పీఎన్‌బీ ఖాతాలో రూ.2,816 కోట్లు జమ | 2,816 crores in the PNB account | Sakshi

పీఎన్‌బీ ఖాతాలో రూ.2,816 కోట్లు జమ

Jul 24 2018 12:31 AM | Updated on Jul 24 2018 12:31 AM

2,816 crores in the PNB account - Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ) కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.2,816 కోట్ల మూలధన కేటాయింపు లభించినట్లు ప్రకటించింది. ప్రాధాన్యతా కేటాయింపు మార్గంలో ఈక్విటీ షేర్లను జారీ చేయడం ద్వారా ఈ మొత్తాన్ని అందుకున్నట్లు బ్యాంక్‌ తెలిపింది.

నియంత్రణ పరమైన ఆమోదాల అనంతరం మూలధన సాయం అందినట్లు వివరించింది. ప్రభుత్వరంగ బ్యాంకులను ఆర్థికంగా బలోపేతం చేయడంలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఐదు పీఎస్‌యూలకు రూ.2.11 లక్షల కోట్ల నిధులను కేటాయించిన విషయం తెలిసిందే.  గడిచిన వారంలోనే అలహాబాద్‌ బ్యాంకు రూ.1,790 కోట్ల మూలధన సాయం అందుకున్నట్లు ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement