
ఆంధ్రప్రదేశ్:
►అమరావతి: నేడు ఎంస్ఎంఈలకు రెండో విడత బకాయిలు విడుదల
♦క్యాంప్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా..
కార్యక్రమాన్ని ప్రారంభించి లబ్ధిదారులతో మాట్లాడనున్న సీఎం జగన్
♦లాక్డౌన్తో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఎంస్ఎంఈలు గట్టెక్కేందుకు..
తిరిగి కంపెనీలు ప్రారంభమయ్యేలా ఏపీ ప్రభుత్వం చర్యలు
♦గత ప్రభుత్వం చెల్లించని బకాయిలను నేరుగా ఎంఎస్ఎంఈల ఖాతాల్లో జమ
♦రీస్టార్ట్ కార్యక్రమం ద్వారా ఏపీలో పారిశ్రామికాభివృద్ధికి ఊతమిస్తున్న ప్రభుత్వం
►తిరుమల: నేటి నుంచి ఆన్లైన్లో జులై నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు
♦టీటీడీ వెబ్సైట్లో ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు
♦రోజుకు 9వేల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఇవ్వనున్న టీటీడీ
♦జులై సర్వదర్శనం టోకెన్లను రేపట్నుంచి ఇవ్వనున్న టీటీడీ
♦తిరుపతి భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణునివాసంలో సర్వదర్శనం టోకెన్లు
♦రోజుకు 3 వేలు చొప్పున సర్వదర్శనం టోకెన్లు
►తూర్పుగోదావరి: నేడు ఏజెన్సీ ప్రాంతాల్లో మంత్రి అనిల్కుమార్ పర్యటన
♦పోలవరం ఆర్అండ్ఆర్ కాలనీలను సందర్శించనున్న మంత్రి అనిల్
♦అనంతరం రంపచోడవరం ఐటీడీఏ అధికారులతో సమీక్షా సమావేశం
తెలంగాణ:
►హైదరాబాద్లో కేంద్ర బృందం పర్యటన
♦తెలంగాణలో కరోనా కట్టడి చర్యల పర్యవేక్షణ
♦నేడు ఉదయం 7 గంటల నుంచి 9 వరకు ఏదైనా కంటైన్మెంట్ క్లస్టర్ పరిశీలన
♦అనంతరం టీఎస్ సీఎస్, ఆరోగ్యశాఖ అధికారులతో భేటీ
♦గాంధీ ఆస్పత్రిని సందర్శించనున్న కేంద్ర బృందం
♦తర్వాత టిమ్స్ ఆస్పత్రికి వెళ్లనున్న కేంద్ర బృందం
►హైదరాబాద్: సచివాలయాల భవనాల కూల్చివేతపై నేడు తుది తీర్పు
♦పాత సచివాలయం కూల్చివేత సవాల్ పిటిషన్లపై ఇప్పటికే హైకోర్టు విచారణ
♦నేడు తుది తీర్పు వెల్లడించనున్న తెలంగాణ హైకోర్టు
Comments
Please login to add a commentAdd a comment