ప్రజల సంక్షేమం కోసం అలుపెరగకుండా పోరాడుతున్న వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలని వైఎస్ఆర్సీఎల్పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు.
ఒంగోలు, న్యూస్లైన్: ప్రజల సంక్షేమం కోసం అలుపెరగకుండా పోరాడుతున్న వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలని వైఎస్ఆర్సీఎల్పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. స్థానిక మంగమూరు డొంకలోని అతిథి గృహంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి సేవా భావాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు నిత్యం ప్రజలతో మమేకమై.. వారి సమస్యలు తెలుసుకోవాలని తెలిపారు. స్వార్థ రాజకీయాలతో రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసేందుకు అధికార కాంగ్రెస్ పార్టీతోపాటు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చేస్తున్న యత్నాలను అడ్డుకుంటూ జగన్మోహన్రెడ్డి చేస్తున్న పోరాటం చారిత్రాత్మకమైనదన్నారు. ఒక లక్ష్యం కోసం నిరంతరం శ్రమిస్తున్న ఆయన తన తండ్రి ఆశయాలను, ఆయన అందించిన సంక్షేమ ఫలాలను ప్రజలకు చేర్చుతారని ప్రతి ఒక్కరూ విశ్వసిస్తున్నారన్నారు. అనంతరం కేక్ను కట్ చేసి పంచిపెట్టారు.
వచ్చే ఏడాది సీఎం జగన్ కేక్ను కట్ చేద్దాం: ఎల్లసిరి గోపాలరెడ్డి
జగన్మోహన్రెడ్డిని సీఎం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని బాపట్ల పార్లమెంటరీ పార్టీ పరిశీలకుడు ఎల్లసిరి గోపాలరెడ్డి పిలుపునిచ్చారు. జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజును పురస్కరించుకొని పార్టీ జిల్లా కార్యాలయంలో కేక్ను కట్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఏడాది సీఎం జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు వేడుకలను నిర్వహించాలన్నారు. పార్టీ నగర కన్వీనర్ కుప్పం ప్రసాద్ మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా అధికారప్రతినిధి నరాల రమణారెడ్డి మున్సిపల్ పారిశుధ్య మహిళా కార్మికులకు చీరెలు పంపిణీ చేశారు.
స్థానిక కరువది వారి వీధిలో ఉన్న వృద్ధాశ్రమంలో మహిళా విభాగం నగర కన్వీనర్ కావూరి సుశీల చీరెలు పంపిణీ చేశారు. స్థానిక మాతాశిశు వైద్యశాలలో రోగులకు కుప్పం ప్రసాద్ పండ్లు పంపిణీ చేశారు. గిద్దలూరుకు చెందిన ఐవీ రెడ్డి వర్గీయులు జగన్ పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక బ్రోచర్లను పంపిణీ చేశారు.
కార్యక్రమాల్లో జిల్లా అధికార ప్రతినిధులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, కొఠారి రామచంద్రరావు, ప్రచార విభాగం జిల్లా కన్వీనర్ వేమూరి సూర్యనారాయణ(బుజ్జి), గ్రామీణ పరిశ్రమలు, ఉపాధి విభాగం జిల్లా కన్వీనర్ బొగ్గుల శ్రీనివాసరెడ్డి, బీసీ సెల్ జిల్లా కన్వీనర్ కఠారి శంకర్, ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ కంచర్ల సుధాకర్, మహిళా విభాగం జిల్లా కన్వీనర్ పోకల అనూరాధ, రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులు సూరాపాండు రంగారెడ్డి, యువజన విభాగం జిల్లా అధికార ప్రతినిధి చిన్నపురెడ్డి అశోక్రెడ్డి, నగర అధికార ప్రతినిధి రొండా అంజిరెడ్డి, వివిధ విభాగాల నగర కన్వీనర్లు యరజర్ల రమేష్, బొప్పరాజు కొండలు, నెరుసుల రాము, ముదివర్తి బాబూరావు, స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎస్వీ రమణయ్య, దుగ్గిరెడ్డి ఆంజనేయరెడ్డి, తోటపల్లి సోమశేఖర్, జాజుల కృష్ణ, స్వరూప్, గోపాలరెడ్డి, రాయని వెంకట్రావు, ఓబుల్రెడ్డి, దుగ్గిరెడ్డి ఆంజనేయరెడ్డి, దేవరపల్లి అంజిరెడ్డి, మీరావలి, అంకయ్య, కండే రమణయాదవ్, మాజీ కౌన్సిలర్లు గోపీ, వెలనాటి మాధవ్, వర్థు శేషయ్య, కావూరిసుశీల, పోకల అనూరాధ, గంగాడ సుజాత, బడుగు ఇందిర, బత్తుల ప్రమీల, లక్ష్మి, ప్రభావతి, సింగరాజు వెంకట్రావు, మేకల అంజిరెడ్డి పాల్గొన్నారు.