
ముడిపట్టు రాయితీ బకాయిలు చెల్లించాలంటూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో 37 రోజులుగా దీక్షలు కొనసాగుతున్నాయి. అయినా ప్రభుత్వంలో చలనం కరువయింది. ఈ నేపథ్యంలో వీరికి అండగా నిలిచేందుకు.. ఆత్మస్థైర్యం నింపేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహనరెడ్డి మంగళవారం ధర్మవరం రానున్నారు. చేనేతల ఇబ్బందులను స్వయంగా తెలుసుకుని మొద్దునిద్రలోని చంద్రబాబు ప్రభుత్వాన్ని మేల్కొలిపే ప్రయత్నం చేయనున్నారు.