రాజమండ్రిలో యువతిపై సామూహిక అత్యాచారం | Woman Gang Rape in Rajahmundry | Sakshi
Sakshi News home page

రాజమండ్రిలో యువతిపై సామూహిక అత్యాచారం

Published Thu, Jun 19 2014 7:13 PM | Last Updated on Sat, Sep 2 2017 9:04 AM

రాజమండ్రిలో యువతిపై సామూహిక అత్యాచారం

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి నగరంలోని లాలాచెరువు సమీపంలో గురువారం దారుణం జరిగింది. పని కోసం రాజమండ్రి వచ్చిన ఓ యువతిని పలువురు యువకులు మాయమాటలు చెప్పి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆ యువకులు అక్కడి నుంచి పరారైయ్యారు. దాంతో ఆ యువతి జరిగిన విషయాన్ని స్థానికులకు వెల్లడించింది.

 

స్థానికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఆ యువతిని పోలీసులు స్టేషన్కు తరలించారు. నిందితుల వివరాలు సేకరించి వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం ఆ యువతిని వైద్య పరీక్షల నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement