడి మొబైల్లో లోన్ యాప్ కు సంబంధించిన చాటింగ్ లభ్యమైంది. -
TG: ప్రభుత్వ ఆఫీసులో రైతు ఆత్మహత్య
సాక్షి,మేడ్చల్జిల్లా: రుణమాఫీ కాలేదని మేడ్చల్ జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయ ఆవరణలో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మేడ్చల్లో నివాసం ఉండే రైతు సురేందర్ రెడ్డి(52) తనకు రుణమాఫీ కాలేదని శుక్రవారం(సెప్టెంబర్6) ఉదయం వ్యవసాయ శాఖ కార్యాలయ ఆవరణలో చెట్టుకు ఉరి వేసుకున్నాడు. రైతు ఆత్మహత్య సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కాలేజీలో చేరిన నాలుగో రోజే వ్యవసాయ పాలిటెక్నిక్ విద్యార్థిని ఆత్మహత్య
రుద్రూర్: నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం అక్బర్నగర్ లోని వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థిని లింగన్ వాడి రక్షిత (15) ఆత్మహత్యకు పాల్ప డటం కలకలం రేపింది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం హస్నాపూర్ గ్రామానికి చెందిన రక్షిత ఆగస్టు 27న వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీలో ఫస్టియర్లో చేరింది. శనివారం ఉదయం నిద్ర లేచిన ఆమె బాత్ రూమ్కు వెళ్లి చాలా సేపటి వరకు తిరిగి రాలేదు. దీంతో తోటి విద్యార్థులు తలుపులు గట్టిగా బాదడంతో కింది భాగం విరిగిపడింది. అందులో నుంచి చూసిన విద్యార్థినులకు రక్షిత చున్నీతో ఉరివేసుకున్న దృశ్యం కన్పించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హాస్టల్ వార్డెన్, కేర్ టేకర్, అధ్యాపకులు, విద్యార్థుల ద్వారా వివరాలను సేకరించారు. రెండు గంటల అనంతరం మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్ను పిలిపించగా విద్యార్థి సంఘాల నాయకులు అడ్డుకున్నారు. పోలీసులు వారిని బలవంతంగా పక్కకు నెట్టి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. సీసీ ఫుటేజీలో శుక్రవారం నాటి డాటా లేకపోవడంతో నిపుణులను పిలిపించి తీసుకుంటామని బోధన్ ఏసీపీ శ్రీనివాస్ రావు చెప్పడంతో విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన విరమించారు. కాగా, రక్షిత ఆత్మహత్య విషయమై కాలేజీ యాజమాన్యంపై అనుమానం ఉందని మృతురాలి తండ్రి విష్ణు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమది వ్యవసాయ కుటుంబమని, నలుగురు సంతానంలో రక్షిత రెండో అమ్మాయని, రక్షితకు వ్యవసాయ విద్య అంటే ఎంతో ఇష్టమన్నారు.కాలేజీ యాజమాన్యాన్ని, ప్రిన్సిపాల్, హాస్టల్ వార్డెన్ను విచారించి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.3 -
ప్రేమ విఫలం... బలవన్మరణం
నెక్కొండ/శాంతినగర్: ప్రేమ విఫలం కావడంతో రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు యువకులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వరంగల్ జిల్లా నెక్కొండ ఎస్ఐ మహేందర్ తెలిపిన ప్రకారం.. నెక్కొండకు చెందిన చింతల జయంత్ (22) ఓ గ్రామానికి చెందిన యువతి ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఉద్యోగం వచ్చాక పెళ్లి గురించి ఆలోచించాలని జయంత్ను యువతి తల్లిదండ్రులు మందలించారు. యువతి సైతం అతన్ని దూరం పెట్టింది. దీంతో ఈ నెల 27న తన సెల్ఫోన్లో సెల్ఫీ వీడియో తీసుకుంటూ గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ వీడియోను కుటుంబ సభ్యులకు పంపించాడు. వీడియో చూసిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం జయంత్ను ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బుధవారం చనిపోయాడు. మృతుడి తండ్రి తిరుపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వీడియో తీసి.. సూసైడ్ నోట్ రాసి.. ప్రేమించి మోసపోవద్దని, తాను మోసపోయి ఆ త్మహత్య చేసుకుంటున్నా అంటూ ఓ యువకుడు పంపిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. జోగులాంబ–గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలంలోని జూలెకల్ స్టేజీకి చెందిన తెలిగి అశోక్ (22) మంగళవారం రాత్రి కర్నూలులోని ఓ లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతకుముందు అతడు.. తాను ప్రేమించిన యువతికి మరో వ్యక్తితో వివాహం నిశ్చయమైందని, యువతి తండ్రి కానిస్టేబుల్గా పనిచేస్తున్నందున తనపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని, తన చావుకు కారణమైన వారిని వదలొద్దంటూ వీడియోలో పేర్కొన్నాడు. సూసైడ్ నోట్ రాసి ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు బుధవారం అశోక్ మృతదేహాన్ని తీసుకొ చ్చి అలంపూర్–రాయచూర్ రోడ్డుపై బైఠాయించి ఆత్మహత్యకు కారణమైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధితుడి తల్లి ఫిర్యాదు మేరకు దర్యాప్తుచేస్తామని సీఐ రవిబాబు చెప్పారు. -
అసోం అత్యాచారం కేసు: నిందితుడు మృతి
దిస్పూర్: అసోంలోని నాగావ్ జిల్లాలో 14 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాజాగా ఈ ఘటనలో అరెస్టైన ప్రధాన నిందితుడు శనివారం తెల్లవారుజామున మృతి చెందినట్లు పోలీసు అధికారులు తెలిపారు. పోలీసులు వివరాల ప్రకారం.. ఈ కేసులో శుక్రవారం పోలీసులు ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు. దర్యాప్తులో భాగంగా ఈ రోజు తెల్లవారుజామున 3.30 గంటలకు క్రైం సీన్ రీ కన్స్ట్రక్షన్ కోసం ఘటన స్థలానికి తీసుకువెళ్లారు. ఈ క్రమంలో నిందితుడు పోలీసు కస్టడీ నుంచి తప్పించుకొని ఓ చెరువులో దూకాడు. దీంతో వెంటనే పోలీసులు రెండు గంటల పాటు చెరువులో గాలించి మృతదేహాన్ని బయటకు తీసి స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ స్వప్ననీల్ వెల్లడించారు.నాగావ్ జిల్లాలోని ధింగ్ ప్రాంతంలో గురువారం రాత్రి 8 గంటల సమయంలో బాలిక ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా, ముగ్గురు వ్యక్తులు మోటార్ సైకిల్ వచ్చి, ఆమెను బంధించి అత్యాచారానికి పాల్పడి, రోడ్డు పక్కన విసిరేసి వెళ్లిపోయినట్లు పోలీసులు చెప్పారు. బాధితురాలు పదో తరగతి చదువుతోందని, దుండగుల దుశ్చర్య వల్ల గాయాలపాలై అపస్మారక స్థితికి చేరుకుందని తెలిపారు. స్థానికులు గమనించి, తమకు సమాచారం ఇచ్చారని వెల్లడించారు. బాధితురాలిని అసుపత్రికి తరలించామని, చికిత్స కొనసాగుతోందని పేర్కొన్నారు. ఇక.. ఈ ఘటనపై ప్రజలు ఆగ్రహంతో వీధుల్లోకి వచ్చి ఆందోళనకు దిగారు. మహిళలకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
వాటర్ ట్యాంకుపై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య
జీడిమెట్ల: మద్యం మత్తులో ఓ వ్యక్తి వాటర్ ట్యాంక్ పైనుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన జీడిమెట్ల పీఎస్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. ఇన్స్పెక్టర్ మల్లేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని పార్వతీపురంనకు చెందిన బావిరి రాము (53)కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. జీవనోపాధి కోసం కొన్నేళ్ల క్రితం నగరానికి వలస వచ్చి కుత్బుల్లాపూర్లో ఉంటూ మేస్త్రీ పనులు చేస్తున్నాడు. ప్రతిరోజూ మద్యం తాగి వచ్చి భార్యతో గొడవపడేవాడు. 15 రోజుల క్రితం కూడా రాము మద్యం మత్తులో భార్యతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయి గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. సోమవారం ఉదయం మద్యం మత్తులో స్థానిక ఎల్లమ్మ పోచమ్మ గుడి వద్ద ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కి కిందికి దూకి మృతి చెందాడు. మృతుడి కుమారుడు జైకుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా.. రాము వాటర్ ట్యాంక్పై నుంచి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడిన దృశ్యాలు బుధవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. పోలీసులకు సమాచారం అందినా స్పందించలేదా? రాము ట్యాంక్పైకి ఎక్కడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించినా వారు పట్టించుకోలేదనే వదంతులు ఉన్నాయి. ఈ విషయమై ఇన్స్పెక్టర్ మల్లేశ్ను ‘సాక్షి’ వివరణ కోరగా.. రాము ట్యాంక్పైకి ఎక్కి నిమిషాల్లోనే దూకి మృతి చెందాడని, ఈ విషయమై తమకు, డయల్ 100కు ఎలాంటి ఫోన్ కాల్ రాలేదని తెలిపారు. -
సీబీఐ దాడులు.. పోస్టాఫీస్ ఉద్యోగి ఆత్మహత్య
సీబీఐ అధికారులు సోదాలు చేయడంతో.. మనస్తాపం చెందిన ఓ పోస్టల్ అధికారి బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కోట్లాది రూపాయల అవకతవకలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు పోస్టాఫీసుపై దాడి చేశారు.ఉత్తర ప్రదేశ్లోని బులంద్షహర్లోని ప్రధాన పోస్టాఫీసుపై మంగళవారం అర్థరాత్రి సీబీఐ అవినీతి నిరోధక విభాగం అధికారులు దాడులు చేశారు. రిటైర్డ్ ఫీల్డ్ ఆఫీసర్ సహా ఎనిమిది మందికి పైగా ఉద్యోగులు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు రావడంతో తనిఖీలు చేపట్టారు.ఈ క్రమంలో పోస్టల్ సూపరింటెండెంట్ త్రిభువన్ ప్రతాప్ సింగ్ బుధవారం ఉదయం అలీగఢ్లోని తన ఇంట్లో లైసెన్స్డ్ పిస్టల్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే సీబీఐ దాడులతో త్రిభువన్ ఒత్తిడికి గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి విచారణ జరుపుతున్నారు. సింగ్కు ఇద్దరు పిల్లలు, భార్య ఉన్నారు.అయితే దాడులతో ఒత్తిడికి గురయ్యాడనే ఆరోపణలను మృతుడి కుటుంబ సభ్యులు ఖండించారు. తనను ఒక మహిళ, కొందరు అధికారులు తమ వద్ద పని చేయమని ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. ప్రతాప్ సింగ్ సోదరుడు బాధితుడు రాసిన ఆత్మహత్య లేఖను వాట్సాప్లో షేర్ చేశాడు. తన అధికారిక లెటర్హెడ్తో కూడిన కాగితంపై హిందీలో రాసిన నోట్లో.. చాలా మంది సహోద్యోగులు తమ ఆదేశాల ప్రకారం పనిచేయమని తనను బలవంతం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. -
ఆన్లైన్ బెట్టింగ్ కోసం రూ.2 కోట్లు అప్పు చేసి..
నల్లగొండ క్రైం, పెన్పహాడ్: ఆన్లైన్ బెట్టింగ్ ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. బెట్టింగ్ మాయలో పడి రూ.2 కోట్లు అప్పు చేసి.. తీర్చే మార్గం లేక సాగర్ కాల్వలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగొండ వన్టౌన్ పోలీసులు తెలిపిన వివరాలివి. నల్లగొండ నెహ్రూగంజ్లో కిరాణా దుకాణం నిర్వహిస్తున్న తడకమళ్ల సోమయ్య కుమారుడు సాయికుమార్ (28) అప్పు తెచ్చి ఆన్లైన్లో బెట్టింగ్ పెట్టి రూ.2 కోట్లు నష్టపోయాడు. అప్పు లు ఇచ్చిన వారు.. తిరిగి చెల్లించాలని అడగడంతో వారికి సమాధానం చెప్పలేక సాయికుమార్ మనస్తాపం చెంది ఈ నెల 17న ఇంట్లోంచి వెళ్లిపోయాడు. హాలియా వద్ద సాగర్ ఎడమ కాల్వలో దూకాడు. అతని సోదరుడు సతీశ్ అదేరోజు నల్లగొండ వన్టౌన్ పోలీస్ స్టేషన్లో సాయికుమార్ కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. కాగా సోమవారం సాయికుమార్ మృతదేహం సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం దోసపహాడ్ గ్రామ శివారులో సాగర్ ఎడమ కాల్వలో లభించినట్టు పెన్పహాడ్ ఎస్ఐ రవీందర్ తెలిపారు. మృతదేహాన్ని సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
స్నేహితులే అలా చేసేసరికి.. నంద్యాల ఇంటర్ విద్యార్థి కేసులో విస్తుపోయే విషయాలు!
నంద్యాల, సాక్షి: ఆత్మకూరు ఇంటర్ విద్యార్థి అదృశ్యం కేసు.. విషాదాంతంగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు దర్యాప్తు పూర్తి చేసిన పోలీసులు విస్తుపోయే వివరాల్ని మీడియాకు వెల్లడించారు. స్నేహితులే అతన్ని ఎత్తుకెళ్లడం, ఆపై అమానవీయంగా ప్రవర్తించడంతో అతను బలవర్మరణానికి పాల్పడినట్లు తెలిపారు. ఆత్మకూరు మండలం కొత్తపేటకు చెందిన ఇంటర్ విద్యార్థి వహీద్ బాషా ఈ నెల 13న కళాశాలకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు కళాశాలకు వెళ్లి అడిగారు. వహీద్ కళాశాల ప్రాంగణంలో తిరిగి వెళ్లినట్లు తెలుసుకున్నారు. అయితే వహీద్ స్నేహితులే అతన్ని కిడ్నాప్ చేసినట్లు అనుమానించారు. ఆ నలుగురు యువకులపై అనుమానం ఉన్నట్లు పోలీసులకు తెలిపారు. ఈలోపు మూడు రోజులు గడిచాయి. అయినా వహీద్ జాడ తెలియకపోవడంతో అతని కుటుంబంలో ఆందోళన పెరిగిపోయింది. ఈలోపు.. ఆత్మకూరు శివారులోని ఓ బావిలో వహీద్ శవమై కనిపించాడు. దీంతో.. ఇది హత్యా? ఆత్మహత్యా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగింది. చివరకు.. స్నేహితుల వల్లే వహీద్ చనిపోయాడని పోలీసులు నిర్ధారించారు. అర్బన్ సీఐ లక్ష్మినారాయణ వెల్లడించిన వివరాల ప్రకారం.. వహిద్కు స్నేహితులతో ఏవో గొడవలు ఉన్నాయి. ఈ క్రమంలో అతన్ని కిడ్నాప్ చేసిన తీవ్రంగా కొట్టిన యువకులు.. అతన్ని దుస్తులు విప్పించి బలవంతంగా ఫొటోలు తీశారు. దాడి గురించి బయట ఎవరికైనా చెబితే ఆ ఫొటోల్ని నెట్లో పెడతామని బెదిరించారు. దీనిని అవమానభారంగా భావించిన వాహిద్ చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనకు కారకులైన నలుగురు యువకుల్ని అరెస్ట్ చేశాం అని తెలిపారయన. -
నారాయణ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్! విద్యార్థి ఆత్మహత్య
సాక్షి,నెల్లూరుజిల్లా: నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్కు విద్యార్థి బలయ్యాడు. తోటి విద్యార్థుల లైంగిక వేధింపులతో బీడీఎస్ రెండో సంవత్సరం చదువుతున్న ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఐదు అంతస్తు నుంచి దూకి ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. విద్యార్థి మృతిని నారాయణ కాలేజీ యాజమాన్యం గోప్యంగా ఉంచింది. కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం, స్టూడెంట్స్ ర్యాగింగ్ వల్లే ప్రదీప్ చనిపోయాడని అతడి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
స్నేహితుడితో భార్య సంబంధం.. మోసం తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్య
సాక్షి, విశాపట్నం: విశాఖలో ఓ ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య, తన స్నేహితుడితో వివాహేతర సంబంధం పెట్టుకోవడాన్ని తట్టులేక హరి ప్రకాష్ అనే వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆతహత్యకు ముందు ఆరు పేజీల సూసైడ్ లేఖ రాశాడు. అలాగే ఆత్మహత్యకు గల కారణాలపై సెల్ఫీ వీడియో తీసుకున్నాడు.కాగా హరి ప్రకాశ్కు భవనేశ్వరితో వి2019లో వివాహమైంది. వీరిద్దరికి ఇది రెండో వివాహమే. ఈ జంటకు నాలుగేళ్ల పాప కూడా ఉంది. అయితే భువనేశ్వరికి, హరి ప్రకాశ్కు గత మూడేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. తన భార్యకు ఇతరులతో సంబంధం పెట్టుకుందన్న ఈ క్రమంలోనే తన స్నేహితుడు రాజేష్కు మధ్య కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం నడుస్తున్నట్లు హరి ప్రకాశ్ ఆరోపించాడు. వారిద్దరికి ఓ పాప కూడా ఉన్నట్లు తెలిపారు. భార్య వేధింపులు, ఇతరులతో ఆమె సంబంధాల కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వీడియోలో చెప్పాడు.కుమారుడి ఆత్మహత్యపై పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ద్వారకా జోన్ పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం హరి ప్రకాష్ మృతదేహన్ని పోలీసులు మార్చరీకి తరలించారు. హరి ప్రకాష్ భార్యభువనేశ్వరిని అదుపులోకి తీసుకున్నారు. స్నేహితుడు రాజేష్ పరారీలో ఉండగా.. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
భూ కబ్జాకు రైతు బలి
ఖమ్మం రూరల్: భూమి కబ్జా చేశారనే ఆవేదన కు తోడు పోలీసులు సైతం కబ్జాదారులకే కొ మ్ము కాస్తున్నారనే ఆక్రందనతో ఓ రైతు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాలిలా.. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం జాన్బాద్ తండాకు చెందిన ఏలేటి వెంకటరెడ్డి(50)కి అర ఎకరం, ఆయన సోదరుడు భూపాల్రెడ్డికి రెండున్నర ఎకరాల పొలం ఉంది. ఇందులో 25 గుంటలకు సంబంధించి వివాదం నెలకొనగా.. అదే గ్రామానికి చెందిన జాటోతు వీరన్న ఆక్రమించాడని వెంకటరెడ్డి కుటుంబం ఆరోపిస్తోంది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతూ వెంకటరెడ్డి ఈనెల 4న పురుగు మందు తాగాడు. దీంతో కుటుంబ సభ్యులు చికిత్స కోసం ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం తెల్లవా రుజామున మృతి చెందాడు. సెల్ఫీ వీడియోలో ఏముందంటే... వెంకటరెడ్డి ఆత్మహత్యకు ముందు తన ఆవేదనను సెల్ఫీ వీడియోలో రికార్డు చేశాడు. ‘మా భూమి ఆక్రమించుకుని జాటోతు వీరన్న సాగు చేస్తుండగా పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. పోలీసులు ఆయన వద్ద లంచం తీసుకుని మమ్మల్నే ఇబ్బందిపెడుతున్నారు. మాజీ ఎంపీటీసీ కళింగరెడ్డి ప్రోద్బలంతో జాటోతు వీరన్నతోపాటు సురేష్, దేవిక, చిన్ని, ఉపేందర్ మమ్మల్ని వేధిస్తున్నారు. వారం క్రితం ప్రైవేట్ కేసు వేయించినా మాకు న్యాయం జరగ లేదు’అని వీడియోలో వెల్లడించారు. ఇదిలా ఉండగా ఇదే భూవివాదంలో వెంకటరెడ్డి సోదరుడు ఏలేటి భూపాల్రెడ్డి కూడా గతంలో ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబీకులు తెలిపారు. కాగా, వెంకటరెడ్డి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు జాటోతు వీరన్న, మాజీ ఎంపీటీసీ కళింగరెడ్డి, సురే‹Ù, దేవిక, చిన్ని, ఉపేందర్పై కేసు నమోదు చేశామని ఎస్ఐ రామారావు తెలిపారు. -
జనసేన నేత వేధింపులతో మహిళ బలవన్మరణం
పల్నాడు, సాక్షి: ఆర్థిక సాయం చేసిన సొమ్ము వెనక్కి ఇవ్వాలంటూ జనసేన నాయకురాలు వేధిస్తుండటంతో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పల్నాడు జిల్లా నకరికల్లు మండలం చేజర్లలో చోటుచేసుకుంది. మృతురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఎస్ఐ కె.నాగేంద్రరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్నికలకు ముందు చేజర్ల గ్రామానికి చెందిన ఉప్పు కృష్ణవేణి (28) కుమారుడు అనారోగ్యం బారినపడ్డాడు. జనసేన పార్టీ మండల అధ్యక్షురాలు తాడువాయి లక్ష్మి అతడిని పరామర్శించింది. ఈ విషయాన్ని జనసేన నియోజకవర్గ ఇన్చార్జి బొర్రా అప్పారావు దృష్టికి తీసుకెళ్లగా.. సుమారు రూ.లక్ష ఆర్థిక సాయం అందించారు. కాగా.. ఎన్నికలలో కృష్ణవేణి కుటుంబం జనసేనకు ఓటు వేయలేదని భావించిన జనసేన నాయకురాలు తాడువాయి లక్ష్మి ఆ సొమ్మును తిరిగి ఇవ్వాలని రెండు నెలలుగా వేధిస్తోంది. తాము ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని, పరిస్థితి కుదుటపడ్డాక చెల్లిస్తామని చెప్పినప్పటికీ ఒత్తిడి ఆపలేదని మృతురాలి భర్త కోటేశ్వరరావు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నెల 25న తాను ఇంట్లో లేని సమయంలో తాడువాయి లక్ష్మి ఇద్దరు మహిళలను వెంటబెట్టుకుని తమ ఇంటికి వచ్చిందని, తన భార్యను తీవ్ర వేధింపులకు గురి చేసిందని ఫిర్యాదులో ఆమె భర్త వివరించారు. వేధింపులు తాళలేక తీవ్ర మనస్తాపానికి గురై తన భార్య ఆత్మహత్య చేసుకుందని కోటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ పేరుతో ఆర్థిక సాయం చేసి.. ఆ డబ్బును తిరిగి ఇవ్వాలంటూ తీవ్ర వేధింపులకు గురి చేసి తన భార్య ఆత్మహత్యకు కారణమైన తాడువాయి లక్షి్మని కఠినంగా శిక్షించాలని ఫిర్యాదులో కోరారు.మునిసిపల్ చైర్పర్సన్పై హత్యాయత్నంఇంటికి వెళ్లి మరీ టీడీపీ కార్యకర్త దాష్టీ కం నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు చెత్త పత్రిక రోత రాతలపై పరువునష్టం దావాపెద్దాపురం: పెద్దాపురం మునిసిపల్ చైర్పర్సన్ బొడ్డు తులసీ మంగతాయారుపై బుధవారం హత్యాయత్నం జరిగింది. ఆమె భర్త ఇంట్లో లేని సమయంలో టీడీపీ కార్యకర్త సానాది సోములు (లింగం) ఇంటి తలుపులను బద్దలుగొట్టి ఆమెను హత్య చేసేందుకు ప్రయతి్నంచాడు. లోపల నుంచి ఆమె వెంటనే పెద్దాపురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ యువకుడిని అదుçపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ పెద్దాపురం నియోజకవర్గ కో–ఆర్డినేటర్ దవులూరి దొరబాబు, మునిసిపల్ వైస్చైర్మన్ నెక్కంటి సాయిప్రసాద్, కౌన్సిలర్లు ఆరెళ్లి వీర్రాఘవులు, సత్యభాస్కర్, విడదాసరి రాజా, తాటికొండ వెంకటలక్ష్మి ఆమెను పరామర్శించారు. అధికారపక్షం రెచ్చగొడితేనే తనపై హత్యాయత్నం జరిగిందని, తనకు ప్రాణహాని ఉన్నందున రక్షణ కలి్పంచాలని చైర్పర్సన్ పోలీసులను కోరారు. రోత రాతలను సహించం అబద్ధాలు, ఆధారాల్లేని ఊహాగానాలతో ఈనాడు పత్రిక పెద్దాపురం కౌన్సిల్ సభ్యులపై తప్పుడు రాతలు రాసిందని మునిసిపల్ కౌన్సిల్ ధ్వజమెత్తింది. కౌన్సిల్ సమావేశం బుధవారం చైర్పర్సన్ బొడ్డు తులసీ మంగతాయారు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఈనాడులో వచ్చిన తప్పుడు రాతలపై కౌన్సిల్ సభ్యులు ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ప్రభుత్వ భూమిని ఆక్రమించారని వచి్చన వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో పత్రిక తేల్చాలన్నారు. పత్రికలో వచి్చన 410 సర్వే నంబర్ పూర్తి జిరాయితీ అయితే 83 సెంట్ల భూమి రూ.4కోట్లు అంటూ తప్పుడు కథనం ఇవ్వడం సమంజసమా అని ప్రశి్నంచారు. ఈ కథనంపై కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. కథనం రాసిన పత్రిక ప్రతినిధి ఓపక్క జర్నలిస్ట్గా, మునిసిపాలిటీలో టౌన్ ప్లానింగ్ సర్వేయర్గా చలామణి అవుతున్నాడని ధ్వజమెత్తారు.వైఎస్సార్సీపీ కౌన్సిలర్ కంటతడితమ కుటుంబ సభ్యుల రేషన్ షాపు తొలగించారని మహిళా కౌన్సిలర్ ఆవేదన షాపు అవసరం లేదని బలవంతంగా సంతకం చేయించుకున్న టీడీపీ నేతలుపుత్తూరు: కూటమి అధికారంలోకి వచి్చనప్పటినుంచి వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు టార్గెట్గా వ్యవహరిస్తున్న టీడీపీ శ్రేణులు రాజకీయ కక్షసాధింపు చర్యల్ని కొనసాగిస్తున్నాయి. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేయడమేగాక వారి ఆధ్వర్యంలో నడుస్తున్న రేషన్ షాపులను తొలగిస్తున్నారు. ఈ క్రమంలోనే తిరుపతి జిల్లా పుత్తూరులో ఐదేళ్లుగా నిజాయితీగా కార్డుదారులకు సరుకులు ఇస్తూ ఎలాంటి ఆరోపణలు లేని వైఎస్సార్సీపీ కౌన్సిలర్ కుటుంబసభ్యులు నిర్వహిస్తున్న రేషన్ దుకాణాన్ని తొలగించారు. దీనిపై బుధవారం 18వ వార్డు వైఎస్సార్సీపీ కౌన్సిలర్ కె.రాధ కౌన్సిల్ సమావేశంలో కంటతడి పెట్టారు. కక్షసాధింపులు తగవని పేర్కొన్నారు. మున్సిపల్ చైర్మన్ ఎ.హరి అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశంలో టీడీపీ ఫ్లోర్ లీడర్ జీవరత్నం నాయుడు మాట్లాడుతూ కౌన్సిలర్లు అందరూ సమానమేనని, అధికారపక్షం, ప్రతిపక్షం అంటూ తేడాలు ఉండకూడదని చెప్పారు. దీనిపై స్పందించిన కౌన్సిలర్ రాధ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చెప్పే మాటలకు, చేసే చేతలకు పొంతన లేకుండా పోయిందని విమర్శించారు. ఇందుకు నిదర్శనం తమ కుటుంబసభ్యులు ఐదేళ్లుగా నిర్వహిస్తున్న రేషన్ షాపును తొలగించడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. తన అక్క మంజుల ఐదేళ్లుగా ఎలాంటి ఆరోపణలు లేకుండా రేషన్ షాపు నడుపుతున్నారని తెలిపారు. రెండురోజుల కిందట టీడీపీ నాయకులు కొందరు రాత్రిపూట ఇంటివద్దకు వచ్చి మంజులను బెదిరించి రేషన్ షాపు అవసరం లేదంటూ బలవంతంగా సంతకం చేయించుకున్నారని చెప్పారు. ఇందుకు సంబంధించిన సాక్ష్యాలు సైతం తమవద్ద ఉన్నాయన్నారు. ఇది ఎంతవరకు న్యాయమని నిలదీశారు. అటవీ భూముల ఆక్రమణకు టీడీపీ నేతల యత్నంఆక్రమణకు గురైన భూములను పరిశీలిస్తున్న అధికారులుచిల్లకూరు: తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం ఆరూరు పంచాయతీలోని అటవీ భూముల్ని ఆక్రమించేందుకు టీడీపీ నాయకులు ప్రయతి్నస్తున్నారు. పలువురు నాయకులు అటవీ భూముల్ని చదును చేస్తున్నారు. చిట్టమూరు మండలంలో సర్వే నంబరు 432లో సుమారు 400 ఎకరాల అటవీభూములు ఉన్నాయి. వీటిలో సగం వరకు ఇప్పటికే ఆక్రమణలకు గురికాగా మిగిలిన భూములను ఆక్రమించేందుకు టీడీపీ నేతలు ప్రయతి్నస్తున్నారు. ఆ భూమిని చదును చేసే పనుల్ని స్థానికులు అడ్డుకున్నారు. గ్రామానికి చెందిన చెరువు లోతట్టులో కూడా సుమారు 50 ఎకరాల వరకు దున్ని సాగుకు సిద్ధం చేస్తున్నారు. ఈ విషయాలను స్థానికులు గూడూరు ఆర్డీవో కిరణ్కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయమై వీఆర్వో శ్రీనివాసులను అడగగా.. భూములు ఆక్రమణలకు గురవుతున్న విషయం వాస్తవమేనన్నారు. దీనిపై క్షేత్రస్థాయిలో పరిశీలించి ఉన్నతాధికారులకు సమగ్ర నివేదిక ఇస్తామని చెప్పారు. మట్టిపోసి వలంటీర్ ఇంటి దారిమూతసత్తెనపల్లి: పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కంకణాలపల్లిలో వలంటీర్ కంటు బ్రహ్మయ్య ఇల్లు తొలగించాలని టీడీపీ నేతలు దౌర్జన్యం చేస్తున్నారు. 20 ట్రాక్టర్ల మట్టిపోసి వలంటీర్ ఇంటికి దారి మూసేశారు. వ్యవసాయ కూలిపనులు చేసుకుంటూ చిన్న టీ హోటల్ నడుపుతూ జీవిస్తున్న బ్రహ్మయ్య 30 సంవత్సరాల నుంచి గ్రామంలో బీసీలకు కేటాయించిన పోరంబోకు స్థలంలో పూరిగుడిసె వేసుకుని ఉంటున్నాడు. బ్రహ్మయ్య వలంటీర్గా వైఎస్సార్సీపీకీ అనుకూలంగా పనిచేశాడంటూ కక్షతో అతడి ఇల్లు కూల్చేయాలని టీడీపీ నేతలు కుట్రచేశారు. టీడీపీకీ చెందిన పచ్చ సు«దీర్, పచ్చ అప్పయ్య, నల్లబోతు కోటయ్య, బొడ్డు లింగయ్య, మరో 20 మంది ఈ నెల 29న బ్రహ్మయ్య ఇంట్లోలేని సమయంలో ఆయన ఇంటికి దారిలేకుండా 20 ట్రాక్టర్ల మట్టిపోశారు. బ్రహ్మయ్య ఇంటిముందు ఎనీ్టఆర్ బొమ్మ ఏర్పాటు చేసి అక్కడ అభివృద్ధి చేయాలంటూ ఆ ఇంటిని కూల్చేయాలని ప్రయతి్నస్తున్నారు. -
ఒంటరితనం ఊపిరి తీసింది!
కర్నూలు సిటీ: కర్నూలులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ (ట్రిపుల్ ఐటీడీఎం)లో చదువుతున్న నల్ల సాయి కార్తీక్ నాయుడు(20) ఒంటరితనం కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు. పార్వతీపురం మన్యం జిల్లా, జియ్యమ్మవలస మండలం, కుదమ గ్రామానికి చెందిన నల్ల వెంకట నాయుడు కుమారుడైన సాయికార్తీక్ ట్రిపుల్ఐటీడీఎంలో ఈసీఈ బ్రాంచ్తో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు.శనివారం క్యాంపస్లోని కలాం హాస్టల్ భవనం 9వ అంతస్తు నుంచి దూకడంతో కుడి కాలు విరిగి, తలకు తీవ్ర గాయమై తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే చనిపోయాడు. క్యాంపస్కు వేసవి సెలవులు ముగిసి ఈ నెల 22 నుంచి క్లాసులు తిరిగి ప్రారంభమయ్యాయి. సాయి కార్తీక్ క్యాంపస్కి వచ్చినప్పటి నుంచి ఒంటరిగానే ఉంటూ మానసికంగా ఇబ్బంది పడే వాడని, సమస్య ఏంటో ఎవరికీ చెప్పలేదని తోటి విద్యార్థులు చెబుతున్నారు.చదువులో ఒత్తిడి ఉంటే కౌన్సిలింగ్ ఇచ్చేందుకు సైకాలజిస్టులు అందుబాటులో ఉన్నారని సిబ్బంది చెప్పారు. విద్యార్థి ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి వచ్చి పరిశీలించి సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. ఒంటరితనం, తాను చెప్పినా ఎవరు వినిపించుకోలేదని సూసైడ్ నోటులో రాసినట్లు సమాచారం. విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
తాను చనిపోతే తల్లిని చూసేవారు లేరని హత్య
కొత్తగూడెంఅర్బన్: తల్లీకొడుకులిద్దరూ మానసిక వ్యాధితో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. ఈ నేపథ్యంలో అనారోగ్యంతో తాను మరణిస్తే తల్లిని చూసేవారు ఎవరూ ఉండరన్న ఆవేదనతో కుమారుడు తల్లిని హత్య చేసి.. ఆ తర్వాత తానూ బలవన్మరణానికి పాల్ప డ్డాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో శని వారం ఈ విషాద ఘటన వెలుగు చూసింది. పట్ట ణంలోని బూడిదగడ్డ ప్రాంతానికి చెందిన తుల్జాకు మారి పాసి (59)కి హారతిపాసి, వినయ్కుమార్ పాసి(28) ఇద్దరు సంతానం. ఆమె భర్త కొన్నేళ్ల క్రితమే మృతి చెందగా కూతురు హారతికి పదేళ్ల క్రితం వివాహమైంది. ప్రస్తుతం తల్లీకొడుకులు మాత్రమే ఇంట్లో ఉంటున్నారు. తుల్జాకుమారి కొంతకాలంగా మానసిక రుగ్మతతో బాధపడుతోంది. వినయ్ కూడా అనారోగ్య సమస్యలతో బేకరీ లో పని మానేసి ఇంట్లోనే ఉంటున్నాడు. కూతురు హారతి కుటుంబం వారికి సమీపంలోనే ఉంటోంది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి వినయ్కుమార్ ఇనుప రాడ్తో తల్లిని కొట్టి హత్యచేసి, తాను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రక్తపుమడుగులో తుల్జాకుమారి..అమ్మ మ్మ, మేనమామకు టిఫిన్ ఇచ్చేందుకు హారతి కూతురు సునన్య శనివారం ఉదయం 10.30 గంటలకు తుల్జాకుమారి ఇంటికి వచ్చింది. ఆమె తలు పు తీసి చూడగా తుల్జాకుమారి రక్తపుమడుగులో పడి ఉంది. వినయ్కుమార్ ఉరి వేసుకుని చనిపోయి ఉన్నాడు. దీంతో భయాందోళనకు గురైన బాలిక వెళ్లి తల్లిదండ్రులకు చెప్పగా.. వారు వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్, త్రీటౌన్ పోలీసు లు చేరుకుని ఘటనను పరిశీలించారు. ఇనుపరాడ్ తో కొట్టడం వల్ల తుల్జాకుమారి తలకు తీవ్ర గాయ మై మృతి చెందిందని గుర్తించారు. మృతదేహాలకు పోస్టుమార్టమ్ నిర్వహించిన అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. హారతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
పరిహారం రాక.. ప్రాణాలు తీసుకున్నాడు!
జైపూర్: జీవనోపాధి కోసం రూ.6 లక్షలు అప్పు తెచ్చి కొనుగోలు చేసిన ట్రాక్టర్కు గిరాకీ లేదు.. ట్రాక్టర్ కిస్తీలు కట్టలేని పరిస్థితి. అదీగాక ఏడాది క్రితం చెల్లి పెళ్లి కోసం రూ.5 లక్షలు అప్పు తెచ్చాడు. సింగరేణి సంస్థ నుంచి పరిహారం వస్తే తన కష్టాలు గట్టెక్కుతాయనుకున్నాడు. కానీ, రెండేళ్లుగా పరిహారం విషయం ఎటూ తేలడం లేదు. ఈ క్రమంలో అప్పులు ఇచ్చిన వారి ఒత్తిడి తట్టుకోలేక శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో హరీశ్ (28) అనే యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.తన చావుకు సింగరేణి యాజమాన్యం, గ్రామ పెద్దలు కారణమని సూసైడ్ నోట్ రాశాడు. అమ్మా నాన్న క్షమించండి.. అక్క, చెల్లి.. అమ్మనాన్నలను బాగా చూసుకోండి అని అందులో పేర్కొన్నాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం రామారావుపేట పంచాయతీ పరిధిలోని దుబ్బపల్లిలో జరిగింది. జైపూర్ ఎస్సై నాగరాజు కథనం ప్రకారం.. దుబ్బపల్లి గ్రామానికి చెందిన జాడి బొందాలు–పద్మ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు హరీశ్ సంతానం. బొదాలు కూలీనాలి చేస్తూ పిల్లలను పెంచి పెద్ద చేశాడు. వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతో ప్రస్తుతం ఏ పని చేయడం లేదు. దీంతో కుటుంబ భారం హరీశ్పై పడింది. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వస్తుందని...దుబ్బపల్లి గ్రామాన్ని రెండేళ్ల క్రితం సింగరేణి శ్రీరాంపూర్ ఓసీపీ విస్తరణ కోసం సేకరించింది. ఇంటితోపాటు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద రూ.20 లక్షలు పరిహారం వస్తుందని హరీశ్ భావించాడు. కానీ, రెండేళ్లుగా సింగరేణి యాజమాన్యం పరిహారం విషయం తేల్చడం లేదు. గ్రామ పెద్దలు పరిహారం ఇప్పించే బాధ్యత తీసుకున్నా.. ఎలాంటి పురోగతి లేదు. ఒక్కగానొక్క కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అటల్ సేతు నుంచి సముద్రంలోకి దూకి...
మహారాష్ట్రలోని ముంబైలో అటల్ సేతుపై నుంచి దూకి ఓ యువ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు డోంబవలికి చెందిన శ్రీనివాసన్ కురుటూరి (38)గా పోలీసులు గుర్తించారు. శ్రీనివాసన్ బుధవారం మధ్యాహ్నం 12.24 గంటలకు అటల్ సేతుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై న్హవా షెవా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.అటల్ సేతు వద్దనున్న సీసీటీవీ ఫుటేజీలో ఒక కారు అటల్ సేతు వద్ద అకస్మాత్తుగా ఆగడం, ఒక వ్యక్తి కారులో నుండి బయటకు వచ్చి వంతెన రెయిలింగ్పైకి వేగంగా ఎక్కి, సముద్రంలోకి దూకడం కనిపిస్తుంది. మృతుడు శ్రీనివాసన్ విదేశాల్లో ఉద్యోగం చేసేవాడని పోలీసులు గుర్తించారు. ఇటీవలే ఇంటికి తిరిగి వచ్చి వ్యాపారం ప్రారంభించాడు. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. పోలీసులు స్థానికుల సాయంతో సముద్రంలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. -
తిరుపతి: ఇష్టంలేని పెళ్లి చేశారని టెక్కీ ఘాతుకం
తిరుపతి క్రైం: తనకు ఇష్టంలేని పెళ్లి చేశారని అన్న భార్య, ఇద్దరు కుమార్తెలను హత్యచేసి.. తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్. బుధవారం రాత్రి తిరుపతి పద్మావతినగర్లో ఈ ఘాతుకం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నెల్లూరుకు చెందిన గుడిమెట్ల తిరిపిదాస్ రెండేళ్ల క్రితం కుటుంబంతో వచ్చి తిరుపతి పద్మావతి నగర్లో నివాసం ఉంటున్నాడు. ప్రైవేట్ ఉద్యోగి అయిన దాస్కు భార్య, ఇద్దరు కుమార్తెలు. దాస్ సోదరుడు గుడిమెట్ల మోహన్ (36) చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. అతడికి 2019లో అన్నావదినలు వివాహం జరిపించారు. వివాదాల నేపథ్యంలో 2021లో భర్త మోహన్ను వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తరువాత తమ్ముడి భార్య, ఆమె తల్లిదండ్రులతో మాట్లాడిన దాస్ ఇద్దరూ కాపురం చేసుకునేలా ఒప్పించాడు. ఆ సమయంలో తనకు ఇష్టంలేని పెళ్లి చేశావంటూ దాస్పై తమ్ముడు మోహన్ దాడి చేశాడు. కొంతకాలం అనంతరం మోహన్ అతడి భార్య మధ్య గొడవలు ప్రారంభం కావటంతో మోహన్ భార్య తిరిగి పుట్టింటికి వెళ్లిపోయింది. చెన్నైలో ఉద్యోగం చేసుకుంటున్న మోహన్ తరచూ తిరుపతిలోని అన్న వద్దకు వచ్చి వెళ్తుండేవాడు. రెండు రోజుల క్రితం తిరుపతి వచి్చన మోహన్ బుధవారం సాయంత్రం అన్న కుమార్తెలను స్కూల్ నుంచి తీసుకొచ్చి ఇంటివద్ద విడిచిపెట్టి బజార్కు వెళ్లాడు. అన్న ఇంట్లో లేని సమయంలో తిరిగి వచ్చిన మోహన్ కత్తితో వదిన, అన్న కుమార్తెల గొంతుకోశాడు. ఆ తరువాత తాను గదిలోకి వెళ్లి ఫ్యాన్కి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దాస్ ఇంటికి చేరుకోగా.. తలుపులు లోపలికి గడియపెట్టి ఉండడంతో అనుమానం వచ్చి వెనుక డోర్ తెరుచుకుని ఇంట్లోకి ప్రవేశించాడు. అప్పటికే భార్య, ఇద్దరు కుమార్తెల మృతదేహాలు రక్తపు మడుగులో పడి ఉన్నాయి. తమ్ముడు గదిలో ఫ్యాన్కి ఉరివేసుకుని ఉన్నాడు. సమాచారం అందుకున్న ఎస్పీ సుబ్బరాయుడు, డీఎస్పీ రవిమనోహరాచారి ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. తన తమ్ముడు ఇష్టంలేని పెళ్లి చేసినందుకు తనపై కక్ష పెంచుకున్నాడని దాస్ చెప్పాడు. భార్యాభర్త విడిపోవడంతో ఇద్దర్నీ కలిపేందుకు ప్రయత్నించానని తెలిపాడు. తనపై కోపం పెంచుకుని చివరకు ఇలా చేశాడని వాపోయాడు. -
Hyderabad: సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
రామచంద్రాపురం(పటాన్చెరు): కుటుంబసమస్య వల్లే తాను చనిపోవడానికి కారణమని సూసైడ్ నోట్ రాసి ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. విద్యుత్నగర్లో నివాసం ఉండే సాయికిరణ్(28) విప్రో సంస్థలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి. అతని చిన్నప్పుడే తల్లి మృతి చెందింది. తండ్రి రెండో వివాహం చేసుకున్నాడు. చిన్ననాటి నుంచి ఇస్నాపూర్లోని అమ్మమ్మ వద్ద ఉండి చదువుకున్నాడు. విప్రోలో ఉద్యోగం రావడంతో రెండు నెలలగా విద్యుత్నగర్లో నివాసముంటున్న తండ్రి నర్సింగ్రావు వద్దే ఉంటున్నాడు. బోనాల పండుగ సందర్భంగా తండ్రి, సవతి తల్లి మహాలక్ష్మి శనివారం జోగిపేటకు వెళ్లారు. ఆదివారం సాయికిరణ్ మహాలక్షి్మకి ఫోన్ చేసి మాట్లాడాడు. మంగళవారం మధ్యాహ్నం వారిద్దరూ తిరిగొచ్చారు. ఇంటి తలుపులు వేసి ఉండటంతో ఎంత పిలిచినా తలుపులు తీయడం లేదు. దీంతో కిటికీలో నుంచి చూస్తే సాయికిరణ్ తన గదిలోని ఫ్యాన్కు ఉరి వేసుకుని మృతిచెందడాన్ని గమనించి ఇంటి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి పోలీసులకు సమాచారం అందించారు. వారొచ్చి ఘటన స్థలానికి చేరుకుని పరిశీలిస్తే మృతుడి వద్ద సూసైడ్ నోట్ లభించినట్లు పోలీసులు తెలిపారు. ఆత్మహత్య చేసుకుని రెండు రోజులై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. -
హైదరాబాద్లో దారుణం.. భార్య, కుమార్తె ప్రాణాలు తీసి..
సాక్షి, హైదరాబాద్: ఎంతో అన్యోన్యంగా ఉంటున్న ఆ కుటుంబంలో విధి విషాదం నింపింది. చూడచక్కని ముగ్గురు పిల్లలతో సాఫీగా సాగుతున్న జీవనంలో ఏం కష్టం వచ్చిందో ఏమో...తండ్రి గణేష్ ఆత్మహత్యే శరణ్యమంటూ బేగంపేట్ రైల్వేస్టేషన్లో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్య,పిల్లల్ని హత్య చేసి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.బోయిన్పల్లిలో విషాదం చోటు చేసుకుంది. భార్య, 10 సంవత్సరాల కుమార్తెను చంపి ఆ తర్వాత భర్త ఆత్మ చేసుకున్నాడు. బేగంపేట వద్ద రైలు కిందపడి భర్త గణేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఆయన కుటుంబ సభ్యుల సమాచారం మేరకు..వృత్తి రిత్యా డాక్టరైన భర్త గణేష్ కుటుంబానికి గత కొంతకాలంగా ఆర్ధిక ఇబ్బందులు ఎక్కువైనట్లు తెలుస్తోంది. దీంతో భార్య, భర్తల మధ్య మనస్పర్దలు తలెత్తాయి. ఓ వైపపు అప్పుల బాధలు, మరోవైపు కుటుంబంలో కలహాలు తట్టుకోలేక గణేష్ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న బేగం పేట్ రైల్వే పోలీసులు,బోయిన్ పల్లి పోలీసులు గణేష్ ఇంటి పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీ, ఫోన్ కాల్ డేటాను పరిశీలిస్తున్నారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్య, ఆత్మహత్యకు గల కారణాల్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. -
20వ అంతస్తు నుంచి దూకిన బిజినెస్ టైకూన్
అమెరికా వ్యాపారవేత్త జేమ్స్ మైఖేల్ క్లైన్ ఎత్తైన భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. 2000లో ఫాండాంగో మూవీ టికెటింగ్ వ్యాపారాన్ని ప్రారంభించిన ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ 64 ఏళ్ల జేమ్స్ మైఖేల్ క్లైన్ మంగళవారం ఉదయం మాన్హాటన్లోని కింబర్లీ హోటల్ 20వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానిక వార్తా నివేదిక పేర్కొంది.న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రకటన ప్రకారం.. పోలీసు అధికారులు ఉదయం 10:19 గంటలకు హోటల్కు చేరుకుని ఎత్తు నుంచి పడిపోయిన వ్యక్తిని గుర్తించి దర్యాప్తు చేపట్టారు. ఆయన గదిలో సూసైడ్ నోట్ లభించినట్లు తెలుస్తోంది. మైఖేల్ క్లైన్కు భార్య పమేలా బి క్లైన్, ఆరుగురు పిల్లలు ఉన్నారు.ప్రస్తుతం ఎన్బీసీ యూనివర్సల్, వార్నర్ బ్రదర్స్ యాజమాన్యంలో ఉన్న ఫాండాంగోను 2011లో వీడిన తర్వాత, క్లైన్ తన అక్రెటివ్ కంపెనీ ద్వారా అక్యుమెన్, ఇన్సూరియన్, అకోలేడ్ లను స్థాపించారు. హెడ్జ్ ఫండ్ బ్రిడ్జ్వాటర్ అసోసియేట్స్తో సహా అనేక టెక్ కంపెనీలు, వెంచర్ క్యాపిటల్ వ్యాపారాలను కూడా క్లైన్ నిర్వహించారు. జక్స్టాపోస్కి ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఉన్నారు. జంతు సంరక్షణ న్యాయవాది అయిన ఆయన నేషనల్ ఫిష్ అండ్ వైల్డ్ లైఫ్ ఫౌండేషన్ చైర్మన్గా కూడా పనిచేశారు. -
టీడీపీ నేతల బెదిరింపులకు ‘ఉపాధి’ ఉద్యోగి బలి
చిలకలూరిపేట: టీడీపీ నాయకుల బెదిరింపులు భరించలేక ఉపాధి హామీ పథకం ఉద్యోగి ఒకరు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం గోపాలంవారిపాలెం గ్రామంలో గురువారం జరిగింది. మృతుని కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం... గోపాలంవారిపాలెం గ్రామానికి చెందిన జడ ఆనంద్(38) గత 18 సంవత్సరాలుగా మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎన్ఆర్ఈజీఎస్)లో ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. ఇటీవల టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ నాయకులు వచ్చి ఎస్సీ సామాజికవర్గానికి చెందిన ఆనంద్ను ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగానికి రాజీనామా చేయాలని హెచ్చరించారు. ఉద్యోగానికి రాజీనామా చేయకపోతే ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు క్రిమినల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయిస్తామని బెదిరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన ఆనంద్ గురువారం మధ్యాహ్నం తన ఇంటి వద్ద పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే గమనించిన కుటుంబసభ్యులు చిలకలూరిపేటలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తీసుకురాగా, చికిత్స పొందుతూ కొద్దిసేపటికే మృతిచెందాడు. ఆనంద్కు భార్య రత్నకుమారి, కుమార్తెలు దివ్య(10వ తరగతి), అర్షిత(8వ తరగతి), మహి(7వ తరగతి) ఉన్నారు. తన భర్త మృతికి గోపాళంవారిపాలెం గ్రామానికి చెందిన చిన్నం రవిబాబు, గోపాళం సాగర్బాబు, గోరంట్ల బుజ్జి, గోపాళం శ్రీధర్, మిన్నకంటి వీరబాబు, మానుకొండ బాలయ్య తదితరుల వేధింపులే కారణమని రత్నకుమారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
నల్గొండలో యువతి దారుణం
-
కుటుంబ కలహాలతో దంపతుల ఆత్మహత్య
జగదేవ్పూర్(గజ్వేల్): ఆరేళ్లుగా కలిసున్నారు.. ఏడా ది నుంచి కుటుంబ కలహాలతో విడిపోదామనుకున్నారు.. ఇంతలోనే పురుగుల మందు తాగి దంపతులు ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం ఇటిక్యాల గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. జగదేవ్పూర్ మండలం దౌలాపూర్ గ్రామానికి చెందిన అకారం నర్సింలు, లక్ష్మీ దంపతుల కూతురు సౌమ్య(25)ను ఆరేళ్ల కిందట ఇటిక్యాల గ్రామానికి చెందిన కర్కపట్ల శేఖర్(36)కు ఇచ్చి వివాహం చేశారు. శేఖర్, సౌమ్య గ్రామంలోనే ఉంటూ వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఎనిమిది నెలల కిందట నుంచి మేడ్చల్ జిల్లా తుర్కపల్లిలో మామిడి తోటలో శేఖర్ సూపర్ వైజర్గా పనిచేస్తున్నాడు. వీరికి ఐదేళ్లలోపు శివాన్స్, బిట్టు పిల్లలు ఉన్నారు. ఐదేళ్లపాటు దంపతులిద్దరూ బాగానే ఉన్నప్పటికీ ఏడాది నుంచి కుటుంబంలో ఇద్దరి మధ్య కలహాలు ప్రారంభమయ్యాయి. తరచూ గొడవలు జరుగు తుండటంతో సౌమ్య తల్లిదండ్రులు, పంచాయతీ పెద్దలు నచ్చజెప్పారు. అయినప్పటికీ ఇద్దరిలో మార్పు రాకపోవడంతో చివరికి విడాకుల వరకు వచ్చింది. ఏడాది నుంచి సౌమ్య అమ్మగారింటి వద్దే ఉంటుంది. రెండు నెలల కిందట సౌమ్య తల్లి లక్ష్మీ అనారోగ్యంతో మృతి చెందింది. పదిహేను రోజుల కిందట శేఖర్ దౌలాపూర్కు వచ్చి భార్య సౌమ్యను తీసుకొని తుర్కపల్లికి వెళ్లాడు. మంగళవారం రాత్రి తుర్కపల్లి నుంచి ఇద్దరు బైక్పై ఇటిక్యాల గ్రామంలో తమ వ్యవసాయ పొలం వద్దకు వచ్చి పురుగుల మందు తాగారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు అపస్మారకస్థితిలో ఉన్న దంపతులను 108 ద్వారా గజ్వేల్ ప్రభుత్వ ఆస్పతికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో సౌమ్య మృతి చెందింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం శేఖర్ మృతి చెందాడు. తల్లిదండ్రులు మృతి చెందడంతో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. -
రైలుకు ఎదురెళ్లి తండ్రికొడుకుల...
ముంబయి: మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఏం కష్టం వచ్చిందో పాపం.. తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం(జులై 8) ఉదయం 9.30 గంటలకు దూసుకొస్తున్న లోకల్ రైలుకు ఎదురుగా నిల్చొని ప్రాణాలు వదిలారు. ఇద్దరు ఒకరి చేతిని ఒకరు పట్టుకుని ట్రాక్పై నిల్చున్నపుడు రైలు వచ్చి ఢీకొట్టిన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. మృతి చెందిన వారిలో తండ్రి హరీశ్ మెహతా(60), కొడుకు జే(35)గా గుర్తించారు. తండ్రి, కొడుకుల ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నిమ్స్ అనస్తీషియా అడిషనల్ ప్రొఫెసర్ ప్రాచీకర్ ఆత్మహత్య
-
NIMS: నిమ్స్ వైద్యురాలి ఆత్మహత్య!
హైదరాబాద్, సాక్షి: మత్తుమందు అధిక మోతాదులో తీసుకుని నిమ్స్ వైద్యురాలు ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శనివారం ఉదయం ఈ ఘటన వెలుగు చూసింది. డాక్టర్ ప్రాచీ కర్(46) నిమ్స్లో అనస్థీషియా అడిషనల్ ప్రొఫెసర్గా పని చేస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి బేగంపేట బ్రాహ్మణవాడిలోని తన ఇంట్లో ఆమె అపస్మాకర స్థితిలో కనిపించారు. పక్కనే అనస్థీషియా మత్తు వాయిల్ పడి ఉండడం గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే నిమ్స్కు తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు.అనస్థీషియా అధిక మోతాదులో తీసుకోవడం వల్లే ఆమె చనిపోయారని నిమ్స్ వైద్యులు చెబుతున్నారు. ప్రాచీ కర్ చనిపోయిన విషయాన్ని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలియజేయడంతో కేసు నమోదు అయ్యింది. ప్రాచీ కర్ మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించి, పలువురిని ప్రశ్నిస్తున్నారు. -
రోబో ఆత్మహత్య!?
సియోల్: పరీక్ష సరిగా రాయలేదని, ప్రేమ విఫలమైందని, ఆర్థిక సమస్యలతో ఉక్కిరిబిక్కిరై ప్రాణాలు తీసుకుంటున్న జనం వార్తలను మనం చూశాం. కానీ మరమనిషి సైతం ఆత్మహత్య చేసుకుంటాడన్న వార్త వింటానికి కొత్తగా ఉన్నా ఇది నిజంగా జరిగిందని దక్షిణకొరియా వార్తాసంస్థలు కోడై కూస్తున్నాయి. రోబో సేవలను విపరీతంగా వాడే దక్షిణ కొరియాలోనే ఈ ఘటన జరగడం గమనార్హం. డాక్యుమెంట్ల డెలివరీ వంటి పనుల్లో తెగ బిజీగా ఉండే ఓ రోబో సూసైడ్ చేసుకుందన్న వార్త సంచలనం సృష్టించింది. పని ఒత్తిడి వల్లే రోబోట్ ఆత్మహత్య చేసుకుందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. చక్కర్లు కొట్టి.. మెట్లపై పడి గత గురువారం సాయంత్రం గుమీ నగర సిటీ కౌన్సిల్ భవనంలో ఈ రోబో ‘సూపర్వైజర్’ బాధ్యతల్లో ఉండగా ఉన్నట్టుండి ఆగిపోయి గుండ్రంగా తిరిగి మెట్లపై నుంచి పడిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం ఏకబిగిన పని చేయాల్సి రావడంతో విపరీత పని ఒత్తిడితోనే అది ఇలా చనిపోయిందని వార్తలొచ్చాయి. అమెరికాకు చెందిన బేర్రోబోటిక్స్ సంస్థ ఈ రోబోను తయారు చేసిచి్చంది. గత ఆగస్ట్ నుంచి అది చురుగ్గా పనిచేస్తోందట. ఈ రోబోకు సొంతంగా పౌరసేవల గుర్తింపు కార్డుంది! అంటే ఒకే ఫ్లోర్లోకాకుండా లిఫ్ట్లో తిరుగుతూ వేర్వేరు అంతస్తుల్లో పనులు చక్కబెట్టగలదు. ఇలాంటి రోబోట్ పొరపాటున మెట్ల పై నుంచి పడిందా? లేదంటే సాంకేతిక లోపమా? లేదంటే మరేదైనా సమస్యా? అన్న కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది. రోబో శకలాలను స్వా«దీనంచేసుకుని ల్యాబ్కు పంపించారు. అనూహ్య ఘటన తర్వాత ఈ బిల్డింగ్లో మరో రోబోను పనిలో పెట్టుకోబోమని గుమీ సిటీ కౌన్సిల్ చెప్పింది. అయితే ద.కొరియాలో రోబోట్ సేవలు అత్యధికం. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రోబోటిక్స్ గణాంకాల ప్రకారం ద.కొరియాలో ప్రతి పది మంది ఉద్యోగులకు ఒక పారిశ్రామిక అవసరాల రోబోట్ను వినియోగిస్తున్నారు. -
అమ్మానాన్న.. నన్ను క్షమించండి..!
చెన్నారావుపేట: అమ్మా, నాన్నా నన్ను క్షమించండి.. మీ ఆశలు నెరవేర్చలేకపోతున్నాను.. అని సూసైడ్ నోట్ రాసి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈఘటనకు సంబంధించి, స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం అమీనాబాద్ గ్రామానికి చెందిన చీర మల్లేశం– కళావతిలకు కుమార్తె, కుమారుడు రంజిత్(25) ఉన్నారు. కుమార్తెకు వివాహం జరిపించారు. కుమారుడు అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తి చేసి ఉన్నత చదువులు చదువుతూ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలు రాస్తున్నాడు. ఇటీవల ఓ పోటీ పరీక్షలో తక్కువ మార్కులు రావడంతో ఉద్యోగం రాలేదని మానసికంగా ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లోని కడపలో స్నేహితుడు ప్రశాంత్ అక్క వివాహానికి మూడు రోజుల క్రితం తన స్నేహితులతో కలిసి వెళ్లాడు. పట్టణంలోని ఎర్రముక్కలపల్లి రోడ్డు వద్ద ఓ ప్రముఖ లాడ్జీని అద్దెకు తీసుకున్నారు. గురువారం తన స్నేహితులు టిఫిన్ చేయడానికి వెళ్లారు. రంజిత్ రాకపోవడంతో స్నేహితులు గదిలోకి వెళ్లి చూడగా ఫ్యాన్కు ఉరేసుకొని ఉన్నాడు. పోలీసులకు తెలియజేసి, రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే రంజిత్ మృతి చెందినట్లు నిర్ధారించారు. పోస్ట్మార్టం అనంతరం రంజిత్ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. చేతికొచ్చిన కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు పలువురి కంటతడి పెట్టించింది. -
రోబో ఆత్మహత్య! కారణం అదేనా..
పని ఒత్తిడి ఎక్కువైతే డిఫ్రెషన్లోకి వెళ్లడం.. ఆత్మహత్య చేసుకోవడం వంటివి మనుషులే చేస్తారు. అయితే రోబోట్స్ కూడా ఒత్తిడి భరించలేక ఆత్మహత్య చేసుకుంటాయని ఇటీవలే ఓ సంఘటన ద్వారా వెలుగులోకి వచ్చింది. రోబోట్ ఆత్మహత్య చేసుకోవడం ఏమిటి? అని చాలామందికి అనుమానం రావొచ్చు? దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలంటే ఈ కథనం చూడాల్సిందే..సౌత్ కొరియాలోని గుమి సిటీ కౌన్సిల్లో పనిచేస్తున్న సివిల్ సర్వెంట్గా పనిచేస్తున్న రోబోట్.. ఇటీవల 'రోబో సూపర్వైజర్'గా పిలువబడే రోబోట్ కౌన్సిల్ భవనంలోని మొదటి, రెండవ అంతస్తుల మధ్య ఉండే మెట్ల మీద నుంచి కిందపడిపోయింది. దీనిని మొట్టమొదటి "రోబోట్ ఆత్మహత్య"గా చెబుతున్నారు.సిటీ కౌన్సిల్ అధికారులు వెంటనే స్పందించారు. పగిలిన రోబోట్ ముక్కలను విశ్లేషణ కోసం సేకరించారు. ఇది ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏమిటనే దిశగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ రోబోట్ ఎక్కువ పని చేయడం వల్ల ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని చాలా మంది అనుకుంటున్నారు.రోబోట్ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు విచిత్రంగా ప్రవర్తించినట్లు, అక్కడే ఏదో వెతుకుతున్నతలు అటూ, ఇటూ తిరుగుతూ కనిపించిందని అక్కడ పనిచేసే ఉద్యోగులు పేర్కొన్నట్లు సమాచారం. ప్రతి రోజూ ఉదయం 9 నుండి సాయంత్రం 6 గంటల వరకు రోబోట్ పనిచేస్తుంది. ఇలా విరామం లేకుండా పనిచేయడం వల్లనే రోబోట్ ఆలా ప్రవర్తించిందని, ఆత్మహత్య చేసుకుందని పలువురు భావిస్తున్నారు.ఇతర దేశాలతో పోలిస్తే.. సౌత్ కొరియాలో రోబోట్స్ వినియోగం చాలా ఎక్కువ. ప్రతి పది మంది ఉద్యోగులకు సహాయం చేయడానికి ఒక రోబోట్ ఉంటుందని ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రోబోటిక్స్ వెల్లడించింది. కాగా రోబోట్ నిజంగా ఆత్మహత్య చేసుకుందా? లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనేది తెలియాల్సి ఉంది. -
కోటాలో జేఈఈ విద్యార్ధి ఆత్మహత్య.. ఏడాదిలో 12వ ఘటన
రాజస్థాన్లోని కోటాలో మరో విద్యార్ధి ప్రాణాలు విడిచాడు. బిహార్కు చెందిన జేఈఈ విద్యార్ధి సందీప్ కుమార్ తన గదిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హాస్టల్లో నివసిస్తున్న ఇతర విద్యార్ధులు కిటికీలోంచి మృతదేహాన్ని చూసి వెంటనే యాజమాన్యానికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తలుపులు పగులగొట్టి..మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.మరణించిన విద్యార్థి బిహార్లోని నలందకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. సందీప్ కుమార్ గత రెండేళ్లుగా కోటాలో ఉంటూ జేఈఈకి ప్రిపేర్ అవుతున్నాడని పోలీసు అధికారులు తెలిపారు. సందీప్ తల్లిదండ్రులు నాలుగేళ్ల క్రితమే చనిపోవడంతో మేనమామ చదువుల ఖర్చులు భరిస్తున్నాడని చెప్పారు. అతన్ని (సందీప్) కోటా ఇన్స్టిట్యూట్లో మేనమామే చేర్పించాడని తెలిపారు. విద్యార్ధి చనిపోయే ఒక రోజు ముందు మామ అతని ఖాతాలో డబ్బు జమ చేసినట్లు తెలిసిందని చెప్పారు. తదుపరి విచారణ కొనసాగుతోందని,అతడి మరణానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. దేశంలోనే ‘కోచింగ్ హబ్’గా ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్ కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. చదువు ఒత్తిడి, వ్యక్తిగత కారణాలతో విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజా ఘటనతో కలిసి ఈ ఏడాది ఇప్పటి వరకూ ఇది పన్నెండవ ఘటన కావడం గమనార్హం. ఇక గతేడాది ఏకంగా 30 మంది దాకా విద్యార్ధులు ప్రాణాలు విడిచారు. -
ఉసురు తీసిన కుటుంబ కలహాలు
కుల్కచర్ల: కుటుంబ కలహాలతో కలత చెందిన తండ్రి ఆత్మహత్యకు సిద్ధపడగా.. కాపాడబోయిన కూతురుతో పాటు ఇద్దరూ మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కుల్చచర్ల మండల పరిధి చౌడాపూర్ల మండలం మందిపల్ గ్రామానికి చెందిన శివానంద్(51) భార్య లావణ్యలకు కుమారుడు సాయి, కూతురు చందన ఉన్నారు. 25 సంవత్సరాలుగా ఈ కుటుంబం మహబూబ్నగర్ జిల్లా శివరాంనగర్ కాలనీలో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో భూమి విషయంలో ఇంట్లో గొడవ జరగగా.. మనస్థాపం చెందిన శివానంద్.. రైలు పట్టాలపై నిల్చున్నాడు. ఇది గమనించిన కూతురు, కుమారుడు తండ్రిని కాపాండేదుకు యత్నించగా.. వేగంగా వచ్చిన రైలు.. తండ్రి శివానంద్, తనయ చందనను ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరూ మృత్యువాత పడ్డారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలకు కుటుంబ సభ్యులు మందిపల్లో అంత్యక్రియలు పూర్తి చేశారు. -
Farmer Suicide: సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగులమందు తాగి...
చింతకాని/జనగామ /లింగాల/గద్వాల రూరల్: వ్యవసాయ భూమి విషయంలో తనకు అన్యాయం జరిగిందనే ఆవేదనతో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా, మరో ముగ్గురు రైతులు ఆత్మహత్యకు యతి్నంచారు. నాలుగు జిల్లాల పరిధిలో సోమవారం ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగులమందు తాగి... ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరుకు చెందిన బోజెడ్ల ప్రభాకర్ (45) కుటుంబానికి 7.10 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. గ్రామంలోని చెరువు శిఖం పక్కనే ఉన్న తన భూమిలో ప్రభాకర్ గత వేసవిలో రూ.8 లక్షలు వెచి్చంచి మట్టి తోలించాడు. అయితే చెరువు శిఖంలో మట్టి పోశారంటూ గ్రామానికి చెందిన మత్స్య సొసైటీ సభ్యులు నాలుగు రోజుల క్రితం రెండు జేసీబీలు, రెండు బుల్డోజర్లతో ప్రభాకర్ పొలంలోని మట్టిని తొలగించారు. దీనిపై తహసీల్దార్, ఎస్సై, ఇరిగేషన్ అధికారులకు ప్రభాకర్ ఫిర్యాదు చేయగా ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు భూమిని పరిశీలించి మట్టి తొలగించొద్దని సొసైటీ సభ్యులకు చెప్పారు. అయినా వారు దౌర్జన్యంగా మట్టి తొలగించగా, గ్రీవెన్స్లో కలెక్టర్, సీపీని కలిసి తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసేందుకు తన తండ్రితో కలిసి ప్రభాకర్ సోమవారం ఖమ్మం కలెక్టరేట్కు వెళ్లాడు. అక్కడ కలెక్టర్ కలవకపోవడంతో మనస్తాపానికి గురైన ప్రభాకర్.. భోజనం చేసి వస్తానంటూ తండ్రితో చెప్పి ఖమ్మంలోని గొల్లగూడెం – కొత్తగూడెం మార్గంలో గల చెరుకూరి గార్డెన్ వద్దకు పురుగుల మందు డబ్బాతో చేరుకున్నాడు. తనకు జరిగిన అన్యాయాన్ని సెల్ఫీ వీడియో ద్వారా వివరిస్తూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న 108 సిబ్బంది ఆ ప్రాంతానికి వెళ్లగా అప్పటికే మృతి చెందాడు. గ్రామంలోని కొందరు కాంగ్రెస్, టీడీపీ నాయకుల ప్రోద్బలంతోనే తన పొలాన్ని నాశనం చేశారని వివరిస్తూ తాను ఆత్మహత్య చేసుకునే ముందు తీసిన వీడియోను సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కకు పంపించాలని, తన కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని ప్రభాకర్ కోరాడు. గోలీలు మింగి...కిరోసిన్ డబ్బాతో... ⇒జనగామ జిల్లా నర్మెట మండల కేంద్రానికి చెందిన అక్కాచెల్లెళ్లు దేవులపల్లి జ్యోతి, స్వప్నల పేరిట తాత లక్ష్మయ్య 1.04 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ చేయించి గార్డియన్గా ఉన్నాడు. ఆ విషయం అక్కాచెల్లెళ్లకు తెలియదు.2014లో లక్ష్మయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. జ్యోతి, స్వప్నలకు పెళ్లిళ్లు కూడా అయ్యాయి. ట్రంకు పెట్టె సర్దుతుండగా, భూమి విషయం తెలిసింది. వెంటనే జ్యోతి గ్రామానికి చెందిన సదరు వ్యక్తిని భూమి విషయం అడగ్గా, మాటామాటా పెరిగి ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. న్యాయం కోసం జ్యోతి గతంలో నర్మెట పీఎస్కు వెళ్లి ఆత్మహత్యాయత్నం చేయగా, పోలీసులు నచ్చచెప్పి ఇంటికి పంపించారు. ఆ తర్వాత జ్యోతి కోర్టును ఆశ్రయించింది. కేసు నడుస్తోంది. భూమి వస్తుందో రాదో అన్న ఆవేదనతో జ్యోతి కొన్ని మందుగోలీలు మింగి సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్స్కు వచి్చంది. ప్రజావాణి ప్రారంభమయ్యే క్రమంలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు యతి్నంచగా, పోలీసులు అడ్డుకున్నారు. చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారు. ఇతరుల పేరిట పట్టా చేశారని... ∙నాగర్కర్నూల్ జిల్లా లింగాలకు చెందిన మహిళారైతు గాలేటి జయమ్మకు గ్రామ శివారులో 1.37 ఎకరాల భూమి వారసత్వంగా దక్కాల్సి ఉంది. ఆ భూమిని పదేళ్ల కిందట అధికారులు ఇతరుల పేరిట పట్టా చేశారు. అప్పటి నుంచి అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. దీంతో ఆందోళనకు గురైన జయమ్మ సోమవారం పెట్రోల్తో లింగాల తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి ఒంటిపై పోసుకునేందుకు ప్రయతి్నంచింది. గమనించిన చుట్టుపక్కల వారు అడ్డుకున్నారు. నేతలు భూమి కబ్జా చేశారని... ∙జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం గుడిదొడ్డి గ్రామానికి చెందిన రైతు పరుశరాముడికి అదే గ్రామ శివారులో ఐదు ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని గ్రామనేతలు కబ్జా చేశారు. దీనిపై పరుశరాముడు పలుమార్లు రెవెన్యూ అధికారులతో పాటు కలెక్టరేట్లో కూడా ఫిర్యాదు చేశాడు. కానీ సమస్య పరిష్కారం కాలేదు. సోమవారం గద్వాల కలెక్టరేట్లో కలెక్టర్ బీఎం.సంతోష్ ఆ«ధ్వర్యంలో ఫిర్యాదుల దినోత్సవం కొనసాగుతుండగానే పరుశరాముడు తన వెంట తీసుకొచ్చిన పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం రైతు పరిస్ధితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. -
నా భార్యాకుమారుడిని చేరదీయండి
ఖమ్మంక్రైం: ‘మానస నువ్వంటే చెప్పలేనంత ప్రేమ. అనారోగ్యంతో బాధపడుతున్న నీకు తోడగా ఉండాల్సింది పోయి వెళ్తున్నా.. మన కుమారుడు నమన్రెడ్డిని జాగ్రత్తగా చూసుకో.. నాన్నా(కుమారుడిని ఉద్దేశించి) నీ చెయ్యి పట్టుకుని ప్రపంచాన్ని చూపించాల్సి ఉన్నా చేయి విడిచిపెట్టి పోతున్నాను. నన్ను క్షమించండి. అమ్మ, అక్క, తమ్ముళ్లు, అత్తయ్య, మామయ్యలు, బాబాయిలు, పిన్నిలు మీరంతా నా కొడుకు, భార్యను జాగ్రత్త గా చూసుకోండి. నాపై కోపం ఉంటే వారిపై చూపకుండా చేరదీసి ఆదుకోండి’ అంటూ లేఖ రాసిన ఓ ఫొటోగ్రాఫర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడెంకు చెందిన ఎరసాని శ్రీనివాస్రెడ్డి(40) ఫొటోగ్రాఫర్గా పనిచేస్తూ భార్య మానస, కుమారుడు నమన్రెడ్డితో కలిసి ఉంటున్నాడు. అయితే కొంతకాలంగా ఆయన లోన్యాప్లు, క్రెడిట్కార్డుల ద్వారా తీసుకున్న అప్పులు పెరిగి తీర్చలేని పరిస్థితి ఎదురైనట్లు తెలుస్తోంది. దీంతో ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈనేపథ్యాన కొన్నాళ్ల క్రితం ఖమ్మంలో ఫొటోగ్రాఫర్గా పనిచేసిన అనుభవం ఉండడంతో శుక్రవారం సాయంత్రం ఇక్కడకు చేరుకుని లాడ్జీలో గది అద్దెకు తీసుకున్నాడు. శనివారం ఉదయం ఆయనకు టీ ఇవ్వడానికి వెళ్లిన సిబ్బంది ఎంత పిలిచినా తలుపు తీయకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు వచ్చి తలుపులు పగులకొట్టి చూడగా శ్రీనివాస్రెడ్డి ఉరి వేసుకుని కనిపించాడు. ఆయన వద్ద లభించిన లేఖ, చిరునామా ఆధారంగా కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. కాగా, అప్పులు పెరగడంతో తీర్చే మార్గం లేక బలవన్మరణానికి పాల్పడగా, శ్రీనివాసరెడ్డి తన భార్య, కుమారుడిని విడిచిపెట్టలేక సంఘర్షణకు గురైనట్లు లేఖ ద్వారా తెలియడంతో చదివిన వారంతా కంటతడి పెట్టారు. కాగా, ఆయన మృతదేహాన్ని అన్నం ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాసరావు, సిబ్బంది సాయంతో మార్చురీకి తరలించి కేసు నమోదు చేసినట్లు ఖమ్మం టుటౌన్ ఎస్ఐ రఫీ తెలిపారు. -
పోలీసుల వేధింపులు?.. రెండు రోజుల వ్యవధిలో సోదరుల ఆత్మహత్య
లక్నో: పోలీసుల వేధింపులకు రెండు ప్రాణాలు బలయ్యాయి. హత్రాస్ పోలీసుల వేధింపులతో రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు సోదరులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ముందుగా తమ్ముడు సంజయ్ అనే ఆత్మహత్య చేసుకున్న రెండు రోజులకు ఆగ్రా సమమీపంలోని ఓ గ్రామంలో చెట్టుకు ఉరేసుకొని సోదరుడు ప్రమోద్ సింగ్ అనే వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు.కాగా జూన్ 9న అతని బావమరిది లక్ష్మణ్ గ్రామంలోని ఒక మహిళతో పారిపోవడంతో పోలీసులు సంజయ్ సింగ్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం జూన్ 13న ప్రమోద్ను విచారించారు. అయితే కస్టడీలో ఉన్న సంజయ్ను కొందరు పోలీసు అధికారులు కొట్టారని, వారు అతని నుంచి రూ. 1 లక్ష డిమాండ్ చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ముందుగా పదివేలు కట్టి, మిగతా 90 వేలు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో సంజయ్ను విడుదల చేశారని తెలిపారు.అనంతరం జూన్ 22 న సంజయ్ ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే పోలీసు అధికారులు నిరంతరం వేధింపులకు గురిచేయడం, పోలీస్ స్టేషన్కు పిలపించి బెదిరింపులకు పాల్పడటంతో మనస్తాపం చెందిన సంజయ్ చనిపోయాడని కుటుంబీకులు ఆరోపించారు.సంజయ్ మరించిన తర్వాత ప్రమోద్ను పోలీసులు మళ్లీ విచారణకు పిలించారు. దీంతో అతడు కూడా సోమవారం చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తన సోదరుడి ఆత్మహత్యపై ఫిర్యాదు చేయవద్దని ప్రమోద్ను పోలీసులు హెచ్చరించినట్లు కుటుంబ సభ్యుడు ఆరోపించారు. కాగా జంట ఆత్మహత్యలపై గ్రామంలో ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు భద్రతను పెంచారు.సుసైడ్కు ముందు హత్రాస్లోని సాదాబాద్ పోలీస్ స్టేషన్లో కొంతమంది అధికారులను తనను వేధింపులకు గురిచేస్తున్నట్లు ప్రమోద్ సింగ్ ఓ లేఖ రాశారు. దీని ఆధారంగా కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఓ అధికారి అగ్నిహోత్రిని సస్పెండ్ చేయగా.. మరో అధికారి కుమార్ను బదిలీ చేశారు. -
టీడీపీ వర్గీయుల వేధింపులతో ఆత్మహత్య
నల్లజర్ల: టీడీపీ వారి సూటిపోటి మాటలు, వేధింపులు తట్టుకోలేక తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లిలో వైఎస్సార్సీపీ కార్యకర్త రాము భార్య పెద్దింట్లు (50) పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి భర్త రాము, వారి కుమారుడు ప్రసాద్ సోమవారం తెలిపిన మేరకు.. ఈ కుటుంబం గ్రామంలోని గంగానమ్మ గుడి వీధిలో నివసిస్తోంది. ఆ వీధిలో వీరొక్కరే వైఎస్సార్సీపీకి చెందినవారు.మిగిలిన వారంతా టీడీపీ వారే. గ్రామంలోని పద్మావతి డ్వాక్రా సంఘంలో పెద్దింట్లు సభ్యురాలు. వయస్సు పైబడిన మానికల లక్ష్మమ్మ ఆ గ్రూపు నుంచి వైదొలగడంతో ఆమె స్థానంలో కొత్త సభ్యురాలిని చేర్చుకునే విషయమై గ్రూపులోని మిగిలిన సభ్యులతో పెద్దింట్లుకు ఇటీవల వివాదం జరిగింది. దీనికితోడు పెద్దింట్లు వైఎస్సార్సీపీకి చెందినవారు కావడంతో గ్రూపు సభ్యులు ఆమెను వేధించసాగారు. ఎన్నికల ముందు నుంచే సూటిపోటి మాటలతో వేధిస్తున్న గ్రూపు సభ్యులు.. ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఓటమితో వేధింపుల్ని తీవ్రతరం చేశారు. ఇంటిపైకి వచ్చి బెదిరించసాగారు.ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన పెద్దింట్లు గురువారం పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. తొలుత స్థానికంగా వైద్యం చేయించిన కుటుంబసభ్యులు తరువాత ఏలూరు, అక్కడి నుంచి గుంటూరు ఆస్పత్రికి తరలించారు. గుంటూరు ప్రభుత్వాస్పపత్రిలో చికిత్స పొందుతూ పెద్దింట్లు ఆదివారం మృతిచెందింది. టీడీపీ వర్గీయులు తమను వేధించడమే కాకుండా, తిరిగి తమపై పోలీస్స్టేషన్లో తప్పుడు కేసు పెట్టారని రాము, ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దింట్లును మానసికంగా వేధించి ఆమె మృతికి కారకులైనవారిని కఠినంగా శిక్షించాలని వారు కోరారు. -
ప్రాణాలు తీసిన వైరల్ వీడియోలు.. మనస్తాపంతో వృద్దుడి ఆత్మహత్య
ట్రోల్స్, మీమ్స్, వీడియోలు వైరల్చేయడం వల్ల తాత్కాలికంగా నవ్వుకోవచ్చేమో కానీ.. కొంత మంది జీవితాలను చిన్నాభిన్నం చేస్తాయి. సరదాకు చేసిన పనుల వల్ల ఆందోళన, మనస్తాపానికి గురై చివరకు ప్రాణాలు సైతం పోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే వీటి కారణంగా ఎంతో మంది మరణించగా.. తాజాగా వ్యర్థాలను సేకరించే ఓ వృద్ధుడు తన వీడయోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అవమానంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో జరిగింది.వివరాలు.. ప్రతాప్ సింగ్ అనే వృద్దుడు రోడ్ల పక్కన ప్లాస్టిక్ బాటిళ్లు, ఇతర వ్యర్థ పదార్థాలను సేకరించి అమ్ముకుంటూ బతికేవాడు. ఆయా వ్యర్థాలను ఓ హ్యాండ్కార్ట్ లో వేసుకుని వెళ్లేవాడు. గ్రమంలో అందరకీ సుపరిచితుడు కావడంతో అందరూ అతన్ని బాబాజీ* అని పిలిచేవారు.అయితే అతడిపై లొహావత్ గ్రామ యువకులు వీడియోలు తీయడం ప్రారంభించారు. వాటిని మీమ్స్గా రూపొందించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. పోస్టు చేసిన వీడియోల్లో కొంతమంది వ్యక్తులు అతనిని వెంబడించి తన చేతి బండిని తోసుకుంటూ వెక్కిరిస్తున్నట్లు కనిపిస్తుంది.ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయ్యాయి. .తనను ఎగతాళి చేస్తూ తీసిన వీడియోల పట్ల ఆ వృద్ధుడు మనస్తాపానికి గురయ్యాడు. చివరకు ఓ హైవే పక్కన చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే తన వీడియోలు వైరల్ అవ్వడం, అమానించడం, మీమ్స్ కారణంగానే ప్రతాప్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
తండ్రి స్నాప్చాట్ వద్దన్నాడని..16 ఏళ్ల బాలిక సూసైడ్
ఈ మధ్య కాలంలో యువత ఆత్మహత్య ఘటనలు ఎక్కువైపోతున్నాయి. చిన్న చిన్న విషయాలకే కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. పరీక్షల్లో ఫెయిల్ పరీక్షలో ఫెయిల్ అయ్యామని, తల్లిదండ్రులు మందలించారని, ఫోన్ కొనియ్యలేదని, స్నేహితులు అల్లరి చేశారని.. ఇలాంటి చిన్న చిన్న కారణాలతో ప్రాణాలు తీసుకుంటున్నారు.. తాజాగా మహారాష్ట్రలో ఇలాంటి తరహా ఘటనే చోటు చేసుకుంది.ప్రముఖ మెసేజింగ్ యాప్ స్నాన్చాట్ను వాడొద్దని తండ్రి మందలించినందుకు 16 ఏళ్ల బాలిక బలవన్మరణానికి పాల్పడింది. థానే జిల్లాలోని డోంబివిలీ ప్రాంతంలోని శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. బాలిక తన ఫోన్లో స్నాప్చాట్ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకుంది. ఇది చూసిన ఆమె తండ్రి ఆమెను సున్నితంగా స్నాప్చాట్ను వాడొద్దని సూచించాడు. తండ్రి మాటలకు ఆగ్రహానికి గురైన సదరు బాలిక రాత్రి తన గదిలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.ఉదయం గది తలుపులు తెరవకపోడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు డోర్లు బద్దలు కొట్టి చూడగా.. అప్పటికే బాలిక ఫ్యాన్కు విగతజీవిగా వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న మాన్పాడ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు ప్రమాదవశాత్తు మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కేజీబీవీలో విద్యార్థిని ఆత్మహత్య?
చిల్పూరు: జనగామ జిల్లా చిల్పూరు మండలం రాజవరం సమీపంలోని కేజీబీవీలో 9వ తరగతి విద్యారి్థని ఇస్లావత్ వర్షిణి (14) అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. అయితే బాలిక ఆత్మహత్య చేసుకుందని భావిస్తున్నారు. కుటుంబ సభ్యులు, పాఠశాల వర్గాలు, ఎస్సై ముత్యం రాజేందర్ కథనం ప్రకారం.. రాజవరం జీపీ పరిధి ఫకీర్తండాకు చెందిన ఇస్లావత్ తీరమ్మ, కిషన్ దంపతుల కూతురు వర్షిణిని శుక్రవారం కేజీబీవీలో 9వ తరగతిలో చేరి్పంచారు.అదే రోజు సాయంత్రం భోజనం పెట్టే సమయంలో వర్షిణి రాకపోవడంతో ఎస్ఓ పిలవగా.. ఆకలిగా లేదని సమాధానం చెప్పింది. ఆ రాత్రి భోజనం చేయకుండానే నిద్రపోయిన వర్షిణి, శనివారం ఉదయం మేల్కొనలేదు. గదులు శుభ్రం చేసేందుకు వచి్చన సిబ్బంది పలకరించినా సమాధానం రాకపోవడంతో ఆమె కప్పుకున్న దుప్పటి తీయగా వాంతులు చేసుకున్నట్లు గమనించారు. పక్కన కూల్డ్రింక్ బాటిల్ కనిపించడంతో అనుమానంతో ఇన్చార్జి స్పెషల్ ఆఫీసర్ (ఎస్ఓ) సోనికి తెలియజేయగా బాలిక తల్లిదండ్రులతోపాటు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ముందుగా వర్షిణిని స్టేషన్ఘన్పూర్ ఆస్పత్రికి తరలించగా ప్రథమ చికిత్స చేసి వరంగల్ ఎంజీఎంకు పంపించారు. అక్కడ చికిత్స పొందుతూ వర్షిణి ఆదివారం ఉదయం మృతి చెందింది. ఇష్టం లేదని చెప్పింది.. : ఎస్ఓ ఈ విషయమై ఇన్చార్జి ఎస్ఓ సోని మాట్లాడుతూ, శుక్రవారం వర్షిణి విద్యాలయంలో చేరిన సమయంలో తనకు హాస్టల్లో ఉండడం ఇష్టం లేదని చెప్పిందని వెల్లడించారు. ఈ విషయాన్ని బాలిక తల్లి దృష్టికి తీసుకెళ్లామని, ఆమె కూడా అదే విషయాన్ని చెప్పారని అన్నారు. ఒకటి రెండు రోజుల్లో సర్దుకుంటుందని ఆమె అన్నారని తెలిపారు.కాగా, బాలిక వెంట తెచ్చుకున్న కూల్డ్రింక్లో పురుగు మందు కలిపి తెచ్చుకుని ఉంటుందని అనుమానిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలిక మరణానికి కారణాలు ఆస్పత్రి వర్గాల పూర్తి నివేదిక వచ్చాక తెలుస్తుందని వారు చెప్పారు. ఇదిలా ఉండగా.. తన తండ్రి మద్యం తాగినప్పుడల్లా తల్లిని కొడుతుంటే అడ్డుగా ఉండేదానినని.. తనను హాస్టల్లో చేర్పిస్తే గొడవ జరిగినప్పుడు ఎవరు ఆపుతారని వర్షిణి సిబ్బందితో అన్నట్లు తెలిసింది. -
భర్తకు ఫోన్ చేసి...!
సాక్షిప్రతినిధి, కరీంనగర్ /అల్వాల్ /గాం«దీఆస్పత్రి/మేడ్చల్: రూపాదేవి(40) తన భర్త ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో ఫోన్లో మాట్లాడిన తర్వాతే ఆత్మహత్య చేసుకుంది. గురువారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఇంట్లో తల్లి, ఇద్దరు పిల్లలు ఉండగానే రూపాదేవి గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. ఎంతకూ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన రూపాదేవి తల్లి భూలక్ష్మమ్మ డోర్ తీయడానికి ప్రయత్నించినా రాలేదు. దీంతో స్థానికుల సాయంతో తలుపులు తీయగా, అప్పటికే రూపాదేవి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అనారోగ్య సమస్యలతో తన కూతురు ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని తల్లి భూలక్ష్మమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు.చనిపోవడానికి ముందు తన కూతురు భర్తతో మాట్లాడిందని భూలక్ష్మమ్మ చెప్పింది. విషయంగా తెలియగానే నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే సత్యం హుటాహుటిన తనే కారు నడుపుకుంటూ సిటీకి బయలుదేరారు. విషయం తెలుసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే సత్యంను మార్యమధ్యలో ఆపి, ఆస్పత్రికి తన కారులో తీసుకొచ్చారు. భార్య మృతదేహాన్ని చూసి ఎమ్మెల్యే బోరున విలపిస్తూ ఒక్కసారిగా కుప్పకూలారు.దీంతో ఆయనకు ఆదే ఆస్పత్రిలో చికిత్స అందించారు. రూపాదేవి అంత్యక్రియలు శుక్రవారం తిరుమలగిరి ఆర్టీసీ కాలనీలోని స్వర్గధామంలో జరిగాయి. గురువారం రాత్రి నుంచి రూపాదేవి అంత్యక్రియలు అయ్యే వరకు పొన్నం ప్రభాకర్ సత్యం వెంటే ఉన్నారు. ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, ఎమ్మెల్యే సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, సుద్దాల దేవయ్య తదితరులు మేడిపల్లి సత్యంను పరామర్శించారు.పీజీ చదువుతుండగా ప్రేమలో... రంగారెడ్డి జిల్లాకు చెందిన రూపాదేవి, సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలానికి చెందిన మేడిపల్లి సత్యంలది ప్రేమ వివాహం. ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చదువుతున్న సమయంలో హైదరాబాద్లో వీరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అనంతరం కులాంతర వివాహం చేసుకున్న సత్యం దంపతుల కాపురం అన్యోన్యంగా సాగింది. వీరికి కుమారుడు యోజిత్ (11), కుమార్తె రిషిక (9)లు ఉన్నారు. వృత్తిరీత్యా రూపాదేవి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. వికారాబాద్ నుంచి మేడ్చల్ మండలంలోని రావల్కోల్ ఉన్నత పాఠశాలకు బదిలీ అయ్యారు. రెండు నెలల క్రితం అల్వాల్ పంచశీల కాలనీకి నివాసం మార్చారు. గురువారమే బయల్దేరిన సత్యం.. చొప్పదండిలో ఎమ్మెల్యేగా గెలవాలని చాలాకాలంగా ప్రయతి్నంచిన సత్యం 2014, 2018 ఎన్నికల్లో ఓటమి తర్వాత 2023లో ఎట్టకేలకు విజయం సాధించారు. సత్యం కరీంనగర్లోని వీపార్క్ సమీపంలో నివాసముంటున్నారు. భార్య టీచర్ కావడంతో పిల్లలతో కలిసి అల్వాల్లోనే నివసిస్తున్నారు. గురువారం మధ్యాహ్నమే అల్వాల్ నుంచి సత్యం చొప్పదండి చేరుకున్నారు. రోజంతా నియోజకవర్గ పరిధిలోని మల్యాల మండలంలో షాదీముబారక్ చెక్కుల పంపిణీతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఒకటి రెండుసార్లు మినహా.. సత్యం ఎమ్మెల్యే అయ్యాక రూపాదేవి నియోజకవర్గంలో చాలా తక్కువగా కనిపించేవారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన సమయంలో, కొండగట్టు సమీపంలోని నల్లగొండ ఆలయంలో మొక్కులు అప్పజెప్పిన సమయంలో సత్యం సతీసమేతంగా కనిపించారు. ఫిబ్రవరి 23న కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన చిలువేరు నరేశ్ దంపతుల నాలుగు నెలల చిన్నారికి గుండె చికిత్సకు రూ.లక్ష అందజేసిన సమయంలో రూపాదేవి సత్యంతో కలిసి వచ్చారు. ఇటీవల సత్యం దంపతులు, కుటుంబసభ్యులతో కలిసి తిరుపతి, శ్రీశైలం, కాణిపాకం తదితర పుణ్యక్షేత్రాలను సందర్శించారు. రూపాదేవి సోదరుడు తోట అనిల్ కూడా ఎమ్మెల్యే సత్యం వద్దనే వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తున్నారు. రూపాదేవి ఆత్మహత్యకు ఆమె అనారోగ్యమే కారణమని కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. రావల్కోల్లో విషాదఛాయలు మేడ్చల్ మండలం రావల్కోల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూపాదేవి రెండేళ్లుగా సోషల్ టీచర్గా పనిచేస్తున్నారు. ఆమె మరణవార్తతో పాఠశాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్కూల్లో ఏనాడు రూపాదేవి వ్యక్తిగత విషయాలు మాట్లాడేవారు కాదని, పేద పిల్లలు బాగా చదవాలని ఆరాటపడేవారని, తోటి ఉపాధ్యాయులు చెప్పారు. రావల్కోల్కు చెందిన ఓ విద్యారి్థని చదువుకు కూడా ఆమె ఆర్థికసాయం చేశారు. మూడురోజుల క్రితమే సెలవు పెట్టారని, అద్దె ఇంటి నుంచి సొంతింటికి మారుతున్నానని తనతో చెప్పారని హెచ్ఎం తెలిపారు. గాంధీలో పోస్టుమార్టం రూపాదేవి మృతదేహానికి సికింద్రాబాద్ గాంధీఆస్పత్రిలో ఫోరెన్సిక్ మెడిసిన్ హెచ్ఓడీ ప్రొఫెసర్ కృపాల్సింగ్ నేతృత్వంలో వైద్యుల బృందం శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించింది. చిలకలగూడ ఎస్హెచ్ఓ అనుదీప్ భద్రత ఏర్పాట్లు పర్య వేక్షించారు. మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ రాజయ్య, పలువురు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు గాం«దీమార్చురీకి చేరుకుని రూపాదేవి మృతదేహం వద్ద నివాళులరి్పంచి మేడిపల్లి సత్యం, కుటుంబసభ్యులను పరామర్శించారు. -
Telangana: కాంగ్రెస్ ఎమ్మెల్యే భార్య ఆత్మహత్య.. కారణం ఇదే?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సతీమణి రూపాదేవి ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్లో అల్వాల్లోని పంచశీల కాలనీలోని ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రూపాదేవి గురవారం రాత్రి అల్వాల్లోని పంచశీల కాలనీలోని ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. ఇక, ఆమె ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం రూపాదేవి మృతదేహాన్ని కొంపల్లిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, రూపాదేవి వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఎమ్మెల్యే దంపతులకు ఇద్దరు పిల్లలు. అయితే, రూపాదేవి రెండు రోజుల నుంచి స్కూలుకు వెళ్లలేదు. మరోవైపు.. ఎమ్మెల్యే మేడిపల్లి ఉదయమే నియోజకవర్గానికి వెళ్లారు. సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు. ఈ సమయంలోనే ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. అయితే, రూపాదేవి అనారోగ్య సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఆమె గత రెండు సంవత్సరాల నుంచి తీవ్ర కడుపునొప్పి సమస్యతో బాధపడుతున్నట్టు తెలిపారు. ఈ కారణంగానే రెండు రోజులుగా స్కూల్కి సెలవు తీసుకొని ఇంట్లోనే ఉంటున్నారు. మరోవైపు.. రూపాదేవి కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేశారు. ఇక, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్నీ గాంధీ ఆసుపత్రికి తరలించారు. -
కన్నడ హీరో దర్శన్ మేనేజర్ సూసైడ్.. ఘటనాస్థలిలో కీలక ఆధారాలు!
