హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో శుక్రవారం రిటైల్ వ్యాపార సంస్థల ప్రతినిధులు భేటీ అయ్యారు. ఏపీలో రిటైల్ వ్యాపార సంస్థల ఏర్పాటు అంశంపై వారు సీఎంతో చర్చించారు. చంద్రబాబు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు అంతర్జాతీయ బ్రాండింగ్ ఇవ్వాలని రిటైలర్లను కోరారు. అలాగే యువతీ, యువకులకు రిటైల్ రంగంలో శిక్షణ కోసం నైపుణ్యాల అభివృద్ధికి కార్పొరేట్ సంస్థలు సహకారం అందించనున్నాయి. కాగా ఈ సమావేశంలో వాల్మార్ట్, రిలయన్స్, ఐటీసీతో పాటు పలు రిటైల్ వ్యాపార సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
చంద్రబాబుతో రిటైల్ వ్యాపార సంస్థల ప్రతినిధుల భేటీ
Published Fri, Jan 2 2015 1:45 PM | Last Updated on Tue, Aug 14 2018 3:48 PM
Advertisement
Advertisement