నగరంలోని నేరెడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరాలపై ఎస్వోటీ పోలీసులు గురువారం దాడి చేశారు.
హైదరాబాద్ : నేరెడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరాలపై ఎస్వోటీ పోలీసులు గురువారం దాడి చేశారు. ఈ సందర్భంగా 10 మంది పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 1.57 లక్షల నగదుతోపాటు 10 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.