హీరో దర్శన్ అభిమాని హత్య కేసు శాండల్వుడ్ను కుదిపేస్తోంది. ఈ కేసులో ఇప్పటికే దర్శన్, ఆయన ప్రియురాలు పవిత్ర గౌడను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసును బెంగళూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్య జరిగిన ప్రదేశంలో దర్శన్ కారు కనిపించడంతో పోలీసులు అతన్ని నిందితుడిగా చేర్చారు. ప్రస్తుతం ఈ కేసులో పవిత్ర గౌడ, దర్శన్ పోలీసుల కస్టడీలో ఉన్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా మరో షాకింగ్ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. దర్శన్కు చెందిన బెంగళూరు ఫామ్హౌస్ను చూసుకునే మేనేజర్ శ్రీధర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని మృతదేహాన్ని ఫామ్హౌస్ సమీపంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడే సూసైడ్ నోట్తో పాటు వీడియో సందేశం పోలీసులకు లభించాయి.విపరీతమైన ఒంటరితనం కారణంగానే జీవితాన్ని ముగిస్తున్నట్లు సూసైడ్ నోట్లో మేనేజర్ శ్రీధర్ పేర్కొన్నాడు. ఈ కేసులో తన మిత్రులు, బంధువులకు ఎలాంటి సంబంధం లేదని.. తన మరణానికి తానే కారణమని సూసైడ్ నోట్లో రాసుకున్నాడు. అయితే మేనేజర్ ఆత్మహత్యకు, దర్శన్ అభిమాని రేణుకాస్వామి హత్య కేసుకు మధ్య ఉన్న సంబంధంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. -
అనుమానాస్పదంగా వివాహిత మృతి
గజపతినగరం రూరల్: మండలంలోని బంగారమ్మపేట గ్రామానికి చెందిన తాడితూరి అనూష (అలియాస్ తనూజ20) ఆదివారం రాత్రి మృతి చెందగా.. తమ కుమార్తె మృతిపట్ల అనుమానాలున్నాయంటూ మృతురాలి తండ్రి రమణ గజపతినగరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు బొబ్బిలి డీఎస్పీ పి.శ్రీనివాస్ సోమవారం తన బృందంతో గ్రామంలోని సంఘటనా స్ధలానికి చేరుకుని విచారణ చేపట్టారు. గ్రామంలో మృతురాలి బంధువులు, తోటి స్నేహితులను వాకబు చేశారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ నాలుగుమాసాల క్రితం ఇదే గ్రామానికి చెందిన సీఆర్పీఎఫ్ జవాన్తో అనూషకు వివాహమైంది. కాపురం ఆనందంగానే సాగుతోందని, అయితే ఆమె వివాహానికి ముందు ఇదే గ్రామానికి చెందిన బోనివెంకటదుర్గాప్రసాద్ అనూషను ప్రేమించాడని, వివాహమైన తరువాత కూడా చీటికీమాటికీ వేధింపులకు గురిచేసినట్లు తెలిసిందన్నారు. ఈ వేధింపులు ఇటీవల బాగా అధికమవడం, తనతో పాటు బయటకు వచ్చి కోరిక తీర్చాలని, లేకుంటే నీతో తీసుకున్న సెల్ఫీలు, ఆడియో, వీడియో కాల్స్ గ్రామంలోని అందరికి చూపిస్తానని పదేపదే బెదిరించడంతో ఏం చేయాలో తెలియక అనూష ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోందన్నారు. చనిపోయేముందు స్నేహితురాలికి, తన అన్నయ్యకు ఫోన్ చేసి అనూష ఈ సమాచారం పంపించిందని, ఈ సమాచారం ఆధారంగా ఈవిషయాలను తెలుసుకున్నామన్నారు.పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని విజయనగరం కేంద్రాస్పత్రికి తరలించి కేసు నమోదుచేసి దర్యాప్తు ముమ్మరం చేస్తామన్నారు. నివేదిక ఆధారంగా పూర్తిస్ధాయి వివరాలను తరువాత వెల్లడించనున్నామని తెలిపారు. ఈ పరిశీలనలో సీఐ ప్రభాకర్, ఎస్సై యు.మహేష్, తదితరులు పాల్గొన్నారు -
Hyderabad: బీటెక్ విద్యార్థి బలవన్మరణం
ఇబ్రహీంపట్నం: బీటెక్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన సంఘటన ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో చోటుచేసుకుంది. ఎస్ఐలు రామకృష్ణ, మైబెల్లి తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా అరుపాలెం మండలం, మామునూర్ గ్రామానికి చెందిన సంగెపు నరేంద్ర (27) ఇబ్రహీంపట్నం సమీపంలోని గురునానక్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఆదిబట్ల ఏరోస్పేస్లో పార్ట్ టైం జాబ్ చేస్తూ ఇబ్రహీంపట్నం ఎంబీఆర్ నగర్లోని ఎస్వీ బాయ్స్ హాస్టల్ ఉంటున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి హాస్టల్ రెండో అంతస్తులోని తన గదిలో బెడ్ షీట్తో సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. షాపింగ్ కోసం నగరానికి వెళ్లిన రూంమేట్స్ వచ్చి చూసేసరికి విగతజీవిగా మారి కనిపించాడు. దీంతో వారు హాస్టల్ యజమాని వేణుకు సమాచారం ఇచ్చారు. వెంటనే మృతుని కుటుంబసభ్యులు, పోలీసులకు విషయాన్ని తెలియజేశారు. మృతుని తండ్రి రాంబాబు, బంధువులు శనివారం ఉదయం హాస్టల్కు చేరుకుని బోరున విలపించారు. తమకు ఎవరిపైనా అనుమానం లేదని, ఆర్థిక ఇబ్బందులు కారణం కావచ్చని తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకోని స్థానిక ప్రభుత్వాస్పత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. కాగా నరేంద్ర మొబైల్ ఫోన్ లాక్ ఓపెన్ కాలేదు. కాల్ డేటాను పరిశీలిస్తే ఆత్మహత్యకు ప్రేరేపించిన కారణాలు ఆర్థిక ఇబ్బందులా లేక మరేమైనా ఉన్నాయా అనేది స్పష్టమయ్యే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.హాస్టల్ భవనంపై నుంచి దూకి...లాలాపేట: తార్నాకలోని ఓయూ ఇంటర్నేషనల్ హాస్టల్ విద్యార్థి హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన శనివారం జరిగింది. ఓయూ పోలీసులు తెల్పిన మేరకు.. వికారాబాద్ జిల్లాకు చెందిన ముల్కగల్ల రవి (25) నిజాం కళాశాలలో ఎంఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తార్నాకలోని స్టూడెంట్స్ హాస్టల్లో ఉంటున్నాడు. శనివారం రెండంతస్తుల హాస్టల్ భవనంపై నుంచి దూకాడు. పెద్ద శబ్దం రావడంతో గమనించిన తోటి విద్యార్థులు, హాస్టల్ సిబ్బంది 108కు ఫోన్ చేశారు. అక్కడి నుంచి వెంటనే ఆర్టీసీ ఎక్స్ రోడ్డులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. తలకు, ముక్కుకు తీవ్ర గాయాలయ్యాయి. ఆత్మహత్యాయత్నానికి ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. ఈమేరకు పోలీసులకు సూసైడ్ నోట్ లభించిందని తెలిసింది. -
పెళ్లికి నిరాకరించిందని యువకుడి ఆత్మహత్య
బద్వేలు అర్బన్/అట్లూరు: ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించిందనే మనస్తాపంతో ఓ యువకుడు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వైఎస్సార్ జిల్లా బద్వేలు పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. జిల్లాలోని కలసపాడు గ్రామానికి చెందిన బాలిరెడ్డి, వెంకట సుబ్బమ్మకు కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో చిన్నవాడైన పామూరి సాయికుమార్రెడ్డి (27) గోపవరం మండలంలో 108 వాహనానికి డ్రైవర్గా పని చేస్తుండేవాడు. కలసపాడు మండలం సిద్ధమూర్తిపల్లెకు చెందిన ఓ యువతి, సాయికుమార్రెడ్డి ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఆమె అట్లూరు మండలం తంబళ్లగొంది రైతు భరోసా కేంద్రంలో ఉద్యోగం చేస్తోంది. గురువారం ఉదయం 10 గంటల సమయంలో తంబళ్లగొందికి వెళ్లిన సాయికుమార్రెడ్డి తనను పెళ్లి చేసుకునేది, లేనిదీ తేల్చాలని.. లేదంటే ఇద్దరం ఆత్మహత్య చేసుకుని చనిపోదామని ఉమామహేశ్వరిని నిలదీశాడు. దీనికి ఆమె ససేమిరా అనడంతో మనస్తాపానికి గురైన అతను అక్కడి నుంచి నేరుగా పట్టణంలోని సిద్దవటం రోడ్డులో ఉన్న తన అక్క ఇంటికి వచ్చాడు. కొద్దిసేపటికి ఆమె సమీపంలోని వారి ఫ్యాన్సీ స్టోర్కు వెళ్లిపోగా ఇంట్లో ఎవరూ లేరని గ్రహించి వంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఇంటినుంచి దట్టమైన మంటలు, పొగలు వ్యాపించడంతో చుట్టుపక్కల వారు అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసి లోపలికి వెళ్లి చూడగా సాయికుమార్రెడ్డి తీవ్రమైన గాయాలతో మృతి చెంది ఉన్నాడు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
బిహార్ జైలులో చైనీయుడి మృతి
పాట్నా:బిహార్లోని ఓ జైలులో ఆత్మహత్యాయత్నం చేసిన చైనీయుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. చైనాలోని షాండాంగ్ ప్రావిన్సుకు చెందిన లీ జియాకీ సరైనా పత్రాలు లేకుండా భారత్లోకి ప్రవేశించాడు. జూన్6వ తేదీన బ్రహ్మపురలోని లక్ష్మీచౌక్ వద్ద తిరుగుతుండగా సరైన వీసా పత్రాలు లేకపోవడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఫారనర్స్ యాక్ట్ కింద లీపై కేసు నమోదు చేశారు. అరెస్టు సమయంలో లీ వద్ద చైనా మ్యాపు, మొబైల్ ఫోన్, చైనా, నేపాల్, ఇండియా కరెన్సీలు దొరికాయి. అరెస్టు తర్వాత లీని ముజఫర్పూర్ జైలుకు తరలించారు. జూన్7న జైలులో లీ ఆత్మహత్యాయత్నం చేశాడు.తన కళ్లద్దాలను పగులగొట్టి గాజుతో శరీరాన్ని గాయపరుచుకున్నాడు. తీవ్ర రక్త స్రావంతో అపస్మారకస్థిలో జైలు గదిలోని బాత్రూమ్లో పడి ఉన్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు లీని ముజఫర్పూర్లోని శ్రీ కృష్ణా మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ లీ మంగళవారం(జూన్11) మరణించాడని పోలీసులు తెలిపారు. -
ఘోరం.. అంత్యక్రియలకు అడ్డుపడ్డ ఆ నలుగురు!
యాదాద్రి భువనగిరి జిల్లా: రూపాయి.. రూపాయి.. నువ్వేం చేస్తావు? అంటే… రూపాయి రూపాయి నువ్వు ఏం! చేస్తావు? అని అడిగితే! హరిశ్చంద్రుని చేత అబద్ధం ఆడిస్తాను, భార్య-భర్తల మధ్యన చిచ్చు పెడతాను, తండ్రి బిడ్డలను విడదీస్తాను. అన్నదమ్ముల మధ్య వైరం పెంచుతాను. ఆఖరుకు.. ప్రాణ స్నేహితులను కూడా విడగొడ్తాను అందట. యాదాద్రి భువనగిరి జిల్లాలో తాజాగా జరిగిన ఘటన అది నిజమేనని నిరూపించింది. అయినవాళ్లే వేధిస్తుండడంతో తట్టుకోలేక ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే.. అతనికి అంత్యక్రియలు నిర్వహించకుండా ఆ అయినవాళ్లే అడ్డుకోవడంతో మూడు రోజులుగా ఆ మృతదేహం మార్చురీలోనే మగ్గుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగికి చెందిన చీరిక హనుమంతరెడ్డి(48) హైదరాబాద్లో ప్రైవేటు బస్సు డ్రైవర్గా పనిచేస్తూ... అక్కడే అద్దె ఇంట్లో ఉండేవారు. హనుమంతరెడ్డి తండ్రి నర్సిరెడ్డి పేరిట 7.24 ఎకరాల భూమి ఉంది. పోస్ట్మాస్టర్గా ఉద్యోగ విరమణ చేసిన నర్సిరెడ్డి... మూడేళ్ల క్రితం వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారు.ఈలోపు తండ్రి ఆస్తిలో తమకూ వాటా కావాలని హనుమంతరెడ్డి తోబుట్టువులు కోర్టును ఆశ్రయించారు. తమ్ముడు కరుణాకర్రెడ్డితోనూ హనుమంతరెడ్డికి ఆస్తి తగాదాలున్నాయి. ఈ నేపథ్యంలో కొద్దిరోజులుగా మానసిక వేదనతో ఉన్న హనుమంతరెడ్డి శనివారం రాత్రి పంతంగిలోని ఇంటికి వచ్చి ఉరి వేసుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున పక్కింట్లో ఉన్న వారు చూసి పోలీసులకు సమాచారమివ్వడంతో విషయం వెలుగు చూసింది. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే, తన భర్త మృతికి ఆడపడుచులు, మరిదే కారణమని హనుమంతరెడ్డి భార్య స్వప్న పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ముగ్గురిపై కేసు నమోదైంది. దీంతో భయపడ్డ ఇద్దరు చెల్లెళ్లు, తమ్ముడు... ఆ కేసును ఉపసంహరించుకోవాలని గ్రామ పెద్దలు, బంధువుల ద్వారా హనుమంతరెడ్డి భార్యపై ఒత్తిడి తెచ్చారు. ఆస్తి విషయమై కోర్టులో ఉన్న కేసును ఉపసంహరించుకుంటేనే అంత్యక్రియలు నిర్వహిస్తామని హనుమంతరెడ్డి భార్య స్వప్న, బంధువులు భీష్మించారు. ఆది, సోమ వారాల్లో అతడి సోదరుడు, చెల్లెళ్లతో బంధువులు చర్చించారు. కేసు ఉపసంహరణకు వారు ఒప్పుకొన్నా.. సోమవారం కోర్టు సమయం మించిపోవడంతో వీలు కాలేదు. మంగళవారం కేసు ఉపసంహరించుకున్న తర్వాత అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
పోలీసుల వేధింపులతో ఉప సర్పంచ్ ఆత్మహత్య
సత్తెనపల్లి: పల్నాడు జిల్లాలో పోలీసుల వేధింపులతో ఆత్మహత్యాయత్నం చేసిన ఉప సర్పంచి, వైఎస్సార్సీపీ క్రియాశీలక కార్యకర్త కొర్లకుంట నాగమల్లేశ్వరరావు (37) నాలుగు రోజులు మృత్యువుతో పోరాడి ఆదివారం మృతిచెందాడు. అతడి మృతితో సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో ఉద్రిక్తత నెలకొంది. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఈనెల 4న పాకాలపాడు పీఏసీఎస్ అధ్యక్షుడు కొర్లకుంట వెంకటేశ్వర్లు కౌంటింగ్కు వెళ్లాడు. ఆయన కుమారుడు రెంటపాళ్ల గ్రామ ఉప సర్పంచ్, వైఎస్సార్సీపీ క్రియాశీలక కార్యకర్త కొర్లకుంట నాగమల్లేశ్వరరావు ఇంటి వద్ద ఉన్నాడు. సత్తెనపల్లి రూరల్ పోలీసులు ఈనెల 4వ తేదీ ఉదయం ఏడుగంటల సమయంలో నాగమల్లేశ్వరరావును ట్రబుల్ మంగర్స్ బైండోవర్లో భాగంగా పోలీస్స్టేషన్లో కూర్చోబెట్టారు. మధ్యాహ్నం ఎన్నికల ఫలితాలు ఎన్డీఏ కూటమికి అనుకూలంగా రావడంతో రెంటపాళ్లలోని టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు నాగమల్లేశ్వరరావు ఇంటిపై, ఎస్సీ కాలనీపై దాడులకు దిగారు. నాగమల్లేశ్వరరావు ఇంట్లో ఆయన భార్య నందిని, కుమార్తె యశస్విని ఉన్నారు. ఇంటిమీద దాడిచేస్తున్న విషయాన్ని యశస్విని తన తండ్రి నాగమల్లేశ్వరరావుకు ఫోన్చేసి చెప్పింది. పోలీస్స్టేషన్లో ఉన్న ఆయన ఫోన్ మాట్లాడబోతుండగా పోలీసులు ఫోన్ లాక్కున్నారు. ఈ నెల 5న సాయంత్రం మర్యాదగా గ్రామం విడిచి వెళ్లు .. లేకుంటే రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపిస్తానంటూ సత్తెనపల్లి రూరల్ సీఐ రాజే‹Ùకుమార్ బెదిరించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ క్రమంలో నాలుగు రోజులపాటు దూరంగా ఉంటే గొడవలు సర్దుబాటవుతాయని భావించిన తండ్రి వెంకటేశ్వర్లు కూడా నాగమల్లేశ్వరరావును గుంటూరులో సోదరుడు కొర్లకుంట శ్రీకాంత్ వద్దకు పంపాడు. తనపై ఒక్క కేసు కూడా లేకపోయినా, ఇంటిపైకి వచ్చి గొడవచేసి దాడులు చేసిన టీడీపీ, జనసేన నాయకులను వదిలేసి పోలీసులు తనను బెదిరించటంతో మనస్తాపానికి గురైన నాగమల్లేశ్వరరావు ఈనెల 6న పేరేచర్ల వద్ద గడ్డిమందు కొనుగోలు చేసి 14వ మైలు వద్ద తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే అతడిని గుంటూరులోని ప్రైవేట్ వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించారు. అప్పటినుంచి మృత్యువుతో పోరాడిన నాగమల్లేశ్వరరావు ఆదివారం మరణించాడు. నాగమల్లేశ్వరరావు ఆత్మహత్యాయత్నం చేసుకున్న సమయంలో మేడికొండూరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా అక్కడ పోలీసులు ఫిర్యాదును ట్యాంపరింగ్ చేశారు. నాగమల్లేశ్వరరావు మృతి వార్తతో రెంటపాళ్లలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉండటంతో పోలీసు బలగాలను మోహరించారు. నాగమల్లేశ్వరరావు మృతదేహాన్ని మాజీ మంత్రులు అంబటి రాంబాబు, డొక్కా మాణిక్యవరప్రసాద్, మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి, అంబటి అల్లుడు ఉపేష్, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు రాయపాటి పురుషోత్తమరావు, నాయకులు నల్లబోతు శివనారాయణ, చల్లా శ్రీను, కొమెర శివశంకర్ తదితరులు సందర్శించి నివాళులర్పించారు. మృతుడి తండ్రి వెంకటేశ్వర్లును ఓదార్చారు. తన కుమారుడి మృతికి కారకులపై పోలీసు ఉన్నతా«ధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. నాగమల్లేశ్వరరావు మృతదేహానికి గుంటూరు జీజీహెచ్లో పోస్ట్మార్టం నిర్వహించారు. -
మనస్తాపంతో ఇద్దరు వైఎస్సార్సీపీ అభిమానులు ఆత్మహత్య
బల్లికురవ/టి.నరసాపురం: వైఎస్సార్సీపీ ఓటమిని తట్టుకోలేక తీవ్ర మనస్తాపంతో ఇద్దరు అభిమానులు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు.. బాపట్ల జిల్లా బల్లికురవ మండలం గంగపాలెం గ్రామానికి చెందిన పెయ్యల రామయ్య(64) 4వ తేదీ ఉదయం ఎన్నికల ఫలితాలను టీవీలో చూస్తూ బాధపడ్డాడు. ప్రజలకు ఎంతో మేలు చేసిన వైఎస్సార్సీపీని ఈవీఎంల ట్యాంపరింగ్ ద్వారా ఓడించారంటూ మనోవ్యథకు గురయ్యాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి గంగపాలెం గ్రామం నుంచి మల్లాయపాలెం వెళ్లే రోడ్డులోæని వ్యవసాయ భూమిలో ఉన్న విద్యుత్ స్తంభానికి తాడుతో ఉరి వేసుకుని ప్రాణాలొదిలాడు. ఆదివారం ఉదయం స్థానికులు గమనించి మృతుని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న కటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అతని భార్య సులోచన మాట్లాడుతూ.. ‘జగనన్న పాలనలో సంక్షేమ పథకాలు అందడంతో మా కుటుంబం ఎంతో సంతోషంగా ఉండేది. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఓడిపోవడంతో నా భర్త ఎంతో బాధపడ్డాడు. ఆయన్ను ఎంతగానో ఓదార్చాం. కానీ, ఇంతలోనే ఆత్మహత్య చేసుకున్నాడు’ అంటూ విలపించింది. రామయ్య కుటుంబాన్ని వైఎస్సార్సీపీ నేతలు, ఎంపీపీ బడుగు శ్రీలక్ష్మి సురేష్, కొణిదెన సర్పంచ్ కె.లేపాక్షి విష్ణు, పెయ్యల రంగనాథ్, గుంజి ఆంజనేయులు తదితరులు పరామర్శించారు. అన్యాయం జరిగిందంటూ.. ఏలూరు జిల్లా టి.నరసాపురం మండలం పుట్రేపు గ్రామానికి చెందిన గుర్రం శ్రీనివాస్(24) వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వైఎస్సార్సీపీ అంటే విపరీతమైన అభిమానం ఉన్న శ్రీనివాస్.. ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అఖండ మెజార్టీతో గెలిచి.. మరోసారి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి పదవి చేపడతారని భావించాడు. కానీ అందుకు భిన్నంగా ఫలితాలు రావడంతో శ్రీనివాస్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఎక్కడో అన్యాయం జరిగిందంటూ ఆవేదన చెందాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అనంతరం కొద్దిసేపటికి ఇంటికి వచి్చన కుటుంబసభ్యులు శ్రీనివాస్ను వెంటనే జంగారెడ్డిగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే శ్రీనివాస్ మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. కుటుంబానికి ఆధారంగా ఉన్న శ్రీనివాస్ మరణించడంతో భార్య, ముగ్గురు పిల్లలు గుండెలవిసేలా రోదిస్తున్నారు. -
రష్యా వెళ్లలేక.. రైలు కింద పడి
నల్లగొండ క్రైం: రష్యా వెళ్లి చదువుకుంటూ ఉద్యోగం చేసి కుటుంబానికి అండగా నిలవాలన్న ఆ యువకుడి ఆశ తీరే మార్గం లేక వేగంగా వస్తున్న రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగొండ మండలం చందనపల్లి గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ శంకర్, జయమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు శివమణి(19) ఉన్నారు. పెద్దకూతురు వసంతకు మూడేళ్ల క్రితం పెళ్లి చేశారు. రెండో కూతురు ఝాన్సీ ఎమ్మెస్సీ చదివి ఖాళీగానే ఉంటోంది. కుమారుడు శివమణి ప్రస్తుతం హైదరాబాద్లోని ఓ కాలేజీలో బీఎస్సీ అగ్రికల్చర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. జీవితంలో త్వరగా స్థిరపడాలని భావించిన శివమణి.. రష్యాలో నర్సింగ్ చదువుతూ అక్కడే ఉద్యోగం పొందాలని భావించారు. రష్యాలో బీఎస్సీ నర్సింగ్ చేసేందుకు ప్రభుత్వ రిక్రూటింగ్ సంస్థ అయిన ‘టాంకాం’ద్వారా దరఖాస్తు చేసుకున్నాడు. 6 నుంచి 8 నెలల పాటు రష్యా భాషపై హైదరాబాద్లో శిక్షణ తీసుకోవాల్సి ఉంది. శిక్షణకు, రష్యా వెళ్లేందుకు మొత్తం ఖర్చుకు మూడున్నర లక్షలు కావాలి. దీంతో రెండు నెలలుగా తల్లిదండ్రులు అప్పుకోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడా అప్పు పుట్టలేదు. శివమణి గతేడాదే రష్యా వెళ్లేందుకు ప్రయతి్నంచగా, డబ్బులు సర్దుబాటు కాలేదు. ఈ ఏడాది కూడా డబ్బు అందకపోవడంతో అవకాశం చేజారిపోతుందని మనస్తాపం చెందాడు. దీంతో శుక్రవారం నల్లగొండ సమీపంలోని బతుకమ్మ చెరువు పక్కన రైల్వేట్రాక్ వద్దకు వెళ్లి.. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు తన సోదరి ఝాన్సీకి వీడియోకాల్ చేసి లోకేషన్ షేర్ చేశాడు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో గుంటూరు వైపు వెళుతున్న గూడ్స్కు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, రైల్వే పోలీసులు ఘటనా స్థలంలోకి చేరుకొనేలోపే ఈ ఉదంతం చోటుచేసుకుంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్ఐ సాలకమ్మ తెలిపారు. -
వివాహిత ఆత్మహత్య
కొత్తూరు: మండలంలోని కర్లెమ్మ పంచాయతీ ఎన్ఎన్ కాలనీలో నివాసం ఉంటున్న వన్నాల రేవతి(27) బుధవారం ఇంటిలో ఉన్న ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రేవతి భర్త కృష్ణారావు స్థానిక ఫైర్ స్టేషన్లో ఫైర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. సారవకోట మండలం కుమ్మరిగుంటకు చెందిన కృష్ణారావుకు పాతపట్నం మండలం పాచిగంగుపేటకు చెందిన రేవతితో తొమ్మిదేళ్ల కిందట వివాహం జరిగింది. అయితే ఎప్పటి మాదిరిగానే కృష్ణారావు విధుల నుంచి మధ్యాహ్నం భోజనం కోసం ఇంటికి వచ్చాడు. ఇంటిలోకి వెళ్లే సరికి రేవతి ఫ్యాన్కు ఉరి వేసుకొని కనిపించింది. దీంతో వెంటనే ఆమెకు కిందకు దించి స్థానికుల సహకారంతో స్థానిక సీహెచ్సీకి తీసుకెళ్లాడు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పాతపట్నం ఏరియా ఆస్పత్రికి పోలీసులు తరలించారు. వీరికి ఆరేళ్ల వయసు గల కుమార్తె ఉంది. అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఏంఏ ఆహ్మద్ తెలిపారు. -
ఫెయిల్ అయ్యానని వైద్య విద్యార్థిని ఆత్మహత్య
షాద్నగర్ రూరల్: పరీక్షలో ఫెయిల్ కావ డంతో మనస్తాపం చెందిన ఫిజియో థెరపీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్ప డిన ఘటన గురువారం రాత్రి షాద్నగర్ రైతు కాలనీలో చోటుచేసుకుంది. కాలనీకి చెందిన బుచ్చి బాబు, అమృత దంపతుల పెద్ద కూతురు కీర్తి (24) హైదరాబాద్లోని దుర్గాబాయ్ దేశ్ముఖ్ కళాశాలలో ఫిజియోథెరపీ నాలు గో ఏడాది చదువుతోంది. ఇటీవల థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఓ సబ్జెక్టులో ఫెయిలైన కీర్తి తీవ్ర మనస్తాపంతో ఉంటోంది. ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న కీర్తి తల్లి, ఆర్ఎంపీ వైద్యుడైన తండ్రి బుచ్చిబాబు ఇద్దరూ వేర్వేరు పనులపై గురువారం సాయంత్రం బయటకు వెళ్లారు. ఇదే అదనుగా భావించిన కీర్తి సీలింగ్ ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటికి వచ్చిన తండ్రి బెడ్రూంలోకి వెళ్లి చూడగా ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ రాంచందర్ తెలిపారు. -
ప్రేమ పేరుతో మోసం.. యువకుడి ఆత్మహత్య
కాజీపేట: ప్రేమ పేరుతో యువతి మోసం చేసిందనే మనస్తాపంతో ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నల్లగొండ సమీపంలో చోటు చేసుకుంది. మృతుడి కుటుంబీకుల కథనం ప్రకారం.. కాజీపేట మండలం సోమిడికి చెందిన మంతుర్తి రమేశ్, రాజమ్మ దంపతుల కుమారుడు రాజ్కుమార్ (28) దాదాపు ఏడేళ్లుగా హైదరాబాద్లో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. పనిచేసే చోట పరిచమైన ఓ యువతితో కొద్దికాలంగా చనువుగా ఉంటున్నాడు. సూర్యాపేట జిల్లాకు చెందిన సదరు యువతి కుటుంబీకులకు ఇటీవల వీరి ప్రేమ విషయం తెలియడంతో రాజ్కుమార్ను హెచ్చరించారు. దీంతో రాజ్కుమార్ ఎదురు తిరగడంతో యువతి బంధువులు సూర్యాపేట పీఎస్లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ప్రేమించిన యువతి.. కుటుంబీకుల ఒత్తిడికి తలొగ్గి ఎదురు తిరుగడం, బంధువులు చంపేస్తామంటూ బెది రించడంతో రాజ్కుమార్ మనస్తాపానికి గురయ్యాడు. దీంతో ఏడేళ్లుగా సాగిన ప్రేమాయణం.. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను వివరిస్తూ సెల్ఫీ వీడియోను రికార్డు చేసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు బంధు, మిత్రులకు పంపించాడు. వెంటనే అప్రమత్తమైన సన్నిహితులు రాజ్కుమార్ను వెతకడానికి ప్రయత్నించగా సూర్యాపేటలో చిక్కాడు. ఎంత నచ్చ చెప్పినా వినకుండా తనకు ఆత్మహత్యే శరణ్యమని చెప్పి పరారయ్యాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం నల్లగొండ సమీపంలో గుర్తుతెలియని రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడిన విషయం వెలుగు చూసింది. యువతి కుటుంబీకుల బెదిరింపుల వల్లే తమ కుమారుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుడి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. కాగా, చెట్టంత ఎదిగిన కుమారుడు ప్రేమ కోసం బలయ్యాడని, తనను బెదిరించిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబీకులు కోరారు. -
బుల్లితెర నటి కేసులో ట్విస్ట్.. ప్రియుడు సూసైడ్!
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ బుల్లితెర నటుడు చందు బలవన్మరణానికి పాల్పడ్డారు. హైదరాబాద్లోని నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అల్కాపూర్ కాలనీలో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. చందు ప్రస్తుతం త్రినయిని, రాధమ్మ పెళ్లి, కార్తీక దీపం లాంటి సీరియల్స్లో నటించారు. కాగా.. 2015లో శిల్పను ప్రేమ వివాహం చేసుకున్న చందుకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.కాగా.. ఇటీవలే రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరాం మృతి చెందిన సంగతి తెలిసిందే. గత ఆరేళ్లుగా చందుకు టీవీ నటి పవిత్ర జయరాంతో పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే పవిత్ర పుట్టినరోజు సందర్భంగా తనను రమ్మంటుంది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే కాకుండా ఓ యూట్యూబ్ ఛానెల్తో తనకు బ్రెయిన్ వ్యాధి ఉందని వెల్లడించారు. కాగా.. పవిత్రతో సహజీవనం చేసిన చందు ఆమెను గుర్తు చేసుకుంటూ ఆవేదన చెందారు. ఈ నేపథ్యంలో చందు సూసైడ్ చేసుకోవడం ఒక్కసారిగా టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటనతో సీరియల్ నటి పవిత్ర జయరాం యాక్సిడెంట్ కేసు కీలక మలుపులు తిరగనుంది. -
సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
ముంబై: భారత క్రికెట్ దిగ్గజం, భారత రత్న అవార్డు గ్రహిత సచిన్ టెండూల్కర్ భద్రతా సిబ్బందిలో ఒకరు ఆత్మహత్య పాల్పడటం కలకలం రేపుతోంది. స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్కు (SRPF) చెందిన జవాన్ ప్రకాష్ కపడే తన సర్వీసు రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. సెలవులపై తన స్వస్థలం మహారాష్ట్రలోని జలగావ్జిల్లా జమ్నేర్కు వెళ్లిన ప్రకాష్.. అక్కడే ఈ ఘటనకు పాల్పినట్లు పేర్కొన్నారు. 39 ఏళ్ల కపడే తన సర్వీస్ గన్తో మెడపై కాల్చుకుని మరణించినట్లు వెల్లడించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు, ఓ సోదరుడు ఉన్నారు. బుధవారం తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు జమ్నేర్ పోలీస్ స్టేషన్ సీఐ కిరణ్ షిండే పేర్కొన్నారు. అయితే ఆత్మహత్యకు గల ఖచ్చిత కారణాలు ఇంకా తెలియరాలేదని చెప్పారుప్రాథమిక విచారణ ద్వారా వ్యక్తిగత కారణాల వల్ల జవాన్ బలవన్మరణానికి పాల్పడినట్లు తేలిందన్నారు. విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. కపడే మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఆత్మహత్య ఘటనపై జమ్మేర్ పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు, సహోద్యోగులు, సంబంధిత వ్యక్తులను విచారిస్తున్నారు. వీవీఐపీకి సెక్యూర్టీ కల్పిస్తున్న వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం వల్ల ఎస్ఆర్పీఎఫ్ వ్యక్తిగతంగా ఈ కేసును దర్యాప్తు చేయనున్నది.మరోవైపు, వీవీఐవీ భద్రత కోసం నియమించిన గార్డు ఆత్మహత్యకు పాల్పడటంతో.. ఈ ఘటనపై SRPFస్వతంత్ర విచారణ చేపట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. -
మన పెళ్లికి ఒప్పుకోరు.. ఇద్దరం చనిపోదాం
బల్మూర్: బాలికను ప్రేమ పేరుతో వంచించాడు. పెళ్లికి పెద్దలు అడ్డు చెబుతారని ఆమెను నమ్మించి ఆత్మహత్యకు ప్రేరేపించాడు. చివరకు ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ సంఘటన నాగర్కర్నూల్ జిల్లా బల్మూరులో ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించి బాలిక కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. బల్మూర్కు చెందిన రాఘవేందర్ అదే గ్రామానికి చెందిన బాలిక(15) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.అయితే పెళ్లికి కుటుంబసభ్యులు అడ్డు చెబుతున్నారని రాఘవేందర్ ఈ నెల 11న గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలం వద్దకు బాలికను తీసుకెళ్లాడు. నువ్వు మైనర్.. పెళ్లికి మా ఇంట్లో ఒప్పుకోవడం లేదు. ఇద్దరం కలిసి పురుగు మందు తాగి చనిపోదామని చెప్పా డు. వెంట తెచ్చిన పురుగు మందును మొదటగా ఆమెకు తాగించి, తాను కూడా తాగినట్టు నటించాడు. బాలిక అపస్మారక స్థితికి చేరుకోగానే మరో యువకుడి సహాయంతో బాలికను బైక్పై అచ్చంపేట ఆస్పత్రికి తరలించాడు.ఆపై బాలిక కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. ఆరోగ్య పరిస్థితి విషమించడంలో మెరుగైన వైద్యం కోసం ఆమెను నిమ్స్కు తీసుకెళ్లారు. అక్కడే చికిత్స పొందుతూ ఆ బాలిక సోమవారం రాత్రి మృతి చెందింది. అయితే తమ కూతురుతో బలవంతంగా పురుగు మందు తాగించాడని బాలిక కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.పరిహారంగా రెండెకరాల భూమి బాలిక మృతిపై బల్మూర్లో పంచాయితీ పెట్టిన గ్రామపెద్దలు, కులస్తులు రెండెకరాల భూమి çపరిహారంగా ఇవ్వాలని తీర్మానించినట్టు తెలిసింది. రాఘవేందర్ తండ్రికి ఉన్న భూమిలో రెండు ఎకరాలు బాలిక తరఫున బంధువు పేరుపై రిజిస్ట్రేషన్ చేయాలని కాగితాలు రాసుకొని ధరణిలో స్లాట్ కూడా మంగళవారం బుక్ చేసినట్టు సమాచారం. భూమి మార్పిడి జరిగిన వెంటనే ఆస్పత్రిలో ఉన్న మృతదేహానికి ఆత్మహత్య కేసుగా నమోదు చేయించి ఇంటికి తీసుకొచ్చి అంత్యక్రియలు జరిపించాలని ఒప్పందం చేసుకున్నట్టు తెలిసింది. ఈ విషయమై ఎస్ఐ బాలరాజును వివరణ కోరగా బాలిక ఆత్మహత్యపై తమకు ఫిర్యాదు అందలేదని చెప్పారు.