dharmavaram
-
సత్యసాయి జిల్లా ధర్మవరంలో టీడీపీ, బీజేపీ నేతల కుమ్ములాట
-
పట్టు చీరల వనం.. ధర్మవరం
సాక్షి, పుట్టపర్తి : మగువలు మెచ్చే పట్టు చీరలు.. వివాహం కోసం ప్రత్యేకంగా చీరలు, ఫంక్షన్లలో స్పెషల్ లుక్కుతో ఆకట్టుకునే డిజైన్లు తయారీలో ధర్మవరం నేతన్నలు ఆరితేరిపోయారు. తరతరాలుగా మగ్గాల పైనే తమ నైపుణ్యాన్ని రంగరించి రకరకాల పట్టుచీరలు తయారు చేస్తున్నారు. సింగిల్ త్రెడ్, డబుల్ త్రెడ్, వెండి జరీ, బంగారు జరీ చీరలు, జాకాడీ డిజైన్లతో అత్యద్భుతంగా నేసి వినియోగదారులను ఆకట్టుకుంటున్నారు. ధర్మవరంలో తయారయ్యే పట్టుచీరలు హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, చెన్నైతో పాటు విదేశాలకు సైతం ఎగుమతి అవుతున్నాయి. రాష్ట్రంలో 28 వేల మగ్గాలు ఉన్న ఏకైక ప్రాంతంగా ధర్మవరం పట్టణం ప్రథమ స్థానంలో నిలుస్తోంది. ఇక్కడి పట్టు మార్కెట్లో సగటున వారానికి రూ.100 కోట్ల వరకు పట్టుచీరల వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి. ధర్మవరం పట్టణ విశిష్టతను గుర్తించి భారత ప్రభుత్వం ధర్మవరం పట్టుచీరకు భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఇండికేషన్)ను ఇవ్వడం నేతన్నల ప్రతిభకు గర్వ కారణంగా చెప్పవచ్చు. శ్రీసత్యసాయి జిల్లాలో ధర్మవరంతో పాటు కొత్తచెరువు, గోరంట్ల, బుక్కపట్నం, సోమందేపల్లి, పెనుకొండ, హిందూపురం ప్రాంతాల్లోనూ మగ్గాలు ఉన్నాయి. ధర్మవరంలో మగ్గాలతో పాటు 18 చేనేత అనుబంధ రంగాల ద్వారా సుమారు లక్ష మంది ఉపాధి పొందుతున్నారు. ఫ్యాషన్ ప్రపంచానికి దీటుగా డిజైన్లు మారుతున్న ఫ్యాషన్ ప్రపంచానికి దీటుగా ధర్మవరంలోని డిజైనర్లు ఎప్పటికప్పుడు కొత్తరకాల డిజైన్లు రూపొందిస్తున్నారు. ధర్మవరంలో పట్టుచీరల డిజైన్లు రూపొందించడంలో సుమారు వందమంది మంచి నైపుణ్యం సంపాదించారు. వివాహాలు, ఇతర శుభకార్యాల దగ్గర నుంచి సినీ మోడళ్లు, సెలబ్రిటీల వరకు వినూత్న డిజైన్లను తయారు చేస్తున్నారు. ఒక్కో పట్టు చీర రూ.5 వేల నుంచి రూ.10 లక్షల వరకు ధర ఉంటుంది. బంగారం తాపడంతో పట్టుచీరలు తయారు చేయడం ధర్మవరం నేతన్నల ప్రత్యేకం. విదేశాలకు ఎగుమతులు ధర్మవరంలో తయారైన పట్టుచీరలు ఇతర రాష్ట్రాలతో పాటు అమెరికా, సౌదీ అరేబియా, న్యూజిలాండ్ తదితర దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. రాష్ట్రంలో తయారైన పట్టుచీరలకు ధర్మవరం పట్టుమార్కెట్ ప్రధానం. ధర్మవరం పట్టణంలో సుమారు రెండు వేల పట్టుచీరల దుకాణాలు ఉన్నాయి. ఈ సిల్క్ షాపుల ద్వారా నేతన్నల వద్ద పట్టుచీరలను కొనుగోలు చేసి, ఆపై షోరూంలకు హోల్సేల్గా ఎగుమతి చేస్తారు. వారానికి రూ.వంద కోట్ల వ్యాపారం సగటున ధర్మవరం నేసేపేటలోని మార్కెట్లో వారానికి రూ.100కోట్ల వరకు వ్యాపార లావాదేవీలు జరుగుతాయని అంచనా. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ధర్మవరం పట్టణాన్ని, చేనేత రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలని నేతన్నలు కోరుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆదరణ కరువైందని.. గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ఏటా నేతన్న నేస్తం పథకం కింద ఏటా రూ.24వేల లబ్ధి చేకూరేదని వివరించారు. ధర్మవరం పట్టుచీరకు భౌగోళిక గుర్తింపు ధర్మవరం నేతన్న ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వం గత 2014లో ధర్మవరం పట్టుచీరలు, పావుడాలకు భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఇండికేషన్) ఇచి్చంది. దీని ద్వారా ధర్మవరం పట్టుచీర డిజైన్లు ఎక్కడా తయారు చేయకూడదు. ఒక వేళ ఇతరప్రాంతాల్లో ధర్మవరం నేతన్నల డిజైన్లు నేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.విమానాశ్రయం వస్తే బాగుంటుంది శ్రీసత్యసాయి జిల్లా ఏర్పాటు తర్వాత ధర్మవరంలో చేనేత రంగం మరింత వృద్ధి చెందింది. అయితే పుట్టపర్తిలో విమానాశ్రయం ఆధునీకరించి.. ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తే.. వివిధ దేశాలకు పట్టుచీరల ఎగుమతులు సులభమవుతాయి. మన దేశ పట్టును ప్రపంచ స్థాయికి తీసుకెళ్లవచ్చు. ఫలితంగా వ్యాపారం మరింత ఊపందుకుంటుంది. – రంగన శ్రీనివాసులు, పట్టుచీరల వ్యాపారి, ధర్మవరం ఆధునిక ఫ్యాషన్కు అనుగుణంగా డిజైన్లు ప్రస్తుత ఫ్యాషన్ పోటీ ప్రపంచంలో మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త డిజైన్లు ఎప్పటికప్పుడు రూపొందిస్తున్నాం. మేము తయారు చేసే చీరలు దేశంలోని ఇతర రాష్ట్రాలకే కాక, ఎక్కువగా అమెరికా, సౌదీ దేశాలకు పంపుతుంటాం. పట్టుచీరల్లో నేను తయారు చేసిన డిజైన్లకు రాష్ట్ర స్థాయిలో రెండు, జాతీయ స్థాయిలో ఒక అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది. – నాగరాజు, క్లస్టర్ డిజైనర్, ధర్మవరంగణాంకాలు ఇలా... చేతి మగ్గాలు : 28 వేలు పట్టుచీరల దుకాణాలు : 2వేలు మగ్గాలపై ఆధారపడ్డ కుటుంబాలు : 30 వేలు మగ్గాల ద్వారా లబ్ధి పొందుతున్న వారు : లక్ష మంది అనుబంధ రంగాల ద్వారా : మరో 20 వేల మందికి ఉపాధి రోజుకు పట్టుమార్కెట్ సగటు టర్నోవర్ : రూ.7 కోట్లు శుభకార్యాల సీజన్లో వారంలో పట్టుచీరల లావాదేవీలు : రూ.100 కోట్లు -
ధర్మవరంలో ఉద్రిక్తత.. టీడీపీ-బీజేపీ నేతల మధ్య ఘర్షణ
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: ధర్మవరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ- బీజేపీ నేతల మధ్య ఘర్షణ జరిగింది. మంత్రి సత్యకుమార్ సమక్షంలో బీజేపీలో చేరేందుకు మైనార్టీ నేత జమీన్ సిద్ధమవ్వగా, జమీన్ చేరికను టీడీపీ ఇంఛార్జ్ పరిటాల శ్రీరామ్ వ్యతిరేకిస్తున్నారు. దీంతో మైనార్టీ నేత జమీన్ ఫ్లెక్సీలను పరిటాల శ్రీరామ్ వర్గీయులు చించివేశారు. ఈ క్రమంలో టీడీపీ- బీజేపీ నేతల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఈ ఘటనలో రెండు స్కార్పియో వాహనాలు, మూడు బైకులు ధ్వంసమయ్యాయి. ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు.మరో వైపు, సామాన్యులపై కూడా టీడీపీ నేతల అనుచరులు రెచ్చిపోతున్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ప్రధాన అనుచరుడు దాదు.. శివమాలధారణలో ఉన్న బలిజ శ్రీనివాసులు అనే ఆటోడ్రైవర్పై అకారణంగా దాడి చేసిన సంగతి తెలిసిందే. కాళ్లతో తన్నుతూ అవమానించాడు. ఈ ఘటన శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో శనివారం చోటు చేసుకుంది.బాధితుడి కథనం మేరకు.. పెనుకొండ దర్గాపేటకు చెందిన దాదు కారులో వస్తూ స్థానిక దర్గా సర్కిల్లో అతని ఫ్లెక్సీకి ఎదురుగా శ్రీనివాసులు ఆటో నిలిపి ఉండటాన్ని గమనించాడు. వెంటనే ఆటో పక్కన పెట్టాలని హూంకరించాడు. ఆటో పక్కన పెడతానని అతను చెబుతుండగానే.. దాదు ఆగ్రహంతో ఊగిపోతూ ‘లం.. కొడకా’ అని దూషిస్తూ చెప్పుల కాలితో తన్నుతూ దాడి చేశాడు. అక్కడున్న వారు సముదాయించినా అతను వినకుండా విచక్షణారహితంగా కొట్టాడు.సమాచారం అందుకున్న బలిజ సంఘం, వీహెచ్పీ నాయకులు అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు. వివాదం ముదరడంతో డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ రాఘవన్.. వివిధ మండలాల ఎస్ఐలను రప్పించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ రత్న, ఏఎస్పీ శ్రీనివాసులు, ఆర్డీవో ఆనంద్కుమార్ పెనుకొండ చేరుకున్నారు. వివాదాన్ని సద్దుమణచడానికి ప్రయత్నించినా ఆందోళనకారులు శాంతించలేదు. ఇదీ చదవండి: బరితెగించిన టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి అనుచరులు -
బాబు బాదుడుపై ధర్మవరం YSRCP నేతలు పోరుబాట
-
ధర్మవరంలో కూటమి నేతల బరితెగింపు, కరెంట్ తీగలతో..
సాక్షి, సత్యసాయి జిల్లా: మంత్రి సత్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మవరం నియోజకవర్గంలో రాజకీయ కక్షలు బయటపడ్డాయి. వైఎస్సార్ సీపీ నేత, ఉమ్మడి అనంతపురం జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డి హత్య కుట్ర భగ్నమైంది.కాంపౌండ్ వాల్ ఐరన్ డోర్కు విద్యుత్ తీగలు వేసిన టీడీపీ కూటమి నేతలు.. డోర్ తాకిన వెంటనే కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డి చనిపోయేలా పన్నాగం పన్నారు. అయితే 33కేవీ విద్యుత్ తీగలకు బదులుగా.. ఫైబర్ కేబుల్కు కనెక్షన్ ఇవ్వడంతో ప్రమాదం తప్పింది. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి ప్రధాన అనుచరుడిగా కామిరెడ్డిపల్లి సుధాకర్రెడ్డి వ్యవహరిస్తున్నారు. కామిరెడ్డిపల్లి పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.కాగా, కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత టీడీపీ నేతల దౌర్జన్యాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్ట్లను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారు. అక్కడితో ఆగకుండా బాధితులపైనే కేసులు బనాయిస్తున్నారు. తాజాగా ఆదివారం రాత్రి పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువులో నిత్యం రద్దీగా ఉండే వైఎస్సార్, నెహ్రూ సర్కిళ్లతో పాటు ధర్మవరం బస్టాండ్ ప్రాంతంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులపై టీడీపీ గూండాలు మూకుమ్మడిగా దాడి చేశారు. పోలీసులు చూస్తుండగానే... కొడపగానిపల్లికి చెందిన వినోద్కుమార్రెడ్డి, నరేంద్రరెడ్డి, హరిపై అకారణంగా కాళ్లతో, కర్రలతో విరుచుకు పడ్డారు. కొత్తచెరువుకు చెందిన టీడీపీ ముఖ్య నేత శ్రీనివాసులు ప్రత్యక్షంగా దాడుల్లో పాల్గొన్నట్లు బాధిత కార్యకర్తలు వాపోయారు. కొత్తచెరువు మండలం కొడపగానిపల్లికి చెందిన సోషల్ మీడియా కార్యకర్త ఈడిగ మారుతి రెండు రోజుల క్రితం సోషల మీడియాలో ఓ పోస్టును పెట్టారు. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ తీర్చిదిద్దిన ప్రభుత్వ బడి ఫొటోతో పాటు ఇటీవల ‘బడి వైన్స్’ పేరుతో తిరుపతిలో ప్రారంభించిన మద్యం దుకాణం ఫొటోను జతపరుస్తూ పోస్టు చేశారు. ఇందులో తప్పిదం ఏమీ లేకపోయినా... సీఎం చంద్రబాబు మద్యం పాలసీని తప్పు బట్టారని, ఆ పోస్టును తొలగించకపోతే కేసు పెడతామని స్థానిక టీడీపీ నేత శివయ్య బెదిరింపులకు దిగాడు. అంతటితో ఆగకుండా విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. అయితే ఇంత చిన్న విషయాన్ని రచ్చ చేయరాదని, కేసులు.. గీసులు ఏమీ వద్దని పోలీసులు నచ్చచెప్పారు. అదే సమయంలో ప్రశాంత మైన గ్రామంలో వర్గ కక్షలు ఉండరాదని భావించిన మారుతి కూడా ఆ పోస్టును తొలగించాడు. దీంతో అప్పటికి సమస్య సద్దుమణిగిందనుకున్నారు. అయినా కక్ష కట్టిన శివయ్య... మారుతి పోస్టును స్క్రీన్ షాట్ తీసి ఆదివారం కొత్తచెరువు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఒత్తిళ్లను తాళలేక మారుతిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విషయం తెలుసుకున్న కొడపగానిపల్లికి చెంది వైఎస్సార్సీపీ నాయకులు వినోద్కుమార్రెడ్డి, నరేందర్రెడ్డి, హరి... కొత్తచెరువు పోలీస్ స్టేషన్కు చేరుకుని మారుతీకి స్టేషన్ బెయిల్ ఇచ్చే విషయంగా పోలీసులతో చర్చించి ఆదివారం రాత్రి బయటకు వచ్చారు.ఈ విషయం తెలుసుకున్న టీడీపీ ముఖ్య నేత శ్రీనివాసులు తన అనుచరులతో కలసి పథకం ప్రకారం కొత్తచెరువులోని ప్రధాన కూడళ్లలో వీధి లైట్లను ఆఫ్ చేయించి వినోద్కుమార్రెడ్డి, నరేందర్రెడ్డి, హరిపై దాడికి తెగబడ్డారు. చెప్పులు, కర్రలు, ముష్టిఘాతాలతో విరుచుకుపడ్డారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన హరి అనంతపురంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మిగిలిన ఇద్దరికి మూగ దెబ్బలయ్యాయి. ఘటనపై బాధితులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం మారుతిని సోమవారం పోలీసులు వదిలేశారు. -
ఇదో రకం పిచ్చి..!
డోన్: కొందరు యువకుల చేష్టలు విపరీత అనర్థాలకు దారితీస్తున్నాయి. ద్విచక్రవాహనాల నంబర్ ప్లేట్ల స్థానంలో ఫలానా తాలుకా అంటూ బోర్డులు తగిలించుకోవడం.. ఏదో గనకార్యం చేసినట్లు దూసుకుపోవడం ప్యాషన్గా భావిస్తున్నారు. ఇటీవల కాలంలో పలువురు రాజకీయ నాయకులకు సంబంధించిన పేర్లు వేసుకుని తిరగడం ఎక్కువయ్యాయి. డోన్ పట్టణంలో కొందరు సీడ్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డి తాలుకా అని, మరికొందరు పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు తాలుకా అని, ఇంకొందరు కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్ తాలుకా అని నేమ్ప్లేట్లు రాయించుకుని రోడ్లపై హల్చల్ చేస్తున్నారు. ఈ వాహనాలకు రిజి్రస్టేషన్ నంబర్లు ఉండేచోట ఫలానా వ్యక్తి తాలుకా అని తాటికాయ అంత అక్షరాలతో రాసుకుని తిరుగుతుండటంపై ప్రజలు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. ఇలాంటి వెర్రి మరింత ముదిరిపోకముందే పోలీసు, ఆర్టీఓ అధికారులు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు. -
ఇదీ చంద్రబాబు సర్కార్ డొల్లతనం
సాక్షి, ధర్మవరం: శ్రీ సత్యసాయి జిల్లాలో చంద్రబాబు సర్కార్ డొల్లతనం బయటపడింది. బెల్టు షాపులకు ఐదు లక్షల జరిమానా విధించాలంటూ సీఎం చంద్రబాబు చెబుతుంటే.. ధర్మవరంలో మాత్రం డబ్బులు తీసుకుని బెల్ట్ షాపులకు అనుమతి ఇస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మంత్రి సత్యకుమార్ ప్రాతినిథ్యం వహిస్తున్న ధర్మవరం నియోజకవర్గం లో ఓ టీడీపీ నేత వీడియో వైరల్గా మారింది. డబ్బులు తీసుకుని బెల్టుషాపులకు అనుమతిస్తున్నారంటూ ధర్మవరం టీడీపీ నేత మరస హరి ఆరోపిస్తున్నారు.పోలీసులు అరెస్ట్ చేస్తే ఏ ఒక్కరూ పట్టించుకోలేదంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ కూటమి ముఖ్య నేతలు, అధికారులు లంచం తీసుకుని బెల్ట్ షాపులు కేటాయిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తల వద్ద డబ్బు తీసుకుని మద్యం బెల్ట్ షాపులు కేటాయించడం సరికాదన్నారు. బీజేపీ నేతలతో మాట్లాడితే.. టీడీపీలో ఉండొద్దంటున్నారంటూ ధర్మవరం టీడీపీ నేత మరస హరి చెప్పుకొచ్చారు. -
సచివాలయాన్ని ఎత్తేశాడు
ధర్మవరం: శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో టీడీపీ నాయకుల అధర్మ ప్రవర్తన రోజురోజుకు పెచ్చుమీరుతోంది. తాము చెప్పినచోటే సచివాలయం పనిచేయాలంటూ ఏకంగా కంప్యూటర్లు, ఫర్నీచర్ను తరలించేశారు. దీంతో ఆ సచివాలయం ఉద్యోగులు మరో వార్డు సచివాలయానికి వెళ్లి పనిచేస్తున్నారు. ధర్మవరం పట్టణంలోని 39వ వార్డులో ఈ దురాగతం జరిగి వారం రోజులైనా మున్సిపల్ అధికారులు స్పందించకపోవడం విమర్శనీయంగా ఉంది. 39వ వార్డు టీడీపీ ఇన్చార్జ్ కేతా శ్రీను కొద్దిరోజులుగా సచివాలయ సిబ్బంది తాను చెప్పినట్లుగానే వినాలంటూ తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నాడు.వార్డులోని 37వ నంబరు సచివాలయాన్ని తాను చెప్పినచోటుకు మార్చాలని హుకుం జారీచేశాడు. అతడు చెప్పిన ప్రదేశం వార్డు ప్రజల రాకపోకలకు అనువుగా లేదు. దీంతో సచివాలయాన్ని ఉన్నచోటే కొనసాగించాలని స్థానిక బీజేపీ నాయకుడు జింకా చంద్రశేఖర్, వార్డు ప్రజలు కోరారు. అయినా తనమాటే చెల్లాలంటూ కేతా శ్రీను వారం రోజుల కిందట సచివాలయంలోని ఫర్నీచర్, కంప్యూటర్లు, ఇతర సామగ్రిని దౌర్జన్యంగా తీసుకెళ్లాడు. వాటిని మరో ఇంట్లో ఉంచి సచివాలయ సిబ్బంది అక్కడికొచ్చి పనిచేయాలని నిర్దేశించాడు. ఈ విషయాన్ని మునిసిపల్ కమిషనర్ ప్రమోద్కుమార్ దృష్టికి తీసుకెళ్లిన సచివాలయ సిబ్బంది మూడురోజులు రామ్నగర్ సచివాలయం నుంచి పనిచేశారు.తరువాత వార్డుకు రెండు కిలోమీటర్ల దూరంలో 40 వార్డులోని తారకరామాపురంలో ఉన్న 38వ నంబరు సచివాలయం నుంచి విధులు నిర్వర్తిస్తున్నారు. పనుల మీద ఇప్పటివరకు సచివాలయం ఉన్న చోటుకు వెళ్లిన ప్రజలు ‘ఇక్కడి మా సచివాలయం ఏది?’ అని ప్రశ్నిస్తున్నారు తనకు ప్రభుత్వం నుంచి ఆరునెలల అద్దె రావాల్సి ఉందని, కనీస సమాచారం ఇవ్వకుండా దౌర్జన్యంగా సచివాలయాన్ని ఖాళీచేయడం దారుణమని భవన యజమాని కడప రంగస్వామి ఆవేదన చెందుతున్నారు. ఈ విషయమై మునిసిపల్ కమిషనర్ ప్రమోద్కుమార్ను అడిగేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా.. ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. బీజేపీకి చెందిన మంత్రి సత్యకుమార్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మవరం నియోజకవర్గ కేంద్రంలోనే టీడీపీ నేత ఇలా దౌర్జన్యంగా వ్యవహరిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. -
కూటమి నేతల మధ్య ‘మట్టి’ రగడ
«సాక్షి టాస్క్ఫోర్స్: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో కూటమి నాయకుల మధ్య ‘మట్టి వార్’ తారాస్థాయికి చేరింది. ధర్మవరం మండలం రేగాటిపల్లిలో ఆదివారం మట్టిని అక్రమంగా తవ్వుతున్న టీడీపీ నాయకులకు చెందిన జేసీబీని జనసేన నాయకులు ధ్వంసం చేశారు. ఇక్కడ మట్టిని తాము తప్ప మరెవ్వరూ తవ్వకూడదని జనసేన నాయకులు హెచ్చరించినట్లు తెలిసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ధర్మవరం మండలం రేగాటిపల్లిలో జనసేనకు చెందిన ముఖ్య నేత ఆ«ధ్వర్యంలో జేసీబీ, హిటాచీ వాహనాలతో పెద్ద ఎత్తున అక్రమంగా మట్టి తవ్వి ట్రాక్టర్లు, టిప్పర్లలో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. రోజూ రూ.లక్షల్లో ఆదాయం గడిస్తున్నారు. మట్టి కోసం ఈ పంచాయతీ దరిదాపుల్లోకి ఇతరులెవరినీ రానీయకుండా సదరు జనసేన నేత హుకుం జారీ చేస్తున్నారు. ఇదే పంచాయతీకి చెందిన పలువురు టీడీపీ నాయకులు తాము కూడా ఎన్నికల్లో కూటమి గెలిచేందుకు కృషి చేశామని, తామూ మట్టి తవ్వుకుంటామని పలుమార్లు జనసేన కీలక నేతకు విజ్ఞప్తి చేశారు. ఇందుకు ఆయన అంగీకరించలేదు. అయితే టీడీపీ నాయకులు ఆదివారం సొంతంగా జేసీబీతో రేగాటిపల్లి కొండ సమీపంలో మట్టి అక్రమ తవ్వకాలకు పూనుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన తమ పార్టీకి చెందిన పదిమందిని పంపి దౌర్జన్యం చేయించారు. మట్టి తవ్వుతున్న జేసీబీపై రాళ్ల వర్షం కురిపించి ధ్వంసం చేయించారు. ఇంత గొడవ జరుగుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించినట్లు సమాచారం. ఆ తర్వాత తీరిగ్గా రెండు వర్గాల మధ్య రాజీకి ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. దీన్ని తీవ్ర అవమానంగా భావించిన టీడీపీ నాయకులు తమ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి అక్కడే ఈ మట్టి గొడవ తేల్చుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. కాగా, మంత్రి సత్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మవరం నియోజకవర్గంలో యథేచ్ఛగా మట్టి, ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా, ఈ విషయంలో కూటమి నాయకులు గొడవపడుతున్నా పోలీస్, మైనింగ్ అధికారులు కనీసం పట్టించుకున్న పాపాన పోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ధర్మవరంలో రెచ్చిపోయిన కూటమి మద్యం మాఫియా
-
ధర్మవరం వన్ టౌన్ సీఐ తల్లి స్వర్ణకుమారి దారుణ హత్య
-
కిడ్నాపైన సీఐ తల్లి దారుణహత్య
సాక్షి రాయచోటి/మదనపల్లె: పది రోజుల క్రితం కిడ్నాపైన ధర్మవరం సీఐ నాగేంద్రప్రసాద్ తల్లి స్వర్ణకుమారి దారుణ హత్యకు గురయ్యారు. ఎదురింట్లో ఉంటున్న వెంకటేష్ అనే యువకుడు పూజల పేరుతో ఆమెను బయటకు తీసుకెళ్లి.. తన స్నేహితుడు, అతని తల్లితో కలిసి స్వర్ణకుమారిని అంతమొందించాడు. ఉద్యోగానికి సెలవుపెట్టి మరీ తల్లి ఆచూకీ కోసం «ధర్మవరం సీఐ నాగేంద్రప్రసాద్ వెతికినా ఆయన కష్టం వృథా అయింది. తల్లి క్షేమంగానే ఉంటుందనుకున్న ఆశలు చివరకు అడియాశలయ్యాయి. తల్లి కేసును తానే విచారణ చేపట్టడంతో ఆమె హత్యకు గురైనట్టు నిర్ధారణ అయ్యింది. పోలీసు అధికారి తల్లికే దిక్కులేకపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మొన్న ముచ్చుమర్రిలో వాసంతి హత్య.. నిన్న పుంగనూరులో ముస్లిం బాలిక అంజుమ్ హత్యోదంతం, ఇప్పుడు సీఐ తల్లి హత్య ఘటనలు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ స్థాయికి దిగజారాయో స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఓ పోలీసు అధికారి తల్లిని దారుణంగా హతమార్చినా దిక్కులేకుండాపోయింది. ప్రత్యర్థులపై కక్షసాధింపు కోసమే అన్నట్లుగా రాష్ట్రంలో సాగుతున్న రెడ్బుక్ పాలనలో బాలికలు, మహిళల భద్రతకు కనీస చర్యలు కూడా చేపట్టకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.కుమారుడిపైనే ఆశలన్నీ పెట్టుకుని..అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం మేడికుర్తికి చెందిన స్వర్ణకుమారి భర్త శ్రీరాములుతో 30 ఏళ్ల క్రితమే విడిపోయారు. ఒక్కగానొక్క కుమారుడు నాగేంద్రప్రసాద్ను చదివించి, ప్రయోజకుడిని చేసేందుకు మదనపల్లెకు వలస వచ్చి దేవళం వీధిలో కాపురం ఉండేవారు. నాగేంద్రప్రసాద్ చదువుతోపాటు హాకీ క్రీడాకారుడిగా ప్రతిభ కనపరిచి స్పోర్ట్స్ కోటాలో పోలీస్ శాఖలో ఉద్యోగం సాధించారు. కుమారుడు ఉద్యోగరీత్యా వేర్వేరు ప్రాంతాల్లో ఉండాల్సి వచ్చినప్పటికీ, తల్లి స్వర్ణకుమారి మదనపల్లెలోనే ఉండేవారు. 2009లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో వైఎస్సార్ కాలనీలో ఇల్లు మంజూరు కావడంతో సొంత ఇల్లు నిర్మించుకుని అక్కడకు వెళ్లారు. ఈ క్రమంలో ఎదురింట్లో ఉంటున్న సొంతూరికే చెందిన యల్లమ్మతో ఆమె స్నేహంగా ఉండేవారు. యల్లమ్మ, సురేంద్ర దంపతుల కుమారుడైన నిందితుడు వెంకటేష్ మదనపల్లెలో డిగ్రీ వరకు చదువుకుని, బెంగళూరు వెళ్లి కాల్టాక్సీ డ్రైవర్గా, జొమాటో బాయ్గా పనిచేసేవాడు. నెల రోజుల క్రితం బెంగళూరు నుంచి మదనపల్లె వచ్చిన వెంకటేష్ తల్లిదండ్రులతోనే ఉంటున్నాడు. పూజల పేరుతో.. స్వర్ణకుమారికి భక్తి ఎక్కువ. ఈ విషయం తెలుసుకున్న వెంకటేష్ తన స్నేహితుడి ఇంటికి కాశీ నుంచి స్వామీజీ వస్తున్నారని, ఆయన మంత్రిస్తే మంచి జరుగుతుందని స్వర్ణకుమారిని నమ్మించాడు. స్వామీజీ గురించి గొప్పలు చెబుతూ అక్కడకు వెళదాం రమ్మని ఆహ్వానించాడు. స్వామీజీ వద్దకు వెళితే మంచి జరుగుతుందని నమ్మిన స్వర్ణకుమారి గతనెల 28న నిందితుడు వెంకటేష్తో వెళ్లారు. ముందస్తు పథకం ప్రకారం వెంకటేష్ పట్టణంలోని గజ్జెలకుంట సాయిరాం వీధిలో ఉంటున్న స్నేహితుడు అనిల్ ఇంటికి స్వర్ణకుమారిని తీసుకెళ్లాడు. స్వామీజీ అక్కడికే వస్తున్నాడని నమ్మించి.. ఆమెతో పూజా కార్యక్రమాలు చేయించాడు. తీర్థం తీసుకునేందుకు ఆమె తలవంచగానే వెనుక నుంచి సుత్తితో తలపై మోదాడు. వెంటనే స్నేహితుడు అనిల్, అతడి తల్లి రమాదేవితో కలిసి స్వర్ణకుమారి ప్రాణం తీశాడు. అనంతరం స్వర్ణకుమారి వంటిపై నగలు తీసుకుని, మృతదేహాన్ని గోనె సంచిలో దాచారు. మృతదేహానికి అనిల్ తల్లి రమాదేవిని కాపలాగా ఉంచి వెంకటేష్, అనిల్ బయటకు వచ్చారు. నగలను తీసుకెళ్లి ఓ ఫైనాన్స్ కంపెనీలో తాకట్టు పెట్టి రూ.4 లక్షలు తీసుకున్నారు.శవంపైనే స్వర్ణకుమారి మృతదేహాన్ని పూడ్చి..అదే రోజు రాత్రి కారు అద్దెకు తీసుకుని గోనె సంచిలో ఉంచిన స్వర్ణకుమారి మృతదేహాన్ని పూడ్చేందుకు పోతబోలువైపు వెళ్లారు. అక్కడ ఖననం చేసేందుకు ప్రయత్నించగా.. స్థానికులు చేతబడి పూజలకు ఎవరో వచ్చారని కేకలు పెట్టడంతో అక్కడి నుంచి పరారయ్యారు. అనంతరం అయోధ్య నగర్లోని శ్మశానానికి చేరుకున్నారు. ఇటీవల ఓ మృతదేహాన్ని ఖననం చేసిన స్థలాన్ని ఎంచుకుని నాలుగు అడుగుల మేర తవ్వి స్వర్ణకుమారి మృతదేహం ఉన్న గోనె సంచిని పాత శవంపైనే ఉంచి పూడ్చేశారు. నగలు కుదువపెట్టగా వచ్చిన సొమ్ములో సగం అనిల్కు ఇచ్చి రూ.లక్షను తన అకౌంట్లో ఉంచి, మరో రూ.లక్షను ఇంట్లో ఉంచాడు. పెన్షన్ తీసుకునేందుకు రాకపోవడంతో..ఇంటినుంచి వెళ్లిన స్వర్ణకుమారి రెండు రోజులైనా ఇంటికి రాకపోవడం, 1వ తేదీన పెన్షన్ తీసుకునేందుకు అందుబాటులో లేకపోవడంతో స్థానికులు ఆమె కుమారుడు సీఐ నాగేంద్రప్రసాద్కు సమాచారం అందించారు. ఆయన తల్లి ఫోన్కు చేయగా, కాల్ ఫార్వర్డ్ మెసేజ్ రావడంతో అనుమానంతో నాగేంద్రప్రసాద్ మదనపల్లె వచ్చారు. అక్టోబర్ 2న తాలూకా పోలీస్ స్టేషన్లో తన తల్లి కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారు. స్థానిక పోలీసుల నుంచి స్పందన అంతంత మాత్రంగానే ఉండటంతో తల్లి ఆచూకీ కోసం సీఐ నాగేంద్రప్రసాద్ తానే విచారణ చేపట్టారు. స్వర్ణకుమారిని ఇంటినుంచి తీసుకెళ్లిన యువకుడు వెంకటేష్ను అనుమానితుడిగా భావించి.. ఇంట్లో తనిఖీలు నిర్వహించగా నగలు కుదువపెట్టిన రసీదులు, బియ్యం డబ్బాలో దాచిన రూ.లక్ష నగదు లభించాయి. నిందితుడు వెంకటేష్ తన ఫోన్ స్విచ్ఆఫ్ చేసి.. ఇంట్లోనే ఉంచేసి రెండు రోజులపాటు హతురాలు స్వర్ణకుమారి ఫోన్ ఉపయోగించాడు. చివరగా ఆ ఫోన్ వినియోగించిన టవర్ లొకేషన్, నిందితుడు వెంకటేష్ ఫోన్లోని కాంటాక్ట్స్ ఆధారంగా అతడి స్నేహితులను విచారిస్తే వెంకటేష్ తరచూ వాడే ఫోన్ నంబర్లు ఇచ్చారు. వాటిపై నిఘా ఉంచగా.. మదనపల్లె, తిరుపతి చివరగా బెంగళూరులో ఒక నంబర్ వినియోగిస్తున్నట్టు గుర్తించారు. ఆ నంబర్పై నిఘా పెట్టగా నిందితుడు స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేయడంతో దాని ఆధారంగా వెంకటేష్ను పట్టుకున్నారు. అతడిని తీసుకొచ్చి తాలూకా పోలీస్ స్టేషన్లో అప్పగించారు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. హత్య చేసిన వైనాన్ని వివరించాడు. మంగళవారం అధికారుల సమక్షంలో తహసీల్దార్, వైద్యులను తీసుకువచ్చి ఘటనాస్థలంలో పంచనామా నిర్వహించి, మృతదేహానికి పోస్టుమార్టం జరిపించారు. అనంతరం స్వర్ణకుమారి మృతదేహానికి కుటుంబసభ్యులు అదే శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిపించారు. స్వర్ణకుమారి కుమారుడు సీఐ కావడం, ఆయనే స్వయంగా దర్యాప్తు చేపట్టడంతో 10 రోజుల అనంతరం ఈ కేసు వెలుగు చూసింది. లేదంటే ఈ కేసులో మిస్టరీ వీడేది కాదు. కాగా.. స్వర్ణకుమారి హత్యకు సహకరించిన రెండో నిందితుడు అనిల్, అతడి తల్లి రమాదేవి ఎక్కడ ఉన్నారో ఇప్పటివరకు పోలీసులు ఆచూకీ కనిపెట్టలేకపోయారు. వారిద్దరూ రేణిగుంట నుంచి విమానంలో రాజస్థాన్ వెళ్లినట్టు తెలిసింది.ఇదీ చదవండి: ఆడ శిశువును విక్రయించిన తల్లి -
AP: ధర్మవరం సీఐ తల్లి కిడ్నాప్
మదనపల్లె/రాయచోటి: ధర్మవరం వన్టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ తల్లి స్వర్ణకుమారి(62) మదనపల్లెలో కిడ్నాప్ అయ్యారు. గత నెల 28న ఆమె అదృశ్యమై ంది. 9 రోజులు కావస్తున్నా నేటికీ జాడ కనుక్కోలేని పరిస్థితి చూస్తే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో అర్థమవుతోంది. మదనపల్లె శివారు వైఎస్ జగన్ కాలనీలో సీఐ తల్లి స్వర్ణకుమారి ఒంటరిగా నివసిస్తోంది. సెప్టెంబర్ 28న మధ్యాహ్నం ఆమె స్నేహితురాలు స్వర్ణకుమారికి ఫోన్ చేస్తే కాల్ ఫార్వర్డ్ వాయిస్ వినిపించింది. సాయంత్రమైనా ఆమె ఇంటికి చేరుకోలేదు. ఆమెకు దైవభక్తి అధికం కావడంతో తెలిసిన వారితో కలిసి దూరప్రాంతంలోని గుడికి వెళ్లిందేమోనని స్నేహితురాలు భావించింది.కాగా, అక్టోబర్ 1న పెన్షన్ తీసుకునేందుకు స్వర్ణకుమారి రాకపోవడంతో స్థానికులు ఆ విషయాన్ని కుమారుడైన సీఐ నాగేంద్రప్రసాద్కు తెలిపారు. దీంతో ఆయన మదనపల్లెకు చేరుకుని తల్లి ఆచూకీ కోసం విచారించారు. మూడు రోజులైనా ఆచూకీ లభించకపోవడంతో అక్టోబర్ 2న పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సీఐ కళా వెంకటరమణ అదృశ్యం కేసుగా నమోదుచేసి విచారణ చేపట్టారు. స్వర్ణకుమారి మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండటం, టవర్ లొకేషన్ ఒక్కో సమయంలో ఒక్కో ప్రాంతాన్ని సూచిస్తుండటంతో పోలీసులు అయోమయంలో పడ్డారు. స్వర్ణకుమారి అదృశ్యం పట్టణంలో చర్చనీయాంశం కాగా.. ఈ కేసు పోలీసులకు సవాల్గా మారింది. వెంకటేశ్ అనే యువకుణ్ణి బెంగళూరులో పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది. సీఐ తల్లికే దిక్కులేకపోతే? సీఐ తల్లి అదృశ్యమైతేనే ఇప్పటివరకు కనిపెట్టలేకపోయారంటే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని జనం చర్చించుకుంటున్నారు. ముందెన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో చిన్నారులు, మహిళలను కిడ్నాప్ చేసి అంతమొందించడం లాంటి వరుస ఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో 9 రోజులైనా సీఐ తల్లి ఆచూకీ తెలియలేదంటే.. ఆమె విషయంలో ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలపై వరుస అఘాయిత్యాలు భయపెడుతున్నాయి. ఇటీవల కర్నూలు జిల్లా ముచ్చుమర్రిలో వాసంతిని, పుంగనూరులో ముస్లిం బాలిక అంజుమ్ను తుదముట్టించిన ఘటనలు శాంతిభద్రతలను ప్రశ్నార్థకంగా మార్చాయి. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం తక్షణమే స్పందించకపోవడంతో బాధితులు శవాలుగా మారిపోతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం తనకేమీ పట్టనట్టు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంపై ప్రజలు మండిపడుతున్నారు. పేపర్లకు ఉన్న విలువ ప్రాణాలకు లేదా?మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో కాగితాలు తగలబడితే చంద్రబాబు రాష్ట్ర డీజీపీని హెలికాప్టర్లో పంపించి దర్యాప్తు చేయించారు. అయితే.. బాలికలు, మహిళలను అపహరించుకుని పోయి అత్యాచారాలు చేస్తున్నా, హత్యలకు తెగబడుతున్నా పట్టించుకోవడంలేదు. -
ధర్మవరంలో బీజేపీ – టీడీపీ వార్
ధర్మవరం: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున నియామకం కూటమి పార్టీల మధ్య చిచ్చు రగిల్చింది. మంత్రి సత్యకుమార్ మద్దతుతో మల్లికార్జున ధర్మవరం మున్సిపాలిటీ కమిషనర్గా నియమితులయ్యారు. ఆయన నియామకాన్ని టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ తీవ్రంగా వ్యతిరేకించారు. మల్లికార్జున మున్సిపల్ ఆఫీసుకు వస్తే చొక్కా పట్టుకుని బయటకు గెంటేస్తానని శ్రీరామ్ హెచ్చరించారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం ధర్మవరం మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో మంత్రి సత్యకుమార్ సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు కమిషనర్ను అడ్డుకునేందుకు అక్కడికి భారీగా తరలివచ్చారు. దీంతో మంత్రి సత్యకుమార్ మున్సిపల్ అధికారులను, కమిషనర్ను మార్కెట్ యార్డు వద్ద ఉన్న ఎన్డీఏ కార్యాలయంలోని క్యాంప్ ఆఫీసుకి రప్పించుకుని అక్కడే సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున మంత్రి క్యాంప్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ధర్మవరం–అనంతపురం ప్రధాన రహదారిపై బైఠాయించారు. మంత్రి సత్యకుమార్, కమిషనర్ మల్లికార్జునకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. డీఎస్పీ శ్రీనివాసులు వారిని శాంతింపజేసే ప్రయత్నం చేసినా ఫలించక పోవడంతో ఎన్డీఏ ఆఫీస్లోకి ఎవ్వరూ వెళ్లకుండా తాళం వేశారు.కమిషనర్ మల్లికార్జున నియామకం సరైనదేఅంతకు ముందు మంత్రి సత్యకుమార్ విలేకరులతో మాట్లాడుతూ.. కమిషనర్ మల్లికార్జున నియామకం సరైనదేనని, ఆయన సమర్ధుడైన మంచి అధికారి అంటూ కితాబిచ్చారు. మల్లికార్జున అయితే ధర్మవరం అభివృద్ధి చెందుతుందని భావించే మున్సిపల్ కమిషనర్గా ప్రభుత్వం నియమించిందన్నారు. గత ప్రభుత్వంలో పని చేశారన్న కారణంతో ఆయన్ని కొన్ని పార్టీల నాయకులు అడ్డుకుంటున్నారని, అది మంచి పద్ధతి కాదని చెప్పారు. అధికారులకు రాజకీయాలను ఆపాదించకూడదని అన్నారు. కమిషనర్గా మల్లికార్జున కొనసాగుతారని మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు.సత్యకుమార్ను ఘెరావ్ చేసిన టీడీపీ కార్యకర్తలుమంత్రి క్యాంప్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు కమిషనర్ మల్లికార్జునను కార్యాలయం వెనుక గేట్ నుంచి బందోబస్తుతో పంపించేశారు. అనంతరం మంత్రి సత్యకుమార్ సమావేశాన్ని అర్ధంతరంగా ముగించుకుని బయటకు వచ్చారు. వెంటనే టీడీపీ నేతలు ఆయనపై విరుచుకుపడ్డారు. ‘మేం కష్టపడి గెలిపిస్తే మంత్రివి అయ్యావు. నీవు, నీ అనుచరులు మాపై ఆధిపత్యం చెలాయిస్తున్నారు. మీ సంగతి చూస్తాం’ అంటూ దుర్భాషలాడారు. మంత్రి సత్యకుమార్ ముందుకు కదలకుండా ఆయన వాహనాన్ని చుట్టుముట్టి ఘొరావ్ చేశారు. పరిస్థితి చేయిదాటుతుండటంతో పోలీసులు టీడీపీ కార్యకర్తలను నెట్టివేసి మంత్రిని పంపించేశారు. బీజేపీ, టీడీపీ విభేదాల కారణంగా ధర్మవరం పట్టణంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రహదారిపై రెండు గంటల పాటు ధర్నా వల్ల వాహనాలు భారీగా నిలిచిపోయాయి. పాఠశాలల విద్యార్థులు, వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడ్డారు. -
బంతి, కనకాంబరాల పూల తోటలు.. ప్రకృతి అందాలు (ఫొటోలు)
-
చంపడానికి వచ్చారు.. ధర్మవరంలో రెచ్చిపోయిన కూటమి నేతలు.. కేతిరెడ్డి ఫైర్
-
కేతిరెడ్డిపై టీడీపీ రౌడీల దాడి
-
అధికారుల నిర్వాకం.. సర్కారీ ఆఫీస్ల్లో ‘పరిటాల’ ఫోటో
శ్రీ సత్యసాయి జిల్లా: ధర్మవరంలో అధికారుల నిర్వాకం విస్మయం కలిగిస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ ఫోటోలు వెలిశాయి. ధర్మవరం నియోజకవర్గానికి బీజేపీ నుంచి మంత్రి సత్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తుండగా, ధర్మవరం టీడీపీ ఇంఛార్జి గా పరిటాల శ్రీరామ్ వ్యవహరిస్తున్నారు.ధర్మవరం నియోజకవర్గంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి ఫోటోలతో పాటు పరిటాల శ్రీరామ్ ఫోటోలను అధికారులు ఉంచారు. ఏ పదవి లేని పరిటాల శ్రీరామ్ ఫోటో ఉంచటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
రైలు పట్టాలపై ఇనుప స్తంభాలు.. ధర్మవరంలో తప్పిన ప్రమాదం
శ్రీసత్యసాయి, సాక్షి: జిల్లాలో గత అర్ధరాత్రి లోకో పైలట్ అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. ధర్మవరం రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలపై ఇనుప స్తంభాలు ఉంచారు గుర్తు తెలియని వ్యక్తులు. ఆకతాయిల పనిగా భావిస్తున్న రైల్వే పోలీసులు..కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
వెంకయ్య నాయుడు బామ్మరిది సంచలన కామెంట్స్
-
ధర్మవరంలో కార్పొరేట్ పాలిటిక్స్
ధర్మవరం నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా కార్పొరేట్ రాజకీయం రంగ ప్రవేశం చేసింది. ఢిల్లీ నుంచి వచ్చానన్న బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ ఇక్కడ గల్లీలో ప్రలోభాలు, బెదిరింపులతో నీచరాజకీయాలు చేస్తున్నారు. రూ.కోట్లు కుమ్మరించి అధికార పార్టీ నాయకులను కొనుగోలు చేసేందుకు ప్రయతి్నస్తున్నారు. తనకు మద్దతు ఇవ్వని వ్యాపారులపై సీబీఐ, ఐటీ, ఈడీలతో దాడులు చేయిస్తానంటూ తన వర్గీయుల ద్వారా బెదిరిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ధర్మవరం: ప్రొద్దుటూరుకు చెందిన సత్యకుమార్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగప్రవేశం చేయగానే ధర్మవరంలో కొత్త సంస్కృతి మొదలైంది. ఆయనకు మద్దతుగా ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి రెండు వేల మందికిపైగా ధర్మవరంలో దిగారు. పట్టణంలోని అద్దె ఇళ్లు, లాడ్జీలలో తిష్ట వేశారు. వైఎస్సార్సీపీ నాయకులను ప్రలోభాలకు గురిచేయడమే పనిగా పెట్టుకున్నారు. డబ్బు ఇస్తామని, నామినేటెడ్ పదవులు, సబ్సిడీ రుణాలు ఇప్పిస్తామని.. ఇలా పలు రకాలుగా ప్రలోభపెడుతున్నారు. గ్రామస్థాయి నాయకుడికైతే రూ.10 లక్షలు, ఓ మోస్తరు నాయకుడికైతే అంతకన్నా ఎక్కువ ఇస్తామని చెబుతున్నారు. ఇటీవల వైఎస్సార్సీపీ నాయకుడు గిర్రాజు నగేశ్, ఏపీ కురుబ కార్పొరేషన్ చైర్మన్ కోటి బాబు, ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ యాదవ్లను పెద్దఎత్తున ప్రలోభపెట్టి సత్యకుమార్ సమక్షంలో బీజేపీలో చేర్చుకున్నట్లు సమాచారం. వీరివెంట భారీగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు వస్తారని భావించినప్పటికీ వారి అంచనాలు తలకిందులయ్యాయి. వంద మందితో పారీ్టలో చేరుతానని చెప్పిన గిర్రాజు నగేశ్ కనీసం పది మందికి కూడా కండువా కప్పించలేకపోయాడు. కోటిబాబు వెంట కూడా ఎవరూ వెళ్లలేదు. కోటిబాబు బీజేపీలోకి చేరిన మరుసటి రోజే ఆయన సోదరులు మళ్లీ వైఎస్సార్సీపీలో చేరడం విశేషం. అదేవిధంగా తమ ప్రలోభాలకు లొంగని వారిని సీబీఐ, ఈడీ, ఐటీ దాడుల పేరిట సత్యకుమార్ మనుషులు బెదిరిస్తున్నట్లు తెలిసింది. పట్టు–చేనేత వస్త్ర వ్యాపారానికి కేంద్రమైన ధర్మవరంలో వ్యాపారులకు ఈ తరహా బెదిరింపులు ఎక్కువైనట్లు ఆరోపణలు వస్తున్నాయి. కాగా, సత్యకుమార్ ప్రచారానికి కూడా ఇతర ప్రాంతాల నుంచి డబ్బులు ఇచ్చి జనాన్ని తరలిస్తున్నట్లు తెలిసింది. ఇటీవల ఆయన నామినేషన్ కార్యక్రమానికి కూడా ప్రొద్దుటూరు, కర్నూలు, రాప్తాడు తదితర ప్రాంతాల నుంచి డబ్బులు ఇచ్చి వాహనాల్లో జనాలను తీసుకురాగా, వారు మధ్యలోనే వెళ్లిపోయారు. బీజేపీపై చేనేతల ఆగ్రహం.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేనేత వ్రస్తాలపై 5 శాతం జీఎస్టీ విధించడంతో నేతన్నలు తీవ్రంగా నష్టపోతున్నారు. జీఎస్టీ రద్దు చేయాలని నేతన్నలు నిరసన తెలిపినా మోదీ ప్రభుత్వం పట్టించుకోలేదు. పైగా గత కేంద్ర బడ్జెట్లో జీఎస్టీ 5 నుంచి 12 శాతానికి పెంచాలని భావించింది. అప్పట్లో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్లు కేంద్ర ఆర్థికమంత్రిని కలిసి చేనేత వస్త్రాలపై జీఎస్టీని పెంచడం వల్ల కలిగే నష్టాలను వివరించడంతో 5 శాతానికే పరిమితం చేశారు. ఈ క్రమంలో బీజేపీపై నేతన్నలు, వ్యాపారులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. -
బీజేపీ సేవలో ప్రభుత్వ వైద్యుని భార్య
ధర్మవరం: ప్రభుత్వ వైద్యుని భార్య బీజేపీ సేవలో తరిస్తున్నారు. ధర్మవరం ప్రభుత్వాస్పత్రిలో డాక్టర్ వివేక్ కుళ్లాయప్ప దంతవైద్యునిగా పనిచేస్తున్నారు. ఈయన భార్య నీరజ కూడా డాక్టరే. అయితే ఆమె ప్రైవేట్గా వైద్య సేవలందిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ తరఫున భార్య త్రివేణి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం డాక్టర్ వివేక్ ఇంటివద్దకు వెళ్లి కుటుంబ సభ్యులను కలిశారు. ఈ సందర్భంగా దంతవైద్యుని సమక్షంలోనే ఆయన భార్య డాక్టర్ నీరజకు బీజేపీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రభుత్వ డాక్టర్ భార్య రాజకీయ పార్టీలో చేరడం విమర్శలకు తావిచ్చింది. ఇదిలా ఉండగా బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ నామినేషన్ సమయంలో సమర్పించిన వివరాలలో భార్య పేరు ప్రస్తావించలేదు. పిల్లలు మాత్రమే ఉన్నట్లు పొందుపరిచారు. ఎన్నికల ప్రచారంలో మాత్రం సత్యకుమార్ భార్యగా త్రివేణి ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. -
ధర్మవరంలో జోరుగా కేతిరెడ్డి భార్య ఎన్నికల ప్రచారం...!
-
సీఎం జగన్ పై దాడి...చంద్రబాబు, పవన్ కి కేతిరెడ్డి మాస్ వార్నింగ్..
-
ధర్మవరంలో పరిటాల సూరి వర్గీయుల మధ్య బయటపడ్డ విబేధాలు
-
ధర్మవరంలో పరిటాల, సూరి వర్గీయుల మధ్య బయటపడ్డ విబేధాలు
సాక్షి, శ్రీ సత్యసాయి జిల్లా: లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ప్రతిపక్ష టీడీపీలో వర్గపోరు రచ్చకెక్కింది. ధర్మవరం నియోజకవర్గంలో టీడీపీ నేతల విబేధాలు తీవ్ర స్థాయికి చేరాయి. మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరికి టీడీపీ ఇంఛార్జి పరిటాల శ్రీరామ్ మధ్య మరోసారి విబేధాలు బయటపడ్డాయి. తాజాగా బత్తలపల్లిలో వరదాపురం సూరి వర్గీయుల వాహనాలను పరిటాల అనుచరులు ధ్వంసం చేశారు. దీంతో పరిటాల-సూరి వర్గీయులు ఒకరికొకరు రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో వరదాపురం సూరి వర్గీయులు ప్రయాణిస్తున్న 10-15 వాహనాలు ధ్వంసం అయ్యాయి. నలుగురు సూరి వర్గీయులకు గాయాలయ్యాయి. దీంతో కాసేపు స్థానికంగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పెనుకొండలో సోమవారం సాయంత్రం జరిగే చంద్రబాబు ‘రా.. కదలిరా’ సమావేశానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కాగా ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్న వరదాపురం సూరి వర్గీయులు చంద్రబాబు సభకు వెళ్లకూడదంటూ పరిటాల శ్రీరామ్ వర్గీయులు ఈ దాడికి పాల్పడ్డారు. ఇక ధర్మవరం టీడీపీ టికెట్ కోసం కొంతకాలంగా పరిటాల శ్రీరామ్ - వరదాపురం సూరి గొడవపడుతున్న సంగతి విదితమే. చదవండి: నర్రెడ్డి సునీత యాక్షన్.. చంద్రబాబు డైరెక్షన్ -
ధర్మవరంలో హై టెన్షన్...వరదాపురం Vs పరిటాల..
-
ధర్మవరంలో టీడీపీకి భారీ షాక్
-
ధర్మవరంలో టీడీపీకి భారీ షాక్
-
పరిటాల ఫ్యామిలీకి ఎదురుదెబ్బ..ధర్మవరంలో వైఎస్ఆర్ సీపీలోకి భారీ చేరికలు
-
వరదాపురం సూరి ఓవర్ యాక్షన్
ధర్మవరం: రాజకీయ ఉనికి కోసం మాజీ ఎమ్మెల్యే వరదపురం సూరి ధర్మవరం పట్టణంలో గురువారం హైడ్రామాకు తెరలేపారు. రహదారి అభివృద్ధి పనులకు అడ్డుపడుతూ అనుచరులను రెచ్చగొడుతూ నానా యాగి చేశారు. గత ఎన్నికల్లో వరదాపురం సూరి ధర్మవరం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన తర్వాత టీడీపీని వీడి బీజేపీలో చేరారు. తీరా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ధర్మవరం టీడీపీ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజాదరణలో అత్యంత బలవంతుడైన కేతిరెడ్డిని ఢీకొట్టే సత్తా తనకు మాత్రమే ఉందని కలరింగ్ ఇచ్చేందుకు ఫీట్లు చేస్తున్నారు. టెండర్లు పూర్తయిన విషయం తెలుసుకుని డ్రామా 2019లో అప్పటి ఎమ్మెల్యే సూరి రూ.28 కోట్లతో ధర్మవరం పట్టణంలో రోడ్డు వేశారు. రోడ్డు పనులు అత్యంత నాసిరకంగా చేయడంతో పదినెలలు గడవకముందే శిథిలావస్థకు చేరింది. ఈ విషయాన్ని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడంతో స్పందించి రూ.4 కోట్ల వ్యయంతో నాలుగు వరుసల రహదారిని నిరి్మంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గతేడాది డిసెంబర్ 5న జీఓ విడుదల చేశారు. ఈ క్రమంలో అధికారులు జనవరి 18న టెండర్ ప్రక్రియ సైతం పూర్తిచేశారు. గురువారం రోడ్డు పనులు ఎమ్మెల్యే కేతిరెడ్డి చేతుల మీదుగా ప్రారంభం అవుతున్నాయి. కానీ వరదాపురం సూరి రాజకీయ లబ్ధి కోసం హంగామా చేశారు. తన సొంత నిధులతో రోడ్డు వేస్తానని అనుమతి ఇవ్వాలని ఆర్అండ్బీ అధికారులను కోరగా, ఇప్పటికే టెండర్లు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. అయినప్పటికీ పలుమార్లు అధికారులను కలుస్తూ విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ క్రమంలోనే గురువారం రోడ్డు పనులు ప్రారంభించేందుకు ఎమ్మెల్యే కేతిరెడ్డి సిద్ధమవుతున్న తరుణంలో వరదాపురం సూరి హైడ్రామాకు తెరలేపారు. ఉదయాన్నే మార్కెట్యార్డుకు రెండు టిప్పర్లు తీసుకువచ్చి పనులు చేస్తామంటూ అనుచర గణంతో బైఠాయించారు. డీఎస్పీ టీ. శ్రీనివాసులు, పట్టణ సీఐ సుబ్రహ్మణ్యం తదితరులు సూరి వద్దకు వెళ్లి రోడ్డు పనులకు ఆటంకం కల్గించవద్దని ఎంత సర్ది చెప్పినా వినకుండా పోలీసులపైకి దౌర్జన్యం చేశారు. పెద్దపెట్టున నినాదాలు చేస్తూ పట్టణంలోకి చొరబడేందుకు ప్రయత్నించారు. కేసు నమోదు అభివృద్ధి పనులకు ఆటంకం కల్గిస్తూ రహదారిపై ధర్నా, పోలీసులపై దౌర్జన్యం తదితర కారణాలతో వరదాపురం సూరితో పాటు అనుచరులు 29 మందిని పోలీసులు అరెస్ట్ చేసి టూటౌన్ పోలీస్స్టేషన్కు తరలించారు. ఐపీసీ 143, 145, 188, 341, రెడ్విత్ 149 కింద కేసులు పెట్టారు. సూరికి చెందిన రెండు వాహనాలను సీజ్ చేసినట్లు డీఎస్పీ టీ. శ్రీనివాసులు తెలిపారు. -
ఓర్వలేకే కుట్రపూరిత రాతలు
ధర్మవరం: అబద్ధాల పునాదులపై నిలబడ్డ ఈనాడు దినపత్రిక అవాస్తవాలు ప్రచురిస్తూ, అమాయకుల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా చేస్తున్న కుట్రలు చూస్తుంటే అసహ్యం వేస్తోందని శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అన్నారు. ప్రజల్లో తనకు వస్తున్న ఆదరాభిమానాలను చులకన చేసి, రాజకీయ భవిష్యత్తును దెబ్బతీసే విధంగా నిరాధార కథనాలు రాస్తున్న ఈనాడు అంతు చూస్తానని, పరువు నష్టం దావా వేసి చట్ట పరిధిలో చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. బుధవారం ధర్మవరం మండలం దర్శినమల గ్రామంలో వెంకటరామిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఈనాడు కథనంలో పేర్కొన్న అంశాలన్నీ అవాస్తవాలంటూ ఆధారాలతో సహా వివరించారు. ప్రతిరోజూ ‘గుడ్మార్నింగ్ ధర్మవరం’ పేరిట తాను నియోజకవర్గంలో తిరుగుతూ ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ వారిలో ఒకడిగా మమేకం అవుతున్నానని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని 2008 సంవత్సరం నుంచి తాను నియోజకవర్గ ఇన్చార్జ్గా ఉన్నప్పటి నుంచి చేస్తున్నానన్నారు. దీన్ని ఓర్వలేక స్థలాలు, భూములు కబ్జా చేసేందుకు తిరుగుతున్నానంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. అలాగైతే రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసిన నారా లోకేశ్, నియోజకవర్గంలో పాదయాత్ర చేసిన పరిటాల శ్రీరామ్, వరదాపురం సూరి ఎన్ని ఎకరాలు కబ్జా చేశారో చెప్పాలన్నారు. తనపై ఏఒక్క బాధితుడైనా ఫిర్యాదు చేశారా అని ప్రశ్నించారు. చంద్రబాబును గద్దె ఎక్కించేందుకు రామోజీరావు ఎంతటి నీచానికైనా దిగజారుతారని విమర్శించారు. గతంలోనూ తాను ఈనాడులో రాసిన కథనాలు తప్పుడు రాతలని కోర్టులో నిరూపించానన్నారు. పదేపదే తప్పుడు రాతలతో తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసి, రాజకీయంగా ఇబ్బందులకు గురి చేయాలని చూస్తే సహించేది లేదని, తగిన బుద్ధి చెబుతానని ఆయన హెచ్చరించారు. మా పాఠశాలంటే ప్రభుత్వ పాఠశాల ధర్మవరం పట్టణంలోని కార్పొరేట్ స్కూళ్లపై ఫిర్యాదులు రాగా.. నిబంధనల ప్రకారం నడుచుకునేందుకు తొమ్మిది నెలల సమయం ఇచ్చామని ఎమ్మెల్యే చెప్పారు. అప్పటికీ వారి తీరు మారకపోవడంతో కార్పొరేట్ పాఠశాలలు మూసివేయడం జరిగిందన్నారు. అంతేతప్ప టీడీపీ వాళ్లలాగా ఏ ఒక్కరితోనూ లాలూచీ పడలేదన్నారు. తాను ‘గుడ్మారి్నంగ్ ధర్మవరం’లో తిరుగుతున్నప్పుడు విద్యార్థులు ఎదురైతే ‘మా స్కూల్లో చదవండి’ అని చెబుతానని, మా స్కూల్ అంటే ప్రభుత్వ పాఠశాల అని వివరించారు. దీంతో తనకేవో పాఠశాలలున్నాయంటూ ఈనాడు తప్పుడు కథనాలు రాసిందన్నారు. అలాగైతే శ్రీరాం, సూరి రూ. 200 కోట్ల పనులు చేసేవారా? తన క్వారీలోనే కంకర కొనాలని ప్రజలను బెదిరిస్తున్నారనడం అవాస్తవమన్నారు. అదే నిజమైతే తన నియోజకవర్గంలో పరిటాల శ్రీరామ్కు చెందిన సిద్ధార్థ కంపెనీ, బీజేపీ నేత సూరికి చెందిన నితిన్సాయి కన్స్ట్రక్షన్స్ కంపెనీ రూ. 200 కోట్ల వరకూ విలువైన రైల్వే, బైపాస్రోడ్డు పనులు చేసేవా అని ప్రశ్నించారు. ఏ ఒక్కరైనా తన వద్ద కంకర కొనడం గానీ, పర్సంటేజీలు గానీ ఇచ్చారా అని ఆయన నిలదీశారు. కబ్జా చేసినట్లు ఒక్క ఆధారమైనా ఉందా? నియోజకవర్గంలో ఎక్కడైనా తాను సెంటు భూమి కబ్జా చేసినట్లు ఒక్కరైనా ఆరోపించారా అని వెంకటరామిరెడ్డి ప్రశ్నించారు. తాను రైతుల నుంచి భూమి కొనుగోలు చేసి తుంపర్తి వద్ద ఫాంహౌస్ కట్టుకున్నానని తెలిపారు. దాన్ని కూడా వక్రీకరిస్తూ తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. తన ఫాంహౌస్లో ఆక్రమణలు లేవంటూ రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు ఇచ్చిన రిపోర్టును ఆయన ఈ సందర్భంగా చూపించారు. నియోజకవర్గంలో ఇసుకను ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తుంటే ఇందులో ఎమ్మెల్యేకు ఏం సంబంధముందని ప్రశ్నించారు. గతంలో గరుడంపల్లి వద్ద సోలార్ కంపెనీని ఏర్పాటు చేయడానికి ఢిల్లీకి చెందిన వారు వస్తే.. అప్పటి ఎమ్మెల్యే వరదాపురం సూరి డబ్బులు భారీగా డిమాండ్ చేయడంతో ఆ కంపెనీ ఏర్పాటు చేయకుండానే వారు పారిపోయారన్నారు. ఆ తర్వాత వేరే ప్రైవేట్ కంపెనీ ఢిల్లీ వారి నుంచి భూములు కొనుగోలు చేసిందని, ఏడాది తర్వాత తాను మార్కెట్ ధర చెల్లించి ఆ భూములు కొన్నానని వివరించారు. ఇందులో తప్పేముందని ప్రశ్నించారు. -
AP: అయోధ్య రామయ్యకు ‘శ్రీరామకోటి పట్టు వస్త్రం’
ధర్మవరం: అందరి బంధువు అయోధ్య రామయ్యకు ధర్మవరం నేతన్నలు అపూర్వ కానుకను అందజేసి తమ భక్తి ప్రవత్తులను చాటుకోనున్నారు. రామాయణ ప్రధాన ఘట్టాలను ప్రతిబింబిస్తూ 60 గజాల పట్టువస్త్రాన్ని.. రామాయణ మహాకావ్యాన్ని ప్రతిబింబించే చిత్రాలతో పాటు శ్రీరామ నామాలను 16 భాషల్లో డిజైన్ చేసి సమర్పించనున్నారు. ఈనెల 24వ తేదీన ఈ వస్త్రాన్ని అయోధ్యకు పంపేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. 4 నెలలు శ్రమించి.. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని నేసేపేటకు చెందిన జూజారు నాగరాజు ప్రముఖ పట్టుచీరల డిజైనర్. అయోధ్య రామాలయ నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి చేనేతల తరఫున శ్రీరామునికి ఏదైనా కానుక పంపాలని ఆలోచించి ఈ మహాత్కార్యానికి పూనుకున్నాడు. పల్లా సురేంద్రనాథ్, పల్లా తేజ అనే ఇద్దరు నేత కారి్మకుల సహకారంతో 4 నెలలు శ్రమించి 60 గజాల పట్టువస్త్రాన్ని తయారు చేసి మహాయజ్ఞాన్ని పూర్తి చేశాడు. ఈ పట్టు వ్రస్తానికి ‘శ్రీరామకోటి’ పట్టు వస్త్రంగా నామకరణం చేశాడు. 60 గజాల పొడవు..16 కేజీల బరువు చేనేత మగ్గంపై 6 గజాల పట్టుచీర తయారు చేయడం సర్వ సాధారణం. అయితే శ్రీరామకోటి పట్టు వ్రస్తాన్ని ఎంతో నైపుణ్యంతో 60 గజాల పొడవు, 44 ఇంచుల వెడల్పు 16 కేజీల బరువుతో తయారు చేయడం ఎంతో ప్రత్యేకత సంతరించుకుంది. ఇందుకోసం రూ.1.50 లక్షలు ఖర్చు చేశారు. వస్త్రం తయారీకి పట్టు, నూలు, లెనిన్, బనానాయార్న్, పాలిష్టర్తో పాటు గోల్డ్, సిల్వర్, కాపర్ జరీలు, వెల్స్పన్ తదితర ముడిపదార్థాలను వాడారు. పూర్తిగా ప్రకృతి సిద్ధమైన రంగులతో ఎటువంటి కెమికల్స్ వాడకుండా వస్త్రం తయారు చేయడం ఈ వస్త్రం ప్రత్యేకత. రామాయణంలో ప్రధాన ఘట్టాలు,168 రకాల చిత్రాలు రామాయణంలోని ప్రధాన ఘట్టాలైన శ్రీరాముని జననం, విద్యాభ్యాసం, పట్టాభిõÙకం, వనవాసం, సీతాపహరణం, రావణసంహారం, హనుమంతుని సంజీవని పర్వత ఘట్టాలను తెలుపుతూ పట్టు వ్రస్తాన్ని తయారు చేశారు. మొత్తం 168 రకాల చిత్రాలను అంచుల్లో రూపొందించారు. 16 భాషల్లో శ్రీరామ నామాలు డిజైన్ పట్టు వస్త్రం మధ్య భాగంలో ఆకుపచ్చ, తెలుపు, ఆనంద, మెరూన్, పింక్, చాక్లేట్, రాయల్బ్లూ, ఆలివ్గ్రీన్, వైట్ తదితర రంగుల్లో శ్రీరామ నామాలను తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్, మళయాళం, ఒరియా, గుజరాతీ, పంజాబీ, బెంగాళీ, ఉర్దూ, ఇంగ్లిష్, అస్సాం, సింహళ (శ్రీలంక) భాషల్లో లిఖించారు. పట్టువస్త్రంపై మొత్తం 32,200 రామనామాలు పొదిగారు. నాలుగు నెలలు శ్రమించాం.. ధర్మవరం నేతన్నల తరఫున శ్రీరామకోటి పట్టు వ్రస్తాన్ని తయారు చేయడం నా పూర్వ జన్మ సుకృతం. పట్టు వ్రస్తాన్ని పంపేందుకు ఆలయ ట్రస్ట్ సభ్యులకు సమాచారం ఇచ్చాం. వారి నుంచి అనుమతి రాగానే పట్టు వ్రస్తాన్ని పంపుతాం. –జూజారు నాగరాజు, డిజైనర్, ధర్మవరం. -
'సలార్' రిలీజ్: ప్రభాస్ వీరాభిమాని మృతితో..
శ్రీసత్యసాయి, సాక్షి: సలార్ సినిమా రిలీజ్ నేపథ్యంలో అభిమానులు పండుగు చేసుకుంటుండగా.. ఊహించని విషాదం చోటుచేసుకుంది. ధర్మవరంలో థియేటర్ వద్ద ప్రమాదవశాత్తూ ఓ వీరాభిమాని మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. పట్టణ కేంద్రంలోని రంగా సినిమా థియేటర్లో 'సలార్' సినిమా విడుదల సందర్భంగా బాలరాజు(27) థియేటర్ ఆవరణలో సలార్ మూవీ బ్యానర్ కడుతున్నాడు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు ఫ్లెక్సీ రాడ్ పైనున్న హై వోల్టేజ్ తీగలకు తగలడంతో షాక్కు గురై అక్కడికక్కడే కుప్పకూలాడు. వెంటనే దగ్గరలోని హాస్పిల్కి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు కన్నీటి పర్యంతమయ్యారు. మరోవైపు బంధువులు, ప్రభాస్ ఫ్యాన్స్ థియేటర్ వద్ద న్యాయం చేయాలంటూ, మృతిచెందిన బాలరాజు కుటుంబాన్ని ఆదుకోవాలంటూ ఆందోళన చేపట్టారు. ఇవి కూడా చదవండి: కామారెడ్డిలో దారుణం: క్షణికావేశంలో కొడుకును పొడిచి, ఆపై తండ్రి కూడా.. -
ధర్మవరంలో ప్రభాస్ ఫ్యాన్ మృతి
-
ధర్మవరంలో వైఎస్ఆర్ సీపీ సామాజిక సాధికార యాత్ర
-
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సీఎం జగన్
ధర్మవరం(శ్రీసత్యసాయి జిల్లా): వైఎస్సార్సీపీ తలపెట్టిన సామాజిక సాధికారిత బస్సుయాత్ర జైత్రయాత్రలా కొనసాగుతోంది. ఏడో రోజు బస్సుయాత్రలో భాగంగా జిల్లాలోని ధర్మవరంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ధర్మవరం పట్టణంలోని పోలీస్ స్టేషన్ నుంచి ఆర్డీవో కార్యాలయం వరకూ బస్సుయాత్ర సాగగా తహశీల్దార్ కార్యాలయం వద్ద బహిరంగ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరగ్గా, ప్రజలు భారీ సంఖ్యలో హాజరై సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గుమ్మనూరు జయరాం, మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు శంకర్ నారాయణ, డాక్టర్ సిద్ధారెడ్డి, దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, డాక్టర్ తిప్పేస్వామి, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ తదితరులు పాల్గొన్నారు. సభకు హాజరైన ప్రజలనుద్దేశించి పలువురు వైఎస్సార్సీపీ నేతలు ప్రసంగించారు. పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ మాట్లాడుతూ.. ‘ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్ద పీట వేశారు. సీఎం జగన్కు వెనుకబడిన వర్గాలు రుణపడి ఉండాల్సిన అవసరం ఉంది. అణగారిన వర్గాల విద్యార్థుల అభ్యున్నతి కోసమే ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు’ అని స్పష్టం చేశారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ.. ‘బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. సంక్షేమ పథకాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ లకే అత్యధిక లబ్ది చేకూరింది. బస్సుయాత్రను ఆపేశక్తి టీడీపీ, జనసేనలకు లేదు’ అని తెలిపారు. మాజీ ఎంపీ బుట్టా రేణుక మాట్లాడుతూ.. ‘నాకు రాజకీయ భిక్ష పెట్టింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సీఎం జగన్ పెద్దపీట వేశారు. బీసీ మహిళ అయిన నాకు టీడీపీలో సరైన గుర్తింపు ఇవ్వలేదు. కులగణన కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు. కులాలు మతాలు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు చారిత్రాత్మకం’ అని పేర్కొన్నారు. మంత్రి గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ.. ‘2024 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ కి మరోసారి పట్టం కట్టాలి. జగన్ సంక్షేమ పథకాలపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. జగన్ పాలనలో పేదలు మూడు పూటలా ఆహారం తింటున్నారు’ అని అన్నారు. మాజీ మంత్రి అనిల్కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ‘ సాధికార బస్సు యాత్ర లో నల్లజెండాలు ప్రదర్శించాలని లోకేష్ అంటున్నారు. గత ఐదు రోజులుగా చూస్తున్నా .. ఎవరైనా వస్తారని. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు అత్యధిక రాజకీయ ప్రాధాన్యత కల్పించిన ఘనత సీఎం జగన్దే. వెనుకబడిన వర్గాలకు నాలుగు రాజ్యసభ సీట్లు ఇచ్చిన ఘనత సీఎం జగన్దే. ఏపీలో సుపరిపాలన జరగకుండా చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు కుట్రలు. జగన్ను మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపైనే ఉంది. 2024 ఎన్నికల్లో వైఎస్సార్సీపీని 175 స్థానాల్లో గెలిపించాలి’ అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మాట్లాడుతూ.. ‘ సామాజిక న్యాయం సీఎం జగన్ వల్లే సాధ్యం. వెనుకబడిన వర్గాల ఉన్నత విద్య చదవాలనే మహానేత వైఎస్సార్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం తెచ్చారు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమే. ముస్లిం మైనార్టీల అభివృద్ధి కోసం సీఎం జగన్ చిత్తశుద్ధితో కృషి చేశారు’ అని నొక్కి చెప్పారు. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. ‘75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అన్యాయం జరిగింది. సమాజంలో 80 శాతం ఉన్న అణగారిన వర్గాలకు మేలు చేయాలన్న ఆలోచన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిదే. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పోరేషన్, మున్సిపల్, స్థానిక సంస్థల పదవులన్నీ బడుగు బలహీన వర్గాలకే ఇచ్చారు. సంక్షేమ పథకాలను డోర్ డెలివరీ చేస్తున్న ఘనత జగన్ ప్రభుత్వానిదే. గత నాలుగున్నరేళ్లలో ధర్మవరం నియోజకవర్గంలోనే రూ. 2500 కోట్ల లబ్ధి. వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్కు ప్రజలందరూ అండగా నిలవాలి’ అని ప్రజలను కోరారు. -
ప్రజల భద్రత గాలికి వదిలిన ‘నితిన్ సాయి’ కంపెనీ
ముదిగుబ్బ బైపాస్ రోడ్డు పనుల్లో నాణ్యత నగుబాటుగా మారింది. పనులు దక్కించుకున్న నితిన్సాయి కన్స్ట్రక్షన్స్ కంపెనీ నిబంధనలకు పాతరేస్తూ పైపై పూతలతో పనులు చేస్తోంది. రోడ్డు నిర్మాణంలో భాగంగా వేసిన బ్రిడ్జి పిల్లర్లు అప్పుడే బీటలు వారగా, కాంక్రీట్ వాల్ ఉబ్బిపోయింది. ఆమ్యామ్యాలకు అలవాటుపడిన అధికారులు కళ్లుమూసుకుని బిల్లులపై సంతకాలు చేసేస్తున్నారు. ధర్మవరం: ప్రజలకు మెరుగైన రహదారులు కల్పించి సుఖవంతమైన ప్రయాణం అందించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్రాన్ని ఒప్పించి మరీ ముదిగుబ్బకు బైపాస్ రహదారిని మంజూరు చేయించారు. అందులో భాగంగా 2021 డిసెంబర్లో రూ.116.81 కోట్ల వ్యయంతో ముదిగుబ్బ నుంచి 7.749 కిలోమీటర్ల పొడవున ఎన్హెచ్–42 బైపాస్ రోడ్డును నిర్మించేలా టెండరు పిలిచారు. మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరికి చెందిన నితిన్సాయి కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఈ పనులు దక్కించుకుంది. నిబంధనలకు పాతరేస్తూ బైపాస్ రోడ్డు పనుల్లో అంతులేని అక్రజుమాలకు పాల్పడుతోంది. నాణ్యత గాలికి.. బైపాస్ రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా నితిన్ సాయి కనస్ట్రక్షన్స్ ఇటీవల నిర్మించిన బ్రిడ్జి పనులను చూస్తే నాణ్యత తేటతెల్లమవుతోంది. బ్రిడ్జి నిర్మాణంలో నిలువు కాంక్రీట్ వాల్ వద్ద పగుళ్లు ఏర్పడ్డాయి. నాసిరకం కాంక్రీట్ మిశ్రమం వాడటం వల్లే ఇలా జరిగిందని నిపుణులు చెబుతున్నారు. అలానే బ్రిడ్జి ఉపరితలంలో మట్టికట్ట పనులు లేయర్ల వారీగా సరిగా చేయక పోవడంతో ఇరువైపులా ఉన్న ప్రీకాస్టెడ్ కాంక్రీట్ వాల్ బయటకు ఉబ్బింది. దీంతో నాసిరకం పనులు ఎక్కడ బయటపడతాయోనని కన్స్ట్రక్షన్స్ కంపెనీ సిమెంట్తో ప్లాస్టింగ్ చేసి మేకప్ చేసింది. పట్టించుకోని అధికారులు.. ముదిగుబ్బ బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి నాసిరకంగా జరుగుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదు. పైపెచ్చు పనుల నాణ్యతను పరిశీలించకుండానే విడతల వారీగా సదరు కంపెనీకి బిల్లులు మంజూరు చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికారుల సైతం నితిన్సాయి కన్స్ట్రక్షన్స్ కంపెనీతో లాలూచీ పడటంతోనే అవినీతి పెచ్చుమీరుతున్నట్లు తెలుస్తోంది. సెంట్రల్ విజిలెన్స్కు ఎంపీ మాధవ్ ఫిర్యాదు ముదిగుబ్బ బైపాస్ రోడ్డు నిర్మాణ పనులలో జరుగుతున్న అక్రమాలపై హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ సెంట్రల్ విజిలెన్స్ అధికారులకు లేఖ రాశారు. పనుల్లో అక్రమాలపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. బైపాస్ రోడ్డు, బ్రిడ్జి నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చూడాలని కోరారు. ‘విజిలెన్స్’పై కంపెనీ ప్రతినిధుల దౌర్జన్యం బైపాస్రోడ్డు నిర్మాణ పనులలో జరుగుతున్న అక్రమాలను విచారించేందుకు వెళ్లిన విజిలెన్స్ అధికారులపై గతంలో నితిన్సాయి కనస్ట్రక్షన్ కంపెనీ ప్రతినిధులు దౌర్జన్యం చేశారు. విజిలెన్స్ అధికారుల ల్యాప్టాప్ ఎత్తుకెళ్లడంతో పాటు పనులు పరిశీలించకుండా అడ్డుకున్నారు. దీంతో అధికారులు సైతం నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఏది ఏమైనా ప్రజల భద్రతతో ముడిపడి ఉన్న ఈ వ్యవహారంలో ఉన్నతాధికారులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి పనులు నాణ్యత జరిగేలా చూడాలని పలువురు కోరుతున్నారు. ఈ వ్యవహారంపై నేషనల్ హైవే ఈఈ మధుసూదన్ను వివరణ కోరేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా, ఆయన స్పందించలేదు. -
ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరికి ఎదురుదెబ్బ
-
ధర్మవరం మాజీ ఎమ్మెల్యేకు భారీ జరిమానా
అనంతపురం టౌన్: ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ (వరదాపురం సూరి)కు చెందిన స్టోన్ క్రషర్ యూనిట్ నిర్వహణలో భారీఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు. ఈ విషయం భూగర్భ గనుల శాఖ అధికారుల ఆకస్మిక తనిఖీల్లో బట్టబయలైంది. దీంతో ఏకంగా రూ.1.60 కోట్ల జరిమానా విధించారు. వరదాపురం సూరికి చెందిన నితిన్సాయి కన్స్ట్రక్షన్ సంస్థ పేరిట అనంతపురం రూరల్ మండలం క్రిష్ణంరెడ్డిపల్లి సమీపంలో సర్వేనంబర్ 40–4, 53లో స్టోన్ క్రషర్ యూనిట్ నిర్వహిస్తున్నారు. పక్కనే ఉన్న క్వారీ నుంచి రోడ్డు మెటల్ను క్రషర్లోకి తరలించి 40 ఎంఎం, 20 ఎంఎం, 12 ఎంఎం, 6 ఎంఎం..ఇలా వివిధ రకాల మెటల్(కంకర)తో పాటు డస్ట్గా మార్చి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే క్వారీలో నుంచి తరలించిన స్టాక్కు.. క్రషర్లోని స్టాక్కు భారీ వ్యత్యాసం ఉన్న విషయం ఇటీవల గనులశాఖ అధికారుల ఆకస్మిక తనిఖీలో వెల్లడైంది. 24 వేల క్యూబిక్ మీటర్లకు లెక్కలేదు! చియ్యేడు గ్రామ సమీపంలోని క్వారీ నుంచి తరలించిన రోడ్డు మెటల్.. క్రషర్లో ఉన్న రోడ్డు మెటల్ స్టాక్ వివరాల్లో భారీ వ్యత్యాసాన్ని గుర్తించిన అధికారులు క్వారీలో కొలతలు తీశారు. 24,370 క్యూబిక్ మీటర్లకు సంబంధించిన రోడ్డు మెటల్ వివరాలను క్రషర్ యూనిట్ నిర్వాహకులు రికార్డుల్లో నమోదు చేయకుండా.. ఎలాంటి సీనరేజీ చెల్లించకుండానే అక్రమంగా తరలించి సొమ్ము చేసుకున్నట్లు గుర్తించారు. ఆ మెటల్ ఎక్కడికి తరలించారో తెలపాలంటూ నితిన్సాయి కన్స్ట్రక్షన్ యాజమాన్యానికి అధికారులు నోటీసులు జారీ చేశారు. వీటిపై యాజమాన్యం ఏమాత్రమూ స్పందించలేదు. దీంతో అధికారులు అక్రమంగా తరలించిన రోడ్డు మెటల్కు ఎంత మొత్తం అవుతుందో లెక్కగట్టి ఐదు రెట్లు జరిమానా విధించారు. మొత్తం రూ.1.60 కోట్ల జరిమానా సకాలంలో ప్రభుత్వానికి చెల్లించాలంటూ నోటీసులు జారీ చేశారు. లేని పక్షంలో క్రషర్ యూనిట్ను సీజ్ చేస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు. భారీ స్థాయిలో అవకతవకలు జరిగాయి నితిన్సాయి కన్స్ట్రక్షన్కు చెందిన స్టోన్ క్రషర్ యూనిట్లో రోడ్డు మెటల్కు సంబంధించి భారీ స్థాయిలో అవకతవకలు జరిగాయి. క్వారీ నుంచి వచ్చిన మెటల్కు, క్రషర్లో ఉన్న స్టాక్కు మధ్య భారీ వ్యత్యాసాన్ని గుర్తించి యాజమాన్యానికి నోటీసులు జారీ చేసినా పట్టించుకోలేదు. దీంతో రూ.1.60 కోట్ల జరిమానా సకాలంలో చెల్లించాలని డిమాండ్ నోటీసులు పంపాం. క్వారీల్లో అక్రమ తవ్వకాలు, క్రషింగ్ చేపడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్న వారిని ఉపేక్షించం. ఆకస్మిక తనిఖీలు చేపట్టి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటాం. – నాగయ్య, గనుల శాఖ డీడీ, అనంతపురం -
ధర్మవరంలో అనసూయ, మెహ్రీన్ సందడి (ఫొటోలు)
-
గణేష్ మండపం వద్ద డ్యాన్స్ చేస్తుండగా గుండెపోటు.. కుప్పకూలిన యువకుడు
-
గణేష్ మండపం వద్ద డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన యువకుడు
గుండెపోటు.. ఈ మాట వింటేనే గుండె ఆగినంత పని అవుతుంది. అంతకంతకు పెరిగిపోతున్న గుండెపోటు మరణాలు అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఎవరి ప్రాణాలు ఎప్పుడు ఎలా పోతాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. వయసుతో సంబంధం లేకుండా ఎంతో ఆరోగ్యంగా ఉండే యువకులు సైతం సడెన్ హార్ట్ఎటాక్తో కుప్పకూలి ప్రాణాలు విడుస్తున్నారు. రదాగా ఆడుతూ పాడుతూ ఉత్సాహంగా గడిపిన వారు అప్పటికప్పుడే ప్రాణాలు విడిచిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.. తాజాగా అనంతపురం జిల్లా ధర్మవరంలో విషాదం చోటుచేసుకుంది.. పట్టణంలోని మారుతి నగర్లో వినాయక చవితి సందర్భంగా గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించారు. నవరాత్రుల్లో భాగంగా బుధవారం రాత్రి వినాయకుని మండపం ముందు డాన్స్ చేస్తూ ప్రసాద్ (26) అనే యువకుడు మృతి చెందాడు. అప్పటి వరకు ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేసిన ప్రసాద్ ఒక్కసారిగా కుప్ప కూలిపోయాడు. వెంటనే స్నేహితులు ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. -
సీఎం జగన్కు నేతన్నల సంఘీభావం.. ధర్మవరంలో భారీ ర్యాలీ
సాక్షి, సత్యసాయి జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నేతన్నల సంఘీభావం తెలిపారు. ఈ మేరకు చేనేత కార్మికులు ధర్మవరంలో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. కాగా రాష్ట్రంలోని చేనేత కార్మికులకు ప్రతి ఏటా నేతన్న నేస్తం పేరుతో సీఎం జగన్ ఆర్థిక సాయం అందజేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేతన్న నేస్తం పథకాన్ని స్వాగతిస్తూ లబ్దిదారులు భారీ ప్రదర్శన నిర్వహించారు. ధర్మవరం పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం నుంచి శివానగర్ దాకా సాగిన ర్యాలీలో.. జై జగన్ అంటూ ధర్మవరం చేనేత కార్మికులు నినాదాలు చేశారు. -
భూమి కబ్జాచేసి చంపేస్తామంటున్నారు.. పరిటాల శ్రీరామ్ నుంచి రక్షణ కల్పించండి
సాక్షి, పుట్టపర్తి(శ్రీసత్యసాయి జిల్లా): తెలుగుదేశం నాయకుడు పరిటాల శ్రీరామ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన చెరుకూరి వెంకటరాముడు సోమవారం ఎస్పీ రాహుల్దేవ్సింగ్కు ఫిర్యాదు చేశారు. తన భూమిని కబ్జా చేయడమేగాక దాన్ని రాసి ఇవ్వమంటున్నారని, లేకపోతే చంపేస్తామని ఆయన అనుచరులు బెదిరిస్తున్నారని తెలిపారు. పరిటాల సునీత కబ్జాచేసిన తన భూమిని తనకు ఇప్పించాలని, తనకు రక్షణ కల్పించాలని కోరారు. ‘నా ఆస్తిని కబ్జా చేశారు. నన్ను కిడ్నాప్ చేశారు. ఆ ఆస్తి రాసిస్తాననడంతో వదిలేశారు. కానీ తర్వాత నేను నా ఆస్తి ఇచ్చేది లేదని స్పష్టం చేయడంతో నన్ను హత్యచేసేందుకు కుట్ర పన్నినట్లు తెలిసింది. టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ అండతోనే ఆయన అనుచరులు ఇలా చేస్తున్నారు. వారి నుంచి రక్షణ కల్పించాలి..’ అని పేర్కొన్నారు. జిల్లా కేంద్రం పుట్టపర్తిలోని జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘స్పందన’లో ఆయన ఎస్పీకి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల మేరకు.. అనంతపురం రూరల్ మండలం కక్కలపల్లి రెవెన్యూ లో 141–2 సర్వే నంబరులో 9.81 ఎకరాల భూమి ఉంది. ఆ భూమి 1930 సంవత్సరం ముందు నుంచి వెంకటరాముడు పూర్వీకుల పేరిట ఉంది. తర్వాత మూడు భాగాలుగా పంచుకున్నారు. అందులో మూడోవంతు.. అంటే 3.27 ఎకరాలు చెరుకూరి వెంకటరాముడుకు దక్కింది. అందులో 1.63 ఎకరాలను ఆయన ఇతరులకు విక్రయించారు. మిగిలిన 1.64 ఎకరాల భూమిని తమకు రాసివ్వాలంటూ పరిటాల సునీత మంత్రిగా ఉన్నప్పటి నుంచి వేధిస్తున్నారు. అంతేకాకుండా మొత్తం 9.81 ఎకరాల భూమి ఇంకా సబ్ డివిజన్లు కాకపోవడంతో మొత్తం భూమిపై పరిటాల కుటుంబం కన్నేసింది.. అని వెంకటరాముడు పేర్కొన్నారు. గత నెల 17న కిడ్నాప్ భూమి విషయమై గత నెల 17వ తేదీన ధర్మవరంలో ఉన్న వెంకటరాముడును కిడ్నాప్ చేశారు. పరిటాల అనుచరులు దాదా ఖలందర్, చింతలపల్లి మహేశ్నాయుడు, ఎల్.నారాయణచౌదరి, లిక్కర్ సుధాకర్నాయుడు ప్రోద్బలంతో కుంటిమద్ది అక్కులప్ప తన గ్యాంగ్తో వచ్చి కిడ్నాప్ చేసినట్లు అప్పట్లోనే వెంకట రాముడు అనంతపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తుతెలియని చోటుకు తీసుకెళ్లి తనను తీవ్రంగా కొట్టారని, వారు కోరుకున్నట్లుగా భూమి రాసిస్తానని చెప్పిన తర్వాత అదేరోజు సాయంత్రం ప్రాణాలతో వదిలారని ఆ ఫిర్యాదులో తెలిపారు. చదవండి: టీడీపీ ‘సామాజిక’ చిచ్చు -
ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తో " స్ట్రెయిట్ టాక్ "
-
నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: ఎమ్మెల్యే కేతిరెడ్డి
సాక్షి, ధర్మవరం: ‘నువ్వు అవినీతి, అక్రమాల్లో పీకల్లోతు కూరుకుపోయావు. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ.. పూటకో మాట మాట్లాడతావు. ఏ ఆధారాలు లేకున్నా తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను మభ్య పెట్టాలని ప్రయత్నిస్తున్నావు. నువ్వో ఔట్ డేటెడ్ పొలిటీషియన్. వ్యక్తిత్వం లేని నీలాంటి వ్యక్తుల ప్రవర్తన జుగుప్స కల్గిస్తోంది. మరోసారి నాపై బురద జల్లాలని చూస్తే ఊరుకోను’ అని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ధర్మవరం బీజేపీ నేత వరదాపురం సూరిని హెచ్చరించారు. మంగళవారం ఎమ్మెల్యే తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఇటీవల మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి తనపై చేసిన ఆరోపణలన్నీ తప్పు అని ఆధారాలతో సహా వివరించారు. మార్కెట్ రేటుకు కొన్నాను 2015లో సూరి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే ధర్మవరం మండలం గరుడంపల్లి వద్ద ఓ ప్రైవేట్ కంపెనీ సోలార్ ప్రాజెక్ట్ పెట్టాలని భూములను కొనుగోలు చేసిందన్నారు. అయితే సదరు కంపెనీ ప్రతినిధులను సూరి రూ.4 కోట్లు డిమాండ్ చేయడంతో అంత ఇవ్వలేని వారు కంపెనీ ఏర్పాటు చేయకుండానే వెళ్లిపోయారన్నారు. ఈ విషయంపై అప్పట్లో అన్ని పత్రికల్లోనూ కథనాలు వచ్చాయని, వాటిని మీడియాకు చూపించారు. ఆ తర్వాత ఇన్నేళ్లకు ఆ భూములను సదరు ప్రైవేట్ కంపెనీ వేరొక కంపెనీకి విక్రయిస్తే తాను ఆ కంపెనీ నుంచి మార్కెట్ ధరకు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేశానని ఎమ్మెల్యే కేతిరెడ్డి వివరించారు. ఇదేమైనా తప్పా అని ప్రశ్నించారు. తన తాత సమితి అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచే తాము భూస్వాములమని, సూరి లాగా పేదల రక్తాన్ని పీల్చి ఉన్నత స్థాయికి ఎదగలేదన్నారు. తమకు డీజీపీ బంధువని సూరి పిచ్చిగా మాట్లాడుతున్నాడని, తనకు డీజీపీ ఏ విధంగా బంధువో తెలియజేయాలన్నారు. తాను ఆయనలాగే అధికారాన్ని దుర్వినియోగం చేయనన్నారు. ఇదే సూరి టీడీపీ ప్రభుత్వ హయాంలో డీజీపీగా జేవీ రాముడు ఉన్నప్పుడు ఆయన తనకు మామ అవుతారని పోలీసులపై స్వైర విహారం చేసిన మాట వాస్తవం కాదా.. అని ప్రశ్నించారు. పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చా ధర్మవరం ప్రెస్క్లబ్లో జరిగిన దాడి ఘటనలో నిందితులుగా ఉన్న తన అభిమానులపై కూడా చట్ట ప్రకారం కేసు కట్టించి రిమాండ్కు పంపామన్నారు. పోలీసులకు ఎంత స్వేచ్ఛ ఇచ్చామో ఈ ఒక్క ఉదాహరణ చాలన్నారు. తాను ధర్మవరం పట్టణంలో 20 వేల మందికిపైగా పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చానని, ఇందుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియలోనూ రైతులకు న్యాయం చేశానన్నారు. టీడీపీ హయాంలో రైతుల పొట్టగొట్టి ఎకరానికి రూ.5 లక్షలు ఇచ్చి భూసేకరణ చేసి వారికి అన్యాయం చేశారని, తాము రేగాటిపల్లి పొలాలను ఎకరాకు రూ.25 లక్షల పరిహారం అందించి భూసేకరణ జరిపి పేదలకు ఇళ్లపట్టాలు ఇచ్చామన్నారు. వరదాపురం సూరి చేసిన అవినీతి, అక్రమాలు, నిబంధనలకు పాతరేసి ఏ బ్యాంకులలో ఎన్ని రూ.కోట్ల రుణం తీసుకున్నారో త్వరలోనే బట్టబయలు చేస్తానని ఎమ్మెల్యే కేతిరెడ్డి స్పష్టం చేశారు. అభివృద్ధిపై మాట్లాడేందుకు నైతికత ఉందా? ధర్మవరం నియోజకవర్గంలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.3,387 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయని సూరి అబద్ధాలు చెప్పారని, వాటి తాలూకు ఆధారాలు చూపితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. నియోజకవర్గంలో గుర్తుండిపోయే పని ఒక్కటైనా చేశారా.. అని ప్రశ్నించారు. సూరి లాంటి నాయకులకు అభివృద్ధి గురించి మాట్లాడే నైతికత ఉందా..? అని ప్రశ్నించారు. చదవండి: (విజయవాడ: ఇంద్రకీలాద్రిపై ఓ భక్తురాలి అత్యుత్సాహం) -
ఇష్టానుసారం ఆరోపణలు చేస్తే సహించేది లేదు: కేతిరెడ్డి
-
ఇంతవరకూ ఓపిక పట్టా.. ఇకపై సహించే ప్రసక్తే లేదు: కేతిరెడ్డి
సాక్షి, ధర్మవరం: ‘‘నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తున్నాం. అందువల్లే జనమంతా మా వెంట నడుస్తున్నారు. దీన్ని జీర్ణించుకోలేని పచ్చ నేతలు ఎల్లో మీడియాలో తప్పుడు రాతలు రాయిస్తున్నారు. ఎక్కడ ఏం జరిగినా నాకు ఆపాదిస్తున్నారు. అయినా ఇంతవరకూ ఓపిక పట్టాను. ఇకపై సహించే ప్రసక్తే లేదు. అవాస్తవాలతో బురదజల్లుడు రాజకీయాలు చేస్తే ఊరుకోను’’ అని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఎల్లో మీడియా, టీడీపీ నాయకులను హెచ్చరించారు. శుక్రవారం ఆయన తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ►ఇటీవల కందిపంట ధ్వంసం... వైకాపా నాయకుడి దౌర్జన్యం అనే కథనాన్ని ఓ ఎల్లో మీడియా వండి వార్చిందన్నారు. కందిపంట సాగు చేసిన భూమిని 2004లోనే ప్రభుత్వం సేకరించి రైతు గోనుగుంట్ల రమణప్ప అనే టీడీపీ కార్యకర్తకు పరిహారం ఇచ్చిందన్నారు. ఆ తర్వాత భూమిలో పేదలకు ఇంటి పట్టాలు మంజూరు చేసిందన్నారు. ఈ క్రమంలో కొందరు ఆ భూమిలో కందిపంట సాగుచేయగా, అధికారులు తొలగించారన్నారు. దాన్ని కూడా ఎమ్మెల్యే అనుచరుల దౌర్జన్యమంటూ తప్పుడు కథనాలు రాస్తారా అని మండిపడ్డారు. ►ధర్మవరం పట్టణం సర్వే నంబర్ 661లోని స్థలం ఇరిగేషన్ శాఖ ఆధీనంలో ఉండగా, ఈ స్థలాన్ని ‘అమృత్’ పథకంలో భాగంగా సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్కు కేటాయించామన్నారు. కానీ ఎల్లో మీడియా మాత్రం దర్జాగా కబ్జా అంటూ కథనం అల్లేసిందన్నారు. అలాగే ఓ సర్వేనంబర్ 536లో స్థలాన్ని ఎవరో శుభ్రం చేయిస్తుంటే దాన్ని కూడా ఎమ్మెల్యే అనుచరులంటూ అసత్య కథనాలు ప్రచురిందని కేతిరెడ్డి మండిపడ్డారు. అలాగే అప్రాచెరువు సర్పంచ్ ఈశ్వర్రెడ్డి మార్కెట్ ధరకు స్థలం కొనుగోలు చేస్తే కబ్జా చేశారంటూ కథనాలు రాశారన్నారు. నియోజకవర్గంలో ఎక్కడ ఏం జరిగినా తప్పుడు రాతలు రాయడం ఎల్లో మీడియాకు దాని వెనుక ఉన్న పచ్చ నేతలకు అలవాటైందన్నారు. ఇప్పటికైనా ఇలాంటి నిరాధార కథనాలు రాయడం మానుకోవాలన్నారు. లేదంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఉనికి కోసమే విమర్శలు.. ధర్మవరం నియోజకవర్గంలోని టీడీపీ, బీజేపీ నాయకులకు కేతిరెడ్డిని విమర్శిస్తే తప్ప ఉనికిలేదన్నారు. భూకబ్జాల గురించి పరిటాల శ్రీరామ్ మాట్లాడటం చూస్తే నవ్వు వస్తోందన్నారు. అవినీతికి కేరాఫ్ అడ్రెస్గా మారిన వరదాపురం సూరి... చివరకు అక్రమంగా డీజిల్ను అమ్ముకునే స్థాయికి దిగజారారన్నారు. తాను ఆధారాలతో సహా సూరి అవినీతిని బయటపెడుతున్నానన్నారు. అనంతపురం నడిబొడ్డున రూ.వంద కోట్ల ప్రాపరీ్టని తన సొంత ఊరికి చెందిన సబ్ రిజి్రస్టార్తో దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకుని భూమిని కొట్టేయడం వాస్తవం కాదా.. అని ప్రశ్నించారు. అలాగే ముదిగుబ్బ మండలంలో 151 ఎకరాల ప్రభుత్వ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకుని స్వాహా చేయలేదా...? మీరా నన్ను విమర్శించేది అని ప్రశ్నించారు. ఇప్పటికైనా నీతిమాలిన రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. -
కట్టుకథలు..విషపురాతలు.. ఎమ్మెల్యే కేతిరెడ్డిని టార్గెట్ చేస్తూ కథనాలు
సాక్షి, ధర్మవరం: ఎల్లో మీడియా బరితెగించింది. వాస్తవాలను కప్పిపుచ్చుతూ విషపు రాతలతో జనానికి కనికట్టు కడుతోంది. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా శ్రమిస్తున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిని టార్గెట్ చేసింది. కట్టుకథలతో అసత్యాలు వల్లిస్తోంది. టీడీపీ డైరెక్షన్లో నిరాధార కథనాలు రాస్తూ ప్రజలను మభ్యపెట్టాలని ప్రయతి్నస్తోంది. కానీ వాస్తవాలు చూస్తున్న జనం ఎల్లో మీడియా తీరును బహిరంగంగానే కడిగిపారేస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లంటూ విష ప్రచారం ధర్మవరం నియోజకవర్గంలో అధికారులు పని చేయలేక రాజకీయ ఒత్తిళ్లతో సెలవులో వెళ్లి పోతున్నారంటూ ఇటీవల ఎల్లో మీడియా గగ్గోలు పెడుతోంది. డీఎస్పీ, తహసీల్దార్, సెబ్ ఇన్స్పెక్టర్, మున్సిపల్ కమిషనర్లు సెలవులో వెళ్లిపోయరాని తప్పుడు రాతలు రాసింది. వాస్తవాలు ఇలా... కొన్నిరోజుల క్రితమే డీఎస్పీ రమాకాంత్ వ్యక్తిగత కారణాలతో సెలవు పెట్టారు. ఆయన రెండేళ్లకుపైగా ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా విధులు నిర్వర్తించారు. రాజకీయ ఒత్తిళ్లే ఉంటే రెండేళ్లు ఇక్కడ ఎలా పనిచేస్తారని ప్రజలే చర్చించుకుంటున్నారు. ►తహసీల్దార్ నీలకంఠారెడ్డి నెల రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఆస్పత్రిలో చేరి చికిత్స అనంతరం ఇటీవలే విధుల్లోకి వచ్చారు. అయినా ఆరోగ్యం సహకరించక పోవడంతో వైద్యుల సూచన మేరకు..మరో నెల రోజులు సెలవు పెట్టారు. ►వారం రోజుల క్రితం సెబ్ ఇన్స్పెక్టర్ సైదుల్ తన డ్రైవర్పై విచక్షణా రహితంగా దాడి చేయడంతో బాధితుడు పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో సైదుల్పై కేసు నమోదు కాగా, అతను సెలవుపై వెళ్లారు. ►తాజాగా బుధవారం మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున వ్యక్తిగత పనుల నిమిత్తం 25 రోజులు సెలవు పెట్టారు. ఈ విషయాన్ని కమిషనరే స్వయంగా మీడియా ముఖంగా చెప్పారు. అయినా ఎల్లో మీడియా ప్రజా ప్రతినిధుల ఒత్తిళ్లతో కమిషనర్ సెలవులో వెళ్తున్నారని విష ప్రచారం చేసింది. ►ఇలా ఏ కారణంతో అధికారులు సెలవు పెట్టినా ఎమ్మెల్యేను టార్గెట్ చేస్తూ టీడీపీ, దాని అనుకూల ఎల్లోమీడియా కట్టుకథలతో విష ప్రచారం చేస్తున్నాయి. దీనిపై అధికారులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. సెలవునూ రాజకీయం చేస్తారా ? నేను ధర్మవరం మున్సిపల్ కమిషనర్గా రెండున్నరేళ్ల నుంచీ విధులు నిర్వర్తిస్తున్నా. ఏనాడూ రాజకీయ ఒత్తిళ్లు రాలేదు. నేను ఇంతవరకు ఎప్పుడూ ఎక్కువ రోజులు సెలవు తీసుకోలేదు. వ్యక్తిగత పనుల నిమిత్తం 25 రోజులు సెలవు పెట్టాను. దీన్ని రాజకీయం చేయడం బాధ కల్గిస్తోంది. సెలవు ముగియగానే మళ్లీ విధుల్లో చేరుతా. –మల్లికార్జున, మున్సిపల్ కమిషనర్, ధర్మవరం వైద్య చికిత్స కోసం సెలవు నేను ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాను. వైద్యుల సూచనతో విశ్రాంతి కోసం సెలవు పెట్టాను. దీన్ని రాజకీయం చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నా. ధర్మవరంలో రెండేళ్లకుపైగానే విధులు నిర్వర్తించా. ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వేచ్ఛగా పని చేశాను. మాపై తప్పుడు ప్రచారం చేయడం దుర్మార్గం. –నీలకంఠారెడ్డి, తహసీల్దార్, ధర్మవరం -
స్కూల్ పిల్లలకు లిఫ్ట్ ఇచ్చిన ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి
-
ఎమ్మెల్యే కారులో విద్యార్థులు బడికి..
సాక్షి, ధర్మవరం రూరల్: సాధారణంగా ఎమ్మెల్యే కారులో ఉన్నతస్థాయి అధికారులో లేకపోతే రాజకీయ నాయకులు, వారి బంధువులు కూర్చోవడం పరిపాటి. అయితే నడిచి పాఠశాలకు వెళ్తున్న విద్యార్థినులను తనకారులో ఎక్కించుకొని తానే స్వయంగా కారు నడుపుతూ వారి బడి వద్ద దిగబెట్టారు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి. వివరాల్లోకెళితే... శుక్రవారం ఉదయం గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో 5వ వార్డులో చేపట్టారు. అయితే కార్యక్రమం ముగిసిన తరువాత ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తన నివాసానికి బయలు దేరారు. ఆ సమయంలో కొంత మంది విద్యార్థినులు కళాజ్యోతి సర్కిల్ వద్ద ఉన్న జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలకు నడుచుకుంటూ వెళ్తున్నారు. విద్యార్థినులను గమనించిన ఎమ్మెల్యే ... కారులో ఉన్న వారిని దించివేసి ఆ విద్యార్థినులను తన కారులో ఎక్కించుకొని వారి పాఠశాల వద్ద దింపారు. దీంతో ఎమ్మెల్యే కారులో పాఠశాలకు వచ్చిన ఆ విద్యార్థినులు ఎంతో ఆనందపడిపోయారు. -
కలెక్టర్ సాబ్.. మీరు చేసిన పనికి హ్యాట్యాఫ్!
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ధర్మవరం జెడ్పీ హైస్కూల్... ఎస్.కోట మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాల. గత పాలకుల నిర్లక్ష్యంతో శిథిలావస్థకు చేరిన ఆ విద్యాలయం ఇప్పుడు ఆధునికీకరణకు అద్దం పడుతోంది. ధర్మవరం జెడ్పీ హైస్కూల్ స్టూడెంట్నని అక్కడి విద్యార్థులు ఇప్పుడు గర్వంగా చెప్పుకుంటున్నారు. దానికి రెండు కారణాలు... ఒకటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యారంగంలో చేపట్టిన విప్లవాత్మక సంస్కరణలు. మరొకటి అక్కడి పూర్వ విద్యార్థి, పల్నాడు జిల్లా కలెక్టరు లోతేటి శివశంకర్ కృషి. విద్యాబుద్ధులు నేర్పడమే గాక తాను ఐఏఎస్ అధికారి కావాలనే లక్ష్యానికి బీజం వేసిన పాఠశాలకు గురుదక్షిణ సమర్పించిన తీరు స్ఫూర్తిదాయకమైంది. సొంతంగా రూ.8.5 లక్షలు ఖర్చు చేసి డిజిటల్ లైబ్రరీని అందుబాటులోకి తెచ్చారు. ఏదో చేశామంటే చేశామని గాకుండా ఆధునికీకరణ, సౌకర్యాల కల్పన, పుస్తకాల బహూకరణ... ఇలా ప్రతి విషయంలోనూ ఆయన ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. లోతేటి శివశంకర్ పదో తరగతి (1995–96 బ్యాచ్) వరకూ ధర్మవరం జెడ్పీ హైస్కూల్లో చదివారు. తర్వాత ఐఏఎస్ సాధించి వివిధ హోదాల్లో పనిచేస్తున్నా ఆ స్కూల్ను ఆయన మరచిపోలేకపోయారు. అత్యున్నత సర్వీసు సాధించడంలో తనను స్ఫూర్తి ప్రదాతగా భావిస్తున్న విద్యార్థులకు తన వంతు తోడ్పాటు అందించడానికి ఇతోధికంగా కృషి చేస్తున్నారు. అప్పటికే తన పదో తరగతి బ్యాచ్ స్నేహితులతో కలిసి బాహుదా సేవాసంఘాన్ని ఏర్పాటు చేశారు. ధర్మవరం గ్రామంలో సేవా కార్యక్రమాలను ప్రారంభించారు. తిత్లీ తుఫాన్ సమయంలో దెబ్బతిన్న విద్యుత్తు వ్యవస్థను రెండ్రోజుల్లోనే పునరుద్ధరించగలిగారు. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో కూడా గ్రామంలో వైద్య సేవలు అందేలా ఆ సంఘం విశేష కృషి చేసింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యారంగంలో చేపట్టిన సంస్కరణలతో ధర్మవరం జెడ్పీ హైస్కూల్కు రూపురేఖలు మారాయి. మన బడి నాడు–నేడు కార్యక్రమం ఎంతో దోహదం చేసింది. ఆర్నెల్ల క్రితం ఆ పాఠశాలను సందర్శించిన శివశంకర్... అక్కడి విద్యార్థుల విద్యా మనోవికాసానికి ఉపయోగపడేలా డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తండ్రి పేరుతో రూ.8.5 లక్షల విరాళం.. డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేయడానికి పాఠశాల ప్రాంగణంలోనే ఒక హాల్ను శివశంకర్ ఎంపిక చేశారు. తన తండ్రి లోతేటి సన్యాసప్పడు పేరుతో రూ.8.5 లక్షల విరాళంగా సమకూర్చారు. ఆ నిధులతో చక్కని మార్చుల్స్, సీలింగ్, గోడలకు పుట్టీ, పెయింటింగ్తో ఆహ్లాదంగా ఆ హాల్ను అభివృద్ధి చేశారు. ఏసీ సౌకర్యంతో పాటు స్టడీ టేబుళ్లు, కుషన్ కుర్చీలు సమకూర్చారు. రెండు కంప్యూటర్లను ఏర్పాటు చేశారు. అంతేకాదు సీసీ కెమెరాలతో రక్షణ ఏర్పాట్లు చేశారు. ఇక పుస్తకాలను సమకూర్చడంలో శివశంకర్ తన వంతు కృషి చేశారు. తాను చదువుకున్న, సేకరించిన పుస్తకాలను లైబ్రరీకి ఇచ్చేశారు. చలం మాస్టారి సహకారంతో వైజ్ఞానిక, సాహిత్య, పోటీ పరీక్షల పుస్తకాలన్నీ అందుబాటులోకి తెచ్చారు. అవన్నీ భద్రంగా ఉంచేందుకు ప్రత్యేక కప్బోర్డులను ఏర్పాటు చేశారు. అత్యధిక కాలం లైబ్రరీలో పుస్తక పఠనంలోనే గడిపిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ను విద్యార్థులు స్పూర్తిగా తీసుకోవాలనే ఉద్దేశంతో ఆ డిజిటల్ లైబ్రరీకి ఆయన పేరుతోనే నామకరణం చేశారు. అంతేకాదు పుస్తక పఠనం వైపు విద్యార్థుల ఆసక్తిని పెంచడానికి పోటీ కూడా పెట్టారు. రానున్న దసరా సెలవుల్లో బాహుదా సేవాసంఘం సభ్యులు వారికి పోటీ పరీక్ష నిర్వహించనున్నారు. అందులో అత్యుత్తమ ప్రతిభ చూపిన తొలి 20 మంది విద్యార్థులను ఐదు రోజుల పాటు దేశ రాజధాని ఢిల్లీలో విజ్ఞాన యాత్రకు తీసుకెళ్తానని శివశంకర్ హామీ ఇవ్వడం విశేషం. -
Varadapuram Suri: భూ కుంభకోణాల 'వరద'.. రంగంలోకి ఏసీబీ
సాక్షి, పుట్టపర్తి: భారీ భూ కుంభకోణాల ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేత వరదాపురం సూరిపై ఏసీబీ విచారణ మొదలైంది. అనంతపురం జిల్లాలో భారీగా భూ అక్రమాలకు పాల్పడటంతో పాటు టీడీపీ హయాంలో అధికార బలంతో ప్రభుత్వ భూములను అక్రమంగా కొనుగోలు చేశారు. 2014–19 మధ్య కాలంలో ధర్మవరం ఎమ్మెల్యేగా ఉన్న వరదాపురం సూరి...ఆ సమయంలోనే రూ.కోట్లు విలువైన భూములను అక్రమంగా తీసుకున్నట్టు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండలం ముక్తాపురం పంచాయతీ పరిధిలోని చండ్రాయునిపల్లి గ్రామంలో 155 ఎకరాల ప్రభుత్వ భూములు అక్రమంగా కొనుగోలు చేశారని పలువురు ఫిర్యాదు చేశారు. గ్రామం చుట్టూ వరదాపురం సూరి భూములు కొనుగోలు చేయడం వల్ల చండ్రాయునిపల్లి గ్రామ వాసులు దారిలేక ఊరు వదిలి వెళ్లిపోయారు. ఈ ఆక్రమణలపై ఆర్డీఓ, తహసీల్దార్లకు గ్రామస్తులు పలుసార్లు మొరపెట్టుకున్నారు. చివరకు డిప్యూటీ కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ వేసి విచారణ చేయగా, సూరి అక్రమంగా భూములు కొనుగోలు చేశారని, వాటిని రద్దు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. అంతేకాకుండా క్రిమినల్ కేసు కూడా నమోదు చేయాలని ఆదేశాలిచ్చారు. కారుచౌకగా రూ.130 కోట్ల భూమిని కొట్టేసిన వైనం అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వంద గజాల సమీపంలోనే రూ.130 కోట్ల విలువైన భూమిని వరదాపురం సూరి అక్రమంగా కొనుగోలు చేశారు. అన్రిజిస్టర్డ్ డాక్యుమెంటు సృష్టించి కారుచౌకగా తన కుమారుడు గోనుగుంట్ల నితిన్ సాయితో పాటు అతని అనుచరుడి పేరుతో కొనుగోలు చేశారు. దీనిపై కూడా బాధితులు జిల్లా రిజిస్ట్రార్, సబ్రిజిస్ట్రార్, కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. సూరి భూ కుంభకోణాలపై పలువురు కలెక్టర్కు, ఎస్పీకి, ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) రంగంలోకి దిగింది. చదవండి: (బూతు రాజకీయాలు మానుకో సూరీ: ఎమ్మెల్యే కేతిరెడ్డి) సూరి కొనుగోలు చేసిన భూములు, అప్పట్లో జరిపిన లావాదేవీలు, ఆ సొమ్ములు ఎక్కడనుంచి వచ్చాయి తదితర వాటిని ఆరా తీస్తున్నారు. వరదాపురం సూరితో పాటు ఇందులో ఇంకా ఎవరైనా పాత్రధారులు ఉన్నారా... అన్న కోణంలోనూ ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. భూముల కొనుగోళ్లకు సంబంధించిన డాక్యుమెంట్లు పరిశీలించడంతో పాటు అధికారుల స్టేట్మెంట్లు రికార్డు చేస్తున్నారు. మరోవైపు సివిల్ పోలీసులు కూడా తమకు అందిన ఫిర్యాదుల మేరకు వరదాపురం సూరి అక్రమాలపై దర్యాప్తు చేయనున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్నప్పుడు ఫిర్యాదులు వచ్చాయి కాబట్టి అనంతపురం జిల్లా పోలీసులే దర్యాప్తు చేయనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా అనంతపురం జిల్లాలో భూఆక్రమణలపై ఇప్పటికే సబ్ రిజిస్ట్రార్ను సస్పెండ్ కూడా చేశారు. ఫిర్యాదుల మేరకే దర్యాప్తు వరదాపురం సూరి భూ ఆక్రమణలపై పలు ఫిర్యాదులు వచ్చాయి. ఆ మేరకే దర్యాప్తు చేస్తున్నాం. ఏసీబీ దర్యాప్తు మొదలైంది. ఏసీబీ తర్వాత మాకు వచ్చిన ఫిర్యాదులపై కూడా పూర్తిస్తాయిలో విచారణ చేస్తాం. అక్రమాలున్నట్టు తేలితే ఎంత పెద్ద వారున్నా చర్యలు తీసుకుంటాం. – డా.ఫక్కీరప్ప కాగినెల్లి, ఎస్పీ, అనంతపురం -
బూతు రాజకీయాలు మానుకో సూరీ: ఎమ్మెల్యే కేతిరెడ్డి
సాక్షి, ధర్మవరం (సత్యసాయి జిల్లా): ‘‘రాజకీయ నాయకుడంటే విలువలు ఉండాలి. కష్టమైనా.. నష్టమైనా కార్యకర్తలకు అండగా ఉండాలి. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడాలి. నీలా ఓడిపోయిన రెండు నెలలకే పార్టీ మారి కార్యకర్తలను గాలికి వదిలేయడం నాకు రాదు. పెయిడ్ ఆర్టిస్టులకు డబ్బులిచ్చి కుటుంబ సభ్యులను తిట్టిస్తే ఇకపై సహించేది లేదు’’ అని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరిని హెచ్చరించారు. శుక్రవారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. తాడిమర్రి మండలంలో ఆటోపై విద్యుత్ తీగ పడి చెలరేగిన మంటల్లో ఐదుగురు మృతి చెందగా.. ఒక్కో బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చామన్నారు. గాయపడ్డ వారికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేశామన్నారు. ఫ్యాక్షన్ వద్దనుకునే... ఫ్యాక్షనిజానికి దూరంగా ఉంచాలనే తన తల్లిదండ్రులు తనను విదేశాల్లో చదివించారని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తెలిపారు. తన తండ్రి చనిపోయిన తర్వాత ఇష్టం లేకపోయినా 2006లో రాజకీయాల్లోకి వచ్చానని, అందువల్లే ఫ్యాక్షన్ వద్దనుకుని అభివృద్ధివైపు అడుగులు వేస్తున్నానన్నారు. అందితే జుట్టు.. లేకపోతే కాళ్లు .. సంగాలలో పార్వతమ్మ అనే మహిళను కొట్టంలోకి వేసి సూరి నిప్పంటించాడనీ, రామలింగారెడ్డి అనే వ్యక్తిని జీపుకు కట్టేసి చంపాడని ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆరోపించారు. అక్కడి నుంచి అనంతపురం వెళ్లి అక్కడ పరిటాల రవితో సన్నిహితంగా ఉంటూ డబ్బులు సంపాదించాడన్నారు. అందితే జుట్టు, లేకపోతే కాళ్లు పట్టుకోవడం సూరి నైజమన్నారు. సూరి అనంతపురంలో భూకబ్జాలు చేయగా.. అప్పటి ఎస్పీ స్టీఫెన్ రవీంద్ర బహిష్కరణ చేస్తే రాష్ట్రం వదిలి వెళ్లిపోయాడన్నారు. సూరి అధికారంలో ఉన్నప్పుడు తన మనుషులతో పోలీసులపైనే దాడి చేయించాడన్నారు. సూరి అధికారంలో ఉన్నప్పుడు అరాచకమే తప్ప అభివృద్ధి ఎక్కడ జరిగిందని ప్రశ్నించారు. చదవండి: (ఈజ్ ఆఫ్ సెల్లింగ్లో బీజేపీ టాప్) ఇక సహించబోం.. జీతానికి, కులానికి ఒకరిని పెట్టుకుని నోటికి ఎంత పడితే అంత తిట్టిస్తే ఇక సహించబోమని కేతిరెడ్డి హెచ్చరించారు. కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులను తిడుతుంటే ఎవరైనా రెచ్చిపోతారన్నారు. కేతిరెడ్డిపై మాట్లాడితే క్రేజ్ వస్తుందని సూరి సోషల్ మీడియా వేదికగా తన అనుచరులతో బూతులు తిట్టిస్తున్నాడన్నారు. తాను 20, 30 ఏళ్లు రాజకీయాల్లో ఉండి ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాననీ, సూరి టీడీపీ టికెట్ కోసం అడ్డదారులు తొక్కుతున్నాడన్నారు. సోషల్ మీడియా ద్వారా తప్పులు చూపించాలి గానీ వ్యక్తిగత దూషణలు, బూతులు మాట్లాడితే సహించబోమన్నారు. నీ కొడుకు మీద ప్రమాణం చేయి.. ఆర్అండ్బీ రోడ్డు కబ్జా చేశావు అంటున్నావే ఎక్కడో చూపించు అని కేతిరెడ్డి... ప్రశ్నించారు. వ్యాపారులు ఆర్అండ్బీ స్థలంలో సొంత ఖర్చుతో రోడ్డు వేసుకుంటుంటే నేను కబ్జా చేసినట్టా? కరెంటు వైరు తెగి ప్రమాదం జరిగితే కాంట్రాక్టర్తో కమీషన్ తీసుకున్నాడని నీచంగా మాట్లాడుతావా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ కొడుకు మీద ప్రమాణం చేయి.. సోలార్ కంపెనీ నీకు భయపడి వెనక్కి పోలేదా? అని ప్రశ్నించారు. కర్ణాటక బ్యాంకుల్లో లోన్లు ఎలా తెచ్చుకుంటున్నావో చెప్పాలా అని సూరిని కేతిరెడ్డి ప్రశ్నించారు. 151 ఎకరాలు భూకబ్జా చేశావని కలెక్టర్ నాగలక్ష్మి నిర్ధారించారన్నారు. చేనేతలకు డబ్బులు ఎగ్గొట్టిన కళానికేతన్ వాళ్లతో ఎంత డబ్బు వసూలు చేశావో అందరికీ తెలుసన్నారు. -
వరదాపురం X పరిటాల.. ఢీ అంటే ఢీ! కొనసాగుతున్న మాటల యుద్ధం
ధర్మవరం టౌన్ (సత్యసాయి జిల్లా): నియోజకవర్గంలో టీడీపీ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్, బీజేపీ నాయకుడు వరదాపురం సూరి మధ్య కోల్డ్వార్ జరుగుతోంది. వారి అనుచరులు తీవ్రమైన విమర్శలు చేసుకుంటూ వారి హయాంలో చేసిన ‘ఘన కార్యాలను’ దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ధర్మవరంలో 300 మంది అమాయకులను అంతం చేసిన చరిత్ర పరిటాల కుటుంబానిదని సూరి వర్గం ఆరోపిస్తుండగా... ఎన్నికల్లో ఓడిపోయిన నెలరోజలకే పార్టీ మారి కార్యకర్తలను నట్టేట ముంచిన చరిత్ర వరదాపురం సూరిదని పరిటాల వర్గం విమర్శలు గుప్పిస్తోంది. తాజాగా ఈ ఇద్దరి నాయకులు తమ అనుచరులతో చేనేత వ్యాపారులు, సామాన్య ప్రజలను బెదిరింపులకు గురిచేయడం విమర్శలకు తావిస్తోంది. ఓటమితో పార్టీ మారిన సూరి.. 2019 ఎన్నికల్లో ధర్మవరం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించడంతో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన గోనుగుంట్ల సూర్యనారాయణ వెంటనే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి పరిస్థితుల్లో టీడీపీ అధిష్టానం ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్గా పరిటాల శ్రీరామ్ను ప్రకటించింది. అప్పటి నుంచి పార్టీ కార్యకలాపాలు అతనే నడిస్తున్నాడు. దీంతో ధర్మవరం టీడీపీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. నేసేపేట కేంద్రంగా బెదిరింపుల పర్వం.. ధర్మవరంలోని నేసేపేటలో తటస్తులైన వ్యాపారులు ఎందరో ఉన్నారు. వారిపై ఇటు సూరి వర్గం, అటు పరిటాల శ్రీరామ్ వర్గం బెదిరింపులకు దిగుతున్నాయి. తమ నాయకుడు త్వరలోనే టీడీపీలో చేరి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాడని, వచ్చి కలవాలని చేనేత వ్యాపారులను సూరివర్గం ఒత్తిడి తెస్తోంది. మరోవైపు పరిటాల శ్రీరామ్ అనుచరులు కూడా వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా శ్రీరామ్ను ప్రకటిస్తారని, తమ నాయకున్ని వచ్చి కలవాలని చెబుతున్నారు. దీంతో ఏ పార్టీకి సంబంధం లేని వ్యాపారులు ఎవరిదగ్గరకు వెళితే ఏం అడుగుతారో..ఏం జరుగుతుందోనని భయబ్రాంతులకు గురవుతున్నారు. టీడీపీ హయాంలో భారీ దందా.. టీడీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే పరిటాల రవీంద్ర అనుచరులు పరిటాల పేరు చెప్పి నేసేపేటలో ఎందరో వ్యాపారులను బెదిరించి డబ్బు వసూలు చేసిన సందర్భాలున్నాయి. ఇటు వరదాపురం సూరి ఎమ్మెల్యేగా పని చేసిన సమయంలోనూ చేనేత వ్యాపారులను బెదిరించి సెటిల్మెంట్లు చేసి భూములు లాక్కున్నారన్న ఆరోపణలున్నాయి. తాజాగా ఇద్దరు నేతలూ తమను కలవాలని అనుచరులతో ఒత్తిడి చేయిస్తుండటంతో నేసేపేటలోని వ్యాపారులు, సామాన్యులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పరిటాల కుటుంబంపై తీవ్రమైన ఆరోపణలు.. ధర్మవరంలో టీడీపీ నేతలను తమ వైపు తిప్పుకునేందుకు వరదాపురం సూరి అనుచరులు పరిటాల కుటుంబం చేసిన ఆగడాలను ఒక్కొక్కటిగా వివరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సూరి అనుచరుడు పెద్దిరెడ్డి అరవిందరెడ్డి పరిటాల కుటుంబంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. పరిటాల రవీంద్ర హయాంలో ధర్మవరంలో నరమేధం సృష్టించారని, దాదాపు 300 మందిని హత్య చేశారని ఆరోపించారు. ఇప్పటికీ ఆ 300 మంది ఆచూకీ తెలియదన్నారు. కుటుంబ పాలనతో రాప్తాడులో టీడీపీని భూస్థాపితం చేసి ధర్మవరం వచ్చారని, అటువంటి వారికి టీడీపీ టిక్కెట్ కచ్చితంగా రాదన్నారు. సూరిపై ఎదురు దాడి.. పరిటాల అనుచరులు ఇటీవల మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎదురుదాడి చేశారు. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత కార్యకర్తలను గాలికి వదిలేసి స్వార్ధం కోసం బీజేపీలోకి చేరిన వరదాపురం సూరికి విలువల్లేవని ఆరోపించారు. రోజూ టీడీపీలోకి వస్తామని చెబుతూ టీడీపీ కార్యకర్తలను, పట్టణ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. టీడీపీలోకి రావాలంటే పరిటాల శ్రీరామ్ కండువా కప్పాలన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. నీచ రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్న సూరి మాటలు నమ్మవద్దన్నారు. ఆ చీకటి రోజులు రావొద్దని కోరుకుంటున్న జనం.. టీడీపీ ప్రభుత్వ పాలనను తలచుకుని జనం భయాందోళనలు చెందుతున్నారు. పట్టణానికి చెందిన నిమ్మల కుంట వెంకటేశ్ అనే వ్యక్తికి సంబంధించిన భూములను లాక్కునేందుకు పరిటాల అనుచరులు ఏకంగా అతన్ని కిడ్నాప్ చేయడం అప్పట్లో పెను సంచలనంగా మారింది. విద్యుత్ కేబుల్ పనుల విషయంలో గుడ్విల్ ఇవ్వలేదన్న కారణంతో గుట్టకిందపల్లి వద్ద జరుగుతున్న పనులను అప్పటి ఎమ్మెల్యే వరదాపురం సూరి నిలిపి వేయడయంతో పరిటాల శ్రీరామ్ అనుచరులు, సూరి అనుచరులు రాళ్ల దాడిచేసుకున్న విషయాన్ని గుర్తుచేసుకుంటున్నారు. ఇక తన మాట వినడం లేదన్న కారణంతో వరదాపురం సూరి అనుచరుడు ఏకంగా పోలీస్స్టేషన్ ఆవరణలోనే కానిస్టేబుల్ను చెంపదెబ్బకొట్టడాన్ని తలచుకుని ఆ చీకటి రోజులు మళ్లీ రాకూడదని కోరుకుంటున్నారు. ఏది ఏమైనా∙వీరిద్దరి మాటల యుద్ధం, బెదిరింపుల పర్వం కారణంగా ప్రశాంతంగా ఉండే ధర్మవరంలో అశాంతి రాజుకుంటోంది. -
24 ఏళ్ల క్రితం పెళ్లి.. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం.. భర్త అడ్డొస్తున్నాడని
సాక్షి, శ్రీ సత్యసాయి జిల్లా: వివాహేతర సంబంధానికి అడ్డు తగిలిన భర్తను తానే హతమార్చినట్లు నిందితురాలు పోలీసుల ఎదుట అంగీకరించింది. వివరాలను బుధవారం ధర్మవరం అర్బన్ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రమాకాంత్ వెల్లడించారు. ధర్మవరంలోని దుర్గానగర్కు చెందిన పల్లపు గంగాధర్కు 24 సంవత్సరాల క్రితం లక్ష్మీదేవితో వివాహమైంది. బేల్దారి పనులతో కుటుంబాన్ని పోషించేవాడు. ఈ క్రమంలోనే స్థానిక ఎరికల ముత్యాలు, ఎరికల పుల్లక్క, ఎరికల నగేష్, మరికొందరితో దాదాపు రూ.8 లక్షల వరకు అధిక వడ్డీకి గంగాధర్ అప్పులు చేసి భార్య చీరల వ్యాపారానికి సమకూర్చాడు. కొన్నేళ్లుగా లక్ష్మీదేవి తారకరామాపురానికి చెందిన నారా భాస్కరరెడ్డితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లుగా తెలుసుకున్న గంగాధర్ ఆమెను పలుమార్లు హెచ్చరించాడు. ఆమెలో మార్పు రాకపోవడంతో మద్యానికి బానిసయ్యాడు. తన వివాహేతర సంబంధానికి అడ్డు తగులుతుండడంతో ఎలాగైనా భర్తను అంతమొందించాలని లక్ష్మీదేవి నిర్ణయించుకుంది. తన అన్న వెంకటేష్, ఆమె అల్లుడు సుధాకర్కు డబ్బు ఆశ చూపి వారి సాయంతో ఏప్రిల్ 8న అర్ధరాత్రి 1.30గంటల సమయంలో ఎల్పీ సర్కిల్లోని రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద మద్యం మత్తులో పడి ఉన్న గంగాధర్పై బండరాయి, ఇనుప పైపులు వేసి, గొంతు నులిమి హతమార్చింది. చదవండి: తిరుమల బాలుడి కిడ్నాప్ కేసు సుఖాంతం.. కిడ్నాపర్ ఎవరంటే..? మరుసటి రోజు అప్పులు ఇచ్చిన వారే తన భర్తను హత్య చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తులో లక్ష్మీదేవి ప్రవర్తనపై అనుమానాలు రేకెత్తడంతో విషయం తెలుసుకున్న ఆమె, మిగిలిన ఇద్దరు పరారయ్యారు. బుధవారం ఉదయం వీఆర్వో ద్వారా పోలీసులకు లొంగిపోయారు. హత్యకు దారి తీసిన పరిణామాలను ఈ సందర్భంగా పోలీసులకు నిందితులు వివరించారు. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. -
ఏపీలోనే ప్రథమ స్థానం.. పట్టు.. ‘కొత్త’గా మెరిసేట్టు..
ధర్మవరం...పేరు చెబితే వెంటనే గుర్తొచ్చేది పట్టుచీర. రక్షా బంధన్ చీర, కట్టుకుంటే సంగీతం వినిపించే మ్యూజికల్ చీర, పూల వాసన గుబాళించే సంపంగి చీర, వాతావరణాన్ని బట్టి రంగు మారే చీర, భారతీయ కళలు, సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడే చీరలు.. ఇక్కడి నేతన్నల నైపుణ్యానికి నిదర్శనం. 120 ఏళ్ల చరిత్ర కలిగిన ధర్మవరం చీరకు ప్రభుత్వం భౌగోళిక గుర్తింపు కూడా ఇచ్చింది. నూతన జిల్లా శ్రీసత్యసాయి మకుటంలో ధర్మవరం పట్టుచీర మణిలా మెరుస్తోంది. రానున్న రోజుల్లో మరింత ప్రకాశించనుంది. చదవండి👉: మారేడు తెచ్చి.. నన్నారి షర్బత్ చేసి.. ధర్మవరం టౌన్(శ్రీసత్యసాయి జిల్లా): జిల్లాకు ధర్మవరం పట్టుచీర కీర్తికిరీటంలా నిలుస్తోంది. రాష్ట్రంలో 28 వేల మగ్గాలు ఉన్న ఏకైక ప్రాంతం ధర్మవరం. ఇక్కడి నేతన్నలు దేశంలోని ఇతర రాష్ట్రాలకే కాక, విదేశాలకు సైతం పట్టుచీరలను ఎగుమతి చేస్తూ అగ్రస్థానంలో నిలుస్తున్నారు. ఇక్కడి మార్కెట్లో సగటున వారానికి రూ.100 కోట్ల దాకా పట్టుచీరల బిజినెస్ జరుగుతోంది. ధర్మవరం నేతన్నల పనితనాన్ని గుర్తించి భారత ప్రభుత్వం ధర్మవరం పట్టుచీరకు భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఇండికేషన్)ను ఇచ్చింది. ఉపాధికి ఊతం శ్రీసత్యసాయి జిల్లా వ్యాప్తంగా ధర్మవరం, పుట్టపర్తి, కొత్తచెరువు, గోరంట్ల, బుక్కపట్నం, సోమందేపల్లి, పెనుకొండ, హిందూపురం, చిలమత్తూరు మండలాల్లో 28 వేల దాకా చేనేత మగ్గాలున్నాయి. ఒక్క ధర్మవరం పట్టణంలోనే 20 వేల మగ్గాలున్నాయి. చేనేత మగ్గాలతో పాటు పట్టుచీరల తయారీలో 18 దాకా అనుబంధ రంగాలు ఉంటాయి. రంగుల అద్దకం, డోలు చుట్టడం, పాలిషింగ్, పురిమిషన్, బోట్లు చుట్టడం, రేషం చుట్టడం, అచ్చులు అతకడం తదితర వాటిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష మంది దాకా ఉపాధి పొందుతున్నారు. ఫ్యాషన్ ప్రపంచానికి దీటుగా డిజైన్లు మారుతున్న ఫ్యాషన్ ప్రపంచానికి దీటుగా ఇక్కడి డిజైనర్లు ఎప్పటికప్పుడు కొత్త డిజైన్లు రూపొందిస్తున్నారు. వందమంది దాకా పట్టుచీరల డిజైనర్లు చేనేత రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. వివాహ శుభకార్యాల దగ్గర నుంచి సినీ మోడళ్లు, సెలబ్రిటీలు ధరించే చీరల కోసం ఇక్కడి డిజైనర్లు వినూత్న డిజైన్లతో ఆకట్టుకుంటున్నారు. ధర్మవరం పట్టుచీర జరీ, మోడల్, డిజైన్బట్టి రూ.5 వేల నుంచి రూ.10 లక్షల వరకు ఉంటుంది. భౌగోళిక గుర్తింపు ధర్మవరం నేతన్న ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం 2014లో ధర్మవరం పట్టుచీరలు, పావుడాలకు భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఇండికేషన్) ఇచ్చింది. దీని ద్వారా ధర్మవరం పట్టుచీర డిజైన్లు ఎక్కడా తయారు చేయకూడదు. ఒక వేళ ఇతర ప్రాంతాల్లో ధర్మవరం నేతన్నల డిజైన్లు నేస్తే చర్యలు తీసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. దేశ, విదేశాలకు ఎగుమతులు ధర్మవరంలో తయారైన పట్టుచీరలు ప్రధానంగా కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, న్యూఢిల్లీ, కేరళ రాష్ట్రాలతో పాటు అమెరికా, సౌదీ అరేబియా, న్యూజిల్యాండ్ తదితర దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ధర్మవరంలో 1,800 దాకా సిల్్కషాపులుండగా.. వీటి ద్వారా పట్టుచీరలను కొనుగోలు చేయడం, ఆపై షోరూంలకు హోల్సేల్గా ఎగుమతి అవుతాయి. ధర్మవరం నేసేపేటలోని పట్టుచీరల మార్కెట్లో వారానికి సగటున రూ.100 కోట్ల దాకా టర్నోవర్ జరుగుతోంది. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ధర్మవరం పట్టణాన్ని, చేనేత రంగాన్ని మరింత అభివృద్ధి చేసి శ్రీసత్యసాయి జిల్లాకు వన్నె తేవాలని నేతన్నలు కోరుతున్నారు. చేనేతకు మంచిరోజులు శ్రీసత్యసాయి జిల్లా ఏర్పాటుతో ధర్మవరం చేనేతలకు మంచిరోజులు వచ్చాయి. పుట్టపర్తి ఎయిర్పోర్టును అభివృద్ధి చేసి వివిధ రాష్ట్రాల నుంచి విమానాల రాక పోకలకు అనుమతినిస్తే వ్యాపారులు ఎక్కువ మంది ధర్మవరం వచ్చే అవకాశం ఉంటుంది. సరుకు ఎగుమతులకూ వీలు కలుగుతుంది. తద్వారా వ్యాపారం మరింత జోరందుకుంటుంది. –రంగన శ్రీనివాసులు, పట్టుచీరల వ్యాపారి, ధర్మవరం జాతీయ అవార్డు అందుకున్నా ప్రస్తుత ఫ్యాషన్ ప్రపంచంలో మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త డిజైన్లను ఎప్పటికప్పుడు రూపొందిస్తున్నాం. మేము తయారు చేసే చీరలు దేశంలోని ఇతర రాష్ట్రాలకే కాక, ఎక్కువగా అమెరికా, సౌదీ దేశాలకు పంపుతుంటాం. నేను తయారు చేసిన పట్టుచీర డిజైన్లకు రాష్ట్ర స్థాయిలో రెండు, జాతీయ స్థాయిలో ఒక అవార్డు లభించింది. –నాగరాజు, క్లస్టర్ డిజైనర్, ధర్మవరం. అంతర్జాతీయంగా గుర్తింపు తెస్తాం ధర్మవరం నేతన్నల నైపుణ్యంతో తయారైన పట్టుచీరలను కొందరు వ్యాపారులు కంచిపట్టు చీరలుగా చెలామణి చేస్తున్నారు. అందువల్లే ధర్మవరం నేతన్నకు అనుకున్నంత పేరు రాలేదు. భౌగోళి గుర్తింపు దృష్ట్యా ధర్మవరం పట్టుచీరకు ఉన్న ప్రత్యేకత తెలియజేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రానున్న రోజుల్లో ధర్మవరంలో తయారయ్యే పట్టుచీరలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తాం. –కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్యే, ధర్మవరం. -
ఉత్సాహంగా పయనం.. గమ్యం చేరకముందే ఘోరం..
ధర్మవరం టౌన్(అనంతపురం జిల్లా) : నిశ్చితార్థ వేడుక ఘనంగా చేయాలనుకున్నారు. దగ్గరి బంధువులందరినీ పిలిచారు. ప్రైవేటు బస్సును అద్దెకు తీసుకుని సంతోషంగా బయలుదేరారు. తిరుచానూరులో కార్యక్రమం కావడంతో అందరిలోనూ ఉత్సాహం కనిపించింది. తిరిగొచ్చేటప్పుడు తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని రావచ్చనుకున్నారు. కానీ గమ్యం చేరకముందే ఘోరం జరిగిపోయింది. శనివారం రాత్రి చిత్తూరు జిల్లా భాకరాపేట వద్ద ఘాట్రోడ్డులో బస్సు లోయలోకి బోల్తా పడింది. అర్ధరాత్రి వరకు అందిన సమాచారం మేరకు ప్రమాదంలో ఆరుగురు చనిపోయారు. 49 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో పలువురు ధర్మవరం పట్టణంలోని మారుతీనగర్కు చెందిన వారు కాగా..మరికొందరు చెన్నేకొత్తపల్లి మండలం బసంపల్లి వాసులు. దీంతో ఆయా ప్రాంతాల్లో విషాదం నెలకొంది. చదవండి: 300 అడుగుల లోతు.. చిమ్మ చీకటి.. ప్రాణాలను ఫణంగా పెట్టి.. ఉత్సాహంగా పయనం..మధ్యలో విషాదం ధర్మవరం పట్టణంలోని మారుతీనగర్కు చెందిన మలిశెట్టి మురళి, లలిత దంపతులు. వీరికి కుమారుడు వేణు, కుమార్తె కోమలి సంతానం. మురళి పట్టణంలో సిల్్కహౌస్ నిర్వహిస్తున్నాడు. వేణు తండ్రికి చేదోడుగా ఉంటున్నాడు. వేణుకు పుత్తూరు సమీపంలోని నారాయణవనంకు చెందిన అమ్మాయితో నిశి్చతార్థం కుదిరింది. ఆదివారం తిరుచానూరులోని రాధాకృష్ణ కల్యాణ మండపంలో నిశ్చితార్థ వేడుకను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ధర్మవరం నుంచి శనివారం ఉదయం 11 గంటలకు కేఏ 30ఏ 4995 నంబర్ బస్సులో బయలుదేరారు. మలిశెట్టి మురళి కుటుంబంతో పాటు వారి బంధువులు, పరిచయస్తులు అదే కాలనీకి చెందిన మునుస్వామి, సరస్వతి, కాంతమ్మ (వేణు పిన్ని), సునీత, శశితో పాటు పలు ప్రాంతాలకు చెందిన 55 మంది పయనమయ్యారు. అయితే..బస్సు మార్గమధ్యంలోని భాకరాపేట ఘాట్రోడ్డులో 300 అడుగుల లోతున్న లోయలోకి పడిపోయింది. అతి వేగంతో పాటు ఫిట్నెస్ లేని బస్సు కావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి, 49 మందికి తీవ్ర గాయాలయ్యాయన్న సమాచారం రావడంతో ధర్మవరంలోని బంధువులు, కాలనీ వాసులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. క్షతగాత్రుల్లో పెళ్లికుమారుడు వేణు కూడా ఉన్నాడు. మలిశెట్టి మురళి పట్టణంలో చేనేత ప్రముఖుడు కావడంతో చాలా మంది చేనేతలు నిశ్చితార్థానికి బయలుదేరి వెళ్లారు. దీంతో ఘటనలో తమ వారికి ఏమైందోనన్న ఆందోళనలో కుటుంబ సభ్యులు ఉన్నారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ వైస్చైర్మన్ చందమూరి నారాయణరెడ్డి బాధితుల బంధువులను పరామర్శించి..ధైర్యం చెప్పారు. దిక్కుతోచడం లేదు మా అన్న కుమారుడు మలిశెట్టి వేణు నిశ్చితార్థానికి మా కుటుంబ సభ్యులంతా బయలు దేరి వెళ్లారు. కొద్దిసేపటి క్రితమే బస్సు లోయలో పడిందని టీవీలో చూశాను. ఎవరికి ఏమయ్యిందోనన్న బాధతో దిక్కుతోచడం లేదు. –మలిశెట్టి శివ, మారుతీనగర్, ధర్మవరం ఫొటోలు తీయడానికి వెళ్లి.. చెన్నేకొత్తపల్లి మండలం బసంపల్లికి చెందిన రామాంజినమ్మ, వెంకటేశులు కుమారుడు చంద్రశేఖర్ (28) ధర్మవరంలోని ఓ స్టూడియోలో ఫొటోగ్రాఫర్గా పనిచేస్తున్నాడు. నిశ్చితార్థ వేడుకలో ఫొటోలు తీయడం కోసం బయలుదేరాడు. ప్రమాదంలో అతను చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అతనికింకా వివాహం కాలేదు. అక్క కుమారుడి నిశ్చితార్థం చూడాలని.. అక్క కుమారుడి నిశ్చితార్థ వేడుక చూడాలని సంతోషంగా బయలుదేరిన కాంతమ్మ (52) బస్సు ప్రమాదంలో చనిపోయింది. ఈమె వేణుకు స్వయాన పిన్ని కావడం గమనార్హం. ఈమె భర్త శివ ధర్మవరంలోనే ఉండిపోయాడు. భార్య చనిపోయిందన్న వార్త విని తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. -
సుజన, వెంకటకృష్ణ మధ్య మనస్పర్థలు.. అర్ధరాత్రి దాటాకా..
సాక్షి, ధర్మవరం (అనంతపురం): అదనపు కట్నం వేధింపులు తాళలేక ఓ బ్యాంక్ ఉద్యోగి భార్య ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. ధర్మవరంలోని నేసేపేటకు చెందిన వెంకటకృష్ణ.. తాడిమర్రిలోని ఎస్బీఐ శాఖలో పనిచేస్తున్నారు. 2016లో వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన కొండయ్య, గంగాదేవి దంపతుల కుమార్తె వెంకట సుజన (26)ను పెళ్లి చేసుకున్నారు. పెళ్లి సమయంలో రూ.18 లక్షల కట్నం, 30 తులాల బంగారు నగలను సుజన తల్లిదండ్రులు అందజేశారు. కొన్నేళ్లు వీరి కాపురం సజావుగా సాగింది. ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొంత కాలంగా సుజన, వెంకటకృష్ణ మధ్య మనస్పర్థలు చెలరేగి తరచూ గొడవపడేవారు. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటిపైన మూడో అంతస్తులో సుజన ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చదవండి: (ఇంటర్ విద్యార్థినితో పరిచయం పెంచుకొని.. పలుమార్లు అత్యాచారం) ఆదివారం ఉదయం ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, అదనపు కట్నం కోసమే వేధింపులకు గురిచేసి తమ కుమార్తెను హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించారంటూ వెంకటకృష్ణ కుటుంబసభ్యులతో మృతురాలి తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు. ఈ మేరకు డీఎస్పీ రమాకాంత్కు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు... మృతురాలి భర్తను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. -
Yesvantpur Express: ఆ రైలు ధర్మవరం వరకే
సాక్షి, కర్నూలు(రాజ్విహార్): కాచిగూడ నుంచి కర్నూలు మీదుగా యలహంక (బెంగళూరు)కు వెళ్లే యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ రైలును ధర్మవరం వరకు కుదించారు. బెంగళూరు – పెనుగొండ మధ్య జరుగుతున్న రైల్వే ట్రాక్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. 17603 నంబరు రైలు ఈనెల 12, 13, 14 తేదీల్లో కాచిగూడ నుంచి కర్నూలు, డోన్ మీదుగా ధర్మవరం వరకు మాత్రమే వెళ్తుంది. అలాగే యలహంక నుంచి కాచిగూడ వెళ్లే 17604 నంబరు రైలు 13, 14, 14 తేదీల్లో ధర్మవరం నుంచి వెనుదిరిగి వెళ్తుంది. భువనేశ్వర్ రైలు రద్దు భువనేశ్వర్ – బెంగళూరు – భువనేశ్వర్ మధ్య నంద్యాల, డోన్ మీదుగా రాకపోకలు సాగించే 18463, 18464 రైళ్లు ఈనెల 12, 13, 14, 15 తేదీల్లో బెంగళూరు – శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం స్టేషన్ల మధ్య రద్దు చేశారు. మచిలీపట్నం – యశ్వంత్పూర్ – మచిలీపట్నం మధ్య కర్నూలు మీదుగా రాకపోకలు సాగించే ఎక్స్ప్రెస్ రైళ్లు 13, 14వ తేదీల్లో ధర్మవరం– యశ్వంత్పూర్ మధ్య రద్దు చేశారు. కోర్బా – యశ్వంత్పూర్ వెళ్లే ఎక్స్ప్రెస్ రైలును ఈ నెల 12న కర్నూలు, డోన్, గుత్తి, రేణిగుంట, జోలార్పెట్టాయి, బంగారపేట్, కృష్ణరాజపురం మీదుగా దారి మళ్లించారు. రాజ్కోట్ – కోయంబత్తూర్కు మంత్రాలయం రోడ్, ఆదోని మీదుగా వెళ్లే 16613 ఎక్స్ప్రెస్ రైలును గుత్తి, రేణిగుంట, జోలార్పట్టాయి, తిరపత్తూర్, సేలమ్ మీదుగా మళ్లించారు. ఈ మేరకు రైల్వే శాఖ సీపీఆర్ఓ రాకేష్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ఓ తల్లి ఘాతుకం: కన్న బిడ్డనే కడతేర్చింది..
ధర్మవరం అర్బన్(అనంతపురం జిల్లా): క్షణికావేశం.. ఆ తల్లిని హంతకురాలిని చేసింది. నవమాసాలూ మోసి కన్న బిడ్డనే కర్కశంగా హత్య చేసేలా ప్రేరేపించింది. అంతేకాదు, తను రక్తం పంచిన ఆ బిడ్డ శరీరం రక్తమోడుతున్నా.. ఆ అమ్మ మనసు కరగలేదు. మరణించే దాకా అలానే ఉండిపోయింది.. ఆ తర్వాత తనూ ఆత్మహత్యా యత్నం చేసింది. అనంతపురం జిల్లా ధర్మవరంలో శుక్రవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు కథనం మేరకు వివరాలు.. పట్టణంలోని కొత్తపేటలో నివాసముంటున్న బీరే శ్రీనివాసులు, భార్య మీనాక్షిలు చేనేత కార్మికులు. వీరికి తనుశ్రీ, ప్రణతి అనే ఇద్దరు కుమార్తెలున్నారు. శ్రీనివాసులు మరమగ్గం నేసేందుకు గొట్లూరు గ్రామానికి వెళుతుంటాడు. మీనాక్షి ఇంట్లోనే మగ్గం నేస్తుంటుంది. ఇద్దరూ అన్యోన్యంగానే ఉండేవారు. అయితే ఏమైందో ఏమోగానీ శుక్రవారం ఉదయం భార్యాభర్తలు గొడవపడ్డారు. తర్వాత శ్రీనివాసులు మరమగ్గం నేసేందుకు వెళ్లిపోయాడు. పెద్ద కుమార్తె తనుశ్రీ అమ్మమ్మ ఇంటికెళ్లింది. భర్త వెళ్లిన కాసేపటికే మీనాక్షి ఇంట్లో తలుపులు వేసి.. రెండున్నరేళ్ల చిన్న కుమార్తె ప్రణతి ఎడమ చేతిని మగ్గం పోగులు కోసే కత్తితో కోసేసింది. నొప్పి భరించలేక చిన్నారి ఏడుస్తున్నా తల్లి మనసు కరగలేదు. ప్రాణాలు పోయే వరకూ అలాగే ఉండిపోయింది. తర్వాత తనూ చేయి కోసుకుంది. ఎంతకీ తన ప్రాణాలు పోకపోవడంతో చీరతో ఉరేసుకుంది. ఇంతలో చుట్టుపక్కల వారు వచ్చి తలుపు తట్టినా తీయకపోవడంతో వారు తలుపుల్ని బద్దలు కొట్టారు. మీనాక్షిని వెంటనే ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆస్పత్రికి తీసుకెళ్లారు. ధర్మవరం డీఎస్పీ రమాకాంత్, అర్బన్ సీఐ కరుణాకర్ ఘటనా స్థలానికి వెళ్లి చిన్నారి మృతదేహాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ధర్మవరంలో విషాదం: మరణంలోనూ వీడని స్నేహం
ధర్మవరం రూరల్: ఆ యువకులు ప్రాణ స్నేహితులు. చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకున్నారు.. చదువుకున్నారు. ఇప్పుడు ఒకే రకమైన వ్యాపారం చేసుకుంటూ వారి కుటుంబాలకు చేదోడువాదోడుగా ఉంటున్నారు. అవివాహితులైన వీరిద్దరిని రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. రెండు కుటుంబాల్లోనూ తీరని విషాదం నింపింది. వివరాలిలా ఉన్నాయి. ధర్మవరం పట్టణంలోని రాజేంద్రనగర్కు చెందిన అంకే ధనుశ్ (25), రాంనగర్కు చెందిన భీమనపల్లి అనిల్కుమార్ (27) మిత్రులు. వీరిద్దరూ మగ్గం నేస్తూ పట్టు చీరల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించేవారు. మగ్గం సామగ్రి కోసం ఆదివారం గోరంట్లకు వెళ్లారు. పని ముగించుకుని అక్కడి నుంచి తిరిగి ద్విచక్రవాహనంపై వస్తుండగా ధర్మవరం మండలం మోటుమర్ల గ్రామం వద్ద ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. తీవ్రగాయాలవడంతో ధనుశ్, అనిల్కుమార్ అక్కడికక్కడే మృతి చెందారు. రూరల్ ఎస్ఐ ప్రదీప్కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే ఆర్టీసీ ఆర్ఎం సుమంత్ ఆదోని, సీటీఎం గోపాల్రెడ్డి, ధర్మవరం, పుట్టపర్తి డిపో మేనేజర్లు మల్లికార్జున, ఇనయతుల్లా, ఈయూ నాయకులు నాగార్జునరెడ్డి, సుమో శీనా తదితరులు ఘటన స్థలాన్ని పరిశీలించి, ప్రమాదంపై స్థానికులను ఆరా తీశారు. స్నేహితులిద్దరూ ఒకేసారి ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేసింది. -
రైతు భూమిపై ధర్మవరం హెడ్కానిస్టేబుల్ కన్ను.. కాదనడంతో
ధర్మవరం టౌన్(అనంతపురం): పొలం అమ్మి అప్పులు తీర్చుకోవాలనుకున్న రైతు కుటుంబం పట్ల ఓ హెడ్ కానిస్టేబుల్ కర్కశంగా వ్యవహరించాడు. ఆ పొలం తనకే అమ్మాలంటూ జులుం చేశాడు. కాదన్న పాపానికి తండ్రీకొడుకులను నిర్బంధించి హింసించాడు. వేధింపులు తాళలేక చివరకు రైతు కుటుంబం ‘సాక్షి’ ఎదుట గోడు వెళ్లబోసుకుంది. ధర్మవరం మండలం వెంకటతిమ్మాపురానికి చెందిన రైతు రవీంద్రరెడ్డికి దర్శినమల గ్రామ పరిధిలో 10 ఎకరాల పొలం ఉంది. గతంలో తీవ్ర వర్షాభావంతో బోరుబావి ఎండిపోయి, చీనీ చెట్ల సాగులో తీవ్రంగా నష్టపోయాడు. ఈ క్రమంలో అప్పులు పెరిగిపోయాయి. ఒత్తిళ్లు ఎక్కువ కావడంతో తనకున్న పొలంలో 3.58 ఎకరాలు అమ్మి అప్పులు తీర్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో ఎకరాకు రూ.3.58 లక్షలు బేరం కుదిరి వేరొకరికి పొలం విక్రయించాడు. హెడ్కానిస్టేబుల్ కన్ను రైతు అవసరాన్ని ఆసరాగా తీసుకున్న ధర్మవరం రూరల్ పోలీస్స్టేషన్ హెడ్కానిస్టేబుల్ పూజారి పుల్లప్ప... ఆ పొలాన్ని ఎకరా రూ.2 లక్షలతో తనకే అమ్మాలని రైతుపై ఒత్తిడి తీసుకెళ్లాడు. తనకు కాకుండా ఇతరులకు పొలం అమ్మితే కేసులు బనాయిస్తానంటూ బెదిరింపులకు దిగాడు. ఇందుకు రైతు రవీంద్రరెడ్డి ఒప్పుకోలేదు. దీంతో రవీంద్రరెడ్డి, అతని కుమారుడు మారుతీరెడ్డిని పోలీస్ స్టేషన్కు పిలిపించుకుని చావబాదాడు. చివరకు బయటకు విడుదల చేసేందుకు రూ.30వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో తమ వద్ద ఉన్న రూ.5వేలను అప్పటికప్పుడు ఫోన్పే ద్వారా కానిస్టేబుల్ ఖాతాకు మార్చి, మిగిలిన మొత్తాన్ని తిరిగి ఇస్తామంటూ తండ్రీకొడుకులు బయటకు వచ్చారు. కానిస్టేబుల్ బారి నుంచి తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని, లేకుంటే తమకు ఆత్మహత్యలే శరణ్యమంటూ బాధిత రైతులు వాపోయారు. కాగా, రైతు ఆరోపణలు అవాస్తమంటూ హెడ్ కానిస్టేబుల్ పుల్లప్ప కొట్టిపాడేశారు. అయితే ఘటనకు సంబంధించి బాధిత రైతులు రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామంటూ డీఎస్పీ రమాకాంత్ స్పష్టం చేశారు. -
కరోనాతో మాజీ మంత్రి నాగిరెడ్డి కన్నుమూత
ధర్మవరం: కరోనాతో మాజీ మంత్రి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గరుడమ్మగారి నాగిరెడ్డి(68) శనివారం మృతి చెందారు. పదిరోజుల క్రితం కరోనాతో బాధపడుతున్న ఆయనను అనంతపురంలోని ఓప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. శనివారం సాయంత్రం పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గరుడమ్మగారి నాగిరెడ్డి ధర్మవరం నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా 1983, 1985, 1989లో టీడీపీ తరఫున ఎన్నికయ్యారు. తెలుగు సాహిత్యం మీద అవగాహన ఉన్న నాగిరెడ్డి సొంతంగా పత్రిక పెట్టి సంపాదకునిగా వ్యవహరించారు. ఈ పరిచయంతోనే టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు పార్టీలో చేర్చుకుని టీడీపీ టికెట్ ఇచ్చారు. మూడో దఫా ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన చేనేత జౌళి, చిన్ననీటి పారుదల శాఖ మంత్రిగా పని చేశారు. భార్య సునీత, కుమారుడు సతీష్రెడ్డి ఉండగా.. కుమారుడు 2016లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. కుమారుని మరణంతో రాజకీయాలకు స్వస్తి పలికి ఆయన ఇంటికే పరిమితమయ్యారు. నాగిరెడ్డి మృతి పట్ల ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చదవండి: సినీ గేయ రచయిత అదృష్ట దీపక్ కన్నుమూత కానిస్టేబుల్ ప్రాణాలు కాపాడిన ఎమ్మెల్యే దుద్దుకుంట -
అబ్బాయి అబద్ధం చెప్పాడు.. ‘ఈ పెళ్లి నాకొద్దు’
సాక్షి, కదిరి: ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో గురువారం(నేడు) తెల్లవారుజామున జరగాల్సిన ఓ వివాహం పెళ్లి కుమార్తె అయిష్టంతో నిలిచిపోయింది. వివరాల్లోకి వెళితే.. ధర్మవరం పట్టణానికి చెందిన ఓ యువకునికి ముదిగుబ్బ మండల కేంద్రానికి చెందిన ఓ యువతితో పెళ్లి నిశ్చయమైంది. ఇరువైపులా పెళ్లి పత్రికలను బంధువులందరికీ పంచిపెట్టారు. కదిరిలో నృసింహుని సన్నిధిలో 6వ తేదీన చైత్ర బహుళ దశమి గురువారం తెల్లవారు జామున జరగాల్సి ఉంది. ఇరువైపుల పెళ్లి కుటుంబ సభ్యులు, బంధువులు ఆలయం చేరుకున్నారు. ఈలోగా పెళ్లి కుమార్తె తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, అబ్బాయి ఐటీఐ చదివి ఎంటెక్ అని అబద్ధం చెప్పాడని, తాను బీటెక్ చదివానని తన మనసులో మాట చెప్పింది. దీనికి తోడు తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని, పెళ్లి వాయిదా వేసుకుందామని చెప్పినా బలవంతంగా తాళి కడతానని బెదిరిస్తున్నాడని కదిరి పట్టణ ఎస్ఐ మహమ్మద్ రఫి ఎదుట వాపోయింది. పెళ్లి ఇష్టం లేదని ముందే ఎందుకు చెప్పలేదని.. తమకు అవమానంగా ఉందని పెళ్లికుమారుడితో పాటు అతని తరపు బంధువులు అన్నారు. పెళ్లి కోసం ముందుగానే రూ.1.50 లక్షలు పెళ్లి కుమార్తె బ్యాంకు ఖాతాకు ఫోన్పే ద్వారా జమ చేశానని, ఆ డబ్బు ఇస్తే తన దారిన తాను వెళ్లిపోతానని ఆ యువకుడు తేల్చిచెప్పాడు. ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదని, పెళ్లి కోసం ఇచ్చిన డబ్బులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి పరిష్కరించుకోండని కదిరి టౌన్ ఎస్ఐ చెప్పడంతో చివరకు ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. చదవండి: జలమార్గంలో చేరుకున్న ఆక్సిజన్ ట్యాంకర్లు -
ఊర్మిళ జీవితంలో ‘గుడ్ మార్నింగ్’
‘గుడ్ మార్నింగ్ ధర్మవరం’ ఎందరి జీవితాల్లోనో వెలుగులు నింపుతోంది. ఇంకెందరి జీవితాల్లోనో మార్పు తీసుకొస్తోంది. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ప్రారంభించిన ఈ కార్యక్రమంలో అప్పటికప్పుడే సమస్యలు పరిష్కారం అవుతుండగా.. జనం నుంచి విశేష స్పందన లభిస్తోంది. తాజాగా విద్యుదాఘాతంతో రెండు చేతులు కోల్పోయిన ఓ యువతి పరిస్థితికి చలించిన కేతిరెడ్డి.. ఆమెను విద్యావలంటీర్గా నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు. ధర్మవరం టౌన్: ధర్మవరం పట్టణంలోని పార్థసారధినగర్లో నివసిస్తున్న విశ్రాంత ఉపాధ్యాయుడు వెంకటరాముడు, నాగలక్ష్మిల మూడో సంతానం ఊర్మిళ. 11 ఏళ్ల క్రితం ఉద్యోగ రీత్యా వెంకటరాముడు అనంతపురంలో ఉంటుండగా.. ఓ రోజు ఊర్మిళ ఇంటిపై నుంచి ఇనుపకడ్డీని కిందకు తెచ్చే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో పక్కనే ఉన్న విద్యుత్ తీగలకు ఇనుపకడ్డీ తాకడంతో విద్యుదాఘాతానికి గురై రెండుచేతులు కోల్పోయింది. అయినా కుంగిపోని ఊర్మిళ చదువుపై దృష్టి సారించింది. రెండు చేతులు లేకున్నా చేతికి రబ్బరు బ్యాండులు వేసుకుని వాటి మధ్యలో పెన్ను పెట్టుకుని రాస్తూ చదువు కొనసాగింది. ఉర్మిళ పరిస్థితి తెలుసుకున్న ధర్మవరం లయోలా పాఠశాల కరస్పాండెంట్ శంకర్నాయుడు పదో తరగతి వరకూ ఉచితంగా చదువుకునే అవకాశం కల్పించారు. దీంతో పదో తరగతిలో 9.7 పాయింట్లు సాధించిన ఊరి్మళ... అనంతరం ఎస్వీ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఎంపీసీలో 856 మార్కులు సాధించింది. ఆ తర్వాత డైట్సెట్లో ర్యాంకు సాధించి ధర్మవరంలోని శ్రీసాయికృప డీఎడ్ కళాశాలలో టీటీసీ పూర్తి చేసింది. ఉద్యోగ ప్రయత్నం కొనసాగిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఎలాగైనా ఎమ్మెల్యేను కలుసుకుని తన బాధ చెప్పుకోవాలని భావించింది. కలిసొచ్చిన ‘గుడ్మార్నింగ్’ గుడ్మార్నింగ్ ధర్మవరం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మూడు రోజుల క్రితం ఊర్మిళ ఉంటున్న పార్థసారథి కాలనీకి వెళ్లగా ఆమె పరుగున వెళ్లి ఎమ్మెల్యేను కలిసింది. తనకు రెండు చేతులు లేవని తన తండ్రి విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి కావడంతో పింఛను కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాకుండా తాను టీటీసీ పూర్తి చేశానని ఉద్యోగం ఇప్పిస్తే తన కాళ్లపై తాను నిలబడతానని కోరింది. స్పందించిన ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అక్కడే ఉన్న కమిషనర్ మల్లికార్జునకు చెప్పి విద్యా వలంటీర్గా ఉద్యోగం ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం ఈ విషయంపై ఒకటి రెండు సార్లు అధికారులతో మాట్లాడారు. సోమవారం ధర్మవరం క్రీడా మైదానంలో దివ్యాంగురాలైన ఊర్మిళకు పట్టణంలోని నెహ్రునగర్ మున్సిపల్ పాఠశాలలో విద్యా వలంటీర్గా ఉద్యోగం ఇస్తూ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి నియామక పత్రాన్ని అందించారు. ఎంత మందిని కలిసి తన సమస్య చెప్పుకున్నా.. ఎవరూ ఆదుకోలేదని, తన సమస్యను విని వెంటనే స్పందించి విద్యా వలంటీర్ ఉద్యోగం ఇప్పించినందుకు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటానని ఊర్మిళ భావోద్వేగంతో చెప్పారు. చదవండి: టీడీపీ కార్యకర్తల అరాచకం పట్టణాలు, నగరాల్లో.. త్వరలో సొంతిల్లు -
చేనేత కార్మికుడి నుంచి ప్రముఖ డిజైనర్గా..
ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక కళ దాగి ఉంటుంది. అయితే అది వెలుగులోకి రావాలంటే పట్టుదల ఉండాలి. ఆ పట్టుదలే ధర్మవరానికి చెందిన చేనేత కార్మికుడు జూజారు నాగరాజును ప్రత్యేకమైన వ్యక్తిగా గుర్తింపు వచ్చేలా చేసింది. సాధారణ చీరలు నేసే స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ అద్భుతమైన డిజైనర్ పట్టు చీరల సృష్టికర్తగా ఎదిగారు. రొటీన్కు భిన్నంగా చీరలపై డిజైన్ చేయడం, మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రత్యేక డిజైన్లు రూపకల్పన చేసి తన శక్తి ఏమిటో నిరూపించుకుని రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులు సొంతం చేసుకుంటూ వచ్చిన నాగరాజు విజయ ప్రస్థానంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం... సాక్షి, ధర్మవరం టౌన్: పట్టణానికి చెందిన జూజారు నాగరాజు మగ్గం నేసుకుంటూ డిగ్రీ చదివారు. డిజైనింగ్ మీద మక్కువతో బెంగుళూరు, హైదరాబాద్లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసి, ధర్మవరానికి చేరుకున్నారు. అప్పటి నుంచి సరికొత్త డిజైన్లతో పట్టుచీరలు నేస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. పేదరికాన్ని సవాల్ చేస్తూ.. నాగరాజు తండ్రి జూజారు లక్ష్మణరావు సాధారణ చేనేత కార్మికుడు. నిరుపపేద కుటుంబం కావడంతో ఇంటిల్లిపాది మగ్గం నేస్తేనే జీవనం సాగేది. తండ్రి పడుతున్న కష్టం నాగరాజును కదిలించింది. అందరిలా కాకుండా కొత్తదనాన్ని చూపినప్పుడే తమ ఉత్పత్తులకు మార్కెట్లో డిమాండ్ నెలకొంటుందని భావించిన అతను.. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తి చేశారు. అప్పట్లో పట్టుచీరలంటే తమిళనాడులోని కాంచీపురం ప్రసిద్ధి. కంచి పట్టు చీర అంటే అంత గొప్పగా భావించేవారు. అదే స్థాయిలో ధర్మవరానికి పేరు తీసుకురావాలని భావించిన నాగరాజు... రేయింబవళ్లూ కొత్త డిజైన్ల రూపకల్పనపైనే దృష్టి సారించేవారు. నెమలి పళ్లూ, బ్రోకెట్, కళాంజలి వంటి డిజైన్లను ఆధునీకరించి కంచి కంటే విభిన్నమైన 240 డిజైన్లతో జాకార్డులను సిద్ధం చేశారు. ఒక్కో డిజైన్ రూపకల్పనకు రూ.10 వేల నుంచి రూ.15వేల వరకు ఖర్చు పెట్టారు. క్రమేణ ఈ డిజైన్లతో వచ్చిన పట్టుచీరలు ప్రతి ఒక్కరి దృష్టిని విశేషంగా ఆకట్టుకుంటూ వచ్చాయి. దీంతో కొంతమంది పట్టు చీరల వ్యాపారులు నాగరాజుకు ఖర్చులు పోనూ అదనంగా రూ.3 వేలు చెల్లించి కొత్త డిజైన్లను కొనుగోలు చేస్తూవచ్చారు. 2009లో ఔట్సోర్సింగ్ ద్వారా హ్యాండ్లూమ్లో డిజైనర్ ఉద్యోగాలను భర్తీ చేయడంతో ధర్మవరం హ్యాడ్లూమ్ క్లస్టర్ డిజైనర్గా నాగరాజుకు ఉద్యోగం దక్కింది. విధుల నిర్వహణలో భాగంగా ధర్మవరంతో పాటు ముదిరెడ్డిపల్లి, మంగళగిరి తదితర ప్రాంతాల్లో చేనేతకార్మికులకు డిజైనింగ్ రంగంలో శిక్షణ ఇచ్చారు. నాగరాజు చేసిన వెరైటీ డిజైన్లు ► సాంబ చిత్రంలోని శంఖు, చక్రం, నామాలు కలిగిన డిజైన్తో 2004లో నాగరాజు ఓ పట్టు వస్త్రం సిద్ధం చేశారు. ఈ శ్రమకు ఫలితంగా సినిమా నిర్మాతలు నాగరాజును అభినందిస్తూ రూ.లక్ష పారితోషకాన్ని అందజేశారు. ► ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎగ్జిబిషన్లో పట్టు వస్త్రాలపై నేసిన తాజ్మహల్ చిత్రాలను ప్రదర్శించి, అందరినీ ఆకట్టుకున్నారు. ► 2016లో లేపాక్షి ఆలయంలోని శిల్పకళా నమూనాలతో పట్టు వస్త్రాన్ని చేనేత మగ్గంపై నేసి అబ్బురపరిచారు. ► 2017 ఫిబ్రవరిలో ఇస్రో రాకెట్ ప్రయోగాల విజయవంతం కావడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఇస్రో శాటిలైట్లు, రాకెట్ చిత్రాలతో పట్టు వస్త్రం తయారు చేసి విజయవాడలో ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు. ► గుంటూరులో ప్రముఖ పుణ్యక్షేత్రం పానకాల లక్ష్మీనరసింహస్వామి ముఖచిత్రం, గాలిగోపురం తెలుగు అక్షరాలతో కూడిన డిజైన్ను తయారు చేసి ఆలయానికి బహూకరించారు. ► మహాత్ముని దండియాత్రను పట్టు వస్త్రంపై రూపొందించి 2019లో గాంధీ జయంతి రోజున ఢిల్లీలో జరిగిన నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు. ► సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజును పురస్కరించుకుని 2019 డిసెంబర్లో పట్టు వస్త్రంపై సీఎం జగన్ చిత్రపటాన్ని రూపొందించి హ్యాండ్లూమ్ కార్యాలయం తరఫున నేతన్న నేస్తం పథకం ప్రారంభంలో ధర్మవరంలో జగనన్నకు బహూకరించారు. ► ఆరీటీ వ్యవస్థాపకుడు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ సతీమణి అన్నే ఫెర్రర్ చిత్రాన్ని పట్టు వస్త్రంపై నేసి అందజేశారు. అందుకున్న అవార్డులు.. ► 2006లో ఉమ్మడి రాష్ట్రంలో డిజైన్ డెవలప్మెంట్కు గాను రాష్ట్ర స్థాయి అవార్డును ప్రభుత్వం అందజేసింది. ► 2020 మార్చి నెలలో ఢిల్లీలో నేషనల్ హ్యాండ్లూమ్ డెవల్మెంట్ కార్పొరేషన్ వారు నాగరాజుకు జాతీయ అవార్డును అందజేశారు. దండియాత్రను గుర్తుకు చేస్తూ పట్టువస్త్రం నేసినందుకు ఈ పురస్కారం దక్కింది. వైఎస్సార్ హయాంలోనే ప్రతిభకు గుర్తింపు దక్కింది మగ్గం నేస్తూ డిగ్రీ వరకు చదువుకున్నా. సాంబ సినిమాలో నేను వేసిన డిజైన్ ప్రాచుర్యం పొందింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ నాలో ప్రతిభను గుర్తించి, డిజైనర్గా హ్యాండ్లూమ్ కార్యాలయంలో ఉద్యోగ అవకాశం ఇచ్చారు. ఆ మహానేత గుర్తింపు వల్లనే ఎన్నో డిజైన్లను చేయగలిగాను. ఎందరో కార్మికులకు డిజైనింగ్లో శిక్షణ ఇస్తున్నా. – జూజారు నాగరాజు, చేనేత కార్మికుడు, ధర్మవరం -
స్నేహలత హత్య కేసు: కార్తీక్ అరెస్ట్
సాక్షి, అనంతపురం: స్నేహలత దారుణ హత్య కేసులో పోలీసుల పురోగతి సాధించారు. ఈ హత్యలో కీలకమైన మరో నిందితుడు కార్తీక్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. హత్యలో రాజేష్కు సహకరించిన కార్తీక్ నుంచి నాలుగు సెల్ ఫోన్లు, అపాచి బైక్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు రాజేష్, కార్తీక్లను కలిపి పోలీసులు హత్యకు సంబంధించి లోతుగా విచారిస్తున్నారు. వారిపై 302, అట్రాసిటీ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. స్నేహలత హత్యపై ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. కమిషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ గురువారం బాధిత కుంటుంబాన్ని అనంపురం వెళ్లి పరామర్శించారు. బాధిత కుంటుంబానికి బరోసాగా ఉంటామని తెలిపారు. చదవండి: స్నేహితులతో కలిసి యువతిని హత్య చేసిన ప్రియుడు! బుధవారం ధర్మవరంలో ప్రియుడి చేతిలో స్నేహలత హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసుపై విచారణ కొనసాగిస్తున్న పోలీసులు కీలక నిందితుడు రాజేష్కు సహకరించిన స్నేహితులకు కోసం గాలిస్తున్నారు. స్నేహలత హత్య కేసును ‘దిశ’ పోలీసు స్టేషన్కు అప్పగించినట్లు ఎస్పీ సత్యయేసుబాబు తెలిపారు. హత్యకు కారకులైన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. మరోవైపు తమ కూతురును హత్య చేసిన నిందితులను ఎన్ కౌంటర్ చేయాలని స్నేహలత తల్లి లక్ష్మిదేవి డిమాండ్ చేశారు. -
యువతి దారుణ హత్య
ధర్మవరం రూరల్/అనంతపురం క్రైం: ఓ యువతిని హత్య చేసి.. ఆ తర్వాత తగలబెట్టేందుకు ప్రయత్నించిన ఘటన అనంతపురం జిల్లా బడన్నపల్లి గ్రామ సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. అనంతపురం పట్టణంలోని అశోక్ నగర్లో నివాసముంటున్న లష్మి, కుల్లాయప్ప దంపతుల కుమార్తె స్నేహలత(19) ధర్మవరంలోని ఎస్బీఐలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగినిగా పనిచేస్తోంది. గుత్తి రాజేష్, కార్తీక్ అనే యువకులు ప్రేమ పేరుతో ఆమె వెంట పడుతుండేవారు. చెడు వ్యసనాలకు బానిస అయిన రాజేష్కు స్నేహలత దూరంగా ఉండేది. దీంతో ఆమెపై రాజేష్ కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలో రాజేష్ మంగళవారం స్నేహలతను తన బైక్ మీద ధర్మవరం నుంచి అనంతపురానికి తీసుకొచ్చేందుకు వెళ్లాడు. బడన్నపల్లి సమీపంలోకి వచ్చే సరికి రోడ్డు పక్కన బైక్ ఆపి ఆమెతో గొడవపడి.. గొంతు నులిమి చంపేశాడు. అనంతరం ఆమె వద్ద ఉన్న బ్యాంకు పేపర్లను శరీరంపై వేసి కాల్చి పరారయ్యాడు. బుధవారం ఉదయం కొందరు రైతులు బడన్నపల్లి సమీపంలోని పొలంలో యువతి శవాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతురాలి వద్ద లభ్యమైన ఆధారాలతో యువతి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తమ బిడ్డను డిగ్రీ చదుతున్నప్పటి నుంచి కార్తీక్, రాజేష్ అనే యువకులు ప్రేమ పేరుతో వేధించేవారని.. అల్లారుముద్దుగా చూసుకుంటున్న తమ కూతురిని చివరకు ఇలా చేశారంటూ స్నేహలత తల్లి లక్ష్మి కన్నీరుమున్నీరైంది. రాజేష్తో పాటు కార్తీక్ కూడా ఈ ఘటన వెనుక ఉన్నాడని.. వారిద్దరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాగా, ఘటనా స్థలిని డీఎస్పీ రమాకాంత్, సీఐ చిన్న పెద్దయ్య, ఎస్ఐ జనార్ధన్నాయుడు పరిశీలించి.. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులపై రౌడీషీట్ ఓపెన్ చేయనున్నట్లు పోలీసులు చెప్పారు. యువతి అదృశ్యం విషయం తెలియగానే వన్ టౌన్ పోలీసులు అప్రమత్తమై.. ధర్మవరం పోలీసులకు సమాచారమిచ్చారని.. రాత్రంతా ధర్మవరం, పరిసరాల్లో గాలింపు జరిపారని వివరించారు. కాగా, రాజేష్, కార్తీక్ వేధిస్తున్నట్లు గతంలో తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని వన్ టౌన్ పోలీసులు తెలిపారు. అదుపులో రాజేష్.. పరారీలో కార్తీక్ స్నేహలత హత్య కేసును త్వరితగతిన ఛేదిస్తామని ఎస్పీ బి.సత్యయేసు తెలిపారు. ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. గుత్తి రాజేష్ అనే వ్యక్తి స్నేహలతను హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. అతనితో పాటు మరో అనుమానితుడు కార్తీక్ కూడా ఉన్నట్లు తెలియడంతో విచారణ చేస్తున్నామని చెప్పారు. రాజేష్ను అదుపులోకి తీసుకున్నామని.. కార్తీక్ పరారీలో ఉన్నట్లు చెప్పారు. స్నేహలతపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూస్తామని.. వీలైనంత వేగంగా చార్జ్షీట్ దాఖలు చేస్తామని చెప్పారు. -
ఎస్బీఐ ఉద్యోగిని దారుణ హత్య
సాక్షి, అనంతపురం : జిల్లాలోని ధర్మవరం మండలంలో దారుణం చోటు చేసుకుంది. స్నేహితులతో కలిసి ప్రియురాలిని దారుణంగా హత్య చేశాడో యువకుడు. అనంతరం మృతదేహంపై పెట్రోలు పోసి నిప్పంటించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మవరానికి చెందిన స్నేహలత స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కాంట్రాక్టు ఉద్యోగిని. యథావిధిగానే మంగళవారం ఉదయం బ్యాంక్కు వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి రాలేదు. దీంతో స్నేహలత తల్లిదండ్రులు అనంతపురం వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా, బుధవారం తెల్లవారుజామున ధర్మవరం మండలం బడన్నపల్లి వద్ద స్నేహలత మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. రాజేష్, కార్తీక్ అనే యువకులే తమ కుమార్తెను హత్య చేశారని స్నేహలత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. చాలా కాలంగా ఈ ఇద్దరు ప్రేమ పేరుతో తమ కూతురిని వేధించారని పోలీసులుకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న ధర్మవరం పోలీసులు.. సమగ్ర విచారణ చేపట్టారు. -
అనంతపురం జిల్లా: ధర్మవరంలో దారుణం
-
అనంతపురం జిల్లాలో దారుణం..
సాక్షి, అనంతపురం: జిల్లాలో దారుణం జరిగింది. గది అద్దెకు ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చిన ఘటన ధర్మవరంలో చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి నగరంలోని ఉమా లాడ్జికి వెళ్లిన ముగ్గురు వ్యక్తులు మద్యం మత్తులో ఉండటంతో లాడ్జి మేనేజర్ ఈశ్వరయ్య గదిని అద్దెకు ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో మద్యం మత్తులో ఆయనతో గొడవ పడి దారుణంగా హతమార్చారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకోగా, మరొకరు పరారీలో ఉన్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. (భార్య నగ్న వీడియోలు యూట్యూబ్లో..) -
పరిటాల సునీత అనుచరుడి భూ బాగోతం
సాక్షి, అనంతపురం: మాజీ మంత్రి పరిటాల సునీత ముఖ్య అనుచరుడి భూ బాగోతం తాజాగా వెలుగులోకి వచ్చింది. టీడీపీ నేత, రామగిరి మాజీ ఎంపీపీ బాలరంగయ్య ధర్మవరంలో 3 కోట్ల రూపాయల విలువైన స్థలం కబ్జా చేసి ఫోర్జరీ డాక్యుమెంట్స్తో 8.5 సెంట్ల మున్సిపల్ స్థలం రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు మున్సిపల్ అధికారులు గుర్తించారు. నకిలీ పత్రాలతో తన పేరిట రిజిస్టర్ చేయించుకున్న బాలరంగయ్య, పరిటాల సునీతకు ప్రధాన అనుచరుడు. బాలరంగయ్య ఇచ్చిన నకిలీ పత్రాలతో మున్సిపల్ స్థలాన్ని అప్పటి సబ్ రిజిస్టర్ చేశారు. కాగా ఈ అక్రమాలను గుర్తించిన ధర్మవరం మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున మున్సిపల్ స్థలాన్ని అక్రమంగా రిజస్ట్రేషన్ చేయించుకున్నట్లు వెల్లడించారు. బాల రంగయ్య, సబ్ రిజిస్టర్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదవండి: ‘ప్రజలను ఆ కుటుంబం మోసం చేసింది’ -
ధర్మవరం యువకుడి కిడ్నాప్!
సాక్షి, అనంతపురం: జిల్లాలోని ధర్మవరంలో యువకుడి కిడ్నాప్తో కలకలం రేగింది. శుక్రవారం రాత్రి కార్తీక్ అనే యువకుడిని కిడ్నాప్ చేసిన దుండగులు అతన్ని చితకబాదారు. అనంతరం కార్తీక్ గాయాలతో ఉన్న వీడియోను బెంగుళూరులో ఉన్న అతని సోదరికి పంపించి రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్తీక్ సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ధర్మవరం పోలీసులు గాలింపు చేపట్టారు. స్నేహితుల మధ్య గొడవతోనే కార్తీక్ కిడ్నాప్ జరిగినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓ మిత్రుడి వద్ద రూ.9 వేలకు సెల్ఫోన్ కొనుగోలు చేసిన కార్తీక్ మూడు వేలు బాకీపడ్డాడు. ఈ అప్పు తీర్చకపోవడంతో సూరీ అనే వ్యక్తి తన అనుచరులతో కార్తీక్ను కిడ్నాప్ చేసినట్టు అనుమానిస్తున్నారు. (చదవండి: ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్షలు రద్దు) -
ధర్మవరం పోలీసుల దొంగాట
దిశ చట్టంతో రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు దన్నుగా నిలుస్తోంది. జిల్లా పోలీసు బాస్ కూడా ఆ దిశగానే శాఖ గౌరవాన్ని పెంపొందిస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలోనే భిన్నమైన పరిస్థితి ఎదురవుతోంది. మట్కా, ఇసుక అక్రమ రవాణా.. తదితర వ్యవహారాల్లో తలదూర్చిన పోలీసులను ఎప్పటికప్పుడు సస్పెండ్ చేస్తున్నా, ఇప్పటికీ కొందరి తీరు పోలీసు శాఖను అప్రతిష్టపాలు చేస్తోంది. న్యాయం చేయండని పోలీసు స్టేషన్ తలుపు తట్టిన ఓ యువతి విషయంలో ధర్మవరం పోలీసులు వ్యవహరించిన తీరు చూస్తే ఉన్నతాధికారుల ఆదేశాలను ఏ స్థాయిలో నీరుగారుస్తున్నారో ఇట్టే అర్థమవుతుంది. నవంబర్ 11, 2019 వీఆర్వో మారుతి ప్రసాద్ నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు. నిశ్చితార్థం ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టి ప్రచారం చేశాడు. ఇప్పుడు అదనపు కట్నం కోసం వేధిస్తూ పెళ్లికి నిరాకరించాడు. – ధర్మవరం డీఎస్పీ కార్యాలయంలో బాధిత యువతి ప్రతిమ ఫిర్యాదు డిసెంబర్ 9, 2019 ప్రతిమ కన్నీళ్లకు ధర్మవరం పోలీసుల మనసు కరగలేదు. విధిలేని పరిస్థితుల్లో ఆమె జిల్లా ఎస్పీని స్వయంగా కలిసి తన గోడు వినిపించారు. స్పందించిన ఆయన వెనువెంటనే ధర్మవరం పోలీసులకు ఫోన్ చేసి కేసు నమోదుకు ఆదేశించారు. ఇదీ పోలీసు తెలివి బాధితురాలి ఫిర్యాదును కాదని.. పూర్తిగా కేసును తారుమారు చేశారు. అదనపు కట్నం అనే ప్రధాన ఆరోపణను తక్కువ చేసి.. కేవలం నిశి్చతార్థం అయిన తర్వాత తమ ఇంట్లో అశుభాలు జరగడం కారణంగా పెళ్లి వద్దనుకుంటున్నట్టు ఫిర్యాదును మార్చేశారు. అది కూడా ఆమె సోదరుడు ఫిర్యాదు చేసినట్లుగా చూపి కేసును నీరుగార్చడం గమనార్హం. సాక్షి, అనంతపురం: ఓ మహిళ తనకు అన్యాయం జరిగిందని పోలీసుస్టేషన్ మెట్లు ఎక్కితే.. ఆ ఖాకీల హృదయం కరగలేదు. నెల రోజుల పాటు వేచి చూసినా కనీస స్పందన కరువైంది. ఇక అక్కడ న్యాయం జరగదని తెలుసుకున్న ఆమె జిల్లా పోలీసు బాస్ను కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని ఏకరువు పెట్టింది. స్పందించిన ఆయన వెనువెంటనే ధర్మవరం పోలీసులకు ఆదేశాలు జారీ చేసినా.. ఆయననూ తప్పుదోవ పట్టిస్తూ ధర్మవరం పోలీసులు ఆడిన నాటకం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వివరాలివీ.. ధర్మవరంలో నివాసం ఉంటున్న ప్రతిమకు వీఆర్వోగా పని చేస్తున్న మారుతి ప్రసాద్తో వివాహ నిశ్చితార్థమైంది. ఆ తర్వాత అదనపు కట్నం కోసం వేధించిన మారుతి ప్రసాద్ వివాహానికి నిరాకరించాడు. ఈ విషయమై బాధితురాలు స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేయలేదు. దీంతో ఆమె నేరుగా స్పందన ద్వారా ఎస్పీ కార్యాలయంలోనే ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేసింది ఒకరైతే.. వాస్తవానికి ధర్మవరంలో నివసించే ప్రతిమ తనను మారుతి ప్రసాద్ మోసం చేశారంటూ 11 నవంబర్ 2019లో ధర్మవరం డీఎస్పీ కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసింది. అయితే, పోలీసులు మాత్రం కేసు నమోదు చేయలేదు. దీంతో ఏకంగా ఎస్పీ కార్యాలయానికి చేరుకుని 9 డిసెంబర్ 2019న ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఎస్పీ జోక్యం చేసుకుని నేరుగా ధర్మవరం పోలీసులకు ఫోన్ చేసి కేసు వెంటనే నమోదు చేయాలని ఆదేశించారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ధర్మవరం అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అది కూడా గతంలో స్వయంగా బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మీద కాకుండా ఆమె సోదరుడి పేరు మీద ప్రత్యేకంగా ఒక ఫిర్యాదును పోలీసులే తయారు చేసినట్టు తెలుస్తోంది. ఆమె మొదట ఇచ్చిన ఫిర్యాదులో స్పష్టంగా.. ఎవరెవరు తమను వేధించారనే వివరాలను స్పష్టంగా పేర్కొంది. అయితే, ఈ ఫిర్యాదులో ఉన్న వారి పేర్లను తొలగించి.. పోలీసులు తాము తయారుచేసిన ఫిర్యాదులో వేరే పేర్లను చేర్చారు. అంతేకాకుండా అదనపు కట్నం అనే ప్రధాన ఆరోపణను తక్కువ చేసి.. కేవలం నిశి్చతార్థం అయిన తర్వాత తమ ఇంట్లో అశుభాలు జరగడం కారణంగా తాము పెళ్లి వద్దనుకుంటున్నట్టు ఫిర్యాదును మార్చివేశారు. మొత్తంగా కేసును నీరుగార్చేందుకే ఈ విధంగా ఫిర్యాదును తప్పుదోవ పట్టించినట్టు తెలుస్తోంది. స్పందనలో ఇచ్చిన ఫిర్యాదును పక్కనపెట్టి మరీ కొత్త ఫిర్యాదును ఎందుకు రాశారనేది పరిశీలిస్తే మొత్తం వ్యవహారం ఇట్టే అర్థమవుతుంది. ఈ వ్యవహారంలో ధర్మవరం పోలీసుల వ్యవహారశైలిపై అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. అవతలి వారితో చేతులు కలిపి కేసును నీరుగారుస్తున్నట్టు తెలుస్తోంది. ఆది నుంచీ అంతే.. ధర్మవరం పోలీసుల వ్యవహారశైలిపై ఇప్పటికే అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఇసుక సరఫరాలో కూడా చేతులు తడిపినట్టు తెలుస్తోంది. మరోవైపు తమ వద్దకు ఫిర్యాదు చేసేందుకు వచ్చే వారితో కూడా వారు వ్యవహరిస్తున్న తీరు పట్ల ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా ఒక సీఐ భారీగా అవినీతికి పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. సదరు అధికారి అవినీతిపై అనేక ఫిర్యాదులు వచ్చినప్పటికీ.. ఉన్నతాధికారి కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా పోలీస్బాస్ సీరియస్గా దృష్టిసారిస్తే మినహా ఇక్కడ పరిస్థితి చక్కబడే అవకాశం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
నీ స్వార్థం కోసం ప్రజలను బలిచేయొద్దు
సాక్షి, ధర్మవరం: చంద్రబాబు తన స్వార్థం కోసం ప్రజలను బలిచేసేందుకు సిద్ధమయ్యారని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఉనికి కోల్పోయిన టీడీపీని తిరిగి ప్రజల్లోకి తీసుకువచ్చేందుకే చంద్రబాబు నానా తంటాలు పడుతున్నారన్నారు. ఈ క్రమంలోనే రాజకీయ స్వార్థంతో గ్రామాల మధ్య చిచ్చుపెడుతున్నాడని, సాయం కోసం వెళ్లిన వారిని స్వార్థ రాజకీయాలకు వినియోగించి వారి పొట్టకొడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబు ఎన్నికల ఫలితాల రోజున వైఎస్సార్సీపీ నేతల దాడిలో గాయపడినట్లు చెప్పిన బత్తలపల్లి మండలం డి.చెర్లోపల్లికి చెందిన శివయ్యతోనే వాస్తవం చెప్పించారు. ఈ సందర్భంగా శివయ్య మాట్లాడుతూ, తనకు 5 నెలల క్రితం పక్షవాతం వచ్చిందని, ఆర్థిక సాయం అడిగేందుకు చంద్రబాబు వద్దకు వెళ్లగా.. టీడీపీ నేతలు తమకు కావాల్సినట్లు అన్వయించుకుని తనను బదనాం చేశారని కన్నీటి పర్యంతమయ్యాడు. అనంతరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 10 సంవత్సరాలు ప్రతిపక్షనేతగా ఉన్న వ్యక్తి ఇలా దిగజారుడు రాజకీయాలు చేయడం ఏమిటని నిలదీశారు. గుర్తింపు కోసం ఇలా అడ్డదారులు తొక్కడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. అదేవిధంగా బత్తలపల్లి మండలం పత్యాపురం గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు స్థలం కోసం గొడవపడితే.. దాన్ని కూడా చంద్రబాబు వైఎస్సార్సీపీపైకి నెట్టే యత్నం చేశాడన్నారు. శాంతిభద్రతలు గాడి తప్పనివ్వం చంద్రబాబు ఎదుటే మాజీ ఎంపీ దివాకర్రెడ్డి బూట్లు నాకే పోలీసులను తెచ్చుకుంటామని చెబుతుంటే ఆయన్ను వారించాల్సిన ప్రతిపక్ష నేత.. ఆనందంగా ఆస్వాదించారన్నారు. తమ ప్రభుత్వం శాంతిభద్రతలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఎక్కడా లా అండ్ ఆర్డర్ సమస్య రానివ్వబోమన్నారు. ప్ర¿ోదానంద ఆశ్రమం వ్యవహారంలో దివాకర్రెడ్డి కారణంగా ఒకరు చనిపోగా.. ఆగ్రహించిన ప్రజలు పోలీస్స్టేషన్కు తాళం వేసిన ఉదంతం జిల్లా వాసులందరికీ తెలుసన్నారు. పోలీసులను విమర్శించిన జేసీ దివాకర్రెడ్డి తిమ్మంపల్లికి వచ్చేందుకు 800 మంది పోలీసులను రక్షణగా తెచ్చుకున్నాడని గుర్తుచేశారు. చంద్రబాబు హయాంలో ఆర్వోసీ చేసిన హత్యలు లెక్కలేవని, వారు ఎంతమందిని పొట్టనపెట్టుకున్నారో జిల్లావాసులందరికీ తెలుసునన్నారు. చంద్రబాబు అధికారకాంక్షతో గ్రామాల్లో కక్షలు, కార్పణ్యాలకు కారణభూతుడవుతున్నాడని దుయ్యబట్టారు. అబద్ధాలతో వ్యవస్థను మ్యానేజ్ చేయడం చంద్రబాబుకు పరిపాటిగా మారిపోయిందన్నారు. ఇప్పటికైనా ఆయన స్వార్థ రాజకీయాలు మానుకుని ప్రజాసమస్యలపై దృష్టి సారించాలని హితవు పలికారు. -
నేతన్న నేస్తం
-
సీఎం జగన్ పేదల పక్షపాతి
-
నేతన్నలు గౌరవంగా జీవించేందుకే ఈ సాయం