హైదరాబాద్‌: టవర్స్‌పై నుంచి దూకిన ఇన్‌కంట్యాక్స్ అధికారిణి | Woman Income Tax Officer Jumps From Tower In Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌: టవర్స్‌పై నుంచి దూకిన ఇన్‌కంట్యాక్స్ అధికారిణి

Apr 5 2025 4:23 PM | Updated on Apr 5 2025 4:54 PM

Woman Income Tax Officer Jumps From Tower In Hyderabad

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో విషాదం చోటుచేసుకుంది. గాంధీనగర్‌లో ఇన్‌కంట్యాక్స్ ఆఫీసర్‌ జయలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సీజీవో టవర్స్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. భవనంపై నుంచి దూకి.. దీంతో తీవ్ర గాయాలతో పడివున్న ఆమెను స్థానికులు గుర్తించి ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు.

చికిత్స పొందుతూ ఆమె మరణించినట్లు సమాచారం.  జయలక్ష్మి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనారోగ్య కారణాల వల్లనే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement