ఐకేపీ అధికారుల నిర్బంధం
Published Wed, Dec 11 2013 3:33 AM | Last Updated on Sat, Sep 29 2018 6:00 PM
మధిర, న్యూస్లైన్: మండలంలోని మాటూరు ఎస్సీ కానీ లో ఐకేపీ అధికారులను గ్రామస్తులు మంగళవారం రాత్రి నిర్బంధించారు. అవకతవకలకు పాల్పడుతున్న గ్రామదీపిక వెంకట్రావమ్మ ఎందుకు తొలగించడం లేదంటూ గ్రామంలో నిర్వహించిన సమావేశం సందర్భంగా ఏపీఎం సురేంద్రబాబు, సీసీ చలమయ్యను నిలదీశారు. శ్రీనిధి, డ్వాక్రా రుణాలు, పలువురు విద్యార్థుల స్కాలర్షిప్లను గ్రామదీపిక వాడుకుందని, ఆమెను తొలగించాలని కొంతకాలంగా ఐకేపీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. గ్రామదీపిక వెంకట్రావమ్మను తాత్కాలికంగా తొలగిస్తున్నామని ఏపీఎం సురేంద్రబాబు ప్రకటించడంతో గ్రామస్తులు శాంతించారు. అదేవిధంగా నూతన వీవోను ఎన్నుకున్నట్లు మెజార్టీ సభ్యుల తీర్మానంచేసి పంపితే గ్రామదీపిక గా పరిగణిస్తామని చెప్పారు. ఐకేపీ అధికారులను నిర్బంధించిన విషయాన్ని తెలుసుకున్న మధిర రూరల్ ఏఎస్సై చిట్టిమోదు వెంకటేశ్వర్లు అక్కడికి చేరుకుని బందోబస్తు చేపట్టారు.
Advertisement
Advertisement