
డాక్టర్ మిత్రా
హైదరాబాద్: తెలుగుజాతి ద్రోహులను తరిమితరిమి కొట్టండని డాక్టర్ మిత్రా పిలుపు ఇచ్చారు. ఇందిరా పార్కు వద్ద తెలుగు ప్రజా వేదిక ఆధ్వర్యంలో సమైక్య రాష్ట్రం కోసం దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ మిత్రా మాట్లాడుతూ అసెంబ్లీలో జరుగుతున్న చర్చతో ఎలాంటి లాభంలేదని చెప్పారు. ఓటుతో వారికి జవాబు ఇవ్వండని చెప్పారు.
డాక్టర్ మిత్రా మొదటి నుంచి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా, సమైక్యాంధ్రకు మద్దతుగా నిలిచారు.