PNB
-
పీఎన్బీలో రూ.271 కోట్ల ఫ్రాడ్
ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంకులో (PNB) మరో మోసం వెలుగు చూసింది. ఒరిస్సాకు చెందిన గుప్తా పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ రూ.271 కోట్ల మేర రుణం తీసుకుని తిరిగి చెల్లించకుండా మోసానికి పాల్పడింది. ఈ ఖాతాను మొండిపద్దుగా (ఎన్పీఏ) వర్గీకరించి రిజర్వ్ బ్యాంక్ దృష్టికి తీసుకెళ్లినట్లు బ్యాంకు వివరించింది. ఇప్పటికే ఈ మొత్తానికి ప్రొవిజనింగ్ చేసినట్లు పేర్కొంది.భువనేశ్వర్లోని పీఎన్బీ స్టేషన్ స్క్వేర్ బ్రాంచ్ ఈ రుణాన్ని జారీ చేసింది. పీఎన్బీ ఫ్రాడ్ జరిగినా డిసెంబర్ త్రైమాసికంలో నికర లాభం రెండు రెట్లు పెరిగి రూ.4,508 కోట్లకు చేరుకుంది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో రూ.2,223 కోట్లతో పోలిస్తే అధికంగా నమోదైంది. బ్యాంక్ మొత్తం ఆదాయం రూ.29,962 కోట్ల నుంచి రూ.34,752 కోట్లకు, వడ్డీ ఆదాయం రూ.27,288 కోట్ల నుంచి రూ.31,340 కోట్లకు పెరిగింది. అంతేకాకుండా పీఎన్బీ స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి 6.24 శాతం నుంచి 4.09 శాతానికి తగ్గింది.పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కొన్నేళ్లుగా హైప్రొఫైల్ కేసులతో ఇబ్బంది పడుతోంది. అందులో కొన్ని కింద తెలియజేశాం.నీరవ్ మోదీ స్కామ్ (2018): భారతదేశ చరిత్రలో అతిపెద్ద బ్యాంకింగ్ మోసాల్లో ఒకటిగా నిలిచింది. దీని విలువ సుమారు రూ.12,700 కోట్లు. నగల వ్యాపారి నీరవ్ మోదీ తన బంధువు మెహుల్ చోక్సీతో కలిసి పీఎన్బీ ఉద్యోగులతో కుమ్మక్కై అనధికార లెటర్స్ ఆఫ్ అండర్ టేకింగ్ (ఎల్ఓయూ)లను ఉపయోగించి మోసపూరిత రుణాలు పొందారు. బ్యాంకింగ్ వ్యవస్థలో లొసుగుల కారణంగా ఈ కుంభకోణం ఏళ్ల తరబడి బయటపడలేదు.నీరవ్ మోదీ కుంభకోణంలో గీతాంజలి జెమ్స్ యజమాని మెహుల్ చోక్సీ కూడా ఇరుక్కున్నాడు. 2018 ప్రారంభంలో దేశం విడిచి పారిపోయిన అతను అప్పటి నుంచి అధికారులు, విచారణ వ్యవస్థల నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు.ఇదీ చదవండి: రేట్ల కోత కాదు.. ఏం చేయాలో సూచించిన మిశ్రాపీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ మోసం (2020): సరైన నిబంధనలు పాటించకుండా షెల్ కంపెనీలకు రుణాలు ఇచ్చిన కేసులో పీఎన్బీఐ హౌసింగ్ ఫైనాన్స్ ప్రమేయం ఉందని తేలింది. ఈ కేసు ఇంకా విచారణలో ఉంది. -
మెహుల్ చోక్సీకి క్యాన్సర్ చికిత్స
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)లో రూ.13,500 కోట్ల కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ బెల్జియంలో క్యాన్సర్ చికిత్స పొందుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. చోక్సీ తరఫు న్యాయవాది విజయ్ అగర్వాల్ ఇటీవల ముంబయిలోని మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) ప్రత్యేక కోర్టుకు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. చోక్సీని పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడిగా (ఎఫ్ఈఓ) ప్రకటించాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రయత్నిస్తోంది. దాంతో ఆయన ఆస్తులను జప్తు చేసేందుకు ప్రభుత్వానికి వీలు కలుగుతుంది.చోక్సీ తన బంధువు నీరవ్ మోదీతో కలిసి మోసపూరిత లెటర్స్ ఆఫ్ అండర్ టేకింగ్ (ఎల్ఓయూ), ఫారిన్ లెటర్స్ ఆఫ్ క్రెడిట్ (ఎఫ్ఎల్సీ) ద్వారా పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)లో రూ.13,500 కోట్లకు పైగా మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2018 నుంచి కొనసాగుతున్న ఈ కేసు తదుపరి విచారణను ముంబయి కోర్టు ఫిబ్రవరి 27కి వాయిదా వేసింది. చోక్సీ ఆరోగ్య పరిస్థితి కారణంగా ప్రయాణం చేయలేకపోతున్నాడని, ఆయనను ఎఫ్ఈఓగా ప్రకటించడం అన్యాయమని తన తరఫు న్యాయవాది వాదించారు. ఈ కుంభకోణం బయటపడకముందే భారత్ను వదిలి వెళ్లిన ఆయన 2018 నుంచి ఆంటిగ్వాలోనే ఉంటున్నారని చెప్పారు. మరోవైపు నీరవ్ మోదీని 2019లో ఎఫ్ఈఓగా ప్రకటించారు. ప్రస్తుతం ఆయన లండన్లోని వాండ్స్వర్త్ జైలులో ఉన్నారు.ఇదీ చదవండి: భారీగా పడిపోయిన పామాయిల్ దిగుమతులుచోక్సీ ఆరోగ్య సమస్యల నేపథ్యంలో రాబోయే విచారణలో ఆయనను ఎఫ్ఈఓగా ప్రకటించడంపై కోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఎఫ్ఈఓగా ప్రకటిస్తే తన ఆస్తులను ప్రభుత్వం వేలం వేసి నష్టాన్ని భర్తీ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే మెహుల్ చోక్సీ ఈక్విటీ ఆస్తులకు సంబంధించి మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. చోక్సీ బ్యాంకు ఖాతాలు, షేర్లు, మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్లను జప్తు చేసింది. -
ATM Withdrawal Limit: ఏటీఎం నుంచి ఎంత తీసుకోవచ్చు..?
ప్రస్తుతం అంతటా డిజిటల్ పేమెంట్స్ పెరిగిపోయాయి. ముఖ్యంగా యూపీఐ వచ్చాక భౌతికంగా నగదు చలామణి చాలామటుకు తగ్గిపోయింది. ఎంత డిజిటల్ పేమెంట్స్ అందుబాటులో ఉన్నా కొన్ని సందర్భాలలో చేతిలో నగదు అవసరం ఉంటుంది. దీని కోసం ఖాతాదారులు ఏటీఎం సెంటర్లను ఆశ్రయిస్తుంటారు. అయితే ఏ బ్యాంక్ ఏటీఎం నుంచి రోజుకు ఎంత డబ్బు విత్డ్రా చేసుకోవచ్చన్న విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. ప్రధాన బ్యాంకుల్లో ఏ బ్యాంక్ ఏటీఎం విత్డ్రా లిమిట్ ఎంతన్నది ఈ కథనంలో తెలుసుకుందాం..ఎస్బీఐమీరు మ్యాస్ట్రో డెబిట్ కార్డ్ లేదా క్లాసిక్ డెబిట్ కార్డ్ కలిగి ఉంటే, గరిష్టంగా రోజుకు రూ.40,000 విత్డ్రా చేసుకోవచ్చు. మీ ఖాతా ‘ఇన్టచ్’ లేదా ’ఎస్బీఐ గో’కి లింక్ అయిఉంటే రోజువారీ ఉపసంహరణ పరిమితి రూ. 40,000. అదే ఎస్బీఐ ప్లాటినం ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్తో రోజుకు గరిష్టంగా రూ. 1,00,000 విత్డ్రా చేసుకోవచ్చు.హెచ్డీఎఫ్సీ హెచ్డీఎఫ్సీ ఖాతాకు ఇంటర్నేషనల్, వుమన్ అడ్వాంటేజ్ లేదా ఎన్ఆర్ఓ డెబిట్ కార్డ్లను లింక్ చేసినట్లయితే, రోజుకు గరిష్టంగా రూ. 25,000 విత్డ్రా చేసుకోవచ్చు. ఇంటర్నేషనల్ బిజినెస్, టైటానియం లేదా గోల్డ్ డెబిట్ కార్డ్లకు రోజువారీ ఉపసంహరణ పరిమితి రూ. 50,000. టైటానియం రాయల్ డెబిట్ కార్డ్కు రూ. 75,000. ప్లాటినం, ఇంపీరియా ప్లాటినం చిప్ డెబిట్ కార్డ్లకు రూ. 1,00,000. అదే జెట్ప్రివిలేజ్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వరల్డ్ డెబిట్ కార్డ్తో అయితే రోజుకు రూ. 3,00,000 వరకు విత్డ్రా చేసుకోవచ్చు.కెనరా బ్యాంక్కెనరా బ్యాంక్ క్లాసిక్ రూపే, వీసా లేదా స్టాండర్డ్ మాస్టర్ కార్డ్ డెబిట్ కార్డ్లతో రోజుకు గరిష్టంగా రూ.75,000 విత్డ్రా చేసుకోవచ్చు. ప్లాటినం లేదా మాస్టర్ కార్డ్ బిజినెస్ డెబిట్ కార్డ్తో 1,00,000 వరకు విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది.ఐసీఐసీఐఐసీఐసీఐ బ్యాంక్ కోరల్ ప్లస్ డెబిట్ కార్డ్ వినియోగదారులకు విత్డ్రా పరిమితి రోజుకు రూ. 1,50,000. ఐసీఐసీఐ ఎక్స్ప్రెషన్, ప్లాటినం లేదా టైటానియం డెబిట్ కార్డ్లకు డైలీ లిమిట్ రూ. 1,00,000. ఇక ఐసీఐసీఐ స్మార్ట్ షాపర్ సిల్వర్ డెబిట్ కార్డులకు అయితే రూ. 50,000. అదే ఐసీఐసీఐ బ్యాంక్ సాఫిరో డెబిట్ కార్డ్ ఉంటే రోజుకు గరిష్టంగా రూ. 2,50,000 విత్డ్రా చేసుకోవచ్చు.యాక్సిస్ బ్యాంక్యాక్సిస్ బ్యాంక్ రూపే ప్లాటినం లేదా పవర్ సెల్యూట్ డెబిట్ కార్డ్ ఉంటే రోజుకు రూ. 40,000 విత్డ్రా చేసుకోవచ్చు. లిబర్టీ, ఆన్లైన్ రివార్డ్స్, రివార్డ్స్ ప్లస్, సెక్యూర్ ప్లస్, టైటానియం రివార్డ్స్, టైటానియం ప్రైమ్ డెబిట్ కార్డ్ల ద్వారా రోజువారీ ఉపసంహరణ పరిమితి రూ. 50,000. అలాగే ప్రెస్టీజ్, డిలైట్ లేదా వాల్యూ ప్లస్ డెబిట్ కార్డ్లకు లిమిట్ రూ. 1,00,000. యాక్సిస్ బ్యాంక్ బుర్గుండి డెబిట్ కార్డ్ ద్వారా రోజువారీ ఉపసంహరణ పరిమితి రూ. 3,00,000.బ్యాంక్ ఆఫ్ బరోడావరల్డ్ అగ్నివీర్, రూపే క్యూస్పార్క్ ఎన్సిఎంసి, రూపే ప్లాటినం డిఐ, మాస్టర్ కార్డ్ డిఐ ప్లాటినం లేదా బిపిసిఎల్ డెబిట్ కార్డ్ ఉంటే రోజువారీ ఉపసంహరణ పరిమితి రూ. 50,000. రూపే క్లాసిక్ డీఐ లేదా మాస్టర్ కార్డ్ క్లాసిక్ డీఐ డెబిట్ కార్డ్ నుండి రోజుకు రూ. 25,000 విత్డ్రా చేసుకోవచ్చు. రూపే సెలెక్ట్ డిఐ డెబిట్ కార్డ్ ఉంటే రోజుకు రూ. 1,50,000 ఉపసంహరించుకోవచ్చు.ఇండియన్ బ్యాంక్సీనియర్ సిటిజన్లు, ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన ఖాతాదారులకు రోజుకు రూ. 25,000 విత్డ్రా పరిమితి ఉంది. రూపే ప్లాటినం, రూపే డెబిట్ సెలెక్ట్, మాస్టర్ కార్డ్ వరల్డ్ లేదా మాస్టర్ కార్డ్ వరల్డ్ ప్లాటినం కార్డులతో రోజుకు రూ. 50,000 విత్డ్రా చేసుకోవచ్చు. ఐబీ డిజీ రూపే క్లాసిక్, కలైంజర్ మగలిర్ ఉరిమై తిట్టం (KMUT) పథకం, రూపే కిసాన్ లేదా ముద్రా డెబిట్ కార్డ్లు ఉన్నవారు రోజుకు రూ. 10,000 విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఇక రూపే ఇంటర్నేషనల్ ప్లాటినం డెబిట్ కార్డ్ తో రూ. 1,00,000 విత్డ్రా చేసుకోవచ్చు.యూనియన్ బ్యాంక్మీ ఖాతాకు లింక్ అయిన క్లాసిక్ వీసా, మాస్టర్ కార్డ్ లేదా రూపే డెబిట్ కార్డ్ లతో రోజుకు రూ. 25,000 విత్డ్రా చేసుకోవచ్చు. ప్లాటినం వీసా, మాస్టర్ కార్డ్ లేదా రూపే డెబిట్ కార్డ్లకు పరిమితి రూ. 75,000. అదే బిజినెస్ ప్లాటినం వీసా, మాస్టర్ కార్డ్ ద్వారా రూ. 1,00,000 ఉపసంహరించుకోవచ్చు. యూనియన్ బ్యాంక్ రూపే సెలెక్ట్ డెబిట్ కార్డ్ ఉంటే రూ. 1,00,000, యూనియన్ బ్యాంక్ సిగ్నేచర్ వీసా, మాస్టర్ కార్డ్ లతో రూ. 1,00,000 విత్డ్రా చేసుకోవచ్చు.పంజాబ్ నేషనల్ బ్యాంక్రూపే ఎన్సీఎంసీ క్లాసిక్, వీసా క్లాసిక్ లేదా మాస్టర్ కార్డ్ క్లాసిక్ డెబిట్ కార్డ్తో రోజుకు గరిష్టంగా రూ. 25,000 విత్డ్రా చేసుకోవచ్చు. రూపే ఎన్సిఎంసి ప్లాటినం డొమెస్టిక్, రూపే ఎన్సిఎంసి ప్లాటినం ఇంటర్నేషనల్, రూపే ఉమెన్ పవర్ ప్లాటినం, రూపే బిజినెస్ ప్లాటినం ఎన్సిఎంసి, వీసా గోల్డ్, మాస్టర్ కార్డ్ ప్లాటినం డెబిట్ కార్డ్ల విత్డ్రా పరిమితి రూ. 1,00,000. అలాగే రూపే సెలెక్ట్, వీసా సిగ్నేచర్, మాస్టర్ కార్డ్ బిజినెస్ డెబిట్ కార్డ్లతో రోజుకు రూ. 1,50,000 విత్డ్రా చేసుకోవచ్చు.బ్యాంక్ ఆఫ్ ఇండియా మాస్టర్ కార్డ్ టైటానియం, రూపే సంగిని, రూపే పీఎంజేడీవై, రూపే ముద్ర, రూపే కిసాన్, రూపే పంజాబ్ అర్థవ్యస్థ, వీసా క్లాసిక్, ఎన్సీఎంసీ, మాస్టర్ బింగో లేదా వీసా బింగో డెబిట్ కార్డ్ల ద్వారా రోజుకు గరిష్టంగా రూ. 15,000 విత్డ్రా చేసుకోవచ్చు.రూపే ప్లాటినం, వీసా పేవేవ్ (ప్లాటినం), మాస్టర్ కార్డ్ ప్లాటినం డెబిట్ కార్డ్లకు రోజువారీ ఉపసంహరణ పరిమితి రూ. 50,000. రూపే సెలెక్ట్ డెబిట్ కార్డ్ లిమిట్ రూ. 50,000. వీసా బిజినెస్, వీసా సిగ్నేచర్ డెబిట్ కార్డ్లతో రోజుకు రూ. 1,00,000 వరకు డబ్బు తీసుకోవచ్చు.కోటక్ బ్యాంక్ కోటక్ జూనియర్ డెబిట్ కార్డ్తో రోజుకు రూ. 5,000, రూపే డెబిట్ కార్డ్ లేదా క్లాసిక్ వన్ డెబిట్ కార్డులతో రూ. 10,000, 811 డ్రీమ్ డిఫరెంట్, ఈజీ పే డెబిట్ కార్డ్లతో రూ. 25,000 విత్డ్రా చేసుకోవచ్చు. సిల్క్ ప్లాటినం, రూపే ఇండియా లేదా పెషోప్మోర్ డెబిట్ కార్డ్ ఉంటే రూ. 40,000, జిఫ్ఫీ ప్లాటినం ఎడ్జ్, ప్రో, బిజినెస్ క్లాస్ గోల్డ్, బిజినెస్ పవర్ ప్లాటినం ఎడ్జ్, ప్రో, ఎలైట్ కార్డుల రోజువారీ ఉపసంహరణ పరిమితి రూ. 50,000 ఉంది.ఇక యాక్సెస్ ఇండియా డెబిట్ కార్డ్ ఉపసంహరణ పరిమితి రూ. 75,000 కాగా పీవీఆర్, సిగ్నేచర్ ప్రో, నేషన్ బిల్డర్స్, గోల్డ్, జిఫ్ఫీ ప్లాటినం ఏస్, ప్లాటినం ఎడ్జ్, ప్రో, ఏస్ డెబిట్ కార్డ్లు రోజువారీ విత్డ్రాయల్ లిమిట్ రూ. 1,00,000. అదే ప్రివీ లీగ్ ప్లాటినమ్, వరల్డ్, బిజినెస్ పవర్ ప్లాటినమ్ ఏస్, ఆస్ట్రా డెబిట్ కార్డ్ ఉంటే రోజుకు రూ. 1,50,000 విత్డ్రా చేసుకోవచ్చు. ప్రివీ లీగ్ నియాన్, ప్రివీ లీగ్ ప్లాటినమ్, ప్రివీ లీగ్ సిగ్నేచర్ డెబిట్ కార్డ్లకు రూ. 2,00,000, ప్రివీ లీగ్ బ్లాక్, ఇన్ఫినిట్ డెబిట్ కార్డ్లకు రూ. 2,50,000 రోజువారీ ఉపసంహరణ పరిమితి ఉంది. -
పీఎన్బీ నిధుల సమీకరణ
న్యూఢిల్లీ: పీఎస్యూ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్) ద్వారా రూ. 5,000 కోట్లు సమీకరించింది. క్విప్లో భాగంగా షేరుకి రూ. 103.75 ధరలో 48.19 కోట్ల ఈక్విటీ షేర్లను కేటాయించింది. ఫ్లోర్ ధర రూ. 109.16తో పోలిస్తే ఇది 5 శాతం డిస్కౌంట్గా పీఎన్బీ పేర్కొంది. ఈ నెల 23–26 మధ్య క్విప్ సబ్ర్స్కిప్షన్ పూర్తయినట్లు వెల్లడించింది.మ్యూచువల్ ఫండ్స్, విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు, బీమా కంపెనీలు తదితర అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) నుంచి రూ. 41,734 కోట్ల విలువైన బిడ్స్ దాఖలైనట్లు తెలియజేసింది. ఇవి క్విప్ ప్రాథమిక పరిమాణం రూ. 2,500 కోట్లకు 16.7 రెట్లు అధికంకాగా.. మొత్తం సమీకరణ పరిమాణం రూ. 5,000 కోట్లకు 8.3 రెట్లు అధికమని వివరించింది. క్విప్ నిధులను బ్యాంక్ సీఈటీ–1 నిష్పత్తి మెరుగుకు, కనీస మూలధన నిష్పత్తి పటిష్టతకు వినియోగించనున్నట్లు పేర్కొంది. -
బ్యాంక్ ఖాతాలు క్లోజ్.. సమస్య పరిష్కారానికి చర్చలు
కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన తమ బ్యాంకులోని ఖాతాలను కొనసాగించేలా ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంకు ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో బ్యాంకు ఉద్యోగులు అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆయా బ్యాంకు అకౌంట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఈ తరుణంలో బ్యాంకులు తిరిగి రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలు కొనసాగించేలా చర్చలు జరుపుతున్నాయి.ఈ మేరకు రెండు బ్యాంకులు విడుదల చేసిన సంయుక్త ప్రకటన ప్రకారం..‘కర్ణాటక ప్రభుత్వానికి సంబంధించిన రెండు బ్యాంకుల్లోని ఖాతాలను ఉపసంహరించుకుంటున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. అయితే దీనిపై చర్చలు సాగుతున్నాయి. సమస్యను సామరస్యంగానే పరిష్కరించుకుంటాం’ అని తెలిపాయి.ఇదీ చదవండి: ఆ బ్యాంకుల్లో ఖాతాలు క్లోజ్.. కర్ణాటక సంచలన నిర్ణయంఇటీవల కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్మెంట్ బోర్డ్, కర్ణాటక స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్కు చెందిన మొత్తం రూ.22 కోట్ల డిపాజిట్లను ఉపసంహరించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురయ్యాయి. గతంలోనూ ప్రభుత్వ శాఖలు, సంస్థలు, కార్పొరేషన్లు, బోర్డులు, స్థానిక సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఇతర సంస్థల డిపాజిట్లు, పెట్టుబడులకు సంబంధించి బ్యాంకు ఉద్యోగులు అవకతవకలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దాంతో ప్రభుత్వం ఆయా బ్యాంకులను హెచ్చరించింది. కానీ వాటి తీరు మార్చుకోలేదు. దాంతో ఇటీవల రూ.22 కోట్లు ఉపసంహరించుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి. ఫలితంగా బ్యాంకు ఖాతాలను ముగిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఇందుకు సెప్టెంబర్ 20, 2024 చివరి తేదీగా ఖరారు చేశారు. దీనిపై రెండు బ్యాంకుల అధికారులు ప్రభుత్వంతో చర్చలు సాగిస్తున్నాయి. -
ఆ బ్యాంకుల్లో ఖాతాలు క్లోజ్.. కర్ణాటక సంచలన నిర్ణయం
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ల పట్ల కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్లలో ఆర్థిక అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఆ బ్యాంకుల్లో ప్రభుత్వానికి సంబంధించిన అన్ని ఖాతాలను మూసివేయాలని బుధవారం అన్ని శాఖలను ఆదేశించింది.రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని శాఖలు, సంస్థలు, కార్పొరేషన్లు, బోర్డులు, స్థానిక సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఇతర సంస్థలు ఈ బ్యాంకుల నుంచి తమ డిపాజిట్లు, పెట్టుబడులను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వ ఆర్థిక శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. అలాగే ఈ బ్యాంకుల్లో కొత్త డిపాజిట్లు లేదా పెట్టుబడులు కూడా పెట్టకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది.ఆయా బ్యాంకుల్లో రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అవకతవకలు, అనధికార లావాదేవీలు జరిగినట్లు రోపణలు వచ్చిన నేపథ్యంలో సిద్ధరామయ్య ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఆరోపణలకు సంబంధించి గతంలోనే హెచ్చరించినప్పటికీ పట్టించుకోకపోవడంతో ఖాతాలను మూసివేయాలనే నిర్ణయానికి దారితీసిందని ప్రభుత్వం తెలిపింది. రూ.187 కోట్ల కార్పొరేషన్ నిధులకు సంబంధించి అనధికార లావాదేవీలు జరిగిందని, ఇందులో రూ.88.62 కోట్లు ఐటీ కంపెనీల ఖాతాల్లోకి, హైదరాబాద్లోని సహకార బ్యాంకుకి బదిలీ అయినట్లు తేలిందని ఉత్తర్వుల్లో పేర్కొంది. -
పంజాబ్ నేషనల్ బ్యాంక్ అలర్ట్.. ఆగస్టు 12 డెడ్లైన్!
దేశంలో పురాతన, అతిపెద్ద బ్యాంకులలో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆగస్టు 12 లోపు కేవైసీ వివరాలను అప్డేట్ చేసుకోవాలని తమ కస్టమర్లను కోరింది. నిర్ణీత గడువులోపు కేవైసీ వివరాలను అప్డేట్ చేయడంలో విఫలమైతే, వారి ఖాతాలను నిలిపివేయనున్నట్లు ఒక ప్రకటన విడుదల చేసింది.ఈ అల్టిమేటం మార్చి 31 నాటికి కేవైసీ వివరాలు అప్డేట్ చేయని ఖాతాల కోసమని బ్యాంక్ తెలిపింది. ఈ మేరకు కస్టమర్లు తమ శాఖకు వెళ్లి ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, ఇటీవలి ఫోటో, పాన్, ఆదాయ రుజువు, మొబైల్ నంబర్ వంటివి అందించి కేవైసీ వివరాలను అప్డేట్ చేయించుకోవాల్సి ఉంటుంది.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలను అనుసరించి ఆగస్టు 12 లోపు కేవైసీని అప్డేట్ చేసుకోవాలని పంజాబ్ నేషనల్ బ్యాంక్ సూచించింది. పీఎన్బీ వన్ యాప్ / ఇంటర్నెట్ బ్యాంకింగ్ సర్వీసెస్ (IBS) / రిజిస్టర్డ్ ఈ-మెయిల్ / పోస్ట్ ద్వారా లేదా వ్యక్తిగతంగా ఏదైనా బ్రాంచ్ని సందర్శించడం ద్వారా కేవైసీ చేసుకోవచ్చని బ్యాంక్ తెలిపింది. -
పంజాబ్ నేషనల్ బ్యాంక్: జులై 1 నుంచి ఆ ఖాతాలు క్లోజ్!
PNB Alert: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) తమ కోట్లాది మంది ఖాతాదారులకు అప్రమత్తం చేసింది. ఈ బ్యాంకులో పొదుపు ఖాతా ఉండి గత కొన్నేళ్లుగా ఉపయోగించకపోతే జూలై 1 తర్వాత అలాంటి ఖాతాలు రద్దు కానున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈ విషయాన్ని చెబుతోంది. సేవింగ్స్ అకౌంట్ భద్రతను దృష్టిలో ఉంచుకుని బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది.మీకు పంజాబ్ నేషనల్ బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ ఉంటే ముందుగా దాని స్టేటస్ చెక్ చేసుకోండి. ఈ నెలాఖరు కల్లా వాడుకలో లేని ఖాతాలను బ్యాంక్ మూసివేయనుంది. గత మూడేళ్లుగా ఎలాంటి లావాదేవీలు జరగని ఖాతాలను, అలాగే గత మూడేళ్లుగా అకౌంట్ బ్యాలెన్స్ సున్నా ఉన్న అకౌంట్లను క్లోజ్ చేయబోతున్నట్లు బ్యాంకు తన నోటిఫికేషన్లో పేర్కొంది. అలాంటి కస్టమర్లకు ఇప్పటికే నోటీసులు సైతం పంపించింది.వాడుకలో లేని ఖాతాలకు కేవైసీ చేయించుకోవాలని పీఎన్బీ కొన్ని రోజుల క్రితమే ఖాతాదారులకు తెలియజేసింది. అయితే ఈ గడువును జూన్ 30 వరకు పొడిగించింది. ఆ తర్వాత జూలై 1 నుంచి ఈ ఖాతాలు క్లోజ్ అవుతాయి. చాలా కాలంగా కస్టమర్లు ఉపయోగించని ఇలాంటి ఖాతాలను చాలా మంది మోసగాళ్లు దుర్వినియోగం చేస్తున్నారు. ఇలాంటి కేసులను ఎదుర్కోవడానికి బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. బ్యాంక్ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. ఖాతా లెక్కింపు 2024 ఏప్రిల్ 30 ఆధారంగా జరుగుతుంది.తిరిగి యాక్టివేట్ చేసుకోండిలా..బ్యాంకు జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. అకౌంట్ ఇన్యాక్టివ్ అయి, ఖాతాదారు అకౌంట్ను తిరిగి యాక్టివేట్ చేయాలనుకుంటే బ్రాంచ్ కు వెళ్లి కేవైసీ ఫారాన్ని నింపాల్సి ఉంటుంది. కేవైసీ ఫారంతో పాటు అవసరమైన డాక్యుమెంట్లను కూడా జత చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వారి అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. కస్టమర్లు మరింత సమాచారం కోసం బ్యాంకును సంప్రదించవచ్చు. -
ఈ బ్యాంక్ కస్టమర్లకు గుడ్న్యూస్.. వడ్డీ రేట్లు పెరిగాయ్!
భద్రతతో కూడిన స్థిరమైన రాబడికి ఉత్తమమైన పెట్టుబడి మార్గం ఫిక్స్డ్ డిపాజిట్లు. అందుకే వీటిపై ఎక్కువ మంది దృష్టి సారిస్తున్నారు. కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు ఎప్పటికప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ వస్తున్నాయి. తాజాగా ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కూడా ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నిర్దిష్ట కాల వ్యవధి ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను 80 బేసిస్ పాయింట్లు పెంచింది. 300 రోజుల టెన్యూర్పై ఎఫ్డీ రేటు సాధారణ ప్రజలకు గతంలో 6.25 శాతం ఉండగా 7.05 శాతానికి పెంచింది. సీనియర్ సిటిజన్లకు 6.75 శాతం నుంచి 7.55 శాతానికి, సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.05 శాతం నుంచి 7.85 శాతానికి సవరించింది. రూ. 1 కోటి నుంచి రూ. 2 కోట్ల లోపు 300 రోజుల టెన్యూర్ పీఎన్బీ ఉత్తమ్ (ముందస్తు ఉపసంహరణకు వీలులేని) ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్లోనూ వడ్డీ రేట్లను పంజాబ్ నేషనల్ బ్యాంక్ సవరించింది. సాధారణ ప్రజలకు 6.30 శాతం నుంచి 7.10 శాతానికి, సీనియర్ సిటిజన్లకు 6.80 శాతం నంచి 7.60 శాతానికి పెంచింది. అలాగే సూపర్ సీనియర్ సిటిజన్లకు కూడా 7.10 శాతం నుంచి 7.90 శాతానికి పెంచింది. కొత్త ఎఫ్డీ రేట్లు జనవరి 8 నుంచి వర్తిస్తాయని పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన వెబ్సైట్లో తెలిపింది. ఆర్బీఐ ద్రవ్య విధానాన్ని ప్రకటించిన తర్వాత ఇటీవల ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి అనేక బ్యాంకులు తమ ఎఫ్డీ రేట్లను సవరించాయి. -
రెండు ప్రముఖ బ్యాంకులకు ఆర్బీఐ ఝలక్!
రెండు ప్రముఖ బ్యాంకులకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఝలక్ ఇచ్చింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ ప్రభుత్వ ఆధీనంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్, ప్రైవేట్ రంగ ఫెడరల్ బ్యాంక్తో పాటు మరో రెండు ఫైనాన్స్ సంస్థలకు భారీగా జరిమానాలు విధించింది. వడ్డీ రేట్లు, బ్యాంకుల్లో కస్టమర్ సర్వీస్ నిబంధనలు పాటించడంలో విఫలమైన పంజాబ్ నేషనల్ బ్యాంక్కు రూ.72 లక్షలు, కేవైసీ నిబంధనలు ఉల్లంఘించిన ఫెడరల్ బ్యాంక్కు రూ.30 లక్షల జరిమానా విధించినట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. ఇక కేవైసీ నిబంధనలను పాటించనందుకు మెర్సిడెస్-బెంజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (గతంలో డైమ్లర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్)కు రూ. 10 లక్షల పెనాల్టీని ఆర్బీఐ విధించింది. అలాగే ఎన్బీఎఫ్సీ నిబంధనలను ఉల్లంఘించిన కొసమట్టం ఫైనాన్స్ లిమిటెడ్పై రూ. 13.38 లక్షల నగదు పెనాల్టీ విధించినట్లు సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. -
వాటా విక్రయం! ఎస్బీఐ, ఎల్ఐసీ, పీఎన్బీ, బీవోబీ రెడీ..
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజాలు స్టేట్బ్యాంక్(ఎస్బీఐ), లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ), పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ), బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ).. యూటీఐ మ్యూచువల్ ఫండ్(ఎంఎఫ్)లో వాటాలను విక్రయించే యోచనలో ఉన్నాయి. పురాతన ఎంఎఫ్ యూటీఐ స్పాన్సర్స్ అయిన ఈ సంస్థలు వాటా విక్రయం కోసం మర్చంట్ బ్యాంకర్లను సంప్రదిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. యూటీఐ ఎంఎఫ్ను ఎస్బీఐ, పీఎన్బీ, ఎల్ఐసీ, బీవోబీ ఉమ్మడిగా ప్రమోట్ చేశాయి. ఈక్విటీలో మొత్తం 45.21 శాతం వాటాను కలిగి ఉన్నాయి. అనుబంధ సంస్థ ద్వారా మరో ప్రమోటర్ టీ రోవ్ ప్రైస్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్(యూకే) సైతం 23 శాతం వాటాను పొందింది. 2020లో పబ్లిక్ ఇష్యూ ద్వారా ఈ సంస్థలన్నీ యూటీఐ ఎంఎఫ్లో దాదాపు 3.9 కోట్ల షేర్లను విక్రయించాయి. వెరసి ఐపీవో నిధులను ప్రమోటర్ సంస్థలే అందుకున్నాయి. 2019 డిసెంబర్లో సెబీ ఆదేశాలమేరకు వాటాను తగ్గించుకునే బాటలో ఐపీవోను చేపట్టాయి. కాగా.. ప్రభుత్వ సంస్థలు(పీఎస్ఈలు) అనుబంధ సంస్థలలో వాటాలను విక్రయించాలనుకుంటే ప్రతిపాదనలను ఆయా శాఖలకు పంపించవచ్చని గతేడాది దీపమ్ స్పష్టం చేసింది. తద్వారా ఇందుకు అనుమతించింది. ఈ బాటలో తాజాగా సంబంధిత మార్గదర్శకాలను సైతం జారీ చేసింది. వీటి ప్రకారం వాటాల విక్రయ ప్రతిపాదనలు అందాక ఆయా మంత్రిత్వ పాలనా శాఖలు తొలుత పరిశీలించి దీపమ్కు బదిలీ చేస్తాయి. ఆపై దీపమ్ వీటికి ముందస్తు అనుమతిని మంజూరు చేస్తుంది. 1964లో.. పార్లమెంటు యూటీఐ ఎంఎఫ్ 1964లో ఏర్పాటైంది. యూఎస్ 64 పథకం మూతపడ్డాక 2002లో పార్లమెంట్ యూటీఐ చట్టాన్ని ఆమోదించింది. దీంతో యూటీఐను సూటీ(ఎస్యూయూటీఐ), యూటీఐ అసెట్ మేనేజ్మెంట్ పేరుతో రెండు సంస్థలుగా విభజించారు. యాక్సిస్ బ్యాంక్కు సూటీలో 11.8 శాతం వాటా ఉంది. ఇక యూటీఐ ఎంఎఫ్లో నాలుగు ప్రభుత్వ సంస్థల నుంచి టీ రోవ్ ప్రైస్ 2009లో 26 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఇందుకు 14 కోట్ల డాలర్లు వెచ్చించింది. ఒక్కో సంస్థ విడిగా 6.5 శాతం వాటా చొప్పున విక్రయించాయి. -
ఐసీఐసీఐ,పీఎన్బీ ఖాతాదారులకు షాకింగ్ న్యూస్!
సాక్షి,ముంబై: బ్యాంకింగ్ దిగ్గజాలు కస్టమర్లకు భారీ షాకిచ్చాయి. ప్రైవేట్ రంగ బ్యాంకు ఐసీఐసీఐ,పబ్లిక్ లెండర్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) రెండూ తమ మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేట్లకు (ఎంసీఎల్ఆర్) రేట్లు పెంచాయి. సవరించిన రేట్లు జూన్ 1, 2023 నుండి అమలులోకి వచ్చాయి. ఐసీఐసీఐ అనూహ్యం కొన్నింటికి వడ్డీరేటును తగ్గించి, మరికొన్నింటిపై వడ్డీరేటును పెంచడం గమనార్హం. ఒక నెల ఎంసీఎల్ఆర్ను 15 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. దీంతో ఈ వడ్డీరేటు 8.50 శాతం 8.35శాతానికి దిగి వచ్చింది. మూడు నెలల ఎంసీఎల్ఆర్ కూడా 8.55 శాతం నుంచి 8.40 శాతానికి తగ్గించింది. అయితే ఆరు నెలలు, ఏడాది కాలవ్యవధి రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటును 8.75 శాతంనుంచి 8.85 శాతానికి పెంచడం విశేషం. (సూపర్ ఆఫర్: ఐపోన్ 13పై రూ. ఏకంగా రూ. 36వేల డిస్కౌంట్) మరోవైపు పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా ఇదే బాటలో నడిచింది. అధికారిక వెబ్సైట్ వివరాల ప్రకారం ఓవర్నైట్ బెంచ్మార్క్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ 8శాతంనుంచి 8.10శాతానికి పెంచింది. ఒకటి, మూడు, ఆరు నెలల రేట్లును కూడా పెంచి వరుసగా 8.20, 8.30, 8.50 శాతంగా ఉంచింది. అలాగే ఏడాది రుణాలపై వడ్డీరేటు 8.60శాతంగానూ, మూడేళ్ల రుణాలపై వడ్డీరేటు 8.80శాతంనుంచి 8.90 శాతానికి పెంచింది. ఇదీ చదవండి: అంబానీ మనవరాలంటే అట్లుంటది! పాపాయి పేరు, రాశి ఇదేనట? మరిన్ని ఇంట్రస్టింగ్ అప్డేట్స్, బిజినెస్ వార్తలకోసం చదవండి సాక్షిబిజినెస్ -
ఆ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డులు వాడుతున్నారా? కొత్త రూల్స్ చూసారా..!
కొత్త ఆర్ధిక సంవత్సరం ప్రారంభమైపోయింది. ఈ తరుణంలో ఎన్నెన్నో కొత్త రూల్స్ కూడా పుట్టుకొచ్చాయి. ఇందులో భాగంగానే కొన్ని బ్యాంకులు తమ క్రెడిట్ కార్డు / డెబిట్ కార్డులలో చాలా మార్పులు తీసుకువచ్చాయి. ఇందులో ఎస్బీఐ, కోటక్ మహీంద్రా, పంజాబ్ నేషనల్ బ్యాంకు ఉన్నాయి. ఈ బ్యాంకులు చేసిన మార్పులను గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ప్యూర్-ప్లే క్రెడిట్ కార్డ్ జారీచేసే ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ (ఎస్బీఐ కార్డ్) తమ AURUM కార్డ్లలో కొన్ని మార్పులు తీసుకువచ్చింది. దీని ప్రకారం ఆరమ్ కార్డు కలిగిన వారు RBL Luxeకి బదులుగా టాటా క్లిక్ లగ్జరీ నుంచి రూ. 5000 వోచర్ పొందుతున్నారు. గతంలో రూ.5 లక్షలు క్రెడిట్ కార్డు ద్వారా ఖర్చు చేసిన వారికి ఆర్బీఎల్ లగ్జరీ నుంచి ఈ వోచర్ వచ్చేది. ఈజీ డైనర్ ప్రైమ్, లెన్స్ కార్ట్ గోల్డ్ మెంబర్ షిప్ ప్రయోజనాలను తొలగించింది. అయితే ఈ కార్డు మీద ప్రైమ్ అండ్ లెన్స్కార్ట్ గోల్డ్ మెంబర్షిప్ బెనిఫిట్ ఇకపై అందుబాటులో ఉండే అవకాశం ఉండదు. పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB) 2023 మే 1 నుంచి పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB) కూడా కొత్త నిబంధనలను అమలులోకి తీసుకువచ్చింది. దీని ప్రకారం ఏటీఎమ్ నుంచి అమౌంట్ డ్రా చేసుకోవడం వంటి లావాదేవీలపైన రూ. 10 + జీఎస్టీ విధిస్తోంది. అంతే కాకుండా డెబిట్ కార్డు, ప్రీపెయిడ్ కార్డు వంటి వాటికి కూడా కొంత రుసుము అమలు చేసే ప్రక్రియలో బ్యాంకు ఆలోచిస్తున్నట్లు సమాచారం. కోటక్ మహీంద్రా బ్యాంకు కోటక్ మహీంద్రా బ్యాంకు విషయానికి వస్తే, ఇది 2023 మే 23 నుంచి డెబిట్ కార్డు చార్జీలను రూ. 259తో పాటు GST పెంచనున్నట్లు తమ కస్టమర్లకు ఒక మెయిల్ ద్వారా తెలిపింది. గతంలో ఈ చార్జీలు రూ. 199 ప్లస్ జీఎస్టీతో ఉండేది. కావున ఈ బ్యాంకు కూడా త్వరలోనే కొత్త రూల్స్ ద్వారా కస్టమర్ల మీద పెను భారాన్ని మోపే అవకాశం ఉందని భావిస్తున్నాము. -
మే 1 నుంచి అమలయ్యే కీలక మార్పులు ఇవే..
ఏప్రిల్ నెల దాదాపు ముగుస్తోంది. మే నెల ప్రారంభం కాబోతోంది. జీఎస్టీ, మ్యూచువల్ ఫండ్స్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ చార్జీలు, గ్యాస్ సిలిండర్ ధరలకు సంబంధించిన కీలక మార్పులు మే 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తున్నాయి. ఇదీ చదవండి: Bank Holidays in May 2023: మే నెలలో 12 రోజులు బ్యాంకులు బంద్! సెలవులు ఏయే రోజుల్లో అంటే.. ఈ మార్పులు మీ ఆర్థిక వ్యవహారాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి ఈ మార్పుల గురించి తెలుసుకోవడం చాలా అవసరం. మే 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తున్న కీలక మార్పులు, కొత్త నిబంధనలు ఏంటో ఒకసారి చూద్దాం.. జీఎస్టీ కొత్త రూల్ జీఎస్టీ ఇన్వాయిస్ల అప్లోడ్కు సంబంధించి మే 1 నుంచి కొత్త రూల్ అమలవుతుంది. ఈ రూల్ ప్రకారం.. రూ. 100 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న కంపెనీలు తమ లావాదేవీల రసీదులను ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్ (IRP)లో ఏడు రోజుల వ్యవధిలో అప్లోడ్ చేయాలి. ప్రస్తుతం ఇన్వాయిస్ అప్లోడ్కు ఎలాంటి కాల పరిమితి లేదు. మ్యూచువల్ ఫండ్స్ కేవైసీ చేసిన ఈ-వాలెట్ల నుంచి మాత్రమే నగదును అంగీకరించాలని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ మ్యూచువల్ ఫండ్స్ కంపెనీలను ఆదేశించింది. అంటే మీ ఈ-వాలెట్ కేవైసీ కాకపోతే మీరు దాని ద్వారా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టలేరు. ఈ నిబంధన కూడా మే 1 నుంచి అమల్లోకి రానుంది. గ్యాస్ సిలిండర్ ధర కేంద్ర ప్రభుత్వం ప్రతి నెలా ఎల్పీజీ, సీఎన్జీ, పీఎన్జీ రేట్లను సవరిస్తుంది. గత నెలలో వాణిజ్య సిలిండర్ల ధరలను రూ.91.50 మేర తగ్గించింది. ప్రస్తుతం ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర రూ.2028 ఉంది. ప్రభుత్వం మే 1న ధరలను మార్చవచ్చు. పీఎన్బీ ఏటీఎం చార్జీలు ఇక పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎం లావాదేవీలకు సంబంధించి కొత్త చార్జీలు కూడా మే 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఖాతాల్లో బ్యాలెన్స్ లేని కారణంగా ఏటీఎంలలో లావాదేవీలు విఫలమైతే రూ.10తో పాటు అదనంగా జీఎస్టీని కూడా బ్యాంక్ విధిస్తుంది. ఇదీ చదవండి: New GST Rule: జీఎస్టీ కొత్త రూల్.. మే 1 నుంచి అలా కుదరదు! -
ఇంటర్పోల్ నిర్ణయం: చోక్సీకి విముక్తి లభించినట్టేనా?
సాక్షి,ముంబై: పీఎన్బీలో రూ. 13,000 కోట్ల మోసానికి పాల్పడి భారతదేశంనుంచి పారిపోయిన మెహుల్ చోక్సీ పేరును మోస్ట్ వాంటెడ్ లిస్ట్ నుంచి తొలగించడం సంచలనం సృష్టించింది. ఇంటర్పోల్ రెడ్ నోటీసు నుంచి మెహుల్ చోక్సీని ఎందుకు తొలగించారనేది చర్చనీయాంశంగా మారింది. చోక్సీ లాయర్ ఏమన్నారంటే? తన క్లయింట్ (మెహుల్ చోక్సీ) వ్యతిరేకంగా జారీ అయిన ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసు విత్ డ్రా చేసిందని, ఇది సంతోషించ దగ్గ పరిణామమని చోక్సీ న్యాయవాది విజయ్ అగర్వాల్ ప్రకటించారు. లీగల్ టీమ్ ఇంటర్పోల్తో విచారణ జరుపుతోంది. తాజా నిర్ణయంతో ఇపుడు అతను భారతదేశం మినహా ఎక్కడికైనా స్వేచ్ఛగా తిరగొచ్చని, ఇది ఇండియాలో అతనిపై పెండింగ్లో ఉన్న క్రిమినల్ వ్యాజ్యాన్ని ప్రభావితం చేయదని కూడా ప్రకటించారు. (పీఎన్బీ స్కాం: చోక్సీపై రెడ్ కార్నర్ నోటీసు ఎత్తివేత కలకలం) The legal team is taking up the matter with Interpol. Interpool has removed RCN on my client (Mehul Choksi) and now he is free to travel anywhere except India. This is not going to affect his criminal litigation pending in India. This RCN was an effort that he can be caught and… https://t.co/hN9zGXOnYP pic.twitter.com/BY5m4oRQV5 — ANI (@ANI) March 21, 2023 ఇంటర్పోల్ నిర్ణయం ప్రభావితం చేయదు మరోవైపు మెహుల్ చోక్సీకి వ్యతిరేకంగా రెడ్ కార్నర్ నోటీసు (ఆర్సిఎన్) రద్దు కేసును ప్రభావితం చేయదని కేంద్రం ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి.ఈ కేసు ఇప్పటికే అధునాతన దశలో ఉందని చోక్సీ అరెస్టు తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ ఏఎన్ఐ నివేదించింది. అసలు ఏం జరిగింది? సంచలన పీఎన్బీ స్కాంలో ప్రధాన నిందితుడిగా విదేశాలకు చెక్కేసిన మెహుల్చోక్సీని ఇంటర్పోల్ డేటాబేస్ ఆఫ్ రెడ్ నోటీసుల నుంచి ఉపసంహరించుకుందనేది ఇపుడు హాట్ టాపిక్. తనపై కుట్రపూరితంగా ఆరోపణలు చేస్తున్నారని వాదించి చోక్సీ, సీబీఐ చార్జ్షీటు, రెడ్ కార్నర్ నోటీసులపై సీబీఐ అభ్యర్థనను సవాల్ చేస్తూ లియోన్ హెడ్క్వార్టర్స్ ఏజెన్సీకి అప్పీల్ చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు ఇంటర్పోల్ ఐదుగురు సభ్యుల కమిటీ ఈ కేసును పరిశీలించింది. ముఖ్యంగా డొమినికాలో చోక్సీని కిడ్నాప్ చేసినట్లు వార్తలు వెలువడిన తర్వాత భారతదేశంలో న్యాయమైన విచారణ జరగక పోవచ్చని కమిటీ తెలిపింది. ఈ కేసు రాజకీయ కుట్ర ఫలితమని పేర్కొంది. హిందూస్తాన్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం, ఇంటర్పోల్ ఇలా ప్రకటించింది. చోక్సీని ఆంటిగ్వా నుండి డొమినికాకు కిడ్నాప్ చేయడంలో అంతిమ ఉద్దేశ్యం ఇండియాకు రప్పించడమేనని వ్యాఖ్యానించింది. అలాగే చోక్సిని ఇండియాకు తరలిస్తే.. ఈ కేసులో న్యాయమైన విచారణ లేదా అనారోగ్యంతో ఉన్న చోక్సి సరియైన చికిత్స పొందే అవకాశం ఉండకపోవచ్చని పేర్కొంది. -
పీఎన్బీ స్కాం: చోక్సీపై రెడ్ కార్నర్ నోటీసు ఎత్తివేత కలకలం
సాక్షి,ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)లో రూ. 13వేల కోట్ల రుణం మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పరారీలో ఉన్న మెహుల్ చోక్సీకి సంబంధించికీలక పరిణామంకలకలం రేపింది. ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసు లిస్ట్నుంచి చోక్సీ పేరును తొలగించింది. దీంతో అతనిని స్వదేశానికి రప్పించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్న భారత దర్యాప్తు సంస్థలకు, ప్రభుత్వానికి పెద్ద ఎదురు దెబ్బేనని విమర్శలు వెల్లువెత్తాయి. 2018 డిసెంబర్లో జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసును ఇంటర్పోల్ ఇపుడు ఉపసంహరించుకోవడం గమనార్హం. అంటే మెహుల్ చోక్సీ విదేశీ గడ్డపై దొరికితే అరెస్ట్ చేసే అధికారాన్ని భారత ప్రభుత్వం కోల్పోయినట్టే. అయితే తాజా పరిణామంపై సీబీఐ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన జారీ చేయలేదు. పీఎన్బీ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మెహుల్ చోక్సీ దేశం విడిచి పారిపోయిన సంగతి తెలిసిందే. పరారీలో ఉన్నమెహుల్ చోక్సీ పేరు ఇంటర్పోల్ డేటాబేస్ ఆఫ్ రెడ్ నోటీసుల నుండి తొలగించారు. లియోన్-హెడ్క్వార్టర్డ్ ఏజెన్సీకి చోక్సి అప్పీల్ మేరకే చోక్సీ పేరును రెడ్ లిస్ట్లో చేర్చిన నాలుగేళ్ల తర్వాత ఇంటర్పోల్ తాజా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ పరిణామంపై కాంగ్రెస్ కేంద్రంపై విమర్శలు గుప్పించింది. అయిదేళ్లనుంచి పరారీలో ఉన్న చోక్సీని ఇండియాకు ఎపుడు రప్పిస్తారంటూ కాంగ్రెస్ ట్విటర్ ద్వారా మోదీ సర్కార్ను ప్రశ్నించింది. PM मोदी का चहेता मेहुल 'भाई' चोकसी अब वांटेड नहीं रहा। भगोड़े मेहुल चोकसी के खिलाफ इंटरपोल ने रेड कॉर्नर नोटिस हटा लिया है। PM मोदी जवाब दें कि आपके 'मेहुल भाई' को देश वापस कब लाया जाएगा। 5 साल से फरार है, अब और कितना वक्त चाहिए? — Congress (@INCIndia) March 20, 2023 రెడ్ నోటీసు (లేదా రెడ్ కార్నర్ నోటీసు) 2018లో డిసెంబరు రెడ్ కార్నర్ నోటీసు జారీ అయింది. నాలుగేళ్ల తరువాత మెహుల్ చోక్సీని రెడ్ కార్నర్ నోటీసును ఇంటర్పోల్ తొలగించింది. తాజా నివేదికల ప్రకారం ఆ నోటీసు ఇప్పుడు ఇంటర్పోల్ వెబ్సైట్లో అందుబాటులో లేదు. మంగళవారం ఉదయం 8 గంటల నాటికి, మొత్తం రెడ్ నోటీసుల సంఖ్య 7023కి చేరింది. ఇంటర్పోల్లో 195 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. ఇంటర్పోల్ రెడ్ నోటీసు అనేది అప్పగించడం, లొంగిపోవడం లేదా ఇలాంటి చట్టపరమైన చర్యలు పెండింగ్లో ఉన్న వ్యక్తిని గుర్తించి, తాత్కాలికంగా అరెస్టు చేయమని ప్రపంచవ్యాప్తంగా ఉన్న చట్టాన్ని అమలు చేసేవారికి చేసే అభ్యర్థన. రెడ్ నోటీసు అరెస్ట్ వారెంట్తో సమానం కాదు. అయితే సంబంధిత వ్యక్తిని అరెస్టు చేయాలా వద్దా అనేదానిపై సభ్యదేశాలు తమ స్వంత చట్టాలను వర్తింపజేయాలి. అనేక సందర్భాల్లో నిందితుడిని కోరుకున్న దేశానికి అప్పగిస్తారు. కాగా పీఎన్బీ స్కాం ప్రధాన నిందితుడు డైమండ్ వ్యాపారి నీరవ్మోదీకి దగ్గరి బంధువు మెహుల్ చోక్సీ. దేశంలో అతిపెద్ద స్కాం వెలుగులోకి రావడంతో ఆంటిగ్వా , బార్బుడా పారిపోయి, అక్కడి పౌరసత్వం పొందాడు. ఈడీ, సీబీఐ దర్యాప్తు, ఫుజిటివ్ నేరస్తుడుగా కేంద్రం ప్రకటించింది. సీబీఐ అభ్యర్థన మేరకు పది నెలల తర్వాత ఇంటర్పోల్ అతడి రెడ్ నోటీసు జారీ చేసింది. అయితే సీబీఐ ఛార్జిషీట్పై చోక్సీ అభ్యంతరాలు లేవనెత్తడంతోపాటు,పలు సందర్భాల్లో భారతీయ జైళ్లు, ఆరోగ్య సమస్యలను కూడా ప్రస్తావించడం గమనార్హం. ఈ కీలక పరిణామాల మధ్య మే 2021లో చోక్సీ ఆంటిగ్వా నుండి అదృశ్యమైనాడు. ఆ తరువాత దేశంలోకి అక్రమంగా ప్రవేశించాడన్న ఆరోపణలపై డొమినికాలో అరెస్ట్ కావడంతో 51 రోజులు డొమినికా జైలులో గడిపాడు. అనంతరం అక్రమంగా ప్రవేశించిన చోక్సీపై ఉన్న అన్ని అభియోగాలను కూడా డొమినికా కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. -
బ్యాంకు కస్టమర్లకు అలర్ట్! ఈ బ్యాంకులో కొత్త రూల్..
ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ చెక్కు చెల్లింపుల విషయంలో కొత్త రూల్ తీసుకొస్తోంది. రూ. 5 లక్షలు అంతకంటే ఎక్కువ విలువైన చెక్కుల చెల్లింపులకు పాజిటివ్ పే సిస్టమ్ (పీపీఎస్)ని తప్పనిసరి చేసింది. ఈ కొత్త రూల్ ఏప్రిల్ 5 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ రూల్ మోసపూరిత చెక్కుల చెల్లింపు నుంచి కస్టమర్లను కాపాడుతుంది. ఇంతకుముందు రూ. 10 లక్షలు అంతకంటే ఎక్కువ విలువైన చెక్కుల చెల్లింపులకు పీపీఎస్లో చెక్కు వివరాలను సమర్పించాల్సి ఉండేది. రూ. 5 లక్షలు అంతకంటే ఎక్కువ మొత్తానికి చెక్కులను జారీ చేసేటప్పుడు బ్యాంక్ అకౌంట్ నంబర్, చెక్కు నంబర్, చెక్కు ఆల్ఫా కోడ్, జారీ చేసిన తేదీ, చెక్కు మొత్తం, లబ్ధిదారు పేరుతో సహా అవసరమైన వివరాలను కస్టమర్లు పీపీఎస్లో నమోదు చేయాల్సి ఉంటుంది. దీని వల్ల మోసాలు జరిగే అవకాశం తగ్గుతుందని బ్యాంకు పేర్కొంటోంది. చదవండి: అప్పట్లో వారి కోసం మా జీతాలు భారీగా తగ్గించుకున్నాం: ఇన్ఫీ నారాయణమూర్తి కస్టమర్లు ఈ పీపీఎస్ సౌకర్యాన్ని బ్యాంకు బ్రాంచ్, ఆన్లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఎస్సెమ్మెస్ బ్యాంకింగ్ ద్వారా ఉపయోగించుకోవచ్చు. చెక్కు ప్రెజెంటేషన్ లేదా క్లియరింగ్ తేదీకి ఒక రోజు ముందుగా చెక్కు వివరాలను పీపీఎస్లో సమర్పించాల్సి ఉంటుంది. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం 2021 జనవరి 1 నుంచి సీటీఎస్ క్లియరింగ్లో సమర్పించే రూ. 50 వేలు, అంతకంటే ఎక్కువ విలువైన చెక్కుల కోసం పంజాబ్ నేషనల్ బ్యాంకు పీపీఎస్ను ప్రవేశపెట్టింది. రూ. 5 లక్షల లోపు చెక్కులకు ఈ సదుపాయాన్ని పొందడం ఖాతాదారు ఇష్టం. అయితే రూ. 5 లక్షలు, అంతకంటే ఎక్కువ చెక్కుల కోసం మాత్రం దీన్ని తప్పనిసరి చేయవచ్చని ఆర్బీఐ బ్యాంకులకు సూచించింది. -
బ్యాంకులకు దండిగా వడ్డీ ఆదాయం
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్తో ముగిసిన మూడో త్రైమాసికంలో బ్యాంకుల వడ్డీ ఆదాయం గణనీయంగా వృద్ధి చెందింది. 25.5 శాతం పెరిగి రూ.1.78 లక్షల కోట్లుగా నమోదైంది. ఇచ్చిన రుణాలపై అధిక మార్జిన్, అధికంగా రుణాల వితరణ దీనికి కలిసొచ్చింది. నికర వడ్డీ మార్జిన్ (నిమ్) 0.17 శాతం పెరిగి 3.28 శాతానికి చేరింది. ప్రస్తుత రుణాలపై రేట్లను పెంచడంతోపాటు, కొత్తగా ఇచ్చే రుణాలపైనా రేట్లు పెంచడం, డిపాజిట్ రేట్లను పెద్దగా మార్చకుండా అదే స్థాయిలో కొనసాగించడం వడ్డీ ఆదాయం వృద్ధికి సానుకూలించినట్టు కేర్ రేటింగ్స్ తెలిపింది. బ్యాంకుల ఆదాయంపై ఈ సంస్థ ఓ అధ్యయన నివేదికను విడుదల చేసింది. నిమ్ వృద్ధిలో ప్రైవేటు బ్యాంకుల పాత్ర ఎక్కువగా ఉంది. మెరుగైన నిర్వహణ సామర్థ్యాల వల్ల ప్రైవేటు బ్యాంకుల నిమ్ 0.15 శాతం పెరిగి 4.03 శాతానికి చేరుకుంది. ప్రభుత్వరంగ బ్యాంకుల నిమ్ 0.17 శాతం వృద్ధితో 2.85 శాతంగా ఉంది. బ్యాంకులు సమీకరించిన డిపాజిట్లు/నిధులపై చెల్లించే రేటుకు, ఈ నిధులను రుణాలుగా ఇచ్చి వసూలు చేసే వడ్డీ రేటుకు మధ్య వ్యత్యాసమే నికర వడ్డీ మార్జిన్. పెద్ద బ్యాంకులు డిపాజిట్లపై అధిక రాబడులను ఆఫర్ చేయడం ఆరంభించాయని, రుణాలకు రెండంకెల స్థాయిలో డిమాండ్ ఉండగా, అదే స్థాయిలో డిపాజిట్లు రావడం లేదని క్రిసిల్ నివేదిక తెలిపింది. కనుక నిమ్ ఈ స్థాయిలో స్థిరపడొచ్చని అంచనా వేసింది. ఆర్బీఐ గతేడాది మే నుంచి 2.5 శాతం మేర పెరో రేటును పెంచడం తెలిసిందే. రుణాల్లో చక్కని వృద్ధి డిసెంబర్ క్వార్టర్లో బ్యాంకులు రుణాల్లో 18.5 శాతం వృద్ధిని నమోదు చేశాయి. రుణ వితరణలో ప్రభుత్వరంగ బ్యాంకులది పైచేయిగా ఉంది. ప్రభుత్వరంగ బ్యాంకులు 18.9 శాతం అధికంగా రుణాలను మంజూరు చేయగా, ప్రైవేటు రంగ బ్యాంకుల రుణ వితరణలో 17.9 శాతం వృద్ధిని చూపించాయి. నికర వడ్డీ మార్జిన్లో మాత్రం ప్రభుత్వరంగ బ్యాంకుల కంటే ప్రైవేటు బ్యాంకుల పనితీరు మెరుగ్గా ఉంది. వడ్డీ వ్యయాలు ప్రైవేటు రంగ బ్యాంకులకు 27.3 శాతానికి పెరిగితే, ప్రభుత్వరంగ బ్యాంకులకు 22.6 శాతానికి చేరాయి. సగటు రుణ రేటు 1.2 శాతం పెరిగి 8.9 శాతంగా ఉంది. డిపాజిట్ల కోసం బ్యాంకుల మధ్య పోటీ ఉండడం, ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపు నేపథ్యంలో రానున్న రోజుల్లో డిపాజిట్ రేట్లు పెరుగుతాయని అంచనా వేసింది. 12 ప్రభుత్వరంగ, 18 ప్రైవేటు రంగ బ్యాంకుల గణాంకాల ఆధారంగా కేర్ రేటింగ్స్ ఈ వివరాలను రూపొందించింది. -
పీఎన్బీ కస్టమర్లకు అలర్ట్.. ఇది తప్పనిసరి, లేదంటే మీ బ్యాంక్ ఖాతాపై ఆంక్షలు తప్పవ్!
పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన కస్టమర్లకు కీలక విషయాన్ని వెల్లడించింది. తమ బ్యాంక్లో అకౌంట్ కలిగిన కస్టమర్లు డిసెంబర్ 12 కేవైసీ (KYC) వివరాలను అప్డేట్ చేసుకోవాలని లేదంటే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని సూచనలు చేసింది. కేవైసీ పెండింగ్లో ఉన్న తమ ఖాతాదారులకు పీఎన్బీ ఇప్పటికే ఎస్ఎంఎస్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది. అలాగే రిజిస్టర్డ్ అడ్రస్కు రెండు నోటీసులు పంపించింది. అయితే ఇది అందరికీ వర్తించదు. ఎవరి కేవైసీ అప్డేట్ ఇంకా పెండింగ్లో ఉందో వారికి మాత్రమేనని తెలిపింది. ఈ మేరకు పీఎన్బీ అధికారికి ట్వీటర్లో ట్వీట్ చేసింది. ట్వీట్లో ఏముంది ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. కస్టమర్లు కేవైసీ అప్డేషన్ తప్పనిసరి. 30.09.2022 నాటికి ఏ కస్టమర్ల ఖాతాకు సంబంధించి కేవైసీ పెండింగ్లో ఉందో వారికి మొబైల్ ఎస్ఎంఎస్, నోటీసుల ద్వారా ఈ విషయాన్ని తెలియజేశాం. ఈ నేపథ్యంలో పెండింగ్లో ఉన్న కస్టమర్లు వెంటనే వారి బ్యాంక్ బ్రాంచ్కు వెళ్లి 12.12.2022 లోపు ఈ అప్డేట్ ప్రక్రియని పూర్తి చేయాలి. ఇది పూర్తి చేయని కస్టమర్ల ఖాతాలపై ఆంక్షలు అమలులోకి వస్తాయని తెలిపింది. KYCని ఎలా అప్డేట్ చేయాలి పీఎన్బీ కస్టమర్లు గుర్తింపు, అడ్రస్ ప్రూఫ్, ఇటీవలి ఫోటోలు, పాన్ కార్డ్, ఇన్కం ప్రూఫ్, మొబైల్ నంబర్లు వంటి వివరాలను బ్యాంకుకు మెయిల్ చేయవచ్చు (తమ బ్యాంక్ అకౌంట్లో రిజస్టర్ చేసుకున్న ఈమెయిల్ ద్వారా), లేదా వ్యక్తిగతంగా ఈ సమాచారాన్ని బ్యాంకుకు వెళ్లి అందివ్వాల్సి ఉంటుంది. పీఎన్బీ ఖాతాదారులు కేవైసీ పెండింగ్లో ఉందో లేదా అనే సమాచారం కోసం 1800 180 2222/ 1800 103 2222 (టోల్-ఫ్రీ)/ 0120-2490000 (టోల్ చేసిన నంబర్)లో కస్టమర్ కేర్ సేవతో కనెక్ట్ కావచ్చు. Points to be noted 👇🏻 Remember: KYC updation is mandatory as per RBI guidelines. Beware: Bank does not call & request personal information of customers for KYC updation.#KYC #Banking #SmartBanking #FoolTheFraudster pic.twitter.com/f6WohISarL — Punjab National Bank (@pnbindia) November 20, 2022 చదవండి: మినిమం బ్యాలెన్స్ నిర్వహించని ఖాతాలపై పెనాల్టీ.. కేంద్రం ఏం చెప్పిందంటే? -
పీఎన్బీ ఖాతాదారులకు గుడ్ న్యూస్
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) వృద్ధుల కోసం అధిక వడ్డీ రేటుతో ప్రత్యేక డిపాజిట్ పథకాన్ని ప్రకటించింది. 60 ఏళ్లు నిండిన ఎవరైనా కానీ 600 రోజుల కాలానికి డిపాజిట్ చేసుకోవచ్చు. దీనిపై 7.85 శాతం వార్షిక రేటును ఆఫర్ చేస్తోంది. అక్టోబర్ 19 నుంచి ఇది అమల్లోకి వచ్చినట్టు తెలిపింది. రూ.2 కోట్ల వరకు డిపాజిట్లకు ఇది వర్తిస్తుంది. ఇక వృద్ధులు కాకుండా ఇతరులకు 600 రోజుల డిపాజిట్పై (ఎప్పుడైనా ఉపసంహరించుకోతగిన) 7 శాతం వడ్డీ రేటు, కాలవ్యవధి వరకు ఉపసంహరణకు వీల్లేని 600 రోజుల డిపాజిట్పై 7.05 శాతం వడ్డీని ఇస్తున్నట్టు పీఎన్బీ తెలిపింది. -
భారీ పెంపు: పీఎన్బీ ఖాతాదారులకు గుడ్ న్యూస్
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) ఫిక్స్డ్ డిపాజిట్లపై (ఎఫ్డీలు) వడ్డీ రేట్లను పెంచింది. పీఎన్బీ రూ.2 కోట్ల వరకు ఎఫ్డీలపై రేట్లను సవరించింది. వారం వ్యవధిలో రేట్లను సవరించడం రెండో సారి. ఈ రేట్లు ఈ నెల 26 నుంచి అమల్లోకి వచ్చాయి. గరిష్టంగా 0.75 శాతం వరకు రేట్లను పెంచింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు సైతం ఎఫ్డీలపై రేట్లను పెంచడం ఒక నెలలో ఇది రెండో పర్యాయం. వివిధ కాల పరిమితులపై రూ.2 కోట్ల వరకు చేసే ఎఫ్డీలపై 0.50 శాతం వరకు పెంచింది. రికరింగ్ డిపాజిట్ల రేట్లను కూడా పెంచింది. సవరించిన రేట్లు అక్టోబర్ 26 నుంచే అమల్లోకి వచ్చాయి. -
ఆ ఖాతాదారులకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ శుభవార్త!
సాక్షి,ముంబై: ప్రభుత్వ రంగ రుణదాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) డిపాజిట్ మెచ్యూరిటీలపై సీనియర్ సిటిజన్లు, సూపర్ సీనియర్ సిటిజన్లకు శుభవార్త అందించింది. ఫిక్స్డ్ డిపాజిట్లను సురక్షితమైన, ఆకర్షణీయమైన పెట్టుబడి అవకాశాలుగా చూసే వారికి ఇది అద్భుతమైన వార్త. ముఖ్యంగా సీనియర్,సూపర్ సీనియర్ సిటిజన్లకు బ్యాంక్ వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు మేర అదనంగా ఇవ్వనుంది. కొత్త రేట్లు సెప్టెంబర్ 13, 2022 నుండి అమలులోకి వచ్చాయని బ్యాంక్ ప్రకటించింది. పీఎన్బీ సీనియర్ సిటిజన్లు, సూపర్ సీనియర్ సిటిజన్లకు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రూ. 2 కోట్ల లోపు దేశీయ డిపాజిట్లపై ఈ పెంపు వర్తిస్తుంది. సీనియర్ సిటిజన్ల కోసం FDలపై వడ్డీ రేట్లు నిర్దిష్ట కాలవ్యవధిని సెట్ చేసినప్పటికీ, సూపర్ సీనియర్ సిటిజన్లకు మాత్రం అన్నిరకాల డిపాజిట్లపై ఒకే రేటు అందిస్తుంది. బ్యాంకు అధికారిక వెబ్సైట్ ప్రకారం రూ. 2 కోట్ల వరకు రేటు 30 బేసిస్ పాయింట్లు (బిపిఎస్) గా ఉంది. 60-80 ఏళ్లలోపు సీనియర్ సిటిజన్లు 5 సంవత్సరాల పరిధి డిపాజాట్లపై 50 బీపీఎస్ అదనపు వడ్డీని పొందుతారు. 5 కంటే ఎక్కువ కాలానికి 80బీపీఎస్ పాయింట్ల ఎక్కువ పొందుతారు.మొత్తంగా సీనియర్ సిటిజన్లకు 6.60 శాతం, సూపర్ సీనియర్లకు 6.90 శాతం వడ్డీ రేటు పొందుతారు. రిటైర్డ్ సిబ్బంది, రిటైర్డ్ సూపర్ సీనియర్ సిటిజన్లకు గరిష్టంగా 180 బీపీఎస్ పాయింట్లు వడ్డీ రేటు వర్తిస్తుంది. అలాగే పీఎన్బీ ట్యాక్స్ సేవర్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ కింద ఉద్యోగులతో పాటు సీనియర్ సిటిజన్లు అయిన రిటైర్డ్ ఉద్యోగులకు వర్తించే అత్యధిక వడ్డీ రేటు 100 బీపీఎస్ పాయింట్లుగా ఉంటుందని బ్యాంక్ తెలిపింది. -
అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత అరెస్ట్!
సాక్షి, హైదరాబాద్: అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత అరెస్ట్ అయ్యారు. పీఎన్బీ నుంచి రూ.52 కోట్ల రుణం తీసుకుని ఎగ్గొట్టారనే అభియోగాల నేపథ్యంలోనే ఆమెను సీబీఐ అధికారులు హైదరాబాద్లోని నివాసం నుంచి మంగళవారమే అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆపై హైదరాబాద్ నుంచి బెంగళూరుకు తరలించారు అధికారులు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి విశ్వేశ్వర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ పేరుతో లోన్ తీసుకుని ఎగ్గొట్టారనే బ్యాంక్ అధికారుల ఫిర్యాదుతో కొత్తపల్లి గీతపై గతంలోనే కేసులు నమోదు అయ్యాయి. ఈ తరుణంలో సీబీఐ ఇప్పుడు ఆమెను అదుపులోకి తీసుకోవడం విశేషం. బెంగళూరు అధికారులు కేవలం విచారణ కోసం తీసుకెళ్లారా? లేదంటే ఇతర కారణాలు ఉన్నాయా? అనే దానిపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. ఇదీ చదవండి: ఏపీలో ఆరు పార్టీల తొలగింపు! -
బంపర్ ఆఫర్: మొబైల్ ఫోన్ అలవెన్స్ ఏడాదికి రూ.2 లక్షలు
ముంబై: ప్రభుత్వరంగ పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) ఉన్నతస్థాయిలోని (మేనేజ్మెంట్) ఉద్యోగులు ఒక్కొక్కరికి మొబైల్ ఫోన్లు కొనుగోలుకు వీలుగా ఏడాదికి రూ.2 లక్షలను అలవెన్స్గా ఇవ్వాలని నిర్ణయించింది. ఉద్యోగుల సంక్షేమ ప్రయోజనాలను ఈ మేరకు సవరించింది. దీని ప్రకారం ఎండీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఈ మొబైల్ ఫోన్ అలవెన్స్కు అర్హులు. సవరించిన నిబంధనలు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చినట్టు బ్యాంక్ ప్రకటించింది. పీఎన్బీలో ఎండీ, సీఈవోకి సహాయం అందించేందుకు ప్రస్తుతం నలుగు రు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు పనిచేస్తున్నారు. ఇక చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం) స్థాయి అధికారికి గతంలో మాదిరే మొబైల్ ఫోన్ అలవెన్స్ కొనసాగనుంది. సీజీఎం రూ.50,000, జీఎం రూ.40,000ను ఫోన్ అలవెన్స్ పొందొచ్చు. -
ఎయిర్ఫోర్స్తో ఎస్బీఐ, పీఎన్బీ, బీవోబీ ఒప్పందాలు
ముంబై: ప్రభుత్వరంగ ఎస్బీఐ, పీఎన్బీ, బీవోబీ భారత వాయుసేన (ఇండియన్ ఎయిర్ఫోర్స్)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఎయిర్ఫోర్స్తో ‘డిఫెన్స్ వేతన ప్యాకేజీ’ ఒప్పందం చేసుకున్నట్టు ఎస్బీఐ ప్రకటించింది. ఈ ఒప్పందం కింద ఎయిర్ఫోర్స్ ఉద్యోగులు, పదవీ విరమణ తీసుకున్న వారికి ఎస్బీఐ పలు ప్రయోజనాలు, ఫీచర్లతో ఉత్పత్తులను ఆఫర్ చేయనుంది. వ్యక్తిగత ప్రమాద బీమా, వాయు ప్రమాదం, విధుల్లో మరణిస్తే అదనపు పరిహారంతో బీమా రక్షణను అందించనున్నట్టు తెలిపింది. శాశ్వత/పాక్షిక అంగవైకల్య కవరేజీ కూడా అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ‘‘మన జాతి, పౌరుల రక్షణ కోసం వైమానిక దళ ప్రయత్నాలకు మద్దతుగా నిలవాలని అనుకుంటున్నాం. డిఫెన్స్ శాలరీ స్కీమ్ కింద వారికంటూ ప్రత్యేకమైన పరిష్కారాలు అందించడాన్ని కొనసాగిస్తాం’’అని ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖరా ప్రకటించారు. ఈ ప్రయోజనాలు డిఫెన్స్ శాలరీ ప్యాకేజీ పరిధిలో ఉన్న ఖాతాదారులకు ఆటోమేటిగ్గా లభిస్తాయని ఎస్బీఐ తెలిపింది. -
వినియోగదారులకు ప్రభుత్వ రంగ బ్యాంకు షాక్!
న్యూఢిల్లీ: ప్రభుత్వ యాజమాన్యంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) తన వినియోగదారులకు షాక్ ఇచ్చింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేటును 15 బేసిస్ పాయింట్లు లేదా 0.15 శాతం పెంచింది. అన్ని రకాల టెన్యూర్స్పై ఈపెంపు వర్తిస్తుందని బుధవారం ప్రకటించింది. దీంతో రుణాల ఈఎంఐలపై భారం పడనుంది. సవరించిన కొత్త రేట్లు జూన్ 1 నుంచి అమల్లోకి వస్తాయని పీఎన్బీ రెగ్యులేటరీ ఫైలింగ్లో పేర్కొంది. ఏడాదికాల రుణాలపై ఎంసీఎల్ ఆర్ 7.25 - 7.40 శాతానికి పెరిగింది. అలాగే ఓవర్నైట్, ఒక నెల, మూడు నెలల రుణాలపై వడ్డీరేటు వరుసగా 6.7, 6.80, 6.90 శాతానికి చేరుకోగా, ఆరు నెలల వడ్డీరేటు 7.10 శాతానికి పెరిగింది. గత నెల మేలో ఆర్బీఐ రేటును పెంచిన తర్వాత ఈ మార్పు చోటు చేసుకొంది. -
పీఎన్బీ, ఐడీబీఐ బ్యాంకుల్లో కీలక పరిణామం.. !
న్యూఢిల్లీ: పీఎస్యూ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ), ప్రయివేట్ రంగ సంస్థ ఐడీబీఐ బ్యాంకులలో ప్రభుత్వం ఇద్దరు డైరెక్టర్లను నామినేట్ చేయనుంది. పంకజ్ శర్మను 2022 ఏప్రిల్ 11 నుంచి డైరెక్టర్గా ప్రభుత్వం నియమించినట్లు పీఎన్బీ పేర్కొంది. తదుపరి ఆదేశాలు జారీ అయ్యేటంతవరకూ బాధ్యతల్లో కొనసాగుతారని తెలియజేసింది. పంకజ్ జైన్ స్థానే శర్మ పదవిని చేపట్టినట్లు వెల్లడించింది. ప్రస్తుతం పంకజ్ శర్మ ఆర్థిక శాఖకు చెందిన ఫైనాన్షియల్ సర్వీసుల విభాగంలో సంయుక్త కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రభుత్వం ఈ నెల 11న విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా మనోజ్ సహాయ్, సుశీల్ కుమార్ సింగ్లను డైరెక్టర్లుగా నియమించినట్లు ఐడీబీఐ బ్యాంక్ వెల్లడించింది. మీరా శ్వాంప్, అన్షుమన్ శర్మ స్థానే వీరి నియామకం వెంటనే అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. తదుపరి ఆదేశాలు జారీ అయ్యేవరకు వీరు బాధ్యతలు నిర్వహిస్తారని పేర్కొంది. ప్రత్యేక నియామకం ప్రస్తుతం ప్రయివేట్ రంగ సంస్థగా ఉన్న ఐడీబీఐ బ్యాంక్లో ప్రభుత్వానికి 45.48 శాతం, ఎల్ఐసీకి 49.24 శాతం చొప్పున వాటా ఉంది. దీంతో కంపెనీల చట్టం 2013లోని సెక్షన్ 161(3) ప్రకారం ప్రభుత్వ నామినీ డైరెక్టర్లకు బాధ్యతలు అప్పగించినట్లు బ్యాంక్ వివరించింది. కాగా.. ప్రభుత్వం వెనువెంటనే అమల్లోకి వచ్చే విధంగా ఎంజీ జయశ్రీని డైరెక్టర్గా నామినేట్ చేసినట్లు పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ పేర్కొంది. ఆర్థిక శాఖలోని ఫైనాన్షియల్ సర్వీసుల విభాగంలో డిప్యూటీ డైరెక్టర్గా జయశ్రీ విధులు నిర్వహిస్తున్నట్లు తెలియజేసింది. ప్రభుత్వ నామినీ డైరెక్టర్ల నియామక వార్తల నేపథ్యంలో పీఎన్బీ షేరు బీఎస్ఈలో 2 శాతం క్షీణించి రూ. 36.75 వద్ద, ఐడీబీఐ బ్యాంక్ 3 శాతం నష్టంతో రూ. 46 వద్ద ముగిశాయి. పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ 1.5 శాతం నీరసించి రూ. 17 వద్ద స్థిరపడింది. -
ఖాతాదారులకు గట్టిషాకిచ్చిన పంజాబ్ నేషనల్ బ్యాంక్..!
ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన ఖాతాదారులకు గట్టి షాక్ను ఇచ్చింది. ఖాతాదారుల సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. సవరించిన వడ్డీ రేట్లు ఏప్రిల్ 4, 2022 నుంచి అమలులోకి రానుంది. ఖాతాదారులకు నిరాశపరుస్తూ వడ్డీరేట్లను పీఎన్బీ తగ్గించింది. 10 లక్షల లోపు బ్యాలెన్స్ ఉన్న సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేట్లను ఏడాదికి గాను 2.70 శాతానికి తగ్గించినట్లు పీఎన్బీ ప్రకటించింది. అంతేకాకుండా రూ.10 లక్షల నుంచి రూ.500 కోట్ల మధ్య బ్యాలెన్స్ ఉన్న సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేటును ఏడాదికి 2.75 శాతానికి తగ్గిస్తూ పీఎన్బీ నిర్ణయం తీసుకుంది. సవరించిన వడ్డీ రేట్లు డొమెస్టిక్, ఎన్ఆర్ఐ ఖాతాదారులకు వర్తించనుంది. పీఎన్బీ తీసుకున్న నిర్ణయంతో లక్షల మంది డిపాజిటర్లను ప్రభావితం చేయనుంది. వీరిలో చాలా మందికి రూ.10 లక్షల కంటే తక్కువ ఖాతా నిల్వలు ఉన్నాయి. రెండు నెలల సమయంలో రెండోసారి డిపాజిట్దారుల పొదుపు ఖాతాలపై వడ్డీ రేటును పీఎన్బీ మరింత తగ్గించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తన పొదుపు ఖాతాపై రేటు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. రెండు రోజుల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెల వారీ ద్రవ్య విధాన కమిటీ సమావేశం జరిగే నేపథ్యంలో పీఎన్బీ వడ్డీరేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్లో భాగంగా స్వల్పకాలిక డిపాజిట్లపై 0.5 శాతం నుంచి 0.75 శాతం వరకు వడ్డీ రేట్లు ఇస్తోంది. మధ్యస్థ, దీర్ఘకాలిక డిపాజిట్లపై సంవత్సరానికి 2.25 శాతం, 2.5 శాతం వడ్డీ రేట్లను అందిస్తోంది. చదవండి: స్టాక్స్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నది తెలుగువారే.. -
కస్టమర్ల ధ్రువీకరణ తర్వాతే చెక్కులకు ఆమోదం
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) రూ.10 లక్షలు అంతకుమించిన చెక్కుల ఆమోదానికి కస్టమర్ల ధ్రువీకరణను అమల్లోకి తీసుకురానున్నట్టు ప్రకటించింది. ఏప్రిల్ 4 నుంచి పాజిటివ్ పేసిస్టమ్ (పీపీఎస్)ను అమలు చేయనుంది. రూ.10 లక్షలకు మించిన చెక్కు క్లియరెన్స్ కోసం వచ్చినప్పుడు కస్టమర్ ధ్రువీకరణను తీసుకోనుంది. తద్వారా చెక్కుల రూపంలో భారీ మోసాలకు చెక్ పెట్టొచ్చన్నది పీఎన్బీ అభిప్రాయంగా ఉంది. ఆర్బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా 2021 జనవరి 1 నుంచి సీటీఎస్ విధానంలో రూ.50,000, అంతకుమించిన చెక్కులకు పీపీఎస్ను పీఎన్బీ అమలు చేస్తోంది. ఈ సదుపాయాన్ని పొందడం ఖాతాదారుల ఇష్టానికి వదిలేయాలని, రూ.5లక్షలకు మించిన చెక్కులకు బ్యాంకులు తప్పనిసరి చేయవచ్చని గతంలో ఆర్బీఐ బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. -
పీఎన్బీ ఖాతాదారులకు అలర్ట్.. మరో కొత్త రూల్..!
చెక్కు మోసాల నుంచి బ్యాంకు ఖాతాదారులను రక్షించడం కోసం పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) పెద్ద మొత్తంలో జరిగే లావాదేవీలకు ఏప్రిల్ 4 నుంచి పాజిటివ్ పే సిస్టమ్(పీపీఎస్)ను తప్పనిసరి చేస్తామని నేడు తెలిపింది. ₹10 లక్షలు, అంతకంటే ఎక్కువ విలువ కలిగిన చెక్కుల కోసం వచ్చే నెల నుంచి పీపీఎస్ తప్పనిసరి చేయనున్నట్లు రుణదాత తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) మార్గదర్శకాల ప్రకారం.. 1 జనవరి 2021 నుంచి సీటీఎస్ క్లియరింగ్ సమయంలో ₹50,000, అంతకంటే విలువ కలిగిన చెక్కుల కోసం పీపీఎస్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) అభివృద్ధి చేసిన పాజిటివ్ పే సిస్టమ్(పీపీఎస్) కింద పెద్ద మొత్తం గల చెక్కును క్రాస్ చెక్ చేసే సమయంలో కొన్ని వివరాలను తప్పక తిరిగి ధృవీకరించాల్సి ఉంటుంది. పీఎన్బీ కస్టమర్లు అకౌంట్ నెంబరు, చెక్ నెంబరు, చెక్ ఆల్ఫా కోడ్, జారీ తేదీ, మొత్తం, లబ్ధిదారుపేరు వంటి వివరాలను తెలపాల్సి ఉంటుంది. చెక్ క్లియరింగ్ కోసం కనీసం 24 పనిగంటల ముందు చెక్ వివరాలను బ్యాంకుతో పంచుకోవాలి. కస్టమర్లు తన ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఎస్ఎమ్ఎస్ బ్యాంకింగ్ లేదా తమ హోమ్ బ్రాంచీకి వెళ్ళి వివరాలను పంచుకోవచ్చు. ₹5 లక్షలు, అంతకంటే ఎక్కువ విలువ కలిగిన చెక్కులను క్లియర్ చేయడం కోసం పాజిటివ్ పే సిస్టమ్ వేసులుబాటును ఆర్బీఐ బ్యాంకులకు కల్పించింది. (చదవండి: ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేవారికి అదిరిపోయే శుభవార్త.. సింగిల్ ఛార్జ్ @ 300కిమీ!) -
అప్పులు చేసి పారిపోయిన మెహుల్ చోక్సీ.. హైదరాబాద్ ఆస్తుల అమ్మకం
బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి చెందిన ఆస్తులను హైదరాబాద్కి చెందిన ఓ సంస్థ దక్కించుకుంది. దీనికి సంబంధించిన అధికారిక వ్యవహరాలు ఇటీవలే కొలిక్కి వచ్చాయి. హైదరాబాద్లో పెట్టుబడులు ఒకప్పుడు దేశంలో ప్రముఖ వజ్రాల వ్యాపారిగా మెహుల్ చోక్సీ వెలుగొందారు. రోజుకో దేశంలో తిరుగుతూ కోట్ల రూపాయల్లో వ్యాపార లావాదేవీలు నిర్వహించారు. ఈ క్రమంలో బ్యాంకుల నుంచి భారీ ఎత్తున రుణం పొందారు. వీటితో దేశవ్యాప్తంగా తన వ్యాపారాలను విస్తరించారు. ఈ క్రమంలో హైదరాబాద్కి చెందిన ఏపీ జెమ్స్, జ్యూయల్లరీ వ్యాపారాన్ని మెహుల్ చోక్సీ సొంతం చేసుకున్నారు. విదేశాలకు పరారీ బ్యాంకులకు సకాలంలో రుణాలు చెల్లించలేదు. ఈ విషయంలో పంజాబ్ నేషనల్ బ్యాంకు ఒత్తిడి చేయడంతో అప్పు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయాడు మెహుల్ చోక్సీ. ఈ క్రమంలో ఆయన దివాళా తీసినట్టుగా ప్రకటించారు. దీంతో ఇండియాలో ఆయన ఆస్తులను బ్యాంకుల అప్పులు తీర్చే ప్రక్రియ కొనసాగుతుంది. అమ్మకానికి ఆమోదం ఏపీ జెమ్స్ అండ్ జ్యూయల్లరీ కంపెనీ 2001లో హైదరాబాద్లో ఏర్పాటైంది. ఆ తర్వాత క్రమంలో కంపెనీని మెహుల్ చోక్సీ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం పరిస్థితుల్లో కార్పోరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ (సీఐఆర్పీ) 2019లో మొదలైంది. ఈ క్రమంలో ఏపీ జెమ్స్ని అమ్మకానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి. విలువ ఎంతంటే హైదరాబాద్కి చెందిన రియాల్టీ డెవలపర్స్ సంస్థ రూ. 107 కోట్ల రూపాయలకు ఏపీ జెమ్స్ అండ్ జ్యూయల్లర్స్ని కొనేందుకు ముందుకు వచ్చింది. అమ్మకం ద్వారా సమకూరిన మొత్తాన్ని అప్పుల కింద బ్యాంకులకు జమ చేస్తారు. కాగా ఏపీ జెమ్స్ అండ్ జ్యూయలర్స్ సంస్థకి బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో రెండెకరాల స్థలంతో పాటు ఐదు అతంస్థుల భవనం ఉంది. 2018 నుంచి ఈ ఆస్తులు ఈడీ అటాచ్మెంట్లో ఉన్నాయి. చదవండి: విజయ్ మాల్యా కోర్టు ధిక్కరణ కేసు.. ఆ రోజే తుది తీర్పు -
ఆర్థిక సంక్షోభంలో బ్యాంకు.. రంగంలోకి దిగిన ఆర్బీఐ
ముంబై: సంక్షోభంలో చిక్కుకున్న పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ (పీఎంసీ) బ్యాంక్ను యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (యూఎస్ఎఫ్బీ) టేకోవర్ చేసేందుకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ముసాయిదా స్కీమును రూపొందించింది. దీని ప్రకారం పీఎంసీ బ్యాంక్కు చెందిన డిపాజిట్లతో పాటు ఆస్తులు, అప్పులను యూఎస్ఎఫ్బీ తీసుకోనుంది. ఒకవేళ కొత్త బ్యాంకులో కొనసాగరాదని భావిస్తే రిటైల్ డిపాజిటర్లు దశలవారీగా నగదును వెనక్కి తీసుకోవచ్చు. ఇక పీఎంసీ బ్యాంక్ ఉద్యోగులు అవే వేతనాలు, అవే సర్వీసు నిబంధనల కింద నిర్దిష్ట తేదీ నుంచి మూడేళ్ల పాటు సర్వీసులో కొనసాగుతారు. ఈ స్కీముతో డిపాజిటర్ల సొమ్ముకు మరింత భద్రత చేకూరగలదని ఆర్బీఐ తెలిపింది. దీనిపై డిసెంబర్ 10 దాకా సంబంధిత వర్గాలు తమ అభిప్రాయాలను ఆర్బీఐకు పంపవచ్చు. ఆ తర్వాత ఆర్బీఐ తుది నిర్ణయం తీసుకుంటుంది. ఆర్థిక అవకతవకల ఆరోపణల నేపథ్యంలో 2019 సెప్టెంబర్లో పీఎంసీ బ్యాంక్ బోర్డును ఆర్బీఐ రద్దు చేసి, విత్డ్రాయల్స్పై పరిమితులు విధించిన సంగతి తెలిసిందే. సెంట్రమ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, రెజిలియెంట్ ఇన్నొవేషన్ కలిసి ఏర్పాటు చేసిన యూఎస్ఎఫ్బీ ఈ ఏడాది అక్టోబర్లో స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లైసెన్స్ పొందింది. నవంబర్ 1 నుంచి కార్యకలాపాలు ప్రారంభించింది. చదవండి:మీ పేర్లలో ‘బ్యాంక్’ను తగిలించొద్దు -
వామ్మో! ఎస్బీఐ ఛార్జీల రూపంలో ఇంత వసూలు చేసిందా?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బిఐ)తో సహా పలు బ్యాంకులు జీరో బ్యాలెన్స్ లేదా బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్స్(బిఎస్బిడిఎ) ఖాతాదారులకు అందించే కొన్ని సేవలపై అధిక ఛార్జీలు విధిస్తున్నట్లు ఐఐటి-బొంబాయి అధ్యయనం వెల్లడించింది. బీఎస్బిడిఎ ఖాతాదారులు నాలుగు దాటిన ప్రతి డెబిట్ లావాదేవీ నుంచి రూ.17.70 వసూలు చేయాలని ఎస్బీఐ తీసుకున్న నిర్ణయాన్ని"సహేతుకమైనది"గా పరిగణించ లేమని అధ్యయనం పేర్కొంది. సేవా ఛార్జీలు విధించడం వల్ల 2015-20 మధ్య కాలంలో ఎస్బిఐ దాదాపు 12 కోట్ల బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్(బీఎస్బిడిఎ) హోల్డర్ల నుంచి రూ.300 కోట్లకు పైగా వసూలు చేసినట్లు నివేదికలో పేర్కొంది. అలాగే, ఎస్బీఐ తర్వాత ఇండియాలో రెండవ అతిపెద్ద ప్రభుత్వ రంగ రుణదాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇదే సమయంలో 3.9 కోట్ల బీఎస్బిడిఎ ఖాతాల నుంచి రూ.9.9 కోట్లు వసూలు చేసింది. "కొన్ని బ్యాంకులు బీఎస్బిడిఎలపై గల ఆర్బిఐ నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు ఐఐటి-బొంబాయి అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా ఎస్బీఐ గరిష్ట సంఖ్యలో బీఎస్బిడిఎలను నిర్వహిస్తుంది. ప్రతి డెబిట్ లావాదేవీపై(డిజిటల్ మార్గాల ద్వారా కూడా) నెలకు నాలుగు దాటిన ప్రతిసారి 17.70 రూపాయలు వసూలు చేస్తుంది. 2018-19 కాలంలో రూ.72 కోట్ల వసూలు చేస్తే 2019-20 రూ.158 కోట్లు వసులు చేసినట్లు” ఐఐటి బొంబాయి ప్రొఫెసర్ ఆశిష్ దాస్ అధ్యయనం పేర్కొంది. 2013 సెప్టెంబర్ ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం బీఎస్బీడిఎపై ఛార్జీలు వసూలు చేయడం జరుగుతుంది. ఎస్బీఐ, 2013 నాటి నుంచి ఆర్బిఐ నిర్దేశించిన నిబంధనలను ఉల్లంఘిస్తూ నెలకు నాలుగు దాటిన ప్రతి డెబిట్ లావాదేవీపై బీఎస్బీడిఎ హోల్డర్ల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తుంది. నెఫ్ట్, ఐఎంపిఎస్ వంటి డిజిటల్ లావాదేవీలపై కూడా ఛార్జీలు రూ.17.70 వసూలు చేస్తున్నట్లు నివేదిక పేర్కొంది. "ఒక వైపు ప్రభుత్వం దేశంలో డిజిటల్ చెల్లింపు మార్గాలను గట్టిగా ప్రోత్సహిస్తుంటే. మరోవైపు, ఎస్బీఐ ఖాతాదారులను నిరుత్సాహపరుస్తుంది" అని ప్రొఫెసర్ ఆశిష్ దాస్ అధ్యయనం పేర్కొంది. చదవండి: రెమిడెసివర్ ఎగుమతులపై కేంద్రం నిషేధం! -
పీఎన్బీకి క్విప్ దెబ్బ- ఎంఅండ్ఎం స్పీడ్
ముంబై, సాక్షి: మార్కెట్లు మరోసారి ర్యాలీ బాటలో సాగుతున్నాయి. ఫలితంగా రికార్డ్ గరిష్టాలను తాకాయి. ఈ నేపథ్యంలో అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్) కారణంగా పీఎస్యూ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. అయితే మరోపక్క వచ్చే జనవరి 1 నుంచి వివిధ వాహనాల ధరలను పెంచనున్నట్లు ప్రకటించడంతో ఆటో రంగ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా కౌంటర్కు డిమాండ్ నెలకొంది. వెరసి పీఎన్బీ కౌంటర్ నష్టాలతో డీలాపడగా..ఎంఅండ్ఎం లాభాలతో సందడి చేస్తోంది. వివరాలు చూద్దాం.. (నేటి నుంచి బెక్టర్స్ ఫుడ్.. పబ్లిక్ ఇష్యూ) పంజాబ్ నేషనల్ బ్యాంక్ మంగళవారం సమావేశమైన మూలధన పెట్టుబడుల సమీకరణ కమిటీ క్విప్ ఇష్యూకి గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు పీఎన్బీ వెల్లడించింది. ఇందుకు రూ. 37.35 ఫ్లోర్ ధరను ప్రకటించింది. క్విప్లో భాగంగా అర్హతగల కొనుగోలుదారులకు ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. తద్వారా రూ. 7,000 కోట్లు సమీకరించేందుకు బ్యాంక్ ఇప్పటికే అనుమతులు పొందింది. అయితే ఫ్లోర్ ధరకు 5 శాతానికి మించి డిస్కౌంట్ ఇవ్వబోమని బ్యాంక్ తెలియజేసింది. క్విప్ ధర, షేర్ల జారీ తదితర అంశాలపై శుక్రవారం సమావేశంకానున్న పెట్టుబడుల కమిటీ నిర్ణయాలు తీసుకోనున్నట్లు వివరించింది. ఈ నేపథ్యంలో తొలుత ఎన్ఎస్ఈలో పీఎన్బీ షేరు 8.3 శాతం పతనమై రూ. 37.25ను తాకింది. ప్రస్తుతం 5 శాతం నష్టంతో రూ. 38.60 వద్ద ట్రేడవుతోంది. (మార్కెట్ డౌన్- ఈ షేర్లు జూమ్) మహీంద్రా అండ్ మహీంద్రా జనవరి 1 నుంచి ప్రయాణికుల, వాణిజ్య వాహన ధరలను పెంచనున్నట్లు ఎంఅండ్ఎం తాజాగా వెల్లడించింది. ముడిసరుకులు, తదితర వ్యయాలు పెరగడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలియజేసింది. పెంపు వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎంఅండ్ఎం షేరు తొలుత ఎన్ఎస్ఈలో 4 శాతం జంప్చేసి రూ. 746ను అధిగమించింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. ప్రస్తుతం 3 శాతం ఎగసి రూ. 740 వద్ద ట్రేడవుతోంది. -
పీఎన్బీలో మరో భారీ స్కాం
సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ)లో మరో భారీ కుంభకోణం వెలుగు చూసింది. సింటెక్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (సిల్) 1,203.26 కోట్ల రూపాయల మేర టోపీ పెట్టింది. వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, మెహుల్ చోక్సి పీఎన్బీ స్కాం వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి రాకముందే పీఎన్బీ ఈ భారీ స్కాం గురించి రెగ్యులేటరీ ఫైలింగ్ సమాచారాన్ని అందించింది. అహ్మదాబాద్ జోనల్ కార్యాలయంలోని కార్పోరేట్ శాఖలో ఈ మోసం జరిగినట్లు తెలిపింది. సింటెక్స్ ఇండస్ట్రీస్ మోసపూరితంగా రూ.1,203 కోట్ల రుణాన్ని పొందిందని బ్యాంకు ప్రకటించింది. సెబీ లిస్టింగ్ ఆబ్లిగేషన్స్ అండ్ డిస్ క్లోజర్ రిక్వైర్ మెంట్స్ (ఎల్ఓడిఆర్) బ్యాంకు విధానాల ప్రకారం సింటెక్స్ ఇండస్ట్రీస్ నికర నిర్థక ఆస్తుల్లో రూ.1203 కోట్ల మేర మోసంతో తీసుకున్న రుణాలు ఉన్నాయని ఎక్స్చేంజీలకు ఇచ్చిన సమాచారంలో వెల్లడించింది. -
జీఏఈఎల్, నాగార్జునా జూమ్- సింటెక్స్ బోర్లా
రేపటి నుంచి మార్కెట్లు మూడు రోజులపాటు పనిచేయని కారణంగా గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్స్ కౌంటర్ నేటి నుంచి ఎక్స్స్ల్పిట్గా ట్రేడవుతోంది. కంపెనీ రూ. 2 ముఖ విలువగల ఒక్కో షేరునీ రూ. 1 ముఖ విలువగల 2 షేర్లుగా విభజించింది. ఇతర వివరాలు చూద్దాం.. జీఏఈఎల్ షేర్ల విభజనకు అక్టోబర్ 5 రికార్డ్ డేట్ కావడంతో గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్స్(జీఏఈఎల్) కౌంటర్కు ఒక్కసారిగా డిమాండ్ ఏర్పడింది. దీంతో ఎన్ఎస్ఈలో తొలుత ఈ షేరు 20 శాతం దూసుకెళ్లి రూ. 128ను తాకింది. ఆపై కొంత వెనకడుగుతో రూ. 122 వద్ద ట్రేడవుతోంది. ఇది 12 శాతం లాభంకాగా.. బుధవారం ముగింపు రూ. 218తో పోలిస్తే.. రూ. 110 దిగువన ప్రారంభమైంది. మార్కెట్లకు మూడు రోజులు సెలవులు కావడంతో నేటి(గురువారం) నుంచి ఎక్స్స్ల్పిట్లో ట్రేడింగ్ ప్రారంభమైనట్లు నిపుణులు పేర్కొన్నారు. ఎన్ఎఫ్సీఎల్ ఈ ఏడాది(2020-21) తొలి త్రైమాసికంలో నాగార్జునా ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్(ఎన్ఎఫ్సీఎల్) రూ. 85.3 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది క్యూ1లో రూ. 113 కోట్ల నష్టం నమోదైంది. కాగా.. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఈ క్యూ1(ఏప్రిల్-జూన్)లో మొత్తం ఆదాయం రూ. 347 కోట్ల నుంచి రూ. 464 కోట్లకు ఎగసింది. ఈ నేపథ్యంలో ఎన్ఎస్ఈలో ఎన్ఎఫ్సీఎల్ షేరు 5 శాతం అప్పర్ సర్క్యూట్ను తాకింది. అమ్మేవాళ్లు కరువుకావడంతో రూ. 4.35 వద్ద ఫ్రీజయ్యింది. సింటెక్స్ ఇండస్ట్రీస్ సింటెక్స్ ఇండస్ట్రీస్కు చెందిన రుణ ఖాతాలలో రూ. 1,203 కోట్లమేర మోసాలు జరిగినట్లు ఆర్బీఐకి పీఎస్యూ సంస్థ పంజాజ్ నేషనల్ బ్యాంక్ నివేదించింది. ఈ రుణాలు ఎన్పీఏలుకాగా.. ఇప్పటికే ఈ ఖాతా కింద రూ. 215 కోట్లకు ప్రొవిజన్లు చేపట్టినట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో సింటెక్స్ ఇండస్ట్రీస్ షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం లోయర్ సర్క్యూట్ను తాకింది. కొనుగోలుదారులు లేకపోవడంతో రూ. 2 వద్ద ఫ్రీజయ్యింది. -
2,300 కిలోల వజ్రాలు, ముత్యాలు వెనక్కి
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసగించారంటూ ప్రముఖ వజ్రాల వ్యాపారులు నీరవ్ మోదీ(48), మెహుల్ చోక్సీ(60)పై నమోదైన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును వేగవంతం చేసింది. హాంకాంగ్లోని వారి సంస్థల నుంచి 2,340 కిలోల పాలిష్డ్ వజ్రాలు, ముత్యాలను బుధవారం వెనక్కి తీసుకొచ్చింది. వీటి విలువ రూ.1,350 కోట్లు అని అధికార వర్గాలు తెలిపాయి. మొత్తం 108 బ్యాగేజీల్లో వీటిని తీసుకొచ్చారు. ఇందులో నీరవ్ మోదీకి చెందినవి 32, చోక్సీకి చెందినవి 76 ఉన్నాయి. ఈ మొత్తం వజ్రాలు, ముత్యాలు, నగలను 2018లో వారు హాంకాంగ్ నుంచి దుబాయ్కి తరలించేందుకు ప్రయత్నించారు. ఇండియా దర్యాప్తు అధికారులు అప్రమత్తం కావడంతో అది ఫలించలేదు. ముంబైలోని పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ తప్పుడు గ్యారంటీలు చూపించి, 2 బిలియన్ డాలర్ల రుణం తీసుకున్నారు. ఈ రుణం తిరిగి చెల్లించకుండా చేతులెత్తేశారు. దీనిపై కేసు నమోదు చేసి ఈడీ మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద విచారిస్తోంది. దర్యాప్తులో భాగంగా హాంకాంగ్లో నీరవ్ మోదీ, చోక్సీ సంస్థల నుంచి వజ్రాలు, ముత్యాలు, వెండి నగలను వెనక్కి తీసుకొచ్చింది. వీటిని మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద సీజ్ చేసింది. 2018లో విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీని ఈడీ అధికారులు గతేడాది లండన్లో అరెస్టు చేశారు. -
పీఎన్బీ : మూడు ఆడి కార్లు, విమర్శలు
సాక్షి, ముంబై : దేశంలో రెండవ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) మరోసారి వార్తల్లో నిలిచింది. వేల కోట్ల రూపాయల భారీ కుంభకోణంతోపాటు, కరోనా వైరస్, దేశవ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా సంక్షోభంలో పడిన బ్యాంకు టాప్ మేనేజ్ మెంట్ కోసం అత్యంత విలాసవంతమైన కార్లను కొనుగోలు చేయడం సంచలనం రేపుతోంది. ఆర్థిక నష్టాలను పట్టించుకోకుండా గత నెలలో సుమారు రూ .1.34 కోట్ల విలువైన హై-ఎండ్ లగ్జరీ కార్లను అందించడం విమర్శలకు తావిచ్చింది. అయితే బోర్డు ఆమోదం పొందిన తరువాత, ఫుల్ టైం డైరెక్టర్లకు మంజూరు చేసిన పరిమితిలోనే వీటిని కొనుగోలు చేసినట్లు బ్యాంకు వర్గాలు ప్రకటించాయి. అలాగే గత సంవత్సరం ఉపయోగించకుండా మిగిలిన నిధులతో కలిపి వీటిని కొనుగోలు చేసినట్టు వెల్లడించాయి. పీఎన్బీ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) మరో ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఈ కార్లను ఉపయోగిస్తారని తెలిపాయి. (లాక్డౌన్ ఎఫెక్ట్ : రికార్డు అమ్మకాలు) ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులు, క్యాబినెట్ మంత్రులు కూడా జర్మన్ లగ్జరీ కారు ఆడి కంటే చాలా తక్కువ ఖరీదైన మారుతి సుజుకి సియాజ్ను ఉపయోగిస్తున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ కేంద్ర ప్రభుత్వంలో అదనపు కార్యదర్శికి సమానం. అటు దేశంలోని అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ (ఎండీ కంటే ఎక్కువ స్థాయి ర్యాంకు) కూడా టయోటా కరోలా ఆల్టిస్ను ఉపయోగిస్తున్నారని మార్కెట్ వర్గాలు విశ్లేషించాయి. డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీ అతని మామ మెహుల్ చోక్సీకు మోసపూరిత లెటర్స్ ఆఫ్ అండర్టేకింగ్ (ఎల్ఓయూ) జారీ చేయడం ద్వారా రూ .14 వేల కోట్ల కుంభకోణం 2018లో వెలుగు చూసింది. 2020 జనవరితో ముగిసిన మూడవ త్రైమాసికంలో, బ్యాడ్ లోన్లు గణనీయంగా పెరగడంతో బ్యాంక్ రూ. 502 కోట్ల నష్టాన్ని నివేదించింది. ఏడాది క్రితం ఇదే కాలానికి బ్యాంక్ నికర లాభం రూ .249.75 కోట్లు. (పెట్రో షాక్ : నాలుగో రోజూ) కాగా కోవిడ్-19 సంక్షోభం నేపథ్యంలో, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్త పథకాలను ప్రారంభించవద్దని ఆర్థిక మంత్రిత్వ శాఖ గత వారం అన్నిమంత్రిత్వ శాఖలను కోరింది. ఈ క్లిష్ట సమయాల్లో మారుతున్న ప్రాధాన్యతలకు అనుగుణంగా వనరులను వివేకంతో ఉపయోగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్న సంగతి తెలిసిందే. -
వడ్డీరేట్లు తగ్గించిన పీఎన్బీ
సాక్షి, ముంబై: దేశంలో రెండవ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బి) తన ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. రుణాల వడ్డీరేటును తగ్గిస్తూ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. అన్ని కాల పరిమితి గల రుణాలపై ఎంసీఎల్ఆర్ను 15 బీపీఎస్పాయింట్లు తగ్గించింది. అలాగే రెపో-లింక్డ్ లెండింగ్ రేటు (ఆర్ఎల్ఎల్ఆర్) ను 40 బేసిస్ పాయింట్లు (బిపిఎస్) తగ్గించింది. దీంతో 7.05 నుంచి 6.65 శాతానికి తిగి వచ్చింది. ఈ సవరించిన రేట్లు జూలై 1 నుంచి అమలులోకి వస్తాయని బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది ఫండ్ డిపాజిట్ రేటును కూడా తగ్గించింది. గరిష్టంగా 3.25 శాతం చెల్లించనున్నట్టు తెలిపింది. వివిధ మెచ్యూరిటీల టర్మ్ డిపాజిట్ రేట్లను గరిష్టంగా 5.50 శాతంగా ఉంచింది. రూ .2 కోట్లకు పైన డిపాజిట్లపై సీనియర్ సిటిజనులకు సాధరణ వాటికంటే కంటే 75 బీపీఎస్ పాయింట్ల మేర అధిక వడ్డీ రేటును అందివ్వనుంది. ఇటీవల ఆర్బీఐ కీలక వడ్డీరేట్లను తగ్గించిన నేపథ్యంలో దీనికనుగుణంగా దేశీయ బ్యాంకులు కూడా వడ్డీరేట్లను సవరిస్తున్న సంగతి తెలిసిందే. -
గేదెల రుణం : బ్యాంకు సీనియర్ అధికారి అరెస్ట్
సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు అధికారి అడ్డంగా బుక్కయ్యాడు. గేదెలను కొనుగోలు చేయడానికి రుణం మంజూరు చేసినందుకు గాను లక్ష రూపాయల లంచం లంచం డిమాండ్ చేశాడు. దీంతో వలపన్నిన సీబీఐ అధికారులు పీఎన్బీ సీనియర్ మేనేజర్ సుమేర్ సింగ్, అతని సతీష్ సహచరుడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. హర్యానా, రేవారి జిల్లా కన్వాలి బ్రాంచ్లో ఈ ఉదంతం చోటు చేసుకుంది. సీబీఐ ప్రతినిధి ఆర్కె గౌర్ అందించిన సమాచారం కుష్పురాలో డెయిరీ యూనిట్ నడుపుతున్న ఫిర్యాదుదారునికి రూ .24.72 లక్షల రుణం మంజూరుకు పశుసంవర్ధక శాఖ ఆమోదించింది. గేదెలను కొనుగోలు చేసేందుకు మొదటి దశగా రూ.7.92 లక్షలను బ్యాంకు మంజూరు చేయాల్సి వుంది. అయితే ఇందుకుగాను లక్ష రూపాయల లంచం డిమాండ్ చేశాడు సుమేర్ సింగ్. ఈ మొత్తాన్ని మధ్యవర్తి (ప్రైవేట్ వ్యక్తి) కు అప్పగించాలని నిందితులు ఫిర్యాదుదారుని కోరారు. దీంతో అతడు సీబీఐని ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో లంచం తీసుకుంటుండగా నిందితులు ఇద్దరినీ అరెస్టు చేశారు. -
పీఎన్బీ, అలాహాబాద్ బ్యాంకు రెపో రేటు రుణాలు
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగలోని పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ), అలహాబాద్ బ్యాంకులు తమ రిటైల్ రుణాలను ఆర్బీఐ రెపో రేటుకు అనుసంధానిస్తున్నట్టు ప్రకటించాయి. దీంతో రుణాల రేట్లు దిగిరానున్నాయి. రెపో రేటుతో అనుసంధానించిన ‘పీఎన్బీ అడ్వాంటేజ్’ పథకాన్ని పీఎన్బీ ప్రారంభించింది. ‘‘ప్రస్తుతమున్న ఎంసీఎల్ఆర్తో పోలిస్తే రెపో ఆధారిత విధానంలో 0.25 శాతం తక్కువగా వడ్డీ రేటు ఉంటుంది. ఇంటి రుణాలు తీసుకునే వారికి నూతన రేట్లు 8.25 శాతం నుంచి 8.35 శాతం వరకు.. కార్ల కోసం తీసుకునే రుణాలపై 8.65 శాతం వరకు వడ్డీ రేటు ఉంటుంది’’ అని పీఎన్బీ తెలిపింది. అంతేకాదు, ఎంసీఎల్ఆర్ కింద ఇప్పటికే రుణాలు తీసుకున్న వారు రెపో ఆధారిత లెండింగ్ రేటు (ఆర్ఎల్ఎల్ఆర్)కు మారిపోయే అవకాశం కూడా ఇస్తున్నట్టు పేర్కొంది. ఇక రూ.75 లక్షల వరకు రుణాలకు ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ అనుసంధానిత రేటు (ఈబీఎల్ఆర్) ఆధారంగా రుణాలను మంజూరు చేయనున్నట్టు అలహాబాద్ బ్యాంకు ప్రకటించింది. -
పీఎన్బీకి మరోసారి ఆర్బీఐ షాక్
సాక్షి, ముంబై : ప్రభుత్వ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)కి ఆర్బీఐ షాక్ ఇచ్చింది. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ఖాతాలో మోసం జరిగినట్లు నివేదించడంలో ఆలస్యం చేసినందుకుగాను రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పీఎన్బీకి రూ .50 లక్షల భారీ పెనాల్టీ విధించింది. ఈ విషయాన్ని శనివారం అందించిన రెగ్యులేటరీ ఫైలింగ్లో పీఎన్బీ వెల్లడించింది. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ లిమిటెడ్ ఖాతాకు సంబంధించి జూలై 10, 2018 న పంజాబ్ నేషనల్ బ్యాంక్ సమర్పించిన ఫ్రాడ్ మానిటరీ రిపోర్ట్-1లో ఆలస్యాన్ని ఆర్బీఐ గుర్తించిందని తెలిపింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 లోని వివిధ సెక్షన్ల కింద బ్యాంకుపై ఈ జరిమానా విధించింది. మరోవైపు ఫ్రాడ్పై నివేదించడంలో జరిగిన ఆలస్యానికి గాను ఆర్బీఐ రూ .50 లక్షల జరిమానా విధించినట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా ఒక ప్రత్యేక దాఖలులో పేర్కొంది. కాగా ఇటీవల కరెంట్ బ్యాంకు అకౌంట్ల విషయంలో అవసరమైన కెవైసీ నిబంధనలను ఉల్లంఘించినందుకు నాలుగు బ్యాంకులపై ఆర్బీఐ పెనాల్టీ విధించింది. పీఎన్బీ, అలహాబాద్ బ్యాంకు, యూసీఓ బ్యాంకులకు ఒక్కోదానిపై రూ.50 లక్షలు జరిమానా విధించగా, కార్పొరేషన్ బ్యాంకుపై రూ.25 లక్షల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. -
లాభాల్లోకి పీఎన్బీ
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) ఈ ఆర్థిక సంవత్సరం జూన్ క్వార్టర్లో మళ్లీ లాభాల్లోకి వచ్చింది. గత క్యూ1లో రూ.940 కోట్ల నికర నష్టాలు రాగా, ఈ క్యూ1లో రూ.1,019 కోట్ల నికర లాభం వచ్చిందని పంజాబ్ నేషనల్ బ్యాంక్ తెలిపింది. సీక్వెన్షియల్గా చూస్తే, గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.4,750 కోట్ల నికర నష్టాలు వచ్చాయని పేర్కొంది. రుణ నాణ్యత మెరుగుపడటంతో కేటాయింపులు తగ్గాయని, ఫలితంగా ఈ క్యూ1లో లాభాల బాట పట్టామని బ్యాంక్ ఎమ్డీ, సీఈఓ సునీల్ మెహతా చెప్పారు. గత క్యూ1లో రూ.15,072 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ1లో రూ.15,162 కోట్లకు పెరిగిందని తెలిపారు. గత క్యూ4 ఫలితాల వెల్లడి సందర్భంగా అధ్వాన పరిస్థితులు ముగిశాయని, రానున్న క్వార్టర్లలో మంచి పనితీరు చూపిస్తామని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రుణ నాణ్యత మెరుగు... బ్యాంక్ రుణ నాణ్యత మెరుగుపడింది. గత క్యూ1లో 18.26 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ1లో 16.49 శాతానికి తగ్గాయని మెహతా తెలిపారు. నికర మొండి బకాయిలు 10.58 శాతం నుంచి 7.17 శాతానికి చేరాయని పేర్కొన్నారు. విలువ పరంగా చూస్తే, స్థూల మొండి బకాయిలు రూ.82,889 కోట్ల నుంచి రూ.77,267 కోట్లకు, నికర మొండి బకాయిలు రూ.43,872 కోట్ల నుంచి రూ.30,180 కోట్లకు తగ్గాయని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరి కల్లా మొండి బకాయిలు 10–12 శాతం రేంజ్లో దిగిరాగలవని ఆయన ధీమాగా చెప్పారు. మొండి బకాయిలు తగ్గడంతో మొండి బకాయిలకు కేటాయింపులు దాదాపు సగం తగ్గాయి. గత క్యూ1లో రూ.4,982 కోట్లుగా ఉన్న కేటాయింపులు ఈ క్యూ1లో రూ.2,147 కోట్లకు తగ్గాయని తెలిపారు. ప్రొవిజన్ కవరేజ్ రేషియో 61.80 శాతం నుంచి 74.63 శాతానికి పెరిగిందని పేర్కొన్నారు. రిటైల్ రుణాలు 22 శాతం అప్... భారీ మార్పుల దిశగా చర్యలు చేపట్టామని, ఫలితంగా వ్యాపారంలోనూ, రుణ నాణ్యతలోనూ మెరుగుదల సాధించామని మెహతా తెలిపారు. కేంద్రీకృత రుణ ప్రాసెసింగ్ ప్రక్రియ, ఒత్తిడిలోని రుణాల నిర్వహణలో మెరుగైన విధానం, పర్యవేక్షణ విభాగాల మెరుగుదల వంటి ప్రయత్నాలు ఫలాలనివ్వడం మొదలైందని పేర్కొన్నారు. రిటైల్ రుణాలు 22 శాతం, గృహ రుణాలు 30 శాతం పెరిగాయని పేర్కొన్నారు. నష్టాల్లోంచి లాభాల్లోకి రావడం, రుణ నాణ్యత మెరుగుపడటంతో బీఎస్ఈలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ షేర్ 2.5 శాతం లాభంతో రూ.67.75 వద్ద ముగిసింది. -
ఎన్బీఎఫ్సీలకు బాసట..
న్యూఢిల్లీ: నిధుల సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలకు (ఎన్బీఎఫ్సీ) కొంత ఊరటనిచ్చే దిశగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ప్రతిపాదనలు చేశారు. ఆర్థికంగా పటిష్టంగా ఉన్న ఎన్బీఎఫ్సీల నుంచి అత్యుత్తమ రేటింగ్ ఉన్న అసెట్స్ను ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) కొనుగోలు చేస్తే కేంద్రం వన్టైమ్ పాక్షిక రుణ హామీ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 1 లక్ష కోట్ల మేర విలువ చేసే ఎన్బీఎఫ్సీల అసెట్స్ కొనుగోలు చేసే ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్రం వన్టైమ్ ప్రాతిపదికన పాక్షికంగా హామీనిస్తుంది. ఒకవేళ నష్టం వాటిల్లితే 10 శాతం దాకా హామీ ఉంటుంది‘ అని మంత్రి తెలిపారు. వినియోగ డిమాండ్ను నిలకడగా కొనసాగించడంలోనూ, చిన్న..మధ్య తరహా పరిశ్రమలకు అవసరమైన మూలధనం సమకూర్చడంలోను ఎన్ బీఎఫ్సీలు కీలకపాత్ర పోషిస్తున్నాయని ఆమె చెప్పారు. గతేడాది సెప్టెంబర్లో ఐఎల్అండ్ఎఫ్ఎస్ గ్రూప్ కంపెనీలు డిఫాల్టు అయినప్పట్నుంచీ ఎన్బీఎఫ్సీలకు కష్టాలు మొదలైన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం ఎన్బీఎఫ్సీలు రిజర్వ్ బ్యాంక్ నియంత్రణలో ఉంటున్నాయి. అయినప్పటికీ వాటి నియంత్రణ విషయంలో ఆర్బీఐకి పరిమిత స్థాయిలోనే అధికారాలు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్ బీఎఫ్సీలను ఆర్బీఐ మరింత పటిష్టంగా నియంత్రించే విధంగా ఫైనాన్స్ బిల్లులో మరిన్ని చర్యలుంటాయని సీతారామన్ తెలిపారు. డీఆర్ఆర్ తొలగింపు.. పబ్లిక్ ఇష్యూల ద్వారా ఎన్బీఎఫ్సీలు నిధుల సమీకరణకు సంబంధించి డిబెంచర్ రిడెంప్షన్ రిజర్వ్ (డీఆర్ఆర్) నిబంధనను ఎత్తివేస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రస్తుతం డెట్ పబ్లిక్ ప్లేస్మెంట్ ద్వారా నిధులు సమీకరించే ఎన్బీఎఫ్సీలు డీఆర్ఆర్ కింద కొంత మొత్తాన్ని పక్కన పెట్టడంతో పాటు ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా స్పెషల్ రిజర్వ్ కింద మరికాస్త పక్కన పెట్టాల్సి ఉంటోంది. మరోవైపు, గృహ రుణాల రంగంపై నియంత్రణాధికారాలను ఎన్హెచ్బీ నుంచి ఆర్బీఐకి బదలాయించాలని ప్రతిపాదిస్తున్నట్లు ఆమె వివరించారు. పెన్షను రంగ నియంత్రణ సంస్థ పీఎఫ్ఆర్డీఏ నుంచి నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) ట్రస్టును విడదీయనున్నట్లు తెలిపారు. -
పీఎన్బీ సహా నాలుగు బ్యాంకులకు జరిమానా
ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ), యూకో బ్యాంక్, అలహాబాద్ బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకులకు ఆర్బీఐ రూ.1.75 కోట్ల జరిమానాలు విధించింది. కేవైసీ అవసరాలు, కరెంటు ఖాతాల ప్రారంభానికి సంబంధించి నిబంధనలు పాటించకపోవడమే కారణం. పీఎన్బీ, అలహాబాద్ బ్యాంకు, యూకో బ్యాంకులకు ఒక్కో దానికి రూ.50 లక్షల చొప్పున, కార్పొరేషన్ బ్యాంకుపై రూ.25 లక్షల జరిమానా విధించినట్టు ఆర్బీఐ తెలిపింది. -
క్యూ4లో పీఎన్బీ నష్టం రూ.4750కోట్లు
సాక్షి, ముంబై : ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు ( పీఎన్బీ) క్యూ4లో భారీ నష్టాలను నమోదు చేసింది. మంగళవారం ప్రకటించిన మార్చి ముగిసిన నాలుగవ త్రైమాసిక ఫలితాల్లో రూ. 4750 కోట్ల నికర నష్టాలను నమోదు చేసింది. అయితే స్థూల నిరర్ధక ఆస్తులు గత త్రైమాసికంలో 16.33 శాతం నుంచి 15.5 శాతానికి తగ్గాయి. ప్రొవిజన్లు కూడా రూ.12,970కోట్ల నుంచి రూ. 7,611 స్థాయికి దిగి వచ్చాయి. ఈ ఫలితాలపై ఎనలిస్టులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే గత ఏడాది ఇదే త్రైమాసికం లో రూ.13,417 కోట్ల నష్టాలతో పోలిస్తే గణనీయంగా కోలుకుంది. వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ కుంభకోణం బ్యాంకును భారీగా నష్టపర్చింది. మరోవైపు ఈ ఫలితాల నేపథ్యంలో పీఎన్బీ షేరు నష్టాల్లో కొనసాగుతోంది. -
మరో బ్యాంకింగ్ మెర్జర్కు రంగం సిద్ధం
సాక్షి, న్యూఢిల్లీ : బ్యాంకింగ్ రంగంలో మరికొన్ని ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనానికి రంగం సిద్ధమవుతోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, విజయ బ్యాంక్, దేనా బ్యాంక్ల విలీనం తరువాత మరోసారి ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ చర్చలు జరుపుతోంది. మూడు ప్రభుత్వరంగ బ్యాంకులు పంజాబ్ నేషనల్ బ్యాంకు, యూనియన్బ్యాంకు ఆఫ్ ఇండియా, బ్యాంకు ఆఫ్ ఇండియా విలీనం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం బ్యాంకులతో రెండవ దఫా విలీన చర్చలు జరుపుతోందని ఆర్థిక శాఖ అధికారి ఒకరు తెలిపారు. తుది చర్చల అనంతరం విలీనానికి ఆయా బ్యాంకులకు ఆహ్వానం పంపించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఈ విలీన ప్రక్రియకోసం ఎంతో కాలం వేచి వుండాలని తాము భావించడం లేదనీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు లేదా, మూడవ త్రైమాసికంలో విలీనం ఉండవచ్చని సూచన ప్రాయంగా తెలిపారు. అలాగే బ్యాంకులు తగిన ప్రతిపాదనలు ఇవ్వడంలో విఫలమైతే, ప్రత్యామ్నాయ విధానం (ఏఎం) గ్రూప్ తగిన సలహాలను ఇస్తుందని ఆయన మీడియాకు చెప్పారు. కాగా విజయ, దెనా, బీవోబీ విలీన ప్రక్రియ గత ఏడాది అక్టోబరులో మొదలై , ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ విలీనం తరువాత బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా దేశంలో మూడవ అతిపెద్ద బ్యాంకుగా అవతరించిన సంగతి తెలిసిందే. -
పీఎన్బీలో ఏటీఎం ఫ్రాడ్ ప్రకంపనలు
సాక్షి, న్యూఢిల్లీ : బ్యాంకింగ్ రంగంలోనే అతిపెద్ద కుంభకోణంలో చిక్కుకున్ పంజాబ్ నేషనల్బ్యాంకు (పీఎన్బీ)లో తాజాగా అక్రమ లావాదేవీల ఉదంతం ప్రకంపనలు రేపుతోంది. ఏటీఎం మోసం ద్వారా పీఎన్బీ ఖాతాదారుల సొమ్మలు స్వాహా అయిపోతున్న వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని బ్యాంకు అధికారులు స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేవలం మూడు రోజుల వ్యవధిలో 61 మంది వినియోగదారుల ఖాతాల నుంచి సుమారు 15 లక్షల రూపాయలు గల్లంతు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఏటీఎం మోసాలపై ఆయా బ్యాంకులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నా...తగిన సూచనలు జారీ చేస్తున్నా ఆన్లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఫోన్ బ్యాంకింగ్, ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్స్ (ఏటీఎం) లకు సంబంధించిన నేరాలు భారీగా పెరుగుతున్నాయి. ఏప్రిల్ 8 న తన ఖాతానుంచి తన ప్రమేయం లేకుండానే గుర్తు తెలియని లావాదేవీ జరిగిందని ఒక ఖాతాదారుడు పీఎన్బీ వసంత్ విహార్ బ్రాంచ్ మేనేజర్ను సంప్రదించారు. దీంతో బ్యాంకు అధికారులు ఈ అంశాన్ని పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఫిర్యాదుదారుల జాబితా మరింత పెరిగింది. బ్యాంకు ప్రకటన ప్రకారం మొత్తం 14, 97,769 రూపాయల సొమ్ము అక్రమార్కుల జేబులోకి వెళ్లిపోయింది. దీనిపై కేసు నమోదు చేశామని వసంత్ విహార్ డీసీపీ(సౌత్ వెస్ట్) దేవేందర్ ఆర్యా వెల్లడించారు. -
పీఎన్బీ హౌసింగ్లో వాటా విక్రయించిన పీఎన్బీ
సాక్షి, ముంబై: పంజాబ్ నేషనల్ భ్యాంకు పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్లో వాటాను విక్రయ నిర్ణయాన్ని పూర్తి చేయనుంది. జనరల్ అట్లాంటిక్, వర్డె పార్టనర్స్ సంస్థలకు రూ. 1851 కోట్లకు విక్రయించనున్నామని పీఎన్బీ రెగ్యులేటరీ సమాచారంలో వెల్లడించింది. అయితే హౌసింగ్ యూనిట్లో ప్రమోటర్ హోదా ఉంటుందని బ్యాంకు తెలిపింది. ఇందులో భాగంగా ఇరు సంస్థలు 1.09 కోట్ల పీఎన్బీ హౌసింగ్ షేర్లను రూ. 850 చొప్పున కొనుగోలు చేస్తాయి. ఈ విలువ ప్రకారం పీఎన్బీ హౌసింగ్ మొత్తం విలువ రూ. 926 కోట్లకు చేరుతుంది. ఈ విక్రయం అనంతరం పీఎన్బీకి హౌసింగ్ ఫైనాన్స్లో వాటా 32.79 శాతం నుంచి 19.78 శాతానికి దిగిరానుంది. హౌసింగ్ యూనిట్లో వాటాలను విక్రయించి సొమ్ము చేసుకోవాలని గత డిసెంబర్లో పీఎన్బీ నిర్ణయించింది. ఈ ప్రకటనతో శుక్రవారం మార్కెట్లో పీఎన్బీ హౌసింగ్ ఫిన్ షేర్ దాదాపు 4శాతం లాభపడింది. -
పీఎన్బీ.. సంస్కరణల అమల్లో టాప్
న్యూఢిల్లీ: నీరవ్ మోదీ కుంభకోణంతో భారీగా నష్టపోయిన ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్, చాలా వేగంగా కోలుకుని సంస్కరణల అజెండా అమల్లో అగ్రస్థానంలో నిల్చింది. ఈ విషయంలో బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) రెండో స్థానం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మూడో స్థానాన్ని దక్కించుకున్నాయి. సేవల నాణ్యతను మెరుగుపర్చుకునే దిశగా ప్రభుత్వ రంగ బ్యాంకులు అమలు చేస్తున్న సంస్కరణలపై బీసీజీ–ఐబీఏ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. డిజిటలైజేషన్, రుణ వితరణ తదితర 140 అంశాల ప్రాతిపదికగా రూపొందించిన ఈ నివేదికను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం విడుదల చేశారు. ఇందులో 100 మార్కులకు గాను పీఎన్బీకి 78.4 స్కోరు దక్కించుకుంది. మిగతా బ్యాంకుల స్కోర్లు చూస్తే.. బీవోబీ 77.8, ఎస్బీఐ (74.6), ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (69), కెనరా బ్యాంక్ (67.5), సిండికేట్ బ్యాంక్ 67.1గా ఉన్నాయి. బాధ్యతాయుతమైన బ్యాంకింగ్, రుణ వితరణ, ఆర్థిక సేవల విస్తరణ, కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా సత్వరం స్పందించడం తదితర అంశాల్లో పీఎన్బీ ’మెరుగైన పనితీరు’ కనపర్చినట్లు బీసీజీ–ఐబీఏ నివేదిక పేర్కొంది. ‘భారీ కుంభకోణం కారణంగా ఇటు ఆర్థికంగాను, అటు ప్రతిష్టపరంగానూ దెబ్బతిన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ మొండిబాకీలకు రూ. 14,000 కోట్లు కేటాయించాల్సి వచ్చింది. అయితే, 9 నెలల్లోనే బ్యాంక్ పనితీరు గణనీయంగా మెరుగుపడింది. తొమ్మిది నెలల తర్వాత గత క్వార్టర్లో లాభాలు కూడా ప్రకటించింది. అలాగే, సంస్కరణల అమల్లో అగ్రస్థానాన్నీ దక్కించుకోవడం అభినందనీయం‘ అని జైట్లీ ప్రశంసించారు. ఇలాంటి ర్యాంకింగ్ల విధానంతో బ్యాంకుల మధ్య పోటీతత్వం పెరుగుతుందని, మరింత మెరుగ్గా పనిచేసేలా ప్రోత్సాహం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆయా బ్యాంకులు అమలు చేస్తున్న సంస్కరణల ఊతంతో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ వ్యవస్థలో ఒత్తిడి తగ్గిందని, మొండిబాకీలను గుర్తించడంతో పాటు వాటికి పూర్తి స్థాయిలో ప్రొవిజనింగ్ చేయడం కూడా ఇందుకు కారణమని కేంద్ర ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి రాజీవ్ కుమార్ చెప్పారు. పీసీఏలోని బ్యాంకులకూ ర్యాంకింగ్.. భారీ మొండిబాకీల కారణంగా ఆర్బీఐ ఆంక్షలు ఎదుర్కొంటున్న ఆరు ప్రభుత్వ రంగ బ్యాంకులకు కూడా ఈ నివేదికలో ర్యాంకింగ్ లభించింది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్కి 66.7, యూకో బ్యాంక్ (64.1), యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (60.8), ఐడీబీఐ బ్యాంక్ (60.2), సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (55.7), దేనా బ్యాంక్కు 53.8 ర్యాంక్ లభించింది. ప్రభుత్వ రంగంలో మొత్తం 21 బ్యాంకులు ఉండగా, 11 బ్యాంకులను ఆర్బీఐ గతేడాది పీసీఏ పరిధిలోకి చేర్చి కార్యకలాపాలపై ఆంక్షలు విధించింది. 5 బ్యాంకులు ఇటీవలే దీన్నుంచి బైటికి వచ్చాయి. దివాలా చట్టంతో ప్రయోజనాలు.. దివాలా చట్టం, మొండిబాకీల రికవరీపరమైన సంస్కరణల పక్కా అమలు.. బ్యాంకులు కోలుకునేందుకు తోడ్పడుతున్నాయని నివేదిక పేర్కొంది. 2015 ఏప్రిల్ నుంచి 2018 డిసెంబర్ దాకా ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ. 2.87 లక్షల కోట్లు రికవర్ చేసుకున్నాయని వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ దాకా రికార్డు స్థాయిలో ఏకంగా రూ. 98,498 కోట్లు రాబట్టుకోగలిగాయని తెలిపింది. 2014–15 నుంచి 2019 ఫిబ్రవరి దాకా ప్రభుత్వ బ్యాంకులకు కేంద్రం రూ. 2.5 లక్షల కోట్ల మేర అదనపు మూలధనం సమకూర్చింది. కొనసాగనున్న బ్యాంకుల విలీనం.. అంతర్జాతీయ స్థాయి బ్యాంకులను ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) సదస్సులో పాల్గొన్న సందర్భంగా జైట్లీ చెప్పారు. ఇందులో భాగంగా బ్యాంకుల విలీన విధానాన్ని క్రమంగా అమలు చేస్తోందని ఆయన వివరించారు. మొండిబాకీలను బ్యాంకులు పూర్తిగా బైటపెట్టేలా చర్యలు తీసుకోవడంతో.. ప్రారంభంలో వీటి పరిమాణం భారీ స్థాయికెళ్లిందని, అయితే కేటాయింపులు, రికవరీలతో ఇవి తగ్గుముఖం పడుతున్నాయని పేర్కొన్నారు. గడిచిన 2–3 త్రైమాసికాల్లో ప్రభుత్వ బ్యాంకుల్లో మొండిబాకీల సమస్య క్రమంగా తగ్గుతోందన్నారు. ‘అదనపు మూలధనం సమకూర్చడంపై ప్రభుత్వం తన మాట నిలబెట్టుకుంటోంది. పలు బ్యాంకులు పీసీఏ నుంచి బైటికి రావడం హర్షణీయం. త్వరలో మిగతావి కూడా తమ కార్యకలాపాలు మెరుగుపర్చుకుని, బైటికి రాగలవని ఆశిస్తున్నాను‘ అని చెప్పారు. ఎన్డీఏ సర్కార్ వచ్చాక.. బ్యాం కుల వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యానికి ఫుల్స్టాప్ పడిందని జైట్లీ తెలిపారు. బ్యాంకింగ్ రంగంలో ప్రతిభ, ప్రొఫెషనలిజంకు ప్రాధాన్యం పెరిగిందన్నారు. ప్రైవేట్ బ్యాంకులతో పోలిస్తే మరిన్ని నియంత్రణలకు లోబడి పనిచేయాల్సి ఉంటున్నా.. ప్రభుత్వ రంగ బ్యాంకుల కార్యకలాపాలు భారీ స్థాయిలో ఉండటం అభినందించతగ్గ విషయమని జైట్లీ పేర్కొన్నారు. -
వడ్డీ రేట్లు తగ్గించిన పీఎన్బీ
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు రుణాలపై వడ్డీరేటును తగ్గించింది. వివిధ కాలపరిమితి గల రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు 0.10 శాతం కోత పెట్టింది. ఈ సవరించిన వడ్డీరేట్లు మార్చి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని పీఎన్బీ ఒక ప్రకటనలోవెల్లడించింది. దీంతో సంవత్సరాల కాలపరిమితి గల లోన్లపై వడ్డీరేటు 8.55శాతం నుంచి 8.45 శాతానికి దిగి రానుంది. మూడేళ్ల కాల రుణాల రేట్లు 8.65శాతంగా ఉండనున్నాయి. కాగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని మానిటరీ పాలసీ తాజా ద్రవ్య పరపతి విధాన సమీకలో కీలక వడ్డీరేట్లను పావు శాతం తగ్గించింది. ఈ తగ్గింపు ప్రయోజనాలను అన్ని ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకులు వినియోగదారులకు అందించాలని శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ కూడా 0.05శాతం ఎంసీఎల్ఆర్ను తగ్గించిన సంగతి తెలిసిందే. -
మార్చి తరువాతే పీఎన్బీ మెట్లైఫ్ ఐపీవో!
ముంబై: ప్రభుత్వరంగ పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) తన బీమా విభాగం పీఎన్బీ మెట్లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీని వచ్చే ఆర్థిక సంవత్సరంలో స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయాలనుకుంటోంది. తనకున్న 30 శాతం వాటాల నుంచి 4 శాతం వాటాల విక్రయంపై ప్రస్తుతం దృష్టి పెట్టింది. 2016 నుంచీ పీఎన్బీ మెట్లైఫ్ ఐపీవోకు రావాలనుకుంటోంది. జాయింట్ వెంచర్ నుంచి అమెరికా కంపెనీ మెట్లైఫ్ పూర్తిగా బయటకు వెళ్లిపోవాలని భావిస్తుండడంతో ఐపీవో అనివార్యం కానుంది. 2001లో ముంబై కేంద్రంగా పీఎన్బీ మెట్లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏర్పాటు కాగా, ఇందులో పీఎన్బీకి 30%, మెట్లైఫ్కు 26%, ఎల్ప్రోకు 21 శాతం, ఎం పల్లోంజి అండ్ కంపెనీకి 18%, జమ్మూ అండ్ కశ్మీర్ బ్యాంకుకు 5 శాతం చొప్పున వాటాలున్నాయి. ‘‘పీఎన్బీ మెట్లైఫ్ ఐపీవోతో సరైన సమయంలో మార్కెట్లోకి వస్తాం. ప్రస్తుతం మార్కెట్ స్తబ్దుగా ఉంది. కనుక వచ్చే ఆర్థిక సంవత్సరంలో వస్తాం’’ అని పీఎన్బీ ఎండీ, సీఈవో సునీల్ మెహతా మీడియాకు తెలిపారు. ఐపీవో సైజుపై ఆయన వివరాలేవీ చెప్పలేదు. సరైన ధరను గుర్తించేందుకు పీఎన్బీ మెట్లైఫ్ తన వాటాల నుంచి 4 శాతాన్ని విక్రయించే ప్రయత్నాల్లో ప్రస్తుతం ఉంది. పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్లో బ్యాంకుకున్న వాటాలను కొనుగోలు చేసేందుకు బిడ్లు వచ్చాయని, వీటిపై -
ఆశ్చర్యపర్చిన పీఎన్బీ
సాక్షి, ముంబై: దేశీయ అతిపెద్ద బ్యాంకింగ్ కుంభకోణంలో చిక్కుకున్న ప్రభుత్వరంగ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) త్రైమాసిక ఫలితాల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చింది. 2018-19 మూడో త్రైమాసిక ఫలితాలను మంగళవారం ప్రకటించింది. దాదాపు రెండు మూడు క్వార్టర్ల తరువాత ప్రోత్సాహకర ఫలితాలను నమోదు చేసింది. అంచనాలను మించిన ఫలితాలను ప్రకటించడంతో ఈ కౌంటర్ ఇన్వెస్టర్లు కొనుగోళ్లతో జోరందుకుంది. 4 శాతం జంప్ చేసింది. ఈ ఏడాది క్యూ3(అక్టోబర్-డిసెంబర్)లో పీఎన్బీ 7 .12 శాతం వృద్ధితో రూ. 246.5 కోట్ల నికర లాభం ఆర్జించింది. నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) సైతం 7.6 శాతం పెరిగి రూ. 4290 కోట్లను తాకింది. రూ. 2754 కోట్లమేర ప్రొవిజన్లు చేపట్టింది. గతేడాది(2017-18) క్యూ3లో ఇవి రూ. 4467 కోట్లుగా నమోదయ్యాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 17.16 శాతం నుంచి 16.33 శాతానికి మెరుగుపడ్డాయి. నికర ఎన్పీఏలు సైతం 8.9 శాతం నుంచి 8.22 శాతానికి తగ్గాయి. ఫ్రాడ్కింద రూ. 2014 కోట్లమేర ప్రొవిజన్ను చేపట్టినట్లు బ్యాంక్ తెలిపింది. -
క్యూ2లో ఢమాలన్న పీఎన్బీ
సాక్షి, ముంబై: దేశీయ రెండవ అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) క్యూ2లో ఢమాల్ అంది. శుక్రవారం విడుదల చేసిన ఈ ఆర్థిక సంవత్సరం(2018-19) రెండో త్రైమాసిక ఫలితాల్లో నికర నష్టాలను ప్రకటించింది. సెప్టెంబర్ 30తోముగిసిన క్యూ2లో రూ. 4532 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గత త్రైమాసికంలో రూ. 940 కోట్లతో పోలిస్తే తాజా క్వార్టర్లో భారీ నష్టాలను నమోదు చేసింది. పీఎన్బీ నికర వడ్డీ ఆదాయం కూడా 1 శాతం తగ్గి రూ. 3974 కోట్లకు పరిమితమైంది. అయితే స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 18.26 శాతం నుంచి 17.16 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు సైతం 10.58 శాతం నుంచి 8.9 శాతానికి నీరసించడం గమనార్హం. త్రైమాసిక ప్రాతిపదికన ప్రొవిజన్లు రూ. 5758 కోట్ల నుంచి రూ. 9758 కోట్లకు ఎగశాయి. తాజా స్లిప్పేజెస్ రూ. 5250 కోట్ల నుంచి రూ. 4476 కోట్లకు తగ్గాయి. రైటాఫ్స్ రూ. 2648 కోట్ల నుంచి రూ. 3543 కోట్లకు ఎగశాయి. ఈ ఫలితాల నేపథ్యంలో పీఎన్బీ కౌంటర్లో అమ్మకాలతో 4శాతానికి పైగా నష్టపోయింది. అయితే ఇటీవల నీరవ్మోదీ స్కాంతో అభాసుపాలైన పీఎన్బీ ఎసెట్ క్వాలీటీ క్వార్టర్-ఆన్ క్వార్టర్ మెరుగుపడింది. సెప్టెంబర్ చివరినాటికి రుణాల మొత్తం 17.16 శాతంగా ఉంది. జూన్ చివరి నాటికి ఇది 18.26 శాతం, అంతకు ముందు ఏడాది 13.31 శాతంగా ఉంది. -
పీఎన్బీ వినియోగదారులకు దీపావళి షాక్
సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ) ఫెస్టివ్ సీజన్లో వినియోగదారులకు చేదు వార్త అందించింది. రుణాలపై వడ్డీరేటును పెంచుతున్నట్టు వెల్లడించింది. తన బెంచ్మార్క్ లెండింగ్ రేటును 5 బేసిస్ పాయింట్లను పెంచింది. అన్ని రకాల రుణీలపై ఈ పెంపు వర్తిస్తుందని ప్రకటించింది. నవంబరు 1నుంచి సవరించిన వడ్డీరేట్లు అమల్లోకి వస్తాయని పీఎన్బీ ఒక ప్రకటనలో తెలిపింది. తాజా పెంపుతో పీఎన్బీ అందించే ఒక సంవత్సర కాలపు రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు 8.50 శాతానికి చేరింది. మూడేళ్ల కాల పరిధి రుణాలపై పీఎన్బీ వసూలు చేసే వడ్డీరేటు 8.7శాతంగాను, ఆరునెలల వ్యవధి రుణాలపై వడ్డీ రేటు 8.45శాతంగాను, మూడు నెలల కాలానికి 8.25శాతం గాను ఉంది. -
బ్యాంకులకు రూ.1,700 కోట్ల టోపీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం, నెట్వర్కింగ్, పవర్ కన్వర్షన్ పరికరాల తయారీలో ఉన్న హైదరాబాద్ కంపెనీ వీఎంసీ సిస్టమ్స్.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియానికి రూ.1,700 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టింది. పీఎన్బీ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) వీఎంసీతో పాటు, కంపెనీ ప్రమోటర్లు ఉప్పలపాటి హిమబిందు, ఉప్పలపాటి వెంకట రామారావు, బి.వెంకట రమణపై కేసు నమోదు చేసింది. వీరిపై నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీ కేసులు పెట్టటమే కాక... వీఎంసీ సిస్టమ్స్ ఆఫీసుతో పాటు డైరెక్టర్ల నివాసాల్లో మొత్తం మూడు చోట్ల సోదాలు కూడా చేసింది. సంస్థకు హైదరాబాద్ దగ్గర్లోని రావిర్యాల వద్ద ప్లాంటు ఉంది. ఇక్కడ ఉత్పత్తయ్యే ఉపకరణాలను బీఎస్ఎన్ఎల్తోపాటు వివిధ కంపెనీలకు సరఫరా చేస్తోంది. ఆకాశ్ ట్యాబ్లెట్ల విషయంలో దేశవ్యాప్తంగా వివాదాల్లో చిక్కుకున్న డేటావిండ్తో ఈ కంపెనీకి గతంలో భాగస్వామ్యం ఉండేది. ట్యాబ్లెట్లు, స్మార్ట్ఫోన్లను డేటావిండ్తో పాటు పలు కంపెనీలకు సరఫరా చేసింది. ఇవీ కేసు పూర్వాపరాలు.. నిర్వహణ మూలధనం కోసమని వీఎంసీ సిస్టమ్స్ 2009 ఆగస్టు 12న పీఎన్బీ, ఎస్బీఐ, కార్పొరేషన్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, జేఎం ఫైనాన్షియల్ అసెట్స్ రీకన్స్ట్రక్షన్ కంపెనీల నుంచి రూ.1,010.50 కోట్లు రుణంగా తీసుకుంది. ఈ రుణాలు చెల్లించకుండా డిఫాల్టయింది. బ్యాంకులు ఆరా తీయడంతో కంపెనీ అక్రమాలు బయటపడ్డాయి. రూ.1,010.50 కోట్ల నిర్వహణ మూలధన రుణాల్లో రూ.43.83 కోట్లను బ్యాంకుల అనుమతి లేకుండానే ఏప్రిల్ 2013– ఏప్రిల్ 2014 మధ్య వేరే బ్యాంకుల ఖాతాలకు మళ్లించింది. మిగతా నిధులను కూడా ఇలాగే వేరే ఖాతాలకు దారి మళ్లించి ప్రమోటర్లు స్వాహా చేసినట్టు సీబీఐకి పీఎన్బీ ఫిర్యాదు చేసింది. తీసుకున్న అప్పు ఇప్పుడు వడ్డీతో కలిపి రూ.1,700 కోట్లయింది. దీన్లో రూ.539 కోట్లు పీఎన్బీకే రావాలి. మిగిలిన రూ.1,207 కోట్లు ఎస్బీఐ, కార్పొరేషన్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, జేఎం ఫైనాన్షియల్ అసెట్స్ రీకన్స్ట్రక్షన్లకు రావాల్సి ఉంది. అన్నీ అబద్ధాలే.. అప్పులు తీర్చాలంటూ బ్యాంకులు ఒత్తిడి చేయడంతో వీఎంసీ ఏదో ఒక సాకు చెబుతూ వచ్చింది. బీఎస్ఎన్ఎల్ నుంచి తమకు రూ.262 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నట్టు చెప్పింది. అనుమానం వచ్చిన బ్యాంకు అధికారులు ఆరా తీయగా వీఎంసీకి తాము చెల్లించాల్సింది రూ.33 కోట్లు మాత్రమేనని బీఎస్ఎన్ఎల్ తేల్చి చెప్పింది. ఇంకా ఐటీఐ, న్యుట్రినో పవర్ సిస్టమ్స్, వీపీ సిస్టమ్స్ల నుంచి రూ.352.99 కోట్ల వరకు బకాయిలు రావాల్సి ఉన్నట్టు వీఎంసీ చెప్పింది. ఎస్బీఐ అధికారులు దీనిపై ఆరా తీయగా, అవన్నీ అబద్ధాలేనని తేలటంతో.. పీఎన్బీ సీబీఐని ఆశ్రయించింది. బ్యాంకు రుణాలను ప్రమోటర్లు ఏయే ఖాతాలకు మళ్లించారనే అంశంపైనా సీబీఐ శోధిస్తోంది. -
ఫలితాల దెబ్బ: పీఎన్బీ షేరు పతనం
సాక్షి, ముంబై: అతిపెద్ద బ్యాంకు కుంభకోణంలో ఇరుక్కున్న దేశీయ రెండో అతిపెద్ద బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ను నష్టాలు వదిలిపెట్టడం లేదు. వరుసగా రెండవ క్వార్టర్లో కూడా నష్టపోవడంతో పీఎన్బీ షేరు భారీగా నష్టపోయింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఆ బ్యాంకు భారీగా నష్టాలను చవి చూవడడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెరతీశారు. దీంతో పీఎన్బీ షేరు ఒక దశలో దాదాపు 9శాతం కుప్పకూలింది.. చివరికి 7శాతం నష్టంతో రూ.82.90 వద్ద ముగిసింది. జూన్ 30తో ముగిసిన 2018-19 తొలి త్రైమాసికంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ.940 కోట్ల నష్టాలను నమోదు చేసింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో పీఎన్బీ నికర లాభం కేవలం రూ.343 కోట్లు మాత్రమే. ఇక మొత్తం ఆదాయం రూ.15,072 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది పీఎన్బీ ఆదాయం రూ.14,468గా ఉంది. మార్చితో ముగిసిన గత త్రైమాసికంలో బ్యాంక్ 13,417 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసింది. ఇక మొండి బకాయిలు 18.26 శాతం పెరిగినట్లు బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది. -
పీఎన్బీ ఖాతాలో రూ.2,816 కోట్లు జమ
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.2,816 కోట్ల మూలధన కేటాయింపు లభించినట్లు ప్రకటించింది. ప్రాధాన్యతా కేటాయింపు మార్గంలో ఈక్విటీ షేర్లను జారీ చేయడం ద్వారా ఈ మొత్తాన్ని అందుకున్నట్లు బ్యాంక్ తెలిపింది. నియంత్రణ పరమైన ఆమోదాల అనంతరం మూలధన సాయం అందినట్లు వివరించింది. ప్రభుత్వరంగ బ్యాంకులను ఆర్థికంగా బలోపేతం చేయడంలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఐదు పీఎస్యూలకు రూ.2.11 లక్షల కోట్ల నిధులను కేటాయించిన విషయం తెలిసిందే. గడిచిన వారంలోనే అలహాబాద్ బ్యాంకు రూ.1,790 కోట్ల మూలధన సాయం అందుకున్నట్లు ప్రకటించింది. -
బ్యాంకులకు బెయిలవుట్ జోష్
న్యూఢిల్లీ: మొండిబాకీల(ఎన్పీఏ) దెబ్బకి మూలధన సమస్యలతో సతమతమవుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులను (పీఎస్బీ) ఆదుకునేందుకు ఉద్దేశించిన బెయిలవుట్ ప్యాకేజీ కింద కేంద్రం మరికొన్ని నిధులను సమకూర్చనుంది. ఇందులో భాగంగా అయిదు పీఎస్బీలకు రూ.11,336 కోట్లు అందించే ప్రతిపాదనకు కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదముద్ర వేసింది. ఆంధ్రా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), కార్పొరేషన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐఓబీ), అలహాబాద్ బ్యాంకులు ఈ జాబితాలో ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018–19)లో అదనపు మూలధనాన్ని సమకూర్చడానికి సంబంధించి ఇదే తొలి విడత కానుంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే మరో రూ. 53,664 కోట్లు కూడా పీఎస్బీలకు కేంద్రం అందించనుంది. తాజా ప్రణాళిక ప్రకారం.. నీరవ్ మోదీ స్కామ్ బాధిత పంజాబ్ నేషనల్ బ్యాంక్కు అత్యధికంగా రూ. 2,816 కోట్లు లభించనున్నాయి. ఆంధ్రా బ్యాంక్కు రూ. 2,019 కోట్లు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్కు రూ. 2,157 కోట్లు, కార్పొరేషన్ బ్యాంక్కు రూ. 2,555 కోట్లు, అలహాబాద్ బ్యాంక్కు రూ. 1,790 కోట్లు లభించవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. బాండ్లపై వడ్డీల చెల్లింపులకు తోడ్పాటు.. అదనపు టయర్ 1 (ఏటీ–1) బాండ్హోల్డర్లకు వడ్డీ చెల్లింపులు జరపాల్సి ఉండటంతో... ఈ జాబితాలోని కొన్ని బ్యాంకులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి. తాజా పరిణామం వీటికి కొంత ఉపశమనం ఇవ్వనుంది. సాధారణంగా శాశ్వత ప్రాతిపదికన ఉండే ఏటీ1 బాండ్ల ద్వారా కూడా బ్యాంకులు తమకు కావాల్సిన మూలధనాన్ని సమీకరిస్తుంటాయి. అయితే, కొన్నాళ్లుగా మొండిబాకీలు పెరిగిపోతుండటంతో పాటు భారీ నష్టాలు చవిచూస్తున్న పీఎస్బీలకు.. తమ సొంత ఆదాయం నుంచి ఈ బాండ్లపై వడ్డీలు చెల్లించడం కష్టంగా మారింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ విషయమే తీసుకుంటే.. గతేడాది జూలైలో ఏటీ1 బాండ్ల విక్రయం ద్వారా సమీకరించిన రూ.1,500 కోట్ల మొత్తంపై వడ్డీ చెల్లించేందుకు తక్షణం రూ.135 కోట్లు అవసరముంది. 8.98 శాతం వార్షిక వడ్డీ రేటుతో ఈ నెల 25లోగా వడ్డీలు చెల్లించాల్సి ఉంది. అయితే, నీరవ్ మోదీ స్కామ్ దెబ్బకి లాభాలు తుడిచిపెట్టుకుపోగా భారీ నష్టాలు, మొండిబాకీలతో సతమతమవుతున్న పీఎన్బీకి ఈ చెల్లింపులు జరపడం కష్ట సాధ్యంగా మారింది. మార్చి 31 నాటి గణాంకాల ప్రకారం పీఎన్బీ టయర్ 1 మూలధనం 5.96 శాతం స్థాయిలో ఉంది. రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించిన 7.375 శాతం కన్నా ఇది చాలా తక్కువ. జూలై 25 గడువులోగా నిర్దేశిత స్థాయికి మూలధనం పెంచుకుంటేనే పీఎన్బీ ఈ చెల్లింపులు చేయగలుగుతుంది. ఒకవేళ ప్రభుత్వ రంగ బ్యాంకులు బాండ్లకు సకాలంలో చెల్లింపులు జరపలేకపోతే.. దేశ ఆర్థిక వ్యవస్థపై, ఆర్థిక స్థిరత్వంపై ప్రతికూల ప్రభావాలు పడే అవకాశాలున్నాయని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ ఇటీవలే ఒక నివేదికలో హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం అదనపు మూలధన నిధులు సమకూర్చనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. రెండేళ్లలో రూ. 2.11 లక్షల కోట్లు.. రెండు ఆర్థిక సంవత్సరాల్లో పీఎన్బీలకు రూ. 2.11 లక్షల కోట్ల మేర అదనపు మూలధనం సమకూర్చే ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం గతేడాది అక్టోబర్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం రూ.1.35 లక్షల కోట్లు రీక్యాపిటలైజేషన్ బాండ్ల రూపంలో పీఎస్బీలకు లభించనున్నాయి. మిగతా రూ. 58,000 కోట్లను బ్యాంకులు మార్కెట్ నుంచి సమీకరించుకోవచ్చు. రూ.1.35 లక్షల కోట్లలో కేంద్రం ఇప్పటికే రూ.71,000 కోట్లు అందించింది. మిగతా మొత్తాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలో సమకూర్చనుంది. పీఎస్బీలు కూడా సొంతంగా రూ. 50,000 కోట్లను సమకూర్చుకునేందుకు కసరత్తు చేస్తున్నాయి. మొత్తం 21 పీఎస్బీల్లో ఇప్పటికే 13 బ్యాంకులు ఇందుకోసం బోర్డులు, షేర్హోల్డర్ల అనుమతులు కూడా పొందాయి. పీఎస్బీల షేర్లు రయ్.. కేంద్రం అదనపు మూలధనం సమకూర్చనున్న వార్తలతో మంగళవారం ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు దూసుకుపోయాయి. 11 శాతం దాకా పెరిగాయి. కార్పొరేషన్ బ్యాంక్ షేరు సుమారు 10.88%, అలహాబాద్ బ్యాంక్ 7.23%, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 6.57%, బ్యాంక్ ఆఫ్ బరోడా 6.38%, బ్యాంక్ ఆఫ్ ఇండియా 5.87%, కెనరా బ్యాంక్ 5.71%, ఇండియన్ బ్యాంక్ 5.04% పెరిగాయి. అటు ఆంధ్రా బ్యాంక్ 4.91%, దేనా బ్యాంక్ 3.58%, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3.10%, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 2.27%, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 1.35% పెరిగాయి. కేంద్ర రీక్యాపిటలైజేషన్ ప్రతిపాదన వీటికి ఊతమిచ్చినట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. ‘కనీస బ్యాలెన్స్’ పెనాల్టీలతో పీఎన్బీకి రూ.152 కోట్లు న్యూఢిల్లీ: మినిమం బ్యాలెన్స్ పాటించని పొదుపు ఖాతాలపై జరిమానాల ద్వారా పీఎన్బీ గత ఆర్థిక సంవత్సరంలో ఖాతా దారుల నుంచి రూ.151.66 కోట్లు వసూలు చేసింది. 1.23 కోట్ల సేవింగ్స్ ఖాతాలపై పీఎన్బీ ఈ మేరకు పెనాల్టీలు విధించింది. మినిమం బ్యాలెన్స్ పెనాల్టీల ద్వారా వసూలు చేసిన మొత్తం గురించిన వివరాలు వెల్లడించాలంటూ దరఖాస్తు చేసిన సమాచార హక్కు చట్టం కార్యకర్త చంద్రశేఖర్ గౌడ్కు పీఎన్బీ ఈ విషయాలు తెలియజేసింది. ‘2017–18లో మినిమం బ్యాలెన్స్ పాటించని 1,22,98,748 సేవింగ్స్ అకౌంట్స్ నుంచి రూ.151.66 కోట్ల మేర పెనాల్టీని వసూలు చేయడం జరిగింది’ అని పేర్కొంది. ప్రభుత్వం మరింత మందిని బ్యాంకింగ్ వ్యవస్థ పరిధిలోకి తెచ్చే ప్రయత్నం చేస్తుంటే.. బ్యాంకులు ఇలా మినిమం బ్యాలెన్స్ నిబంధనల పేరుతో పెనాల్టీలు విధించడం సరికాదని, ఈ విషయంలో ఆర్బీఐ తక్షణం జోక్యం చేసుకోవాలని ఆర్థికవేత్త జయంతిలాల్ భండారీ వ్యాఖ్యానించారు. -
పీఎన్బీ హౌసింగ్లో వాటా విక్రయం!
ముంబై: పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్లో వాటాను విక్రయించనున్నట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ తెలియజేసింది. కార్లైల్ గ్రూప్తో కలిసి కనీసం 51 శాతం వాటా విక్రయానికి సంబంధించిన ప్రక్రియను ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్లో పీఎన్బీకి 32.79 శాతం వాటా, కార్లైల్ గ్రూప్కు చెందిన క్వాలిటీ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్కు 32.36 శాతం చొప్పున వాటాలున్నాయి. కాగా పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్లో 4.8 శాతం వాటాను ఈ ఏడాది మేలో క్వాలిటీ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్ ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా రూ.1,024 కోట్లకు విక్రయించింది. తాజా వాటా విక్రయ వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ షేర్ 3.4 శాతం లాభంతో రూ.1,232 వద్ద ముగిసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనుబంధ కంపెనీ పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ నిర్వహణ ఆస్తులు ఈ ఏడాది మార్చి నాటికి రూ.62,252 కోట్లుగా ఉన్నాయి. ఇది దేశంలోనే ఐదో అతి పెద్ద హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ. -
విదేశీ శాఖల్లో కూడా మోదీకి రుణాలు
న్యూఢిల్లీ: వజ్రాభరణాల వ్యాపారి నీరవ్ మోదీ రుణ కుంభకోణాన్ని తవ్వినకొద్దీ మరిన్ని కొత్త అంశాలు బయటపడుతున్నాయి. మోదీ సంస్థలు కేవలం బ్రాడీ హౌస్ బ్రాంచ్ నుంచే కాకుండా తమ దుబాయ్, హాంకాంగ్ శాఖల నుంచి కూడా రుణాలు తీసుకున్నట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) పేర్కొంది. ఇందుకు సంబంధించిన అంతర్గత విచారణ నివేదికను పీఎన్బీ దర్యాప్తు ఏజెన్సీలకు అందజేసింది. దీని ప్రకారం మోదీ గ్రూప్ కంపెనీలైన ఫైర్స్టార్ డైమండ్ లిమిటెడ్ హాంకాంగ్, ఫైర్స్టార్ డైమండ్ ఎఫ్జెడ్ఈ దుబాయ్ సంస్థలు పీఎన్బీకి చెందిన హాంకాంగ్, దుబాయ్ శాఖల నుంచి రుణ సదుపాయాలు పొందాయి. రూ. 14,000 కోట్ల నీరవ్ మోదీ కుంభకోణంపై విచారణ ప్రారంభమైన వెంటనే.. ఈ రెండు సంస్థలకు రుణ సదుపాయాన్ని బ్యాంకు నిలిపివేసింది. అయితే, ఈ రెండు ఖాతాల్లోనూ అవకతవకలేమీ జరిగిన దాఖలాలు లేవని పీఎన్బీ తమ నివేదికలో పేర్కొంది. మోదీ సంస్థలతో బ్యాంకు అధికారులు కుమ్మక్కై మోసపూరిత లెటర్స్ ఆఫ్ అండర్టేకింగ్స్ (ఎల్వోయూ) ద్వారా ఈ స్కామ్కు ఎలా తెరతీసినదీ.. వివరంగా తెలియజేసేలా సుమారు 162 పేజీల నివేదికతో పాటు పలు అంతర్గత ఈ–మెయిల్స్ని కూడా ఆధారాలుగా దర్యాప్తు ఏజెన్సీలకు సమర్పించింది. అమెరికా కేంద్రంగా పనిచేసే ఫైర్స్టార్ డైమండ్ స్కామ్ బైటపడిన తర్వాత ఫిబ్రవరిలోనే దివాలా పిటీషన్ వేసింది. రుణ కుంభకోణంలో సింహభాగం ఈ సంస్థకే చేరినట్లు అనుమానాలున్న నేపథ్యంలో దివాలా ప్రక్రియలో పీఎన్బీ కూడా పారీగా చేరింది. అడ్డంకులు పెడితే రహస్య ఎజెండా ఉన్నట్లే: మాల్యా బాకీలు తీర్చే దిశగా తన ఆస్తుల అమ్మకానికి ఈడీ, సీబీఐ అభ్యంతరాలు పెడితే.. రుణాల రికవరీకి మించిన రహస్య ఎజెండా మరేదో ఉందని భావించాల్సి వస్తుందని వ్యాపారవేత్త విజయ్ మాల్యా వ్యాఖ్యానించారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తూనే ఉంటానని, కానీ రాజకీయాలు చేస్తే మాత్రం తాను చేయగలిగేదేమీ లేదన్నారు. ఈ మేరకు మైక్రోబ్లాగింగ్ సైటు ట్వీట్టర్లో ట్వీట్ చేశారు. న్యాయస్థానం పర్యవేక్షణలో ఆస్తులను విక్రయించి రుణదాతలకు చెల్లించేసేందుకు అనుమతించాలంటూ న్యాయస్థానం అనుమతి కోరినట్లు మాల్యా పేర్కొన్నారు. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ రూ. 9,000 కోట్ల పైచిలుకు బ్యాంకులకు ఎగవేసిన మాల్యా.. ఇంగ్లాండ్కి పారిపోయిన సంగతి తెలిసిందే. -
ఒక ఏడాది.. 1.2 లక్షల కోట్ల రైటాఫ్!!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) గత ఆర్థిక సంవత్సరం ఏకంగా రూ. