income tax officer
-
ఐటీ అధికారుల పేరుతో ఫేక్ కాల్స్
-
ఆదాయపు పన్ను శాఖ పనితీరుపై స్పందించిన నటుడు మాధవన్
ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలుచేసిన మూడు వారాల్లోనే తనకు నగదు రీఫండ్ అయిందని నటుడు మాధవన్ అన్నారు. తన సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ఎక్స్లో ఆదాయపు పన్ను శాఖ పనితీరును ప్రశంసించారు. మాధవన్కు చెందిన ల్యూకోస్ ఫిల్మ్స్ కంపెనీ ఇటీవల ఆదాయపు పన్ను రిటర్న్న్ దాఖలు చేసింది. ఎలాంటి చిక్కులు లేకుండా మూడు వారాల్లోనే ఆదాయపు పన్ను శాఖ నుంచి రీఫండ్ పొందడంతో ఆయన స్పందించారు. అక్టోబర్ 31 వరకు రికార్డు స్థాయిలో 7.85 కోట్ల ఐటీఆర్లు దాఖలయ్యాయని ఆదాయపు పన్ను శాఖ ఇటీవల తెలిపింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో దాఖలు చేసిన మొత్తం 7.78 కోట్ల ఐటీఆర్లతో పోలిస్తే ఇదే ఆల్ టైమ్ హై అని ఐటీ శాఖ చెప్పింది. The income tax refund for our company was received within 3 weeks after filing of return for AY 2023-24. The speed and promptness is simply unheard of ..The efficiency and transparency of the income tax department is unbelievable. Totally impressed and flabbergasted .… — Ranganathan Madhavan (@ActorMadhavan) November 13, 2023 -
హైదరాబాద్ ఇన్కమ్ టాక్స్ టవర్స్కు బాంబు కాల్
నాంపల్లి: ఏసీ గార్డ్స్లోని ఆదాయపు పన్ను శాఖ కార్యాలయం (ఐటీ టవర్స్)కు సోమవారం బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఐటీ టవర్స్ను కాసేపట్లో పేల్చేస్తామంటూ ఫోన్ చేసి గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించారు. సోమవారం మధ్యాహ్నం 12.50 గంటలకు డయల్ 100కు ఫోన్ కాల్ వచ్చింది. మెయిన్ కంట్రోల్ విభాగం సిబ్బంది వెంటనే నాంపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు ఉద్యోగులందరినీ బయటకు పంపించారు. అనంతరం ఐటీ టవర్స్ను పూర్తిగా బాంబు స్క్వాడ్తో తనిఖీ చేశారు. టవర్స్లోని అన్ని అంతస్తులను క్షుణ్ణంగా సోదాలు చేశారు. ఎక్కడా బాంబు లేదని, ఫోన్ కాల్ ఫేక్ అని తేలడంతో ఊపిరిపీల్చుకున్నారు. -
తమిళనాడులో ఐటీ శాఖకు చేదు అనుభవం..
-
సాధారణ తనిఖీల్లో భాగంగానే ఐటీ అధికారులు వచ్చారు : దేవినేని అవినాష్
-
ఐటీ కార్యాలయంలో మరోసారి విచారణకు హాజరైన భద్రారెడ్డి
-
నేడు ఐటీ అధికారుల ఎదుట హాజరుకానున్న మంత్రి మల్లారెడ్డి
-
మల్లారెడ్డి వర్సెస్ ఐటీ శాఖ.. కంచికి చేరని ల్యాప్టాప్ కథ!
సాక్షి, హైదరాబాద్/దుండిగల్: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి వర్సెస్ ఆదాయపు పన్ను శాఖ డిప్యూటీ డైరెక్టర్ రత్నాకర్ ఎపిసోడ్లో బోయిన్పల్లి ఠాణాకు చేరిన ల్యాప్టాప్ వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. గురువారం తెల్లవారుజామున నాటకీయ పరిణామాల మధ్య పోలీసుస్టేషన్ వద్ద లభించిన ల్యాప్టాప్ను పోలీసులు తమ అధీనంలోనే ఉంచుకున్నారు. అది రత్నాకర్దన్న ఉద్దేశంతో ఐటీ అధికారులకు చూపించినా వారు నోరు మెదపకపోవడంతో కోర్టు అనుమతితో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి (ఎఫ్ఎస్ఎల్) పంపాలని యోచిస్తున్నారు. మల్లారెడ్డి సహా ఆయన కుటుంబీకులు, బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన పంచనామాపై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మల్లారెడ్డి పెద్ద కుమారుడు మహేందర్రెడ్డితో అధికారులు సంతకం చేయించుకోవడంతో వివాదం మొదలైంది. దీనిపై మల్లారెడ్డి గురువారం రాత్రి బోయిన్పల్లి ఠాణాలో రత్నాకర్పై ఫిర్యాదు చేశారు. రెండు గంటల తర్వాత రత్నాకర్ కూడా అదే పీఎస్లో మరో ఫిర్యాదు ఇచ్చారు. ఆస్ప త్రి వద్ద తనను అడ్డుకున్న మల్లారెడ్డి తదితరులు ల్యాప్టాప్ లాక్కున్నారని అందులో పేర్కొన్నారు. ఎఫ్ఎస్ఎల్కు పంపే యోచనలో పోలీసులు మల్లారెడ్డి, రత్నాకర్ ఫిర్యాదులతో నమోదైన కేసులను దుండిగల్ ఠాణాకు బదిలీ చేసినా ల్యాప్టాప్ మాత్రం బోయిన్పల్లి ఠాణాలోనే ఉండిపోయింది. అది ఐటీ అధికారి రత్నాకర్ వ్యక్తిగత ల్యాప్టాప్గా భావిస్తున్నప్పటికీ ఆయన సహా ఎవరూ ధ్రువీకరించట్లేదు. తొలుత అది ఎక్కడ నుంచి? ఎలా వచ్చిందో తేలిస్తేనే మిగతా విషయాలు చెప్తామంటూ ఐటీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. తామే ఆ ల్యాప్టాప్ ఆన్ చేసి ఎవరిదో చూద్దామని పోలీసులు మొదట భావించినా.. అలా చేస్తే డేటాకు సంబంధించిన వివాదం తలెత్తే ప్రమాదం ఉందని మిన్నకుండిపోయారు. ఈ నేపథ్యంలోనే కోర్టు అనుమతితో సదరు ల్యాప్టాప్ను ఎఫ్ఎస్ఎల్కు పంపి తెరిపించాలని యోచిస్తున్నారు. సమీప సీసీ కెమెరాల్లోని ఫీడ్ను పరిశీలిస్తున్నామని, కానీ ల్యాప్టాప్ను అక్కడ ఎవరు పెట్టారనేది ఇప్పటికీ స్పష్టంగా తెలియట్లేదని బోయిన్పల్లి పోలీసులు చెప్పారు. కాగా, మంత్రి మల్లారెడ్డి, ఐటీ అధికారి రత్నాకర్ ఫిర్యాదులకు సంబంధించిన రెండు కేసులు దుండిగల్ పోలీస్ స్టేషన్కు బదిలీ అయ్యాయి. దీంతో ఇక్కడ కేసులు నమోదు చేసిన దుండిగల్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రాత్రంతా నాటకీయ పరిణామాలు రెండు ఫిర్యాదులు పోలీసుల వద్ద ఉండగానే నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అప్పటికే బోయిన్పల్లి ఠాణా కేంద్ర బలగాల అ«దీనంలోకి వెళ్లిపోయింది. ఆ సందర్భంలో కొందరు వ్యక్తులు కారులో వచ్చి ఓల్యాప్టాప్ను ఠాణాలో అప్పగించాలని చూశారు. అది సాధ్యం కాకపోవడంతో వాళ్లు వెళ్లిపోయారు. కొద్దిసేపటి తర్వాత మరో యువకుడు ద్విచక్ర వాహనంపై తీసుకువచ్చాడు. అప్పటికే ఠాణా గేట్లకు తాళాలు పడ్డాయి. సదరు యువకుడు ల్యాప్టాప్ను పోలీసులకు ఇవ్వాలని ప్రయత్నించాడు. వారు విముఖత చూపడంతో గేటు వద్ద పెట్టేసి వెళ్లిపోయాడు. ఈ తతంగం మొత్తం ఐటీ అధికారులు తమ ఫోన్లలో రికార్డు చేశారు. రోడ్డుపై వదిలేసిన ల్యాప్టాప్ను ఠాణాలోకి తీసుకువెళ్లిన పోలీసులు దాన్ని ఐటీ అధికారులకు చూపించారు. అది ఎవరిదన్న విష యం పక్కన పెట్టాలని, అసలు ఠాణాకు ఎలా వచి్చందో తేల్చాలని ఐటీ అధికారులు పట్టుబట్టారు. దీంతో పంచనామా నిర్వహించిన పోలీ సులు ల్యాప్టాప్ను ఠాణాలో భద్రపరిచారు. ఇదీ చదవండి: ముందస్తు మేఘాలు! అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సీఎం కేసీఆర్ దృష్టి -
Malla Reddy: మల్లారెడ్డి ఇంటిపై ఐడీ దాడుల్లో కొత్త ట్విస్ట్..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబసభ్యులు, బంధువులు, భాగస్వాములపై జరిగిన ఐటీ దాడుల అంశంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఐటీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ సీఎండీ రత్నాకర్ పంచనామాపై తన అన్న మహేందర్రెడ్డితో బలవంతంగా సంతకం పెట్టించుకున్నారంటూ మల్లారెడ్డి చిన్న కుమారుడు భద్రారెడ్డి బోయిన్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు రత్నాకర్ కూడా ఫిర్యాదు చేశారు. మంత్రి తన విధులు అడ్డుకోవడంతో పాటు కీలక పత్రాలు ధ్వంసం చేశారని ఆరోపించారు. ఈ మేరకు కేసులు నమోదు చేసుకున్న బోయిన్పల్లి పోలీసులు తదుపరి దర్యాప్తు నిమిత్తం దుండిగల్ పోలీసుస్టేషన్కు బదిలీ చేశారు. నా అన్నను బెదిరించారు.. మంత్రి మల్లారెడ్డి పెద్ద కుమారుడు మహేందర్రెడ్డి ఐటీ సోదాల నేపథ్యంలో అస్వస్థతకు గురై మల్లారెడ్డి నారాయణ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. కాగా బుధవారం రాత్రితో మహేందర్రెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు పూర్తి చేసిన అధికారులు దానికి సంబంధించిన పంచనామా రూపొందించారు. దీనిపై సంతకం చేయించుకోవడానికి డిప్యూటీ డైరెక్టర్ రత్నాకర్ ఆస్పత్రికి వెళ్లారు. అయితే గుండె నొప్పితో చికిత్స పొందుతున్న తన అన్న మహేందర్రెడ్డిని బెదిరించి, బలవంతంగా వాటిపై సంతకాలు తీసుకున్నారంటూ మల్లారెడ్డి చిన్న కుమారుడు, సీఎంఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ, మల్లారెడ్డి సొసైటీల అధ్యక్షుడు భద్రారెడ్డి బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1.30 గంటల సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా పోలీసులు రత్నాకర్పై ఐపీసీలోని 384 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మరోవైపు రూ.100 కోట్ల డొనేషన్లకు సంబంధిత పత్రాలపై కూడా ఐటీ అధికారులు మహేందర్రెడ్డి సంతకాలు తీసుకున్నట్టు సమాచారం. కాగా తమ వద్ద రూ.100 కోట్లు లేవని, మేనేజ్మెంట్ కోటా లేనప్పుడు డొనేషన్ ఎలా ఇస్తారని మంత్రి మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రశ్నించారు. చదవండి: Hyderabad: ట్రాఫిక్ చిక్కులకు చెక్.. ఐటీ కారిడార్లో ఇక రయ్ రయ్! ల్యాప్టాప్, హార్డ్డ్రైవ్లు ఉన్న బ్యాగులు దొంగిలించారు.. ఇలావుండగా.. తాను పంచనామాపై సంతకం చేయించుకోవడానికి ఆస్పత్రికి వెళ్లినప్పుడు అక్కడకు తన అనుచరులతో కలిసి వచ్చిన మంత్రి మల్లారెడ్డి తన విధులకు ఆటంకం కలిగించారంటూ రత్నాకర్ గురువారం తెల్లవారుజామున 3.40 గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పంచనామా సహా కొన్ని పత్రాలు చించేశారని, అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు బెదిరించారని పేర్కొన్నారు. ల్యాప్టాప్, హార్డ్ డ్రైవ్స్తో ఉన్న తన రెండు బ్యాగులు కూడా దొంగిలించారని ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా బోయిన్పల్లి పోలీసులు మల్లారెడ్డి తదితరులపై ఐపీసీలోని 342, 353, 201, 504, 506, 379 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ రెండు ఉదంతాలు చోటు చేసుకున్న మల్లారెడ్డి ఆస్పత్రి దుండిగల్ పోలీసుస్టేషన్ పరిధిలోకి వస్తుంది. దీంతో జీరో ఎఫ్ఐఆర్లు నమోదు చేసిన అధికారులు తదుపరి దర్యాప్తు నిమిత్తం ఆ ఠాణాకు బదిలీ చేశారు. ఠాణా గేటు వద్ద ప్రత్యక్షమైన ల్యాప్టాప్! ఈ 2 కేసులు నమోదైన కొద్దిసేపటికే ఓ ల్యాప్టాప్ నాటకీయంగా బోయిన్పల్లి పోలీసుస్టేషన్ వద్ద ప్రత్యక్షమైంది. రత్నాకర్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టారు. ఆయన ల్యాప్టాప్ సహా ఇతర వస్తువులు మల్లారెడ్డి ఇంట్లో ఉన్నాయా? ఎవరైనా తీసుకున్నారా? తదితర అంశాలు ఆరా తీశారు. ఈ నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున 4.15 గంటల ప్రాంతంలో ఓ ల్యాప్టాప్ బోయిన్పల్లి పోలీసుస్టేషన్ గేటు వద్ద ప్రహరీని ఆనుకుని ఉండటం కానిస్టేబుళ్ల కంటపడింది. దీంతో వారు దాన్ని రత్నాకర్కు చూపించగా.. ఆ ల్యాప్టాప్ తనది కాదని, దాన్ని ఎవరో మార్చేశారని అన్నారు. దీంతో దాని పంచనామా నిర్వహించిన సిబ్బంది దుండిగల్ పోలీసులకు అప్పగించాలని నిర్ణయించారు. -
మేం తప్పుడు పనులు చేయలేదు
-
వీళ్లు ఐటీ అధికారులు కాదు.. రక్త పిశాచులు : మల్లారెడ్డి
-
నెల్లూరులో నకిలీ అధికారుల కలకలం
-
గుట్టుచప్పుడు కాకుండా రూ. కోట్ల నగదు, బంగారం తరలింపు
జగ్గంపేట: రిజర్వ్ బ్యాంక్ నిబంధనలను తుంగలోకి తొక్కి, పన్నులను ఎగ్గొడుతూ రూ.కోట్ల నగదు, బంగారాన్ని ప్రైవేటు బస్సులలో గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్న ఘటనలపై కస్టమ్స్, జీఎస్టీ, ఆదాయ పన్ను శాఖల అధికారులు అప్రమత్తమయ్యారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్గేట్ వద్ద శుక్రవారం పోలీసు అధికారుల తనిఖీలో ఈ దందా వెలుగు చూసిన సంగతి విదితమే. దీనిపై కస్టమ్స్, జీఎస్టీ, ఐటీ అధికారులు జగ్గంపేట సీఐ సూర్యఅప్పారావును శనివారం కలిసి వివరాలు సేకరించారు. అనంతరం 10 కేజీల బంగారాన్ని విజయవాడ నుంచి విశాఖ తరలిస్తున్న పద్మావతి ట్రావెల్స్ బస్సు డ్రైవర్ వెంకటేశ్వరరావును, టెక్కలి నుంచి విజయవాడ వైపు రూ.5.65 కోట్ల నగదు తరలింపులో పట్టుబడిన బస్సు డ్రైవర్ సుదర్శనరావును విచారించారు. విజయవాడలో రామవరప్పాడు వద్ద బంగారం ఎవరిచ్చారు, విశాఖలో ఎవరికి అందజేయమన్నారనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ విధంగా బంగారం, నగదు అక్రమ రవాణా పద్మావతి ట్రావెల్స్లోనే జరుగుతోందా, ఇతర ప్రైవేటు ట్రావెల్స్లో కూడా జరుగుతోందా అనే అంశంపైనా దృష్టి సారించారు. కాగా, కృష్ణవరం టోల్ప్లాజా వద్ద పట్టుబడిన రూ.5.65 కోట్ల నగదు, సుమారు 10 కేజీల బంగారాన్ని రాజమహేంద్రవరంలోని ట్రెజరీలో జమ చేసినట్లు సీఐ చెప్పారు. (చదవండి: సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసులోని నిందితుడికి హార్ట్ఎటాక్) -
ఆర్ఎంపీ ఇంట్లో రూ.66 లక్షలు.. సిద్దిపేటలో కలకలం
హుస్నాబాద్: టాస్క్ఫోర్స్ సోదాల్లో ఓ ఆర్ఎంపీ ఇంట్లో రూ.66.11 లక్షలు గుర్తించారు. అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారని ఐటీ అధికారులకు అందిన సమాచారం మేరకు శనివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని ఆర్ఎంపీ కొడం ఆంజనేయులు ఇంట్లో ఏసీపీ మహేందర్ ఆధ్వర్యంలో టాస్క్ఫోర్స్, సివిల్ పోలీసులు సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. పట్టణంలోని మెయిన్రోడ్లో క్లినిక్ నడిపిస్తూ, వినాయకనగర్లో ఆయన నివసిస్తున్నారు. ఈ సోదాల్లో రూ.66,11,100 స్వాదీనం చేసుకొని సీజ్ చేసినట్లు మహేందర్ తెలిపారు. సీజ్ చేసిన డబ్బులను ఐటీ అధికారులకు అప్పగించనున్నట్లు చెప్పారు. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో పూర్తి స్థాయిలో అధికారులు విచారించనున్నట్లు తెలిపారు. కాగా, ఆంజనేయులును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చదవండి: సంతోష్ను చంపింది సోదరుడే.. -
క్షమాపణలు చెప్పకపోతే.. చట్టపరమైన చర్యలు
ఒంగోలు: తమిళనాడులో పట్టుబడ్డ డబ్బుతో తనకు సంబంధం లేదని చెప్పినా కూడా తప్పుడు ట్వీట్లు పదే పదే చేసిన వారు, వాటిని ప్రసారం చేసిన చానళ్లు తక్షణమే క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటానని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. జూలై 14న తమిళనాడు ఎలపూరు చెక్పోస్టు వద్ద ఓ కారులో పట్టుబడిన నగదును పోలీసులు ఐటీ అధికారులకు అప్పజెప్పిన సంగతి విదితమే. అయితే ఆ కారుపై ఆంధ్రప్రదేశ్ ఎంఎల్ఏ స్టిక్కర్ ఉండటంతో తమిళ, కొన్ని తెలుగు మీడియా వారు డబ్బుతో తనకు సంబంధం ఉందనుకున్నారని, ఆ విషయాన్ని ఖండిస్తూ పూర్తిస్థాయి విచారణకు తాను సిద్ధం అని అన్ని మీడియాలకు సందేశాన్ని పంపానని మంత్రి పేర్కొన్నారు. కానీ టీవీ 5 చానల్, టీడీపీ నేతలు తనపై తప్పుడు వార్తలు ప్రచారం చేశారన్నారు. నారా లోకేష్ తనపై తప్పుడు ట్వీట్లు చేస్తే.. వాటిని టీవీ 5 పదేపదే ప్రచారం చేసిందన్నారు. లాయర్ నోటీసులను లోకేష్, బోండా ఉమా, బొల్లినేని రాజగోపాల్నాయుడు, రవీంద్రనాథ్, సాంబశివరావు, కొమ్మారెడ్డి పట్టాభిరాం, న్యూస్18, టీవీ5 చానళ్లకు పంపించారు. -
యువతులతో పట్టుబడ్డ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్
సాక్షి, హైదరాబాద్ : గౌరవప్రదమైన ఉద్యోగం చేస్తున్న ఒక వ్యక్తి వ్యభిచారం కేసులో అడ్డంగా బుక్కయ్యాడు. వివరాల్లోకి వెళితే.. నాగేందర్ భుక్య అనే వ్యక్తి ముంబై ఎంకె రోడ్డులోని అయకార్ భవన్లో ఇన్కమ్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా అమీర్పేట్లో వ్యభిచారం దందా నడుస్తున్నట్లు ఎస్సార్నగర్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో వ్యభిచార గృహంపై దాడి నిర్వహించిన పోలీసులకు నాగేందర్ ముగ్గురు యవతులతో అడ్డంగా దొరికిపోయాడు. నాగేందర్తో పాటు, వ్యభిచారం నిర్వహిస్తున్న వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. (లిఫ్ట్లో అనుమానాస్పద స్థితిలో నర్సు మృతదేహం) -
టీడీపీ అధ్యక్షుడి ఇంట్లో ఐటీ సోదాలు
-
టీడీపీ నేత ఇంటిపై ఐటీ దాడులు
సాక్షి, వైఎస్సార్ కడప: టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ఇంటిపై ఆదాయపన్ను (ఐటీ) శాఖ అధికారులు గురువారం దాడులు చేశారు. ద్వారక నగర్లోని ఆయన ఇంట్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులను పెద్ద సంఖ్యలో శ్రీనివాసులరెడ్డి ఇంటి చుట్టూ మొహరించారు. హైదరాబాద్లోని పంజాగుట్టలో ఉన్న ఆయన కార్యాలయంలోనూ ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. జార్ఖండ్ రాష్ట్రంలో శ్రీనివాసులరెడ్డి చేపట్టిన కాంట్రాక్ట్ పనులకు సంబంధించిన పత్రాలను ఐటీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. పన్ను ఎగవేసినట్టు ప్రాథమికంగా గుర్తించిన ఆదాయపన్ను శాఖ అధికారులు నేరుగా రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఏమేరకు పన్ను ఎగవేశారన్నది సోదాల్లో తేలనుంది. -
పారిశ్రామికవేత్తపై ఐటీ దాడులు: సమారు రూ.200 కోట్లు
సాక్షి, ఆదిలాబాద్: ప్రముఖ పారిశ్రామికవేత్త రఘునాథ్ మిత్తల్ ఇంటితో పాటు ఆయన పరిశ్రమల్లో ఇన్కం టాక్స్ అధికారుల బృందం మంగళవారం దాడులు చేసింది. జిల్లాలోని నాలుగు చోట్లతో పాటు హైదరాబాద్లోని పలు వ్యాపార స్థావరాలపై ఏకకాలంలో ఐటీ అధికారుల దాడులకు చేశారు. రఘునాథ్ మిత్తల్ వ్యాపార లావాదేవీలు, ఆస్తులుకు సంబంధించిన వివరాలపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఉదయం నుంచి కొనసాగుతున్న ఇన్కం టాక్స్ సోదాలకు సంబంధించిన విషయం సాయంత్రం వరకూ బయటకు తెలియలేదు. ఐటీ అధికారులు ఈ సోదాల్లో రఘునాథ్ మిత్తల్కు సంబంధించిన సుమారు రూ. 200 కోట్లు లెక్కల్లో తేలని ఆస్తులను గుర్తించినట్లు తెలస్తోంది. కాని అధికారికంగా మాత్రం సంబంధిత అధికారులు దీనిపై స్పందించలేదు. ఆదిలాబాద్కు చెందిన రఘునాథ్ మత్తల్కు సంబంధించి ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో పలు వ్యాపారాలు, ఆస్తులు ఉన్నప్పటికీ.. ఆయా చోట్ల ఐటీ దాడులకు సంబంధించిన సమాచారం తెలియరాలేదు. -
12 మంది ఐటీ అధికారులపై వేటు
న్యూఢిల్లీ: అవినీతి, విధుల్లో నిర్లక్ష్యం, మహిళా అధికారులపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న 12 మంది సీనియర్ ఆదాయపన్ను శాఖ అధికారులపై ప్రభుత్వం వేటు వేసింది. ఉద్వాసనకు గురైన వారిలో చీఫ్ కమిషనర్, ప్రిన్సిపల్ కమిషనర్, కమిషనర్ స్థాయి అధికారులుండటం గమనార్హం. వీరిపై జనరల్ ఫైనాన్షియల్ నిబంధన 56 ప్రకారం వీరిని బాధ్యతల నుంచి తొలగించాలని కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగ బాధ్యతల నుంచి తొలగింపునకు గురైన వారిలో జాయింట్ కమిషనర్ స్థాయి అధికారి అశోక్ కుమార్ అగర్వాల్(ఐఆర్ఎస్–1985) ఉన్నారు. ఈయన తీవ్ర అవినీతికి పాల్పడటంతోపాటు ఓ వ్యాపారి నుంచి బలవంతపు వసూళ్లు, ఒకప్పటి ఆథ్యాత్మిక గురువు చంద్రస్వామికి సాయం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. కమిషనర్ స్థాయి మహిళా అధికారులను లైంగికంగా వేధించిన నోయిడాలోని కమిషనర్(అప్పీల్) ఎస్కే శ్రీవాస్తవ (ఐఆర్ఎస్) అధికారిపైనా ప్రభుత్వం వేటువేసింది. అధికార దుర్వినియోగం, అక్రమ మార్గాల్లో రూ.3.17 కోట్లు కూడబెట్టిన ఐఆర్ఎస్ అధికారి హోమీ రాజ్వంశ్ను ఉద్యోగం నుంచి తొలగించింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అజోయ్ కుమార్, అలోక్‡ మిత్రా, చందర్ భార్తి, అందాసు రవీందర్, వివేక్ బాత్రా, శ్వేతబ్ సుమన్, రాజ్ భార్గవ, రాజేంద్ర ప్రసాద్ తదితరులను బాధ్యతల నుంచి తప్పించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. నిర్బంధ పదవీ విరమణ చేయించాల్సిన అధికారులను గుర్తించాల్సిందిగా గత కొంతకాలంగా కేబినెట్ సెక్రటేరియట్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్లు తమ అధికారులకు మౌఖిక ఆదేశాలిచ్చినట్లు సమాచారం. సెంట్రల్ సివిల్ సర్వీసెస్–1972 చట్టంలోని నిబంధన 56(జే) ప్రకారం ఒక అధికారికి 50, 55 సంవత్సరాలు నిండిన తర్వాత లేదా 30 ఏళ్ల సర్వీసు పూర్తయిన తర్వాత అతని పనితీరుపై సమీక్ష చేపట్టేందుకు ప్రభుత్వానికి వీలుంటుంది. పనిచేయని అధికారులపై వేటువేసేందుకు ఉద్దేశించిన ఈ విధానాన్ని 2014లో మోదీ అధికారంలోకి రాగానే పునరుద్ధరించారు. ఇటీవలి కాలంలో వేటుపడిన ఉన్నతాధికారుల్లో ఎంఎన్ విజయ్కుమార్(ఐఏఎస్), కె.నరసింహ(ఐఏఎస్), మయాంక్ షీల్ చోహన్(ఐపీఎస్), రాజ్ కుమార్ దేవాంగన్(ఐపీఎస్) ఉన్నారు. -
ఆదాయ పన్ను అధికారులపై కొరడా
సాక్షి, న్యూఢిల్లీ : ఆదాయ పన్ను(ఐటీ) శాఖలో అవినీతి అధికారులపై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝలిపించింది. చీఫ్ కమిషనర్, ప్రిన్సిపల్ కమిషనర్, కమిషనర్ల స్థాయిలో ఉన్న 12 మంది అధికారులను ఆర్థిక మంత్రిత్వ శాఖ లోని 56 నిబంధనను అనుసరించి నిర్బంధంగా పదవీ విరమణ చేయించిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఈ అధికారుల్లో కొందరిపై అవినీతి, అక్రమాలకు పాల్పడినట్టు, అక్రమాస్తులు కూడగట్టిన ఆరోపణలున్నాయి. మరికొందరిపై లైంగిక వేధింపుల ఆరోపణలున్నాయని సమాచారం. -
ఈ ఏడాది ఐటీఆర్ ఫామ్స్ నోటిఫై...
న్యూఢిల్లీ: అసెస్మెంట్ ఇయర్ 2019–20కి సంబంధించి వ్యక్తులు, కంపెనీలకు ఆదాయపు పన్ను (ఐటీ) రిటర్న్ ఫామ్స్ను ఆదాయపు పన్ను శాఖ నోటిఫై చేసింది. వేతన వర్గం ఫైల్ చేసే ఐటీఆర్–1 లేదా సహజ్ల్లో ఎటువంటి మార్పులూ లేవు. అయితే ఐటీఆర్ 2,3,5,6,7ల్లో కొన్ని సెక్షన్లను హేతుబద్ధీకరించడం జరిగింది. 2018–19లో సంపాదించిన ఆదాయానికి సంబంధించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యక్తులు, కంపెనీలు రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలుకు తుది గడువు జూలై 31. తమ అకౌంట్లకు ఆడిట్లు అవసరం లేని వారికి ఈ గడువు వర్తిస్తుంది. -
ఆదాయ పన్ను వివాదాల పరిష్కారానికి 2 కమిటీలు
న్యూఢిల్లీ: ఆదాయ పన్ను శాఖ సంబంధ వివాదాల పరిష్కారాలు సూచించేందుకు, అంతర్జాతీయంగా అనుసరిస్తున్న విధానాల పరిశీలనకు కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు కొత్తగా రెండు కమిటీలు ఏర్పాటు చేసింది. ఇవి రెండూ కూడా నెల రోజుల్లోగా నివేదికలు సమర్పించాల్సి ఉంటుంది. వివాదాస్పద అంశాల క్రమబద్ధీకరణ, పరిష్కార మార్గాలు సూచించేందుకు ఏర్పాటైన కమిటీకి ఐటీ కమిషనర్ హోదా అధికారి సారథ్యం వహిస్తారు. ఇందులో ఐదుగురు సభ్యులు ఉంటారు. ఇక పన్ను వివాదాల పరిష్కారానికి అంతర్జాతీయంగా అనుసరిస్తున్న విధానాల పరిశీలనకు ఏర్పాటైన రెండో కమిటీకి కమిషనర్ స్థాయి అధికారి సారథ్యం వహిస్తారు. ఇందులో కూడా నలుగురు సభ్యులు ఉంటారు. సాధ్యమైనంత వరకూ లిటిగేషన్లను తగ్గించే దిశగా సీబీడీటీ ఇటీవలి కాలంలో పలు చర్యలు తీసుకుంది. ట్రిబ్యునల్స్, కోర్టుల్లో ట్యాక్స్ శాఖ అప్పీలు చేసేందుకు ఉద్దేశించిన పన్ను బాకీల పరిమితిని కూడా గణనీయంగా పెంచింది. అధికారిక గణాంకాల ప్రకారం 2018 ఏప్రిల్ 1 నాటికి ఐటీ అపీల్స్ కమిషనర్ ముందు అప్పీల్స్ రూపంలో రూ. 6.38 లక్షల కోట్ల బకాయిల వివాదాలు పెండింగ్లో ఉన్నాయి. -
గుట్టు తేల్చబోతున్నారు!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు తాపత్రయపడ్డ అభ్యర్థులకు ఫలితాల తర్వాత షాకులు తగులబోతున్నట్లు తెలుస్తోంది. పోలీసులు, ఐటీ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా రూ.125 కోట్లు స్వాధీనం చేసుకోగా, ప్రధానంగా వరంగల్ జిల్లా పెంబర్తిలో పట్టుబడ్డ రూ.5.8 కోట్ల వ్యవహారం సంచలనంగా మారనుంది. కారు సీట్ల వెనుక సీక్రెట్ బాక్స్లో తరలిస్తున్న డబ్బును పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ముగ్గురు ప్రముఖ రాజకీయ నేతల పేర్లు విన్పిస్తున్నాయి. వరంగల్ ఈస్ట్ కాంగ్రెస్ అభ్యర్థి రవిచంద్ర, పరకాల అభ్యర్థి కొండా సురేఖ, ఖమ్మం అసెంబ్లీ బరిలో నిలిచిన మాజీ ఎంపీ నామా నాగేశ్వర్రావు మెడకు ఈ కేసు చుట్టుకోబోతున్నట్లు సమాచారం. ఎక్కడి నుంచి.. హైదరాబాద్ గోషామహల్కు చెందిన హవాలా వ్యాపారి కీర్తికుమార్ జైన్ రూ.5.8 కోట్లను వరంగల్ తీసుకెళ్తూ పట్టుబడ్డాడు. ఈ డబ్బును నామా నాగేశ్వర్రావు, కొండా మురళి, రవిచంద్రలకు చేర్చేందుకు వెళ్తున్నట్లు కీర్తికుమార్ జైన్ పోలీసుల ఎదుట ఒప్పుకొన్నాడు. ఈ డబ్బు హవాలా మార్గంలో ఎక్కడి నుంచి వచ్చింది.. పంపించిన వ్యక్తి ఎవరు.. అతడి వివరాలపై వరంగల్ పోలీసులు ఆరా తీస్తున్నారు. సింగపూర్లోని ఓ వ్యక్తి హవాలా ద్వారా ఈ డబ్బును చెన్నైకి పంపించినట్లు అనుమానిస్తున్నారు. చెన్నై నుంచి కీర్తికుమార్కు ఈ డబ్బు చేరినట్లు తెలిసింది. సింగపూర్లో ఉన్న వ్యక్తి ఎవరు.. మహాకూటిమి అభ్యర్థులకు డబ్బు పంపాలని ఆ సింగపూర్ వ్యక్తిని ఆదేశించిందెవరన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. నేతలకు తాఖీదులు..: పలానా వ్యక్తి నుంచి డబ్బు వస్తుందని నామానాగేశ్వర్రావుతో పాటు కొండా మురళి, రవిచంద్రలకు సమాచారం ఉన్నట్లు వరంగల్ పోలీసులు గుర్తించారు. ఈ ముగ్గురిని త్వరలోనే విచారించేందుకు రంగం సిద్ధం చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే ఈ వ్యవహారంలో కేసులు నమోదు చేసిన పోలీసు శాఖ వీరికి త్వరలో నోటిసులు జారీచేసి విచారణకు రావాలని ఆదేశించనుంది. విచారణలో పలు అంశాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. గతంలో కూడా హవాలా ద్వారా డబ్బు రవాణా జరిగిందా.. డబ్బు పంపింన అసలు వ్యక్తి ఎవరన్న దాన్ని తేల్చాలని వరంగల్ పోలీసులు భావిస్తున్నారు. బాబు కోటరీయేనా? మహాకూటమికి అన్నీ తానై నడిపించిన ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు సంబంధించిన వ్యక్తులే ఈ హవాలా డబ్బు వెనుక ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నామా నాగేశ్వర్రావు.. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా పేరుంది. రవిచంద్రకు వరంగల్ ఈస్ట్ టికెట్ను కాంగ్రెస్ నుంచి ఇప్పించేందుకు చంద్రబాబు మంత్రాంగం నడిపినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరితో పాటు కొండా సురేఖ ఎన్నికల ఖర్చు కోసం కూడా చంద్రబాబు కోటరీయే హవాలా ద్వారా డబ్బును వరంగల్ చేర్చేందుకు ప్రయత్నించినట్లు రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. రిమాండ్లో ఉన్న కీర్తికుమార్ను కస్టడీలోకి తీసుకునేందుకు వరంగల్ పోలీసులు సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఆయన కస్టడీలో అసలు కథ ఏంటన్న అంశాలు వెలుగులోకి వస్తాయని రాష్ట్ర నిఘా వర్గాలు భావిస్తున్నాయి. -
రూ.33.72 లక్షల నగదు స్వాధీనం
నాగర్కర్నూల్ క్రైం/కందనూలు: నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల పరిధిలోని అల్లీపూర్ చెక్పోస్టు వద్ద రూ.33.72 లక్షల నగదును పోలీసులు స్వాధీ నం చేసుకున్నారు. కడప జిల్లాకు చెందిన పల్లీల వ్యాపారి సాంబశివారెడ్డి ఆదివారం అర్ధరాత్రి స్కార్పియో వాహనంలో ఈ నగదును తీసుకువెళ్తున్నాడు. అల్లీపూర్ చెక్పోస్టు వద్ద పోలీసులు వాహనాలను ఆపి తనిఖీ చేస్తున్నారు. సాంబశివారెడ్డి వాహనం లోని ఓ బ్యాగును తెరిచి చూడగా నగదు ఉన్నట్లు గుర్తించారు. వాటికి ఎలాంటి రశీదులు చూపకపోవడంతో ఎన్నికల కమిషన్ ఆదేశం మేరకు నగదును స్వాధీనం చేసుకొని రిటర్నింగ్ అధికారి హన్మానాయక్కు అందజేశారు. ఈ విషయమై ఇన్కంట్యాక్స్ అధికారులు, జిల్లా మానిటరింగ్ కమిటీ, జిల్లా ఎన్నికల అధికారికి సమాచారం ఇచ్చామని హన్మానాయక్ తెలిపారు. -
‘ఐటీ అధికారుల ముసుగులో మా ఇళ్లపై దాడి’
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కక్ష పూర్వకంగా తమపై సోదాలు చేయిస్తున్నారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. ఐటీ విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ...కేసీఆర్ నరేంద్ర మోదీతో కలిసి ఐటీ, ఈడీ విచారణ ముసుగులో ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. ఐటీ అధికారుల పేరుతో తమ ఇళ్లపై దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంపై ఐటీ అధికారులకు ఫిర్యాదు చేశానన్నారు. విచారణలో ఐటీ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకి సమాధానాలు చెప్పానన్నారు. తన సమాధానంతో అధికారులు సంతృప్తి చెందారని తెలిపారు. రాజకీయంగా కేసీఆర్ను ఎదుర్కొవడానికి తాను సిద్ధమన్నారు. ఐటీ కార్యాలయంలో రేవంత్ రెడ్డి విచారణ ముగిసింది. బుధవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన విచారణ దాదాపు ఐదు గంటల పాటు కొనసాగింది. 23న మరోసారి విచారణకు హాజరుకావాలని ఐటీ అధికారులు రేవంత్ రెడ్డి ఆదేశించారు. ముగిసిన రేవంత్ విచారణ -
రేవంత్ రెడ్డి విచారణపై ఏపీ ప్రభుత్వం ఆరా!
సాక్షి, అమరావతి : ‘ఓటుకు కోట్లు కేసు’ లో ఏ1 నిందితుడు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని ఆదాయపు పన్ను శాఖ అధికారుల బుధవారం విచారించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన విచారన దాదాపు ఐదు గంటల పాటు కొనసాగింది. ఈ కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కూడా సంబంధం ఉన్న విషయం తెలిసిందే. దీంతో రేవంత్ విచారణ పరిణామాలపై ఏపీ ప్రభుత్వం ఆరా తీసుస్తోంది. ఐటీ కార్యాలయ పరిసరాల్లో ఏపీ ఇంటలిజెన్స్, ఎస్బీ అధికారులు ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఐటీ సోదాలు, విచారణను గమనిస్తున్న ఏపీ ప్రభుత్వ పెద్దలు భయాందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. -
ముగిసిన రేవంత్ విచారణ
సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు కేసు’లో ఏ1 నిందితుడు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని ఆదాయపు పన్ను శాఖ అధికారులు విచారణ ముగిసింది. బుధవారం ఉదయం 11 గంటలకు ఐటీ కార్యాలయంలో ప్రారంభమైన విచారణ దాదాపు ఐదు గంటల పాటు కోనసాగింది. రేవంత్తో పాటు ఈ కేసులో మరో నిందితుడు ఉదయ్ సింహాలను కలిపి ఐటీ అధికారులు విచారిస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్కు ఇవ్వజూపిన రూ.50 లక్షలతో పాటు, ఇస్తామని ఆఫర్ ఇచ్చిన నాలుగున్నర కోట్ల రూపాయల గురించి అధికారులు ఆరా తీస్తున్నారని సమాచారం. అంతేకాకుండా ఈ కేసు గురించి ఏం చెప్పదల్చుకున్నాడో లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని రేవంత్ను కోరారు. ఆదాయ వ్యయాలు, వ్యాపార లావాదేవీలు, ఆస్తుల డాక్యుమెంట్లు, ఎన్నికల అఫిడవిట్స్లు ఐటీ అధికారులు రేవంత్ ముందుంచి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. రేవంత్తో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న పలువురిని కూడా ఐటీ అధికారులు విచారిస్తున్నారు. (గుట్టు తేలితే బాబుపైనే నజర్!) చదవండి: ఓటుకు ‘కోట్లు’ ఎక్కడివి? రేవంత్పై.. నేనే ఫిర్యాదు చేశా -
ముఖ్యమంత్రి వియ్యంకుడి ఇంట్లో ఐటీ సోదాలు
సాక్షి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పళణిస్వామి వియ్యంకుడు సుబ్రమణ్యం నివాసంలో మంగళవారం ఐటీ సోదాలు నిర్వహించారు. ఐటీ అధికారులు సుబ్రమణ్యంను అదుపులోకి తీసుకొని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. ఇప్పటివరకు చెన్నైలో జరిగిన ఐటీ సోదాల్లో కాంట్రాక్టర్ సెయ్యాదురై, ఆయన బంధువుల నివాసంలో 160 కోట్లు నగదు, 100 కేజీల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా సెయ్యాదురై ట్వీట్ ఒకటి సంచలం సృష్టిస్తోంది. ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా సెయ్యాదురై శుభాకాంక్షలు తెలపడం విశేషం. -
వేలానికి నటి ఇల్లు..
సాక్షి, చెన్నై : దివంగత నటి శ్రీవిద్య ఇంటిని ఆదాయ పన్ను శాఖ వేలం వేయనుంది. సీనియర్ నటి శ్రీవిద్య. గత 1966 నుంచి 2000 సంవత్సరం వరకూ ప్రముఖ నటిగా రాణించిన శ్రీవిద్య తమిళం, తెలుగు, మలయాళం, కన్నడలో పలు భాషల్లో నటించారు. ముఖ్యంగా కోలీవుడ్లో కథానాయకిగానూ కొన్ని చిత్రాల్లో నటించిన శ్రీవిద్య కేన్సర్ వ్యాధితో 2006లో కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో మరణించారు. అయితే ఆమెను చివరి దశలో మలయాళ నటుడు, ఆ రాష్ట్ర శాసన సభ్యుడు గణేశ్కుమార్ బాగోగులు చూసుకున్నారు. శ్రీవిద్యకు చెన్నై, అభిరామపురంలోని సుబ్రమణియంపురం వీధిలో రెండు అంతస్తుల ఫ్లాట్ ఉంది. అందులో ప్రస్తుతం డాన్స్ స్కూల్ నిర్వహిస్తున్నారు. అయితే ఆ ఇంటికి చాలా కాలంగా పన్ను చెల్లించకపోవడంతో డాన్స్ స్కూల్ ద్వారా వస్తున్న అద్దెను ఆదాయ పన్ను శాఖ జమ చేసుకుంటోంది. ఇంటి పన్ను, వడ్డీ, వేలం ఖర్చుల కోసం ఆ ఇంటినిప్పుడు వేలం వేయడానికి ఆ శాఖ సిద్ధమైంది. 1,250 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఆ ఫ్లాట్ను ఆదాయ పన్ను శాఖ రూ.1,17,20,000గా ధర నిర్ణయించింది. ఈ నెల 27వ తేదీన ఇంటిని వేలం వేయనున్నట్టు ప్రకటించింది. -
అటెన్షన్ టాక్స్ పేయర్స్..
సాక్షి, న్యూఢిల్లీ: ఆదాయ పన్ను శాఖ ఇ-ఫైలింగ్లో పన్ను చెల్లింపుదారుల కోసం ఒక కొత్త హెల్ప్ లైన్ను ప్రకటించింది. ఈ మేరకు ఇ-ఫైలింగ్ కోసం హెల్ప్ డెస్క్ నెంబర్లను మారుస్తున్నామంటూ సోమవారం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. తాజా నోటిఫికేషన్ ప్రకారం ఇ-ఫైలింగ్( ఆన్లైన్ ద్వారా) పన్ను వివరాలను నమోదు చేసుకునే వారి కోసం ఆదాయపన్ను శాఖ కొత్త హెల్ప్లైన్ నెంబర్ను ప్రకటించింది. అడ్వైజరీ ద్వారా ఐటీశాఖ నేడు కొత్త నెంబర్లతో ఈ ప్రకటన జారీ చేసింది. టోల్ ఫ్రీ నెంబర్18001030025, డైరక్ట్ నెంబర్ 918046122000 కొత్త నెంబర్లు పన్ను చెల్లింపుదారులకు అందుబాటులో ఉంటాయని ఐటీశాఖ వెల్లడించింది. https://www.incometaxindiaefiling.gov.in. వెబ్ పోర్టల్ ద్వారా పన్నుదారులు తమ పన్నులకు సంబంధించిన అంశాలను ఈ-ఫైయిలింగ్ చేసుకోవచ్చు. పోర్టల్లో ఐటీఆర్ ఫారం దాఖలు సందర్భంగా ఏదైనా సమస్యలు ఉత్పన్నమైతే ఈ హెల్ప్ లైన్ నెంబర్లను సంప్రదించ వచ్చని సీనియర్ అధికారి తెలిపారు. -
క్లినిక్లలో 100 కోట్ల నల్లధనం
బెంగళూరు: ఐవీఎఫ్ క్లినిక్లు, డయాగ్నస్టిక్ కేంద్రాలతో కొందరు వైద్యులు సాగిస్తున్న రహస్య సంబంధాలు బెంగళూరులో బట్టబయలయ్యాయి. ప్రముఖ గైనకాలజిస్ట్ కామిని రావ్కు చెందిన క్లినిక్లు, డయాగ్నస్టిక్ సెంటర్లలో సుమారు రూ.100 కోట్ల నల్లధనమున్నట్లు ఆదాయపన్ను అధికారులు గుర్తించారు. తమ దాడుల్లో రూ.1.4 కోట్ల నగదు, 3.5 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు శనివారం ఐటీ శాఖ ప్రకటించింది. అలాగే విదేశీ కరెన్సీ, కోట్లాది రూపాయల నిల్వలున్న విదేశీ ఖాతాలను కూడా కనుగొన్నట్లు తెలిపింది. ఆయా కేంద్రాలకు రోగులను రెఫర్ చేస్తున్నందుకు బదులుగా అవి డాక్టర్లకు భారీగా చెల్లిస్తున్నట్లు తెలిసింది. తమ సోదాల్లో ఆ ల్యాబ్లలో రూ.100 కోట్ల అప్రకటిత ఆదాయం ఉన్నట్లు కనుగొనగా, ఒక్కో ల్యాబ్లో డాక్టర్లకు చెల్లించిన రెఫరల్ ఫీజు రూ.200 కోట్లకు పైనే ఉంటుందని అంచనా వేసింది. తమకు రోగులను పంపిన డాక్టర్లకు ల్యాబ్లు చెల్లిస్తున్న అనేక విధానాలను గుర్తించామని పేర్కొంది. ‘డాక్టర్లకు అందుతున్న కమిషన్ ల్యాబ్ను బట్టి మారుతుంది. ఎంఆర్ఐ పరీక్షలకు 35 శాతం, సిటీ స్కాన్, ఇతర పరీక్షలకు 20 శాతం చొప్పున ఇస్తున్నారు. అయితే ఈ చెల్లింపులను ల్యాబ్లు మార్కెటింగ్ ఖర్చులుగా చూపుతున్నాయి. కొన్నిసార్లు డాక్లర్లకు చెల్లించే రెఫరల్ ఫీజును ప్రొఫెషనల్ ఫీజుగా చూపుతున్నాయి. ఒప్పందంలో భాగంగా ఆసుపత్రులు డాక్టర్లను ఇన్–హౌస్ కన్సల్టెంట్లుగా నియమించుకుంటున్నాయి. కానీ వారు క్లినిక్లకు రారు. పేషెంట్లను చూడరు. రిపోర్టులు రాయరు. డాక్టర్లకు కమిషన్లు చేరవేసేందుకు కొన్ని ల్యాబ్లు కమిషన్ ఏజెంట్లను కూడా నియమించుకుంటున్నాయి’ అని ఆదాయ పన్ను శాఖ వెల్లడించింది. -
ఇక శశి, ఇళవరసిల విచారణ
సాక్షి ప్రతినిధి, చెన్నై: మెరుపు దాడులతో శశికళ బంధువర్గాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన ఆదాయపు పన్నుశాఖ ఇక శశికళ, ఇళవరసిలపై దృష్టి సారించనుంది. ఐటీ దాడుల్లో స్వాధీనం చేసుకున్న పత్రాల ఆధారంగా బెంగళూరు జైలులో వీరిద్దరినీ విచారించనుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భర్త నటరాజన్ను పరామర్శించేందుకు శశికళ ఇటీవల పెరోల్పై చెన్నైకి వచ్చినపుడు 622 ఆస్తుల రిజిస్ట్రేషన్లలో మార్పులు, చేర్పులు చేసినట్లు ఐటీ అధికారులు భావిస్తున్నారు. ఈ తతంగమంతా ఇళవరసి కుమార్తె కృష్ణప్రియ ఇంట్లో జరిగినట్లు అభియోగం. దాడులు ముగిసిన నాటి నుంచి శశికళ బంధువులను ఐటీ కార్యాలయానికి పిలిపించి విచారిస్తున్నారు. ఆస్తులు కూడగట్టడంలో ప్రధానపాత్ర పోషించిన శశికళను, ఆమె అన్న భార్య ఇళవరసిలను విచారించేందుకు ఐటీ అధికారులు బెంగళూరు జైలుకు వెళ్లనున్నట్లు సమాచారం. దినకరన్ సోదరికి శిక్ష ఖరారు టీ నగర్ (చెన్నై): శశికళ సోదరి బి.వనితామణి కుమార్తె శీతలాదేవికి మూడేళ్లు, ఆమె భర్త ఎస్ఆర్ భాస్కరన్కు ఐదేళ్ల జైలు శిక్షను విధిస్తూ గతంలో సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ మద్రాసు హైకోర్టు గురువారం తీర్పునిచ్చింది. శీతలాదేవి దినకరన్కు చెల్లెలు. భాస్కరన్ రిజర్వు బ్యాంకు మాజీ ఉద్యోగి. 1988– 97 మధ్యకాలంలో భాస్కరన్ తన భార్య పేరిట ఆదాయానికి మించి రూ.1.68కోట్ల ఆస్తులు కూడబెట్టినట్లు సీబీఐ 1998లో కేసు వేసింది. కేసు విచారించిన సీబీఐ కోర్టు భాస్కరన్కు ఐదేళ్ల శిక్ష, రూ.20 లక్షలు జరిమానా, శీతలాదేవికి మూడేళ్ల శిక్ష, రూ.10 లక్షలు జరిమానా విధిస్తూ 2008లో తీర్పుచెప్పింది. దీనిపై వీరు 2008లో హైకోర్టును ఆశ్రయించగా, శిక్షను నిలిపేసి హైకోర్టు విచారణ చేపట్టింది. తాజాగా సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ హైకోర్టు జడ్జి జయచంద్రన్ తీర్పుచెప్పారు. -
జయ చానెల్కు ఐటీ ఝలక్..!
-
తమిళనాడులో అనూహ్య పరిణామం!
సాక్షి, చెన్నై: తమిళనాడులో అనూహ్య పరిణామం.. ప్రస్తుతం జైల్లో ఉన్న అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ ఆర్థిక సామ్రాజ్యానికి ఆదాయపన్నుశాఖ (ఐటీ) దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. శశికళ, ఆమె బంధువుల ఆస్తుల లక్ష్యంగా ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. గురువారం తెల్లవారుజాము నుంచి 80మందికిపైగా ఐటీ అధికారులు ఏకంగా 30 చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రారంభించిన ’జయ టీవీ’, అన్నాడీఎంకేకు చెందిన నమధు ఎంజీఆర్ పత్రిక కార్యాలయాల్లోనూ ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. జయటీవీ కార్యాలయంలో దాదాపు పదిమంది ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. టార్గెట్ శశికళ.. జయలలిత ప్రారంభించినప్పటికీ ప్రస్తుతం జయటీవీ, నమధు ఎంజీఆర్ పత్రిక శశికళ కుటుంబసభ్యుల అధీనంలో ఉన్నాయి. శశికళను పార్టీ నుంచి బహిష్కరించి.. ఈపీఎస్-ఓపీఎస్ శిబిరాలు విలీనమైన నేపథ్యంలో అన్నాడీఎంకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ఈ సంస్థలు కథనాలు ప్రచురిస్తున్నాయి. పళనిస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జయటీవీ, ఎంజీఆర్ పత్రిక పనిచేస్తున్న నేపథ్యంలోనే వీటిపై ఐటీ దాడులు జరగడం రాజకీయంగా సంచలనం రేపుతోంది. ముఖ్యంగా శశికళ బంధువులైన దినకరన్, దివాకరన్, శశికళ వదిన ఇళవరసి, ఆమె మేనకోడలు కృష్ణప్రియ ఇంట్లో ఐటీ దాడులు ఏకకాలంలో కొనసాగుతున్నాయి. తంజావూరులోని శశికళ భర్త నటరాజన్ ఇంట్లో, బెంగళూరులోని శశికళ సన్నిహితుడు పుహళేంది ఇంట్లోనూ ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి. జయలలిత ఆస్తులు ప్రస్తుతం శశికళ కుటుంబసభ్యుల నియంత్రణలో ఉన్నాయి. వీటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తున్న నేపథ్యంలో శశికళ టార్గెట్గా ఐటీ దాడులు జరగడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఆదాయాన్ని దాచిపెట్టడం, పన్ను ఎగవేయడం వంటి సమాచారం ఆధారంగానే చానెల్ కార్యాలయంలో దాడులు నిర్వహించినట్టు ఐటీ అధికారులు తెలిపారు. ‘చానెల్ పన్ను ఎగ్గొట్టేందుకు ఆదాయ వివరాలను దాచిపెడుతున్నట్టు మాకు సమాచారం అందింది. చానెల్ కార్యకలాపాలు, ముఖ్య సిబ్బంది తీరుపై ప్రస్తుతం దృష్టి పెట్టాం’ అని ఐటీ అధికారులు చెప్పారు. జయ చానెల్తోపాటు శశికళ కుటుంబానికి చెందిన జాజ్ సినిమా థియేటర్పై, వివేక్ నివాసంలోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. -
నయీం కుటుంబానికి ఐటీ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: సిట్ పేరుతో గ్యాంగ్స్టర్ నయీం కేసు విచారణ జరిపిన పోలీసులు చాలా రోజులుగా మౌనంగా ఉండగా, తాజా గా ఆదాయపన్ను శాఖ రంగంలోకి దిగింది. నయీం తల్లితోపాటు నలుగురు కుటుంబ సభ్యులకు బినామీ ఆస్తుల నిరోధక చట్టం కింద తాఖీదులు జారీ చేసింది. నయీం తల్లి తాహేరా బేగం, భార్య హసీనా బేగం, అక్క సలీమా బేగం, తమ్ముడి భార్య హీనా కౌసర్, తమ్ముడి కూతురు అహేలా బేగంలకు నోటీసులిచ్చింది. సోమవారం ఆదాయపన్ను శాఖ అధికారులు భువనగిరిలోని నయీం పాత ఇంటికి నోటీసులను అంటించి వెళ్లారు. బినామీ లావాదేవీల నిరోధక యూనిట్ (బీపీయూ) డిప్యూటీ కమిషనర్ బ్రజేంద్ర కుమార్ పేరిట జారీ అయిన ఈ నోటీసుల్లో మొత్తం 26 చోట్ల ఉన్న 98 ఆస్తుల వివరాలను పొందుపరిచారు. ఈ ఆస్తులు ఎక్కడ్నుంచి వచ్చాయో తెలపాలని అందులో పేర్కొన్నా రు. నోటీసులో పేర్కొన్న వ్యక్తులు ఏం వ్యాపా రాలు చేస్తున్నారు? ఆదాయ వనరులు ఎక్క డ్నుంచి వస్తున్నాయి? ఆయా ఆస్తుల సేల్ డీడ్లు, గత పదిహేనేళ్ల ఐటీ రిటర్న్లు, స్థిర, చరాస్తుల క్రయ విక్రయాల వివరాలను తెలి యజేయాలని ఆదేశించారు. అక్టోబర్ 3లోగా వ్యక్తిగతంగా లేదా పోస్టు ద్వారా లేదంటే తమ ప్రతినిధి ద్వారా వివరాలను పంపాలని, లేదంటే జరిమానా విధిస్తామన్నారు. విలువ వేల కోట్లలో.. ఆదాయపన్ను శాఖ జారీ చేసిన నోటీసుల్లోని ఆస్తుల వివరాలు విస్తుగొలుపుతున్నాయి. వందలు, వేల కోట్ల రూపాయల విలువ చేసే భూములు, నివాస స్థలాలు కేవలం ఐదుగురి పేరిట రిజిస్టర్ అయి ఉన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా, నల్లగొండ, ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో ఆస్తులు ఇందులో ఉన్నాయి. నయీం తల్లి, భార్య, అక్క, తమ్ముడి భార్య, కూతురు పేర్లపై 258 ఎకరాలకు పైగా వ్యవసాయ, వ్యవసాయేతర భూములున్నాయి. వీటి విలువ కనీసం రూ.500 కోట్లు దాటుతుందని అంచనా. ఇక నివాస స్థలాల విషయానికి వస్తే మొత్తం 12,911 చదరపు గజాల ప్లాట్లు ఈ ఐదుగురి పేరిట రిజిస్టర్ అయ్యాయి. అందు లో తమ్ముడి కూతురు అలేహ బేగం పేరిట ఎక్కువగా రిజిస్టర్ కావడం గమనార్హం. ఆమె ఒక్కరి పేరిటే 7,637 చదరపు గజాల నివాస స్థలాల ఉన్నట్టు ఐటీ నోటీసుల్లో పేర్కొన్నారు. తల్లి తాహెరాబేగం పేరిట 85 ఎకరాల భూమి, 746 చదరపు గజాల నివాస స్థలం, భార్య హసీనా బేగం పేరిట 69.79 ఎకరాల భూమి, 1,736 చదరపు గజాల నివాస స్థలం, అక్క సలీమా బేగం పేరిట 39.33 ఎకరాల భూమి, 2,937.50 చదరపు గజాల నివాస స్థలం, తమ్ముడి భార్య హీనా కౌసర్కు 15.9 ఎకరాల భూమి, 600 చదరపు గజాల నివాస స్థలం, ఆలేహ బేగం పేరిట 47.13 ఎకరాల భూమి, 7,637 చదరపు గజాల నివాస స్థలం ఉంది. భువనగిరిలోని ఖిలానగర్లో ఉన్న నయీం ఇంటిని తల్లి, భార్య, అక్క పేర్ల మీద ఉమ్మడి రిజిస్ట్రేషన్ చేయడంతో ముగ్గురికీ నోటీసులు జారీ చేశారు. -
నాన్నా రూ.50 లక్షలు పంపండి
మీవల్ల ఇబ్బంది పడినవారు నన్ను కిడ్నాప్ చేసి హింసిస్తున్నారు కిడ్నాపర్ల చెర నుంచి ఐటీ అధికారికి కొడుకు వీడియో సాక్షి, బనశంకరి(బెంగళూరు): ఆదాయపు పన్ను (ఐటీ) అధికారి కొడుకుని గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేసి రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ పెట్టారు. బెంగళూరులో ఈ ఘటన జరిగింది. ఐటీ శాఖలో పనిచేస్తున్న నిరంజన్ ఉళ్లాలలో నివసిస్తున్నాడు. ఇతని కొడుకు శరత్ (19) రెండు రోజుల క్రితం జ్ఞానభారతిలో ఉన్న స్నేహితుడి ఇంటికి వెళ్తుండగా, దుండగులు అతన్ని అపహరించి రూ.50 లక్షలు ఇస్తేనే విడుదల చేస్తామని తండ్రి నిరంజన్, తల్లి, సోదరిలకు వాట్సాప్లో వీడియో పంపించారు. నిరంజన్ జ్ఞానభారతి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా, కిడ్నాపర్ల కోసం గాలింపు చేపట్టారు. బాధితుడు శరత్ వాట్సాప్ వీడియోలో మాట్లాడుతూ... ‘నాన్నా మీ వల్ల ఇబ్బంది పడినవారు నన్ను కిడ్నాప్ చేశారు, నన్ను హింసిస్తున్నారు, రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఎలాగైనా వీరికి డబ్బు ఇవ్వండి. పోలీసులకు ఫిర్యాదు చేస్తే మన కుటుంబానికి ప్రమాదమని హెచ్చరించారు’ అని పేర్కొన్నాడు. -
అవినీతి కేసు: ఐటీ అధికారులు అరెస్ట్
సాక్షి, రాంచి : అవినీతి కేసుతో సంబంధమున్న నలుగురు ఆదాయపు పన్ను శాఖ అధికారులను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) అరెస్ట్ చేసింది. అవినీతి ఆరోపణలు, క్రిమినల్ కుట్ర, క్రిమినల్ దుష్ఫర్తన వంటి కారణాలచే రాంచిలోని పలువురు ఐటీ అధికారులపై సీబీఐ జూలై 10నే ఎఫ్ఐఆర్ నమోదుచేసింది. అనంతరం వీరిపై విచారణ చేపట్టింది. ఈ విచారణలో భాగంగా నలుగురు ఐటీ అధికారులను శుక్రవారం సీబీఐ అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో భాగంగానే రాంచి ఐటీ డిపార్ట్మెంట్కు చెందిన ప్రధాన కమిషనర్ను జూలై 12నే సీబీఐ అరెస్ట్చేసింది. నేడు అరెస్ట్ చేసిన మరో నలుగురు అధికారుల్లో రంజిత్ కుమార్ లాల్, సునిల్ కుమార్ గుప్తా, తరుణ్ రాయ్, వినోద్ కుమార్ పాల్లు ఉన్నారు. ఎక్కువ మొత్తంలో పన్ను పడిన వ్యాపారవేత్తల నుంచి భారీగా లంచం తీసుకుని వీరు అవినీతికి పాల్పడినట్టు సీబీఐ అధికార ప్రతినిధి చెప్పారు. వీరిపై ఎఫ్ఐఆర్ నమోదుచేసిన అనంతరం ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి సమీప ప్రాంతాలు కోల్కత్తాలోని 18, రాంచిలోని 5 ప్రాంతాల్లో దాడులు నిర్వహించినట్టు పేర్కొన్నారు. ఈ దాడుల్లో రూ.3.7 కోట్ల నగదు, 6.6 కేజీల బంగారం, నాలుగు కోట్ల విలువ చేసే ఫ్లాట్కు సంబంధించిన డాక్యుమెంట్తో పాటు మరికొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. -
ఆరేళ్లలో 21 విదేశీ ట్రిప్లు...
