తెనాలి రూరల్(గుంటూరు): గుంటూరు జిల్లా తెనాలి పట్టణ పరిధిలో పేకాట శిబిరంపై ఆదివారం సాయంత్రం పోలీసులు దాడి చేశారు. వివరాలు...పినపాడు సమీపంలోని పొలాల్లో పేకాట ఆడుతున్న బృందంపై ఎస్సై రవీంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన దాడిలో 9 మందిని అరెస్టు చేశారు. పోలీసులు వారి నుంచి రూ.35 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.