మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని చంద్రశేఖర్ జ్యువెలర్స్లో మంగళవారం ఉదయం చోరీ జరిగింది. చెవి పోగులు కొనేందుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు దుకాణం యజమాని కళ్లు కప్పి రూ. 2.50 లక్షల విలువైన 7 బంగారు గొలుసులను తీసుకుని పరారయ్యారు. ఆలస్యంగా గమనించిన దుకాణం యజమాని నారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
బంగారు దుకాణంలో చోరీ
Published Tue, Dec 15 2015 12:48 PM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM
Advertisement
Advertisement