సాక్షి, ముంబయి : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఐటీ అధికారి వివేక్ బాత్రా విలాసవంత జీవితం విస్తుగొలుపుతుంది. ఆరేళ్లలో ఆయన తనే భార్యతో కలిసి 21 సార్లు విదేశాలను చుట్టివచ్చారు. వీరు కేవలం ఆరు నెలల వ్యవధిలో ఎనిమిది సార్లు అమెరికాను సందర్శంచారు. ఐటీ అధికారి వివేక్ బాత్రా అక్రమంగా ఆర్జించిన సొమ్మును స్టాక్ మార్కెట్లలో లిస్టయిన డొల్ల కంపెనీలకు తరలించేవారని సీబీఐ వెల్లడించింది. బాత్రా దంపతుల విలాసవంత లైఫ్స్టైల్ పైనా సీబీఐ దృష్టి సారించింది. మహాలక్ష్మి రేస్కోర్సులో జరిగిన ఓ చిన్న పార్టీలో కేవలం డ్రింక్స్ కోసమే వీరు రూ 50,000 వెచ్చించారని తెలిసింది. దంపతులిద్దరూ తరచూ నగరంలోని సెలబ్రిటీ పార్టీల్లో దర్శనమిస్తుంటారు. ముంబయిలో ఆదాయపన్ను అదనపు కమిషనర్గా పనిచేస్తున్న బాత్రాపై గతనెలలో సీబీఐ ఆదాయాన్ని మించి ఆస్తులు కలిగిఉన్నారని కేసు నమోదు చేసింది. బాత్రా దంపతులు 2008 నుంచి 2017 మధ్య రూ 6.79 కోట్ల విలువైన ఆస్తులను అక్రమంగా కూడబెట్టారని సీబీఐ ఆరోపిస్తోంది. ఈ కేసులో బాత్రా సీఏ, రెండు కంపెనీల టాప్ ఎగ్జిక్యూటివ్లపైనా కేసులు నమోదయ్యాయి. 2005లోనూ బాత్రాపై సీబీఐ అభియోగాలు మోపింది. అప్పట్లో సీబీఐ ఆరోపణలను ఆయన న్యాయస్ధానాల్లో సవాల్ చేశారు. -
భారీ పన్ను డిఫాల్టర్ల జాబితా జారీ
న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారుల విషయంలో కఠిన వైఖరి అవలంబిస్తున్న ఆదాయపన్ను శాఖ తాజాగా జాబితా విడుదల చేసింది. భారీగా పన్ను ఎగవేత దారులు నేమ్ అండ్ షేమ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ అవమాన వ్యూహంలో భాగంగా రూ .10 కోట్లకుపైగా పన్నులు చెల్లించని ఢిల్లీకి చెందిన ఐదు సంస్థల పేర్లను ప్రచురించింది. ఆదాయ పన్ను,కార్పొరేట్ టాక్స్ చెల్లించాల్సిన జాబితాను ప్రధాన జాతీయ జాతీయ దినపత్రికలకు జారీచేసిన ప్రకటనలోఐటీశాఖ విడుదల చేసింది. "పన్ను బకాయిలు వెంటనే" చెల్లించాలని కోరింది. పన్ను శాఖ యొక్క పాలసీ యంత్రాంగం ప్రత్యక్ష పన్నుల సెంట్రల్ బోర్డు (సిబిడిటి) గత కొన్ని సంవత్సరాల క్రితం ఈ అవమాన పథకాన్ని ఆదాయం పన్ను శాఖ ప్రారంభించింది. ఈ క్రమంలో గతంలో 96 సంస్థలు గుర్తించింది. ఇవి గుర్తించలేకుండా లేదా రికవరీ కోసం ఎలాంటి ఆస్తులు లేకుండా మిగిలిపోయాయి. ఆదాయ పన్ను ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ జారీ చేసిన ఒక నోటీసు లో ఈ జాబితాను వెల్లడి చేశారు. పాన్ కార్డు సంఖ్య, చివరిగా తెలిసిన చిరునామా, అంచనా పరిధి , పన్ను చెల్లించని మొత్తాన్ని, వ్యక్తిగత, సంస్థల వివరాలతో వెల్లడించినట్టు ఐటీ శాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. అయితే ఈ సంస్థల చిరునామా, వ్యాపారం, వాటాదారుల నిర్వహణ మరియు నిర్వహణ వంటివి మారవచ్చు. ఈ సంస్థల గురించి సమాచారం తెలిసిన వారు, ఉపయోగకరమైన సమాచారం ఉంటే తమకు తెలియపర్చాల్సిందిగా కోరారు. కాగా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ క్లీన్మనీ వెబ్సైట్ను మంగళవారం ప్రారంభించారు. నిజాయితీగల పన్ను చెల్లింపుదారులకు లబ్ది చేకూర్చేలా , పన్ను చెల్లింపులకు ప్రజలను ప్రోత్సహించేలా ఈ పోర్టల్ను లాంచ్ చేసినట్టు చెప్పారు. ఈ డిఫాల్టర్ల పేర్లను తన అధికారిక వెబ్ సైట్ లో కూడా ప్రచురించడం ప్రారంభించింది. -
శేఖర్రెడ్డికి చెందిన 34 కోట్ల ఆస్తులు అటాచ్
చెన్నై: పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో పెద్ద మొత్తంలో దొరికిన సొమ్ము కేసులో టీటీడీ ట్రస్టు బోర్డు మాజీ సభ్యుడు శేఖర్రెడ్డితో పాటు పలువురి ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. సుమారు రూ.34 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే సెక్షన్ కింద టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు, కాంట్రాక్టర్ శేఖర్రెడ్డిసహా నలుగురిపై సీబీఐ, ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ అధికారులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. పెద్దనోట్ల రద్దు అనంతరం శేఖర్రెడ్డి అతని భాగస్వాముల ఇళ్లు, ఆస్తులపై గత ఏడాది డిసెంబర్లో ఆదాయపుపన్నుశాఖ అధికారులు మెరుపు దాడులు నిర్వహించి రూ.131 కోట్ల నగదు, ఇందులో రూ.34 కోట్ల కొత్త కరెన్సీ, 127 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసు తీవ్రత దృష్ట్యా విచారణ బాధ్యత సీబీఐ, ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ చేతుల్లోకి వెళ్లింది. అయితే ఈ మొత్తం డబ్బు, బంగారం అంతా తనదేనని శేఖర్రెడ్డి చెబుతున్నా.. వీటికి సంబంధించి ఎలాంటి లెక్కలు లేవని ఈడీ నిర్ధారించింది. ఈ నేపథ్యంలో వాటిని అటాచ్ చేసుకుంటున్నట్లు ఈడీ నోటీసులు ఇచ్చింది. -
జంప్ జిలానీ!
సీఐడీకే ఝలక్ ఇచ్చిన కమర్షియల్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ బోధన్ స్కాం కేసులో విచారణకు వచ్చి పరార్ సాక్షాత్తూ సీఐడీ ప్రధాన కార్యాలయం నుంచి మాయం విషయం బయటకు పొక్కనీయని అధికారులు అదేరోజు పారిపోయిన అధికారి పేరుతో ఉన్న మరో అధికారి అరెస్ట్ నాలుగు రోజులుగా డిప్యూటీ కమిషనర్ కోసం వేట దర్యాప్తు అధికారులపై వెల్లువెత్తుతున్న విమర్శలు సమయం: ఉదయం 11 గంటలు.. స్థలం: ఎన్నో సంచలనాత్మకమైన కేసులను విచారించే హైదరాబాద్లోని సీఐడీ ప్రధాన కార్యాలయం. ఎవరెవరుంటారు?: ఒక అదనపు డీజీపీ, ఇద్దరు ఐజీలు, నలుగురు అదనపు ఎస్పీలు, పదుల సంఖ్యలో డీఎస్పీలు, 30 మందికిపైగా ఇన్స్పెక్టర్లతో ఆ కార్యాలయం కట్టుదిట్టంగా ఉంటుంది. వచ్చిందెవరు?: ఆయన కమర్షియల్ ట్యాక్స్ శాఖ డిప్యూటీ కమిషనర్. బోధన్ స్కాంలో కీలక నిందితుడు. సీఐడీ అధికారులు విచారణకు పిలిచారు. ప్రశ్నల వర్షం కురిపించారు. పొంతన లేని సమాధానాలు వచ్చాయి. లాభం లేదనుకొని అరెస్ట్కు సిద్ధమయ్యారు. ప్రభుత్వం నుంచి అనుమతి కోసం వేచిచూస్తున్నారు. ఎలా జారుకున్నాడు?: ఇక అరెస్టు తప్పదని డిప్యూటీ కమిషనర్కు అర్థమైపోయింది. విచారణకు పిలిచిన అధికారి బయటకు వెళ్లారు. అదే చాన్స్గా డిప్యూటీ కమిషనర్ సీట్లోంచి లేచాడు. తలుపులు తెరిచి అటూ ఇటూ చూశాడు. పెద్దగా సిబ్బంది ఎవరూ కనిపించలేదు. ఇంకేముంది.. ఎవరికీ అనుమానం రాకుండా అక్కడ్నుంచి జంప్ అయ్యాడు!! గతనెల 29న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఇది స్వయంగా ముఖ్యమంత్రి పర్యవేక్షణలో ఉన్న వాణిజ్య పన్నుల శాఖకు సంబంధించిన కేసు కావడంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ నేరుగా పర్యవేక్షిస్తున్నారు. ఇలాంటి ముఖ్యమైన కేసులో, అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించాల్సిన సీఐడీ అధికారుల సమక్షంలోంచి, అదీ ప్రధాన కార్యాలయం నుంచి కీలక నిందితుడు పరారవడం సంచలనం రేపుతోంది. అప్పట్నుంచీ ఆ డిప్యూటీ కమిషనర్ జాడ తెలియడం లేదు. ఇంటికి తాళం వేసి భార్యాపిల్లలు సహా పత్తా లేకుండా పోయారు. కలిసొచ్చిన ఒకే ‘పేరు’ బోధన్ స్కాంలో మొదట అరెస్ట్ చేయాల్సింది పరారైన డిప్యూటీ కమిషనర్నే. అయితే సీఐడీ కార్యాలయం నుంచి ఆయన పరారవడంతో దర్యాప్తు అధికారులకు, ఉన్నతాధికారులకు ఏం చేయాలో తోచలేదు. ఆయన తర్వాత అరెస్టు చేయాల్సిన మరో అధికారి శ్రీనివాస్రావును అదేరోజు అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. తప్పించుకొని పారిపోయిన అధికారి పేరు, అరెస్ట్ చేసిన అధికారి పేరు ఒకటే కావడం గమనార్హం. ఎలాగూ శ్రీనివాస్రావు అరెస్ట్ కావాల్సిందే కాబట్టి మొదటి అధికారి కన్నా ముందు ఈయనను అరెస్ట్ చేసినట్టు తెలిసింది. దర్యాప్తు అధికారులపై తీవ్ర ఆగ్రహం బోధన్ స్కాం విచారణ ప్రారంభమైన నాటినుంచి దర్యాప్తు అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. మొదట దర్యాప్తు అధికారిగా ఉన్న డీఎస్పీపై ఆరోపణలు రావడంతో ఆయన్ను పక్కనబెట్టారు. ఆ తర్వాత దర్యాప్తు అధికారిగా ఉన్న డీఎస్పీ... నిందితులతో కుమ్మక్కయ్యారని తేలడంతో సీఐడీ అదనపు డీజీపీ ఆయన్ను సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఏకంగా అదనపు ఎస్పీ అధికారిని విచారణ అధికారిగా నియమించినా.. ఏకంగా సీఐడీ కేంద్ర కార్యాలయం నుంచి నిందితుడు పరారవడం ఉన్నతాధికారులను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. ఒక్క కేసు విచారణ కూడా వివాదాస్పదం కాకుండా పూర్తి చేయలేరా అంటూ ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే కేసులో ఇద్దరు దర్యాప్తు అధికారులు మారడం, మూడో అధికారి నేతృత్వంలోనూ నిర్లక్ష్యం జరగడంపై ప్రభుత్వ వర్గాలు సైతం ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. ముమ్మరంగా వేట.. సీఐడీ కార్యాలయం నుంచి పోలీసుల కళ్లుగప్పి పారిపోయిన డిప్యూటీ కమిషనర్ కోసం రెండు ప్రత్యేక బృందాలు నాలుగు రోజులుగా వేట సాగిస్తున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా సాగిన వ్యవహారాన్ని కప్పిపుచ్చుకునేందుకు.. ఎలాగైనా డిప్యూటీ కమిషనర్ను పట్టుకునేందుకు యత్నిస్తున్నారు. ఇక ఈ కేసులో చిక్కినట్టే చిక్కి తప్పించుకుంటున్న ఏసీటీవో పూర్ణచందర్రెడ్డి విషయంలోనూ సీఐడీ ఉన్నతాధికారులు దర్యాప్తు అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. రెండు రోజుల్లో ఇద్దరిని అరెస్ట్ చేయకపోతే తీవ్రమైన చర్యలుంటాయని దర్యాప్తు అధికారులను హెచ్చరించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. -
సీబీఐ వలలో ఐటీ అధికారి
విశాఖపట్నం: ఆదాయపు పన్ను శాఖాధికారి ఒకరు సీబీఐ వలకు చిక్కారు. ఓ వ్యక్తి నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా ఐటీ అధికారి శ్రీనివాసరావును సీబీఐ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించి రూ.2.03 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. సీబీఐ అధికారులు శ్రీనివాసరావును గురువారం కోర్టులో హాజరుపరచనున్నారు. -
పేరెంట్స్కన్నా పేదోళ్లు ఈ తరం పిల్లలు
న్యూయార్క్: రెండో ప్రపంచ యుద్ధం ముగిశాక అభివృద్ధి చెందిన దేశాల్లో తాత ముత్తాతలు, తల్లిదండ్రలు కన్నా పిల్లలు ఎక్కువగా సంపాదిస్తూ వచ్చారు. 1993 నుంచి 2005 వరకు ఆ తరం ఆదాయాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి చెందిన దేశాల్లో 98 శాతం మంది ఆదాయం ఏటా పెరుగుతూ వచ్చింది. ఈ ట్రెండ్ కనీసం 25 అభివృద్ధి చెందిన దేశాల్లో స్పష్టంగా కనిపించింది. 2005 నుంచి 2014 సంవత్సరాల మధ్య నవతరం ఆదాయాన్ని పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. 70 శాతం ఈ తరం ఇళ్లలో తాతముత్తాతలు, తల్లిదండ్రులకన్నా ఆదాయం ఉన్న చోట ఆగిపోవడంగానీ, తగ్గిపోవడంగానీ జరుగుతోంది. ఈ ప్రతికూల పరిణామాన్ని కొంతమేరకైనా తగ్గిద్దామనే ఆలోచనతో కొన్ని దేశాల ప్రభుత్వాలు పన్నులను తగ్గించడమే రాయితీలను కూడా పెంచాయి. అయినప్పటికీ పరిస్థితుల్లో పెద్దగా మార్పు లేదు. ఇటలీ లాంటి దేశాల్లో పరిస్థితి మరింత దిగజారింది. 2005 నుంచి 2014 మధ్య ఇటలీలో 97 శాతం మంది ఆదాయం నిలకడగా ఉండడంగానీ, పడిపోవడంగానీ జరగ్గా, ఆదాయం పన్ను రాయితీల అనంతరం వారి శాతం నూటికి నూరు శాతం చేరుకుంది. అమెరికాలో ఈ ట్రెండ్ వైవిధ్యంగా ఉంది. ఇదే కాలానికి 80 శాతం ఈ తరం అమెరికన్ల ఆదాయం నిలకడగా, లేదా పడిపోగా పన్ను రాయితీల వల్ల వారందరి ఆదాయం పెరిగింది. దీనికి కారణం 2008లో ప్రపంచాన్ని కుదిపేసిన ఆర్థిక మాంద్యం ఒక కారణంకాగా, అభివృద్ధి చెందిన దేశాల్లో ఆర్థిక వ్యత్యాసం బాగా పెరగడం, అంటే కొంత మంది వద్దనే ఆదాయం ఎక్కువగా పోగవడం మరో కారణమని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. లేబర్ మార్కెట్లో వయసుమీరిన వారు కూడా ఎక్కువవడం కూడా కారణమని వారంటున్నారు. ఏదేమైనా ‘మ్యాక్కిన్సే గ్లోబల్ ఇనిస్టిట్యూట్’ విడుదల చేసిన ఈ ఆర్థిక విశ్లేషణలు ఆసక్తిదాయకంగా ఉన్నాయని, ఆధునిక ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలపై చర్చించే అవకాశం వచ్చిందని ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు అంటున్నారు. -
ఐటీ దాడులకు ఐదు రాష్ట్రాల అధికారులు
చెన్నైలో ముగిసిన రెండురోజుల రహస్య సమావేశం సాక్షి ప్రతినిధి, చెన్నై: తీగలాగితే డొంక కదిలినట్లుగా తమిళనాడు మాజీ సీఎస్ రామమోహన్రావు, కాంట్రాక్టర్ శేఖర్రెడ్డి, ఇళ్లపై ఐటీ దాడులతో మరికొంత మంది బడా బాబుల పేర్లు బైటకు రాబోతున్నాయి. శేఖర్రెడ్డి, రామ మోహన్రావుల నుంచి స్వాధీనం చేసుకున్న డైరీల్లో పేర్లు న్న పెద్దల ఇళ్లపై దాడులకు ముహూర్తం పెడుతున్నారు. తమిళనాడులో రెండో విడత దాడులకు ఆదాయపు పన్ను శాఖ సమాయత్తమయ్యే కార్యక్రమంలో భాగంగా ఈ నెల 25, 26వ తేదీల్లో చెన్నై నుంగంబాక్కంలోని ఐటీ ప్రధాన కార్యాలయంలో అధికారులు రహస్యంగా సమావేశమ య్యారు. తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు చెందిన 140 మంది ఐటీ ఉన్న తాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారని తెలిసింది. నగదు, నగలు, డాక్యుమెంట్లే కాకుండా కంప్యూటర్ హార్డ్డిస్క్లు స్వాధీనం చేసుకోవడానికి ప్రాముఖ్యతనివ్వా లని తీర్మానించారు. బెంగళూరులో వివేక్కు కోట్ల స్థిరాస్తులు తమిళనాడు మాజీ సీఎస్ రామమోహన్రావు కుమారుడు వివేక్ పాపిశెట్టికి గతవారంలో నోటీసులిచ్చిన ఐటీ శాఖ.. తాజాగా మరోసారి రిమైండర్ నోటీసులు పంపింది. తన భార్య అనారోగ్య కారణాల వల్ల విచారణకు హాజరుకాలేక పోతున్నానని గతంలో వివేక్ విచారణ అధికారులకు తెలి పాడు. వివేక్ పెద్ద ఎత్తున అక్రమార్జనకు పాల్పడి నట్లు ఐటీ శాఖ భావిస్తోంది. బెంగళూరులో కోట్లాది రూపాయల ఖరీదు చేసే 500 లగ్జరీ అపార్టుమెంట్లను వివేక్ కొనుగోలు చేసినట్లు దాడుల్లో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల ద్వారా ఐటీ అధికారులు కనుగొన్నారు. సహకార బ్యాంకులకు ఐటీ నోటీసులు పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో పాత కరెన్సీని మార్చేందుకు జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల్లో నకిలీ ఖాతాలు తెరిచి కొన్ని కోట్ల రూపాయల గోల్మాల్కు పాల్పడినట్లు వెల్లడైంది. దీంతో జిల్లా సహకార బ్యాంకులకు ఐటీశాఖ సోమవారం నోటీసులు జారీచేసింది. -
చిన్న వర్తకులకు ‘పన్ను’ నజరానా!
డిజిటల్ లావాదేవీలకు మారితే 6 శాతమే ఆదాయపన్ను: సీబీడీటీ న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపులకు ప్రోత్సాహక చర్యల్లో భాగంగా చిన్న వర్తకులకు కేంద్ర ప్రభుత్వం ఓ సదవకాశం కల్పించింది. రూ.2 కోట్ల వార్షిక టర్నోవర్ కలిగిన వ్యాపారులు డిజిటల్ రూపంలో చెల్లింపులు స్వీకరిస్తే...ఆదాయపన్ను తక్కువ చెల్లించే అవకాశాన్ని కల్పించింది. ఆదాయపన్ను చట్టం–1961 లోని సెక్షన్ 44ఏడీ ప్రకారం వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబం తదితర వర్గాల వారు వార్షిక వ్యాపారం రూ.2 కోట్లు, అంతకంటేతక్కువగా ఉంటే... ఆ మొత్తం టర్నోవర్లో లాభాన్ని 8 శాతంగా పరిగణించి పన్ను చెల్లించే అవకాశం ఉంది. అయితే, ఈ టర్నోవర్కు సరిపడా చెల్లింపులను బ్యాకింగ్ చానల్, డిజిటల్ విధానంలో స్వీకరించి ఉంటే ఈపన్ను రేటును ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 6 శాతానికి తగ్గించాలని నిర్ణయించినట్టు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) వెల్లడించింది. ఒకవేళ నగదు రూపంలోనే స్వీకరించి ఉంటే 8 శాతం పన్ను రేటేఅమలవుతుందని స్పష్టం చేసింది. తక్కువ నగదు చలామణి గల వ్యవస్థగా మారాలన్న ప్రభుత్వ లక్ష్యం సాకారం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. -
నలుగురి ఇళ్లల్లో 152 కోట్ల ఆస్తులు
-
నలుగురి ఇళ్లల్లో 152 కోట్ల ఆస్తులు
కర్ణాటకలో దడ పుట్టించిన ఐటీ దాడులు సాక్షి, బెంగళూరు: నలుగురి ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడుల్లో రూ.152 కోట్ల విలువైన సంపద బయటపడింది. బెంగళూరు లో నవంబర్ 30 నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు దాడులు నిర్వ హించినట్లు ఐటీ అధికారులు ప్రకట నలో వెల్లడించారు. ఇద్దరు ప్రభుత్వ ఇంజనీర్లు, ఇద్దరు కాంట్రాక్టర్ల ఇళ్లు, కార్యాలయాలతో పాటు వారి బంధు వులు, స్నేహితుల ఇళ్లలో సోదాలు జరిపామన్నారు. రూ.6 కోట్లకు పైగా బయట పడిన నగదులో రూ.5.7 కోట్ల విలువ చేసే కొత్త రూ.2 వేల నోట్లు ఉన్నాయి. దాదాపు 7 కిలోల బంగారం, వెండి బిస్కెట్లు, 9 కిలోల ఆభరణాలు సోదాల్లో వెలుగు చూశాయి. వందల కోట్ల విలువ చేసే స్థిర, చరాస్తులు, విలాసవం తమైన కార్లు బయటపడ్డాయి. ఇందుకు సంబంధించి కావేరి నిరావరి నిగమ మేనేజింగ్ డెరైక్టర్ చిక్కరాయప్ప, ప్రజాపనుల శాఖలో చీఫ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ జయచంద్రను సస్పెండ్ చేస్తున్నట్లు రాష్ట్ర హోం శాఖ మంత్రి పరమేశ్వర్ విధానపరిషత్లో వెల్లడించారు. మరో ఇద్దరు కాంట్రాక్టర్లపై కేసు నమోదు చేశారు. -
ఇన్కంట్యాక్స్ ఆఫీసర్ ఇంటిపై సీబీఐ దాడులు
-
ఆదాయ పన్ను అధికారి ఇంటిపై సీబీఐ దాడులు
హైదరాబాద్ : ఆదాయ పన్ను శాఖాధికారి ఇంటిపై సీబీఐ అధికారులు గురువారం మెరుపు దాడులకు దిగారు. నగరంలోని కేపీహెచ్బీ కాలనీకి చెందిన ఆదాయ పన్ను అధికారి బొడ్డు వెంకటేశ్వరరావు ఇంటితో పాటు ఆయన బంధువుల ఇళ్లలో అధికారులు ఏకకాలంగా తనిఖీలు చేపట్టారు. ఆయనపై తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు రావడంతో ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నాలుగు చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సోదాల్లో భారీగా అక్రమాస్తులను అధికారులు గుర్తించారు. వెంకటేశ్వరరావు కుమారుల పేరుతో ప్రొడక్షన్ హౌస్ను స్థాపించారు. పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహారించి భారీగా డబ్బులు సంపాదించినట్లు అధికారులు గుర్తించారు. సప్త వర్ణ క్రియేషన్స్ పేరుతో ఆయన కుమారుడిని హీరోగా చిత్రం నిర్శిస్తున్నట్లు సమాచారం. నగరంతో సహా 15 ప్రాంతాల్లో ఉన్న స్థిరాస్తుల విలువ దాదాపు 40 కోట్లకు పైగా ఉన్నట్లు గుర్తించారు. ఈ దాడులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బినామీలుగా మారితే సమస్యలే!
• ఎవరి ఆస్తులకు, డబ్బులకు వారే లెక్కచెప్పాల్సుంటుంది • ఇన్కంటాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ సీహెచ్ ఓంకారేశ్వర్ సాక్షి, కరీంనగర్: ఎవరి ఆస్తులు, డబ్బులు వాళ్ల ఖాతాలోనే వేసుకోవాలని, ఇతరుల ఆస్తులకు, లావాదేవీలకు బినామీగా వ్యవహరిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని ఇన్కంటాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ సీహెచ్.ఓంకారేశ్వర్ అన్నారు. శుక్రవారం కరీంనగర్లో ఆయన విలేకరులతో రూ. 500, 1000 నోట్ల రద్దు గురించి మాట్లాడారు. నోట్ల రద్దు నిర్ణయం వల్ల దేశం అభివృద్ధి బాటలో పయనిస్తుందన్నారు. నల్లడబ్బు మొత్తం బయటకు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. మనదేశంలో కరెన్సీ మొత్తం రూ.17 లక్షల కోట్లు ఉండగా, ఇందులో రూ. 14.5 లక్షల కోట్లు 500, 1000 రూపాయల నోట్ల రూపంలో ఉన్నాయన్నారు. ఇప్పటివరకు రూ. 6 లక్షల కోట్లు డిపాజిట్ కాగా రూ. 1.5 లక్షల కోట్లు మళ్లీ విత్డ్రా రూపంలో ప్రజలకు చేరుకున్నాయన్నారు. ఇంకా 9.5 లక్షల కోట్లు రావాల్సి ఉందన్నారు. ప్రస్తుతం డిపాజిట్ అరుున డబ్బులకు వారే లెక్క చెప్పాల్సి ఉంటుందన్నారు. దీనికి సంబంధించిన అన్ని లావాదేవీలు జరిపినట్లు రుజువుచేసుకోవాలని వాటి ద్వారా వచ్చే లాభాలను కూడా లెక్కలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. విదేశాల్లో ఉన్న బ్లాక్మనీ నిల్వలున్న వారు వారంతట వారే రూ. 7 వేల కోట్లు చెల్లించారని, సెప్టెంబర్, 2016 వరకు ఇన్కం డిక్లరేషన్ స్కీం ద్వారా 70 వేల కోట్లు వచ్చిందని తెలిపారు. 25 లక్షల కోట్ల జనధన్ అకౌంట్లుండగా వాటిలో రూ. 21 వేల కోట్లు వచ్చి పడ్డాయన్నారు. జనధన్ ఖాతాల ద్వారా రూ. 50 వేలు మాత్రమే వేసుకోవచ్చని అంతకు మించి డబ్బులుంటే వాటికి లెక్కచూపించాలన్నారు. -
‘ఆడారి’ నివాసంలో కొనసాగుతున్న ఐటీ రైడ్స్
విశాఖ : విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావు నివాసంపై ఆదాయ పన్ను శాఖ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఐటీ అధికారులు మూడోరోజు కూడా అడారి తులసీరావు ఇంటితో పాటు కార్యాలయాల్లోనూ సోదాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా విశాఖ డైయిరీ కార్యాలయంలో పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు ఐటీ అధికారులు చెబుతున్నారు. డెయిరీలోకి ఇతరులను అధికారులు అనుమతించడం లేదు. అలాగే విశాఖ డైయిరీ చైర్మన్ కుమార్తె, కుమారుడి ఆస్తులపైనా ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే ఇప్పటికే ఆయన కుమార్తె యలమంచిలి మున్సిపల్ చైర్పర్సన్ ఇళ్లపై మంగళవారం ఆదాయపన్ను (ఐటీ) అధికారులు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. పలుమార్లు రమాకుమారిని పట్టణంలోని ఆంధ్రాబ్యాంకుకు తీసుకెళ్లి లాకర్లను తెరిపించి తనిఖీలు చేపట్టారు. లాకర్లలో గల బంగారు నగలపై ప్రశ్నించగా గ్రామదేవతల నగలను లాకర్లలో ఉంచినట్టు చెప్పారని సమాచారం. మరోవైపు విశాఖ డెయిరీ సంస్థలపై ఆదాయ పన్నుశాఖ అధికారుల దాడులు డైరక్టర్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తించాయి. చైర్మన్ ఇంట్లో ఐటీ దాడులు జరిగాయంటూ ప్రచార సాధనాల ద్వారా తెలుసుకున్న విశాఖ డెయిరీ డైరక్టర్లు కొందరు అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలిసింది. డెయిరీ చైర్మన్కు బినామీలుగా కొందరు డైరక్టర్లు ఉన్నట్టు, ఆ కోణంలో కూడా అధికారులు కూపీ లాగుతున్నట్టు తెలిసింది. డైరక్టర్ల ఆస్తులు, వారి ఆదాయ వనరులపైనా ఆరా తీస్తున్నట్టు సమాచారం. -
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అన్నీ రికార్డులే
తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం అంగరంగ వైభవంగా ముగిశాయి. శ్రీవారి దర్శనంతో పాటు అన్ని విభాగాల్లోనూ ఆదాయం గత ఏడాది కంటే ఈ సారి సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. భక్తులకు ఆలయంలో మూలమూర్తి దర్శనం కల్పించటంతోపాటు హుండీ కానుకలు, లడ్డూ ప్రసాదాల అమ్మకం .. వంటి విభాగాల్లో భారీగా పెరుగదల కనిపించింది. విభాగం 2015 2016 పెరిగిన శాతం(%) మూలమూర్తి దర్శనం 5.75లక్షలు 7.99లక్షలు 38.85 శాతం హుండీ కానుకలు (రూ.) 17.37 కోట్లు 22.96 కోట్లు 32.20శాతం లడ్డూ ప్రసాదాల అమ్మకం 24.82లక్షలు 33.91 లక్షలు 36.63శాతం అన్నప్రసాదం 14.89 లక్షలు 24.59 లక్షలు 65.11శాతం తలనీలాలు 2.72 లక్షలు 3.83 లక్షలు 40.75శాతం రిసెప్షన్ ఆదాయం(రూ.) 1.44 కోట్లు 1.87 కోట్లు 29.59శాతం వైద్యసేవలుపొందిన భక్తులు 52,170 67,821 30 శాతం ప్రచురణల అమ్మకం(రూ.) 3.70లక్షలు 64.87 లక్షలు 16.53శాతం నీటి వినియోగం(లక్షల గ్యాలన్లు) 281.7 338.12 20.03శాతం తిరుపతి నుండి ఆర్టీసీ ప్రయాణికులు 3.75లక్షలు 4.98 లక్షలు 32.58శాతం తిరుమల నుండి ఆర్టీసీ ప్రయాణికులు4.95లక్షలు 6.95 లక్షలు 40.19శాతం -
టీడీపీ ఎమ్మెల్యే ఇళ్లలో ఐటి సోదాలు
-
'దుర్గం'లో ఐటీ దాడులు
రాయదుర్గం : రాయదుర్గంలోని వినాయక సర్కిల్ సమీపాన నివాసముంటున్న తల్లం కాశీనాథ్ అనే హోల్సేల్ వ్యాపారి ఇంట్లో గుంటూరు, తిరుపతి, గుంతకల్లుకు చెందిన ఇన్కంట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ అధికారులు మంగళవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఉదయం 8 నుంచి రాత్రి 11 గంటల వరకు సోదాలు నిర్వహించిన అనంతపురం ఐటీఓ ఎస్పీఎన్ కుమార్ మీడియాతో మాట్లాడడానికి నిరాకరించారు. మద్యాహ్నం 3 గంటలకని, 5కని, రాత్రి 9 గంటలకని విలేకర్లను తప్పుదోవ పట్టించే యత్నాలు చేశారు. చివరికి 9 గంటలకెళితే సోదాలు ఎంతసేపు పడతాయో తెలియదు అర్ధరాత్రి కావచ్చు, అంతవరకు ఉంటే చెబుతాం అంటూ సమాధానమిచ్చారు. సోదాలపై సమగ్రంగా జాయింట్ కమిషనర్ కు నివేదిక ఇస్తామని మాత్రం తెలిపారు. ఈ సోదాల్లో విశాఖపట్టణానికి చెందిన ఐటీఓ భావన్నారాయణ, ఇన్స్పెక్టర్లు వీరబాబు, కిరణ్ కుమార్, సూర్యబాబు నాయక్ పాల్గొన్నట్లు చెప్పారు. గుంటూరులో తయారయ్యే త్రిపుల్ ఎక్స్, సరిగమ సబ్బుల ఏజెన్సీ తీసుకుని, ట్యాక్స్ కట్టకుండా జీరో వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం అందడంతోనే అధికారులు దాడులు చేసినట్లు తెలుస్తోంది. -
ఆక్వా రైతులు పన్ను చెల్లించాల్సిందే
భీమవరం : ఆక్వా రంగాన్ని రైతులు వ్యవసాయరంగంగా భావిస్తూ ఆదాయపన్ను చెల్లించడం లేదని, ఇది సరిన విధానం కాదని ఆక్వా రంగం వ్యవసాయ రంగంగా పరిగణించబడదని ఇన్కంటాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ (వైజాగ్–1) బీజీ రెడ్డి స్పష్టం చేశారు. భీమవరం ఏఎస్ఆర్ సాంస్కృతిక కేంద్రంలో శుక్రవారం ఆక్వా రంగం ప్రముఖులు, రైతుల కోసం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఆదాయపన్ను చెల్లించకపోవడం వల్ల దేశాభివృద్ధి కుంటుపడుతుందన్నారు. ఆదాయపన్ను సక్రమంగా చెల్లించకుంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇబ్బందులు తప్పవన్నారు. రానున్న కాలంలో బ్లాక్మనీ వినియోగం అత్యంత కష్టమని అందువల్ల ప్రతి వ్యక్తి సంపాదనలో అర్హత మేరకు పన్నులు చెల్లించడం వల్ల ఆయా వ్యక్తులకు, సమాజానికి మేలు కలుగుతుందన్నారు. ఈ సదస్సులో ఇన్కంటాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్లు జీవీ గోపాలరావు(రాజమహేంద్రవరం), సీసీహెచ్ ఓంకారేశ్వర్(వైజాగ్–2) ఇతర అధికారులు పాల్గొన్నారు. సదస్సులో పలువురు ప్రముఖులు, రైతులు మాట్లాడారు. ఆక్వాలో నష్టాలే ఎక్కువ ఆక్వారంగంలోని రైతులంతా ఇబ్బడిముబ్బడిగా సంపాదిస్తున్నారనే ఆపోహ ప్రభుత్వ వర్గాల్లో ఉంది. పదిశాతం మంది రైతులు మాత్రమే విజయం సాధిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలు, నాణ్యమైన సీడ్ లభ్యం కాక తీవ్రంగా నష్టపోతున్నారు. దీనిని గుర్తించకుండా పన్ను పేరుతో భయబ్రాంతులకు గురిచేయడం సరికాదు. – మేకా శేషుబాబు, ఎమ్మెల్సీ, ఆక్వా రైతు వ్యవసాయ పన్ను చెల్లిస్తున్నాం రొయ్యలు, చేపల చెరువులు రైతులు నేటికీ ప్రభుత్వానికి వ్యవసాయపన్ను చెల్లిస్తున్నారు. అందువల్లనే రైతులు ఆక్వాను వ్యవసాయరంగంగా పరిగణిస్తున్నారు. అయితే ఆక్వా వ్యవసాయరంగంలోకి రాదని చెప్పడం విడ్డూరం. ఉభయగోదావరి జిల్లాల్లో ఆక్వా రంగంపై ఆధారపడి ఎక్కువ మంది ఉపాధి పొందుతున్నారు. – వి.రామచంద్రరాజు,ఆక్వా రైతుల రాష్ట్ర సంఘం అధ్యక్షుడు సరైన పన్నుల విధానం ఉండాలి పన్నుల విధానంలో చట్టసభల్లో ప్రజాప్రతినిధులు సరైన విధానాన్ని అనుసరించాలి. ఆదాయపన్నును రైతులు ఆన్లైన్ విధానంలో చెల్లించుకునే వి«ధంగా వారికి అవగాహన కల్పించాలి. ముందుగా పన్నులు చెల్లింపు విధానంపై ప్రభుత్వం ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. – ఐపీఎల్ మోహన్రాజు, ఆలిండియా ఆక్వా ఫార్మర్స్ ఫెడరేషన్ చైర్మన్ -
వీడు మాయగాడు
► ఇన్కమ్ట్యాక్స్ అధికారినంటూ అధికారులు, ప్రజాప్రతినిధుల వద్ద నగదు వసూలు ► పోలీస్స్టేషన్లోనే నివాసం.. అక్రమ వసూళ్లకు ఏకంగా ఖాకీల జీపే వినియోగం ► సర్పంచుల ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు ► కేటుగాడిది వైఎస్సార్ జిల్లా కలసపాడు మండలం గిద్దలూరు: గిద్దలూరు నియోజకవర్గంలో కస్టమ్స్, ఇన్కమ్ ట్యాక్స్ అధికారినంటూ తిరుగుతూ అధికారులు, ప్రజాప్రతినిధుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసిన నకిలీ అధికారిని పోలీసులు శనివారం అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. వివరాలు.. వైఎస్సార్ జిల్లా కలసపాడు మండలం తెల్లపాడుకు చెందిన పసుపుల ర ఫీ గిద్దలూరులో కొందరు పోలీసు అధికారులతో పరిచయాలు పెంచుకున్నాడు. తాను ఇన్కమ్ ట్యాక్స్ అధికారినంటూ కొందరికి, కస్టమ్స్ అధికారినంటూ మరికొందరికి చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. గిద్దలూరు, రాచర్ల, కొమరోలు, బేస్తవారిపేట మండలాల్లో వాహనాల్లో తిరుగుతూ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, పలువురు కాంట్రాక్టర్లు, అధికారుల వద్ద అందిన కాడికి దండుకున్నాడు.కొందరు సర్పంచుల వద్ద రూ.10 వేలు చొప్పున వసూలు చేశాడు. పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, నగర పంచాయతీ, ఇరిగేషన్, పోలీసు అధికారుల వద్ద పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడ్డాడు. డబ్బులు ఇవ్వని ప్రజాప్రతినిధులు, అధికారులపై బెదిరింపులకు దిగాడు. పోలీసులకు ఫిర్యాదు చేసిన సర్పంచులు అనుమానం వచ్చిన కొందరు సర్పంచులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటికే పోలీసుస్టేçÙన్లో ఉన్న ర ఫీని సీఐ ఫిరోజ్ అదుపులోకి తీసుకుని ఖాకీ రుచి చూపించారు. ఎన్ఎస్ఎస్లో శిక్షణ పొందానని, మరి కొన్ని రోజులు గిద్దలూరులో ఉంటానంటూ వచ్చిన ర ఫీ పోలీసులతో తిరుగుతూ వాహనాల తనిఖీలు చేసేవాడని తెలుస్తోంది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం కోసం వెళ్తున్నానని నెల రోజులు ర ఫీ ఎవరికీ కనిపించలేదు. ఆ తర్వాత గిద్దలూరు వచ్చి తనకు ఇన్కమ్ ట్యాక్స్ అధికారిగా ఉద్యోగం వచ్చిందంటూ ప్రచారం చేసుకున్నాడు. గ్రామాల్లో తిరుగుతూ నగదు వసూళ్లకు పాల్పడ్డాడు. ఏడాదిన్నరగా పోలీసుస్టేçÙన్లోనే నివాసం ఉన్నాడు. ఏకంగా పోలీసు వాహనంలోనే తిరుగుతూ అధికారులు, ప్రజా ప్రతినిధుల వద్ద దర్జాగా డబ్బులు వసూలు చేసుకున్నాడు. మండలంలోని కంచిపల్లెకు చెందిన ఓ నాయకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రఫీపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. నిందితుడిని కటకటాల వెనక్కి నెట్టినట్లు ఎస్సై రాంబాబు తెలిపారు. -
ఐటీ అధికారుల పేరుతో రూ. 17.5 లక్షల దోపిడి
కంకిపాడు: కృష్ణాజిల్లా కంకిపాడు మండలం పునాదిపాడు చెరువు కట్టపై ఇన్కంటాక్స్ అధికారుల పేరుతో కైకలూరుకు చెందిన చేపల వ్యాపారి చొక్కరపు శ్రీనివాస్ నుంచి 17.5 లక్షల రూపాయలు దోచుకెళ్లారు. ఈ సంఘటన సోమవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. శ్రీనివాస్ వ్యాపార లావాదేవీలు ముగించుకుని 17.5 లక్షల రూపాయల నగదుతో కారులో కంకిపాడు మీదుగా కైకలూరుకు బయలుదేరారు. పునాదిపాడు చెరువు కట్టపైకి వచ్చేసరికి వెనుకనుంచి ఎర్ర బుగ్గ కారు ఓవర్టేక్ చేసి వచ్చి కారును ఆపారు. తాము ఇన్కంటాక్స్ డిపార్ట్మెంట్కు చెందిన వారమని, కారును తనిఖీ చేయాలని చెప్పారు. సూట్కేసులో ఉన్న 17.5 లక్షల రూపాయలను వారు తీసుకుని , ఈ మొత్తానికి లెక్క చెప్పాల్సి ఉంటుందని... తమ వెంట వన్టౌన్ పోలీస్ స్టేషన్కు రమ్మని చెప్పారు. అనంతరం సదరు నగదు ఉన్న సూట్కేసును తీసుకుని వారు తమ కారులో బయలుదేరారు. కొద్దిదూరం వెళ్లిన తర్వాత ఎర్ర బుగ్గ ఉన్న కారు వేగం పెంచి మరోదారిలో వెళ్లి కనుమరుగయ్యారు. తాను మోసపోయానని భావించిన శ్రీనివాస్ వన్ టౌన్ సీఐకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా సదరు రహదారిలోని సీసీ కెమెరా ఫూటేజ్ లను పోలీసులు పరిశీలిస్తున్నారు. -
ఐటీ అటాక్!
సాక్షి, చెన్నై : డీఎంకేకు చెందిన కేంద్ర మాజీ మంత్రి జగద్రక్షకన్ ఆస్తులపై ఆదాయ పన్ను శాఖ గురి పెట్టింది. ఏక కాలంలో ఆ శాఖ వర్గాలు అటాక్ చేశారు. 40 చోట్ల దాడులు కొనసాగుతున్నాయి. పన్ను ఎగవేతతో ఈ దాడులు సాగుతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. డీఎంకేలో ఆర్థికంగా బలం కల్గిన నాయకుల్లో జగద్రక్షకన్ ఒకరు. ఒకప్పుడు అన్నాడీఎంకేలో రెండు సార్లు ఎంపీగా పార్లమెంట్ మెట్లు ఎక్కిన జగద్రక్షకన్ మరో రెండు సార్లు డీఎంకే తరఫున గెలిచారు. యూపీఏలో డీఎంకే కీలక పాత్ర పోషించిన వేళ సహాయ మంత్రిగా పలు శాఖలకు పనిచేశారు. రాష్ట్రంలో ఈయన ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించడం కష్టతరమే. ఆ మేరకు హోటళ్లు, ఇంజినీరింగ్, వైద్య, దంత వైద్య కళాశాలలు, భవనాలు, సంస్థల్ని కల్గి ఉన్నారు. ఆర్థిక, రాజకీయ బలం కల్గిన ఈ మాజీ మంత్రిని ఆదాయపన్ను శాఖ టార్గెట్ చేసి ఉన్నది. పన్నుల ఎగవేత ఆధారాలు తమ చేతికి చిక్కడంతో ఏకకాలంలో దాడులకు పాల్పడి ఇవన్నీ జగద్రక్షకన్ ఆస్తులా..? అన్నట్టుగా ప్రజలు విస్మయంలోపడాల్సిన పరిస్థితి. ఐటీ దాడి : రాష్ట్రంలో జగద్రక్షకన్కు నలభై చోట్ల ఆస్తులు ఉన్నట్టుగా ఆదాయ పన్ను శాఖ గుర్తించింది. బుధవారం ఉదయాన్నే నలభై బృందాలు వేర్వేరుగా రంగంలోకి దిగి, దాడులకు పాల్పడ్డాయి. అడయార్లోని ఆయన నివాసం, చెన్నై నగర శివారుల్లోని బాలాజీ మెడికల్ కళాశాల, ఠాకూర్ ఇంజినీరింగ్ కళాశాల, భారత్ వర్సిటీ, పుదుచ్చేరిలోని లక్ష్మి నారాయణ ఇంజనీరింగ్ కళాశాల, రాజీవ్ గాంధీ రోడ్డులోని అకార్డ్ హోటల్లతో పాటు నలభై చోట్ల ఉదయం నుంచి తనిఖీలు కొనసాగుతూ వస్తున్నాయి. అలాగే, జగద్రక్షకన్ మేనేజర్లుగా పేర్కొంటున్న మనోజ్, వైర కుమార్, ఇలవరసన్లతో పాటుగా మరి కొందరి ఇళ్లలోనూ దాడులు జరిగాయి. అర్ధరాత్రి వరకు ఈ దాడులు సాగడం, పన్ను ఎగవేతకు సంబంధించిన కీలక ఆధారాలు అధికారులకు చిక్కినట్టు సమాచారం. కీలక రికార్డులను, ఫైల్స్ను తనిఖీలు అనంతరం ఐటీ వర్గాలు తమ వెంట పట్టుకెళ్లి ఉన్నాయి. కాగా, డీఎంకే మాజీమంత్రి ఆస్తులపై ఐటీ గురి పెట్టిన వ్యవహారం మున్ముందు ఎలాంటి మలుపులు తిరుగుతాయో వేచి చూడాల్సిందే. ఇందుకు కారణం, డీఎంకేకు చెందిన కేంద్ర మాజీ మంత్రులు మెజారిటీ శాతం ఏదో ఒక కేసులో కోర్టుల చుట్టూ తిరుగుతున్న విషయం తెలిసిందే. -
18.5కోట్లు పట్టివేత... 32 మంది అరెస్ట్
తిరువనంతపురం: ఎన్నికల ప్రచారం మొదలైదంటే చాలు నల్లధనం ఎక్కడున్నా సరే జనాల్లోకి వస్తుంది. రాజకీయ పార్టీలు సామాన్య ప్రజలను నోట్ల కట్టలతో ప్రలోభపెడుతుంటారని ఆరోపణలు వస్తుంటాయి. ఈ విషయం తాజాగా మరోసారి కేరళ ఎన్నికల సమయంలో రుజువైంది. 18.5 కోట్ల రూపాయల నగధు స్వాధీనం చేసుకోవడంతో పాటు ఈ సొమ్మును కలిగిఉన్న కారణంగా 32 మందిని అరెస్ట్ చేసినట్లు ఆదాయపన్నుశాఖ అధికారులు మంగళవారం వెల్లడించారు. గతంలో ఎప్పుడు ఇంత సొమ్మును తక్కువ కాలంలో పట్టుకోలేదని డిప్యూటీ ఇన్ స్పెక్టర్ పి. విజయన్ తెలిపారు. మే 16న కేరళ శాసనసభకు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. పొరుగురాష్ట్రాల నుంచి కేరళకు కూడా చాలా మార్గాల్లో ధనప్రవాహం మొదలైనట్లు కనిపిస్తోందన్నారు. ఎక్కడ అనుమానితులు కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా వారిని పట్టుకుని విచారణ చేపట్టగా వారినుంచి సరైన వివరణ రానిపక్షంలోనే ఈ నగధును స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. గల్ఫ్ దేశాల నుంచి అధిక మొత్తాలలో ఈ సొమ్ము ఇక్కడికి వచ్చి చేరుతుందని అభిప్రాయపడ్డారు. మలప్పురం, పలక్కాడ్ ప్రాంతాల్లోనే ఈ హవాలా సొమ్మును అధిక మొత్తాల్లో సీజ్ చేసినట్లు చెప్పారు. అరెస్ట్ చేసిన వారిని విచారణ చేస్తున్నట్లు డిప్యూటీ ఇన్ స్పెక్టర్ తెలిపారు. -
అభ్యర్థులపై ఐటీ కన్ను
♦ అనుమానిత ప్రాంతాల్లో ఆకస్మికదాడులు ♦ 19న ఐటీ అధికారుల బృందం రాక ♦ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రాజేష్ లఖానీ వెల్లడి ఎన్నికల నగదు బట్వాడాను అరికట్టేందుకు ఇన్కంటాక్స్ అధికారులు సైతం రంగంలోకి దిగుతున్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రాజేష్ లఖానీ తెలిపారు. ఎన్నికల అధికారులతో కలిసి అనుమానిత అభ్యర్థుల ఇళ్లలో, ప్రాంతాల్లోనూ ఆకస్మికదాడులు నిర్వహిస్తారని ఆయన చెప్పారు. ఈ బృందం ఈనెల 19వ తేదీన చెన్నైకి చేరుకోనున్నట్లు వివరించారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: ఎన్నికల ఏర్పాట్లను శనివారం మీడియాకు వివరిస్తూ, సహజంగా ఎన్నికల పర్యవేక్షణలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు మాత్రమే ఉంటారని, అయితే ఈసారి ఎన్నికల్లో ఐఆర్ఎస్ అధికారులను సైతం రంగంలోకి దించుతున్నామని ఈసీ లఖానీ చెప్పారు. అభ్యర్థుల ఎన్నికల ఖర్చును లెక్కకట్టేందుకు మొత్తం 234 నియోజకవర్గాలకు ఒక్కొక్కరు చొప్పున ఐఆర్ఎస్ అధికారులను పరిశీలకులను నియమిస్తున్నామని అన్నారు. స్థానిక ప్రభావం ఉండకుం డా ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నట్లు తెలిపారు. తొలివిడతగా 12 మందితో కూడిన ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారుల బృందం ఈనెల 19వ తేదీన చెన్నై చేరుకోనుందని అన్నారు. అభ్యర్థుల ఎన్నికల ఖర్చులు, పార్టీల బహిరంగ సభలు, ఓటర్లకు నోట్ల పంపిణీపై తీవ్రస్థాయిలో దృష్టిపెడతారని తెలిపారు. అంతేగాక అధికార పార్టీలకు అనుకూలంగా వ్యవహరించే అధికారులను గుర్తించి చీఫ్ ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేస్తారని చెప్పారు. ఆదాయపు పన్నుశాఖ ప్రత్యేక విభాగం తనిఖీ కమిషనర్ ప్రసేన్జిత్ సింగ్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజీవ్లు విళుపురం, తిరుచ్చి, పుదుచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాలను పర్యవేక్షిస్తారని తెలిపారు. ఆదాయపు పన్నుశాఖ ప్రత్యేక విభాగం తనిఖీ అధికారి రాజీవ్ సిన్హా, అంజూ ఆరోరా, పీవీ రావ్ ఈ ముగ్గురు చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, తిరువణ్ణామలై, వేలూరు, కడలూరు జిల్లాలపై దృష్టి పెడతారని తెలిపారు. ఆదాయపు పన్నుశాఖ ప్రత్యేక విభాగం కమిషనర్ సునీల్శర్మ, పశండ్య, శశిభూషణ శుక్లా ఈ ముగ్గురు అధికారులు మదురై, విరుదనగర్, నెల్లై, తూత్తుకూడి, కన్యాకుమారి, శివగంగై, రామనాథపురం, దిండుగల్లు, తేనీ తదితర జిల్లాకు పరిశీలకులుగా వ్యవహరిస్తారని తెలిపారు. కోవై, నీలగిరి, ఈరోడ్డు, తిరుప్పూరు, సేలం, నామక్కల్, ధర్మపురి, కృష్ణగిరి, కరూరు జిల్లాలకు సైతం అదే స్థాయి అధికారులు వస్తున్నారని చెప్పారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో ఆదాయపు పన్నుశాఖ అధికారులు బృందంగా ఏర్పడి ఆకస్మికదాడులు నిర్వహిస్తారని అన్నారు. నగదు బట్వాడా, రహస్యంగా భద్రపరచడం వంటి ఫిర్యాదులు అందగానే దాడులు నిర్వహించి తక్షణ చర్యలు చేపడతారని తెలిపారు. ఈ అధికారులంతా నేరుగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆధీనంలో పనిచేయడం వల్ల స్థానికంగా ఎటువంటి ప్రభావానికి లోన య్యే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. నిజాయితీగా ఎన్నికలకు అనుకూలంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేయాలని డీఎంకే ఇచ్చిన విజ్ఞప్తిపై రహస్య విచారణ సాగుతోందని, విచారణ నివేదిక అందిన తరువాత బదిలీలు జరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. 40 రోజుల్లో రూ.25 కోట్లు స్వాధీనం: 40 రోజులుగా నిర్వహించిన దాడుల్లో రూ.25 కోట్లు పట్టుబడిందని చెప్పారు. అంతేగాక పెద్ద సంఖ్యలో బహుమతుల వస్తువులు, బంగారు, వెండి నగలు, మద్యం బాటిళ్లు లభ్యమైనాయని అన్నారు. అలాగే సేలంలో ఫ్లయింగ్ స్క్వాడ్ జరిపిన దాడుల్లో రూ.12 లక్షల విలువైన సిగరెట్ బండిల్స్ పట్టుబడ్డాయని తెలిపారు. సేలం సెవ్వాయ్పేటకు చెందిన మహేంద్రకుమార్ అనే వ్యక్తికి బెంగళూరు నుండి పార్శిల్ వచ్చినట్లు కనుగొన్నారు. అయితే సరుకుకు తగిన డాక్యుమెంట్లు లేకపోవడంతో రూ.12 లక్షల విలువైన ఆరు బండిళ్ల సిగరెట్ను స్వాధీనం చేసుకున్నారు. -
సీబీఐకి చిక్కిన ఆదాయపన్ను అధికారిణి
విజయవాడ: కృష్ణా జిల్లా గుడివాడ ఆదాయపన్ను శాఖ అధికారిణి లంచం తీసుకుంటూ సీబీఐ అధికారులకు పట్టుబడ్డారు. స్ధానిక ఒకటో వార్డు ఆదాయపన్ను అధికారిణి జయశ్రీ రియల్ ఎస్టేట్ వ్యాపారి జయరామ్ నుంచి రూ.1.5లక్షలు లంచం తీసుకుంటుండగా మంగళవారం సాయంత్రం సీబీఐ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అనంతరం ఆమె నివాసంలో సోదాలు చేపట్టారు. -
కాంట్రాక్టర్ ఇంటిపై ఐటీ దాడులు
పాల్వంచ: ఖమ్మం జిల్లాలో ఓ కాంట్రాక్టర్ ఇంటిపై సోమవారం ఆదాయపుపన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. పాల్వంచలోని కేఎస్పీ రోడ్డులో నివాసం ఉండే వెంకటేశ్వర్లు మూడు రాష్ట్రాల్లో పవర్ప్లాంట్లలో కాంట్రాక్టు పనులు నిర్వహిస్తుంటారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం 9 గంటల నుంచి వెంకటేశ్వర్లు ఇంటితోపాటు ఆయనకు సంబంధించిన ఆఫీసుల్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. ప్రస్తుతం దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. భారీగా ఆస్తులతో పాటు పలు కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బంగారం దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు
పార్వతీపురం : విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలోని బంగారం దుకాణాలపై గురువారం 50 మంది ఇన్కమ్టాక్స్, విజిలెన్స్ అధికారులు బృందాలుగా ఏర్పడి మూకుమ్మడిగా దాడులు జరుపుతున్నారు. కాగా ఈ తనిఖీలకు అధికారులు విలేకరులను అనుమతించలేదు. పట్టణంలో ఉన్న అన్ని బంగారం దుకాణాలపై ఈ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
సీబీఐ, ఐటీ అధికారుల ఢిష్యుం ఢిష్యుం
లక్నో: ఉత్తరప్రదేశ్ లో సీబీఐ అధికారులపై ఆదాయపన్ను శాఖ అధికారులు భౌతికదాడికి పాల్పడ్డారు. లక్నోలో ఇన్కంట్యాక్స్ అధికారిణి లంచం తీసుకుంటుండగా సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. రూ. 2 లక్షలు లంచం తీసుకుంటుండగా సీబీఐ అధికారులు ఆదాయపుపన్ను అధికారిణిని అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో ఆదాయపు పన్ను ఆఫీసులో పనిచేస్తున్న ఇతర అధికారులు సీబీఐ అధికారులపై బౌతిక దాడికి దిగారు. -
తనిఖీల్లో రూ.80 లక్షల నగదు స్వాధీనం
అఫ్జల్గంజ్: ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీల్లో భారీ మొత్తంలో నగదు, గుడుంబా పట్టుబడింది. ఈ సంఘటన నాంపల్లిలోని ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో జరిగింది. మంగళవారం నాంపల్లిలోని ఎక్సైజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హైదరాబాద్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషన్ పి. భగవాన్ రెడ్డి వివరాలు వెల్లడించారు. మల్లెపల్లిలోని నోబుల్ థియేటర్ ఎదురుగా సోమవారం రాత్రి తనిఖీలు చేస్తుండగా రాజస్థాన్కు చెందిన సునీల్శర్మ, అనిల్కుమార్ శర్మ ఆటో (ఏపీ 13ఎన్ 9741)లో ప్రయాణిస్తున్నారు. వారిని ఆపి తనిఖీ చేయగా రూ. 80.30 లక్షల నగదు లభించింది. ఇద్దరినీ ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో నగదును స్వాధీనం చేసుకున్నారు. నగదుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు చూపకపోవడంతో బషీర్బాగ్లోని ఇన్కమ్టాక్స్ అధికారులకు అప్పగించినట్టు ఆయన వెల్లడించారు. ఇదే తనిఖీల్లో ధూల్పేట్కు చెందిన సునీల్సింగ్ ద్విచక్ర వాహంపై 40 లీటర్ల గుడుంబాను తరలిస్తుండగా పట్టుకుని అతన్ని అరెస్టు చేశారు. ఈ సమావేశంలో ఎక్సైజ్ కమిషనర్ అహ్మద్ నదీమ్, ఎన్స్ఫోర్స్మెంట్ డెరైక్టర్ టి. ప్రసాద్, డిప్యూటీ కమిషన్ ఎం.ఎం.ఎ. ఫారూకీ తదితరులు పాల్గొన్నారు. -
ఐటీ షాక్
సిద్దిపేట టౌన్, న్యూస్లైన్: రియల్బూమ్లో కోట్లు సంపాదించినా, సర్కార్కు పన్ను కట్టని వ్యాపారులపై ఇన్కంటాక్స్ అధికారులు దృష్టి సారించారు. ఇప్పటికీ ఇలాంటి వారి జాబితాను సిద్ధం చేసుకున్న ఐటీ అధికారులు మంగళవారం సిద్దిపేటలోని రియల్ ఎస్టేట్ వ్యాపారి సోమసుందరయ్య ఇంటిపై దాడి చేశారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ సోదాలు నిర్వహించారు. సోమసుందరయ్య సిద్దిపేటతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో విలువైన ఆస్తులను కొనుగోలు చేసిన నేపథ్యంలో ఆయా భూముల పత్రాలను పరిశీలించారు. ఆయన ఐటీ శాఖకు సమర్పించని సమాచారాన్ని పకడ్బందీగా సేకరించారు. సిద్దిపేట ఇన్కం టాక్స్ ఆఫీసర్ పద్మలత నేతృత్వంలో హైదరాబాద్కు చెందిన ఐటీ శాఖ ప్రతినిధులు సోదాల్లో పాల్గొన్నారు. సోమసుందరయ్య ఇంట్లోని ఆస్తుల డాక్యుమెంట్లను, ఇతర ఆస్తుల వివరాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వివిధ రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. నిమిషాల్లోనే ఈ వార్త బయటకు పొక్కడంతో స్థానిక రియల్ ఎస్టేట్ వ్యాపారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తమకు తెలిసిన అధికారులతో సమాచారం తెలుసుకునే పనిలో పడ్డారు. గత నెల ఫెర్టిలైజర్ షాపులపై దాడులు చేసిన ఐటీ అధికారులు, ఇపుడు రియల్ ఎస్టేట్ వ్యాపారులపై దృష్టి సారించడంతో స్థానికులంతా ఇదే విషయాన్ని చర్చించుకుంటున్నారు. ఐటీ అధికారులు మాత్రం ఐటీశాఖకు లెక్కలు చూపకుండా పన్ను ఎగ్గొట్టిన రియల్ఎస్టేట్ వ్యాపారులపై మున్ముందు దాడులు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. -
తమిళ చిత్ర పరిశ్రమ ప్రముఖుల ఇళ్లపై ఐటీ దాడులు
ఆదాయపన్ను శాఖ అధికారులు తమిళ చిత్ర పరిశ్రమ ప్రముఖుల ఇళ్లపై గురువారం మెరుపు దాడులు చేశారు. చెన్నైలో ఒకే సమయంలో 29 మంది నిర్మాతలు, నటుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. తెలుగులో పలు చిత్రాలు నిర్మించిన ఏఎమ్ రత్నం, ఆర్బీ చౌదరి ఇళ్లను ఐటీ అధికారులు తనిఖీ చేశారు. జ్ఞానవేలు రాజా, హాస్య నటుడు సంతానం తదితర ప్రముఖల ఇళ్లు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేశారు. ఒకేసారి ఇంతమంది ప్రముఖల ఇళ్లను సోదా చేయడం గమనార్హం. దాడులకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సివుంది.