
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం అనంతపురం జిల్లా ధర్మవరంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. చేతి వృత్తులకు చేయూతనిచ్చేందుకు అమలు చేస్తున్న ఈ పథకానికి ధర్మవరం నుంచే శ్రీకారం చుట్టారు. చేనేత మగ్గం ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వం రూ.24,000 అందించనుంది. కాగా వైఎస్సార్ నేతన్న నేస్తం పథకానికి జిల్లాలో 27,481మంది ఎంపిక అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment