బంగారం మెరుగుపెడతామని దోపిడి | robbers attack on women in prakasam district | Sakshi
Sakshi News home page

బంగారం మెరుగుపెడతామని దోపిడి

Published Tue, Mar 15 2016 2:21 PM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

robbers attack on women in prakasam district

కొనకలమెట్ల : ప్రకాశం జిల్లా కొనకలమిట్ల మండలం పెదారిగట్ల గ్రామంలో దోపిడీ జరిగింది. బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బంగారం మెరుగుపెడతామని చెప్పి ఓ ఇంట్లో దూరారు. మాకు ఎలాంటి మెరుగు అవసరం లేదని సదరు మహిళ చెప్పడంతో వెంటనే దుండగులు తెచ్చుకున్న స్ప్రేను ఆమె కళ్లలో చల్లారు. తేరుకునేలోపే మహిళ మెడలో ఉన్న 3 సవర్ల బంగారు గొలుసుతో ఉడాయించారు. సంఘటన జరిగినప్పుడు ఆమె ఒక్కటే ఇంట్లో ఉంది. భర్త పొలానికి వెళ్లాడు.బాధితురాలు రజిత(27) ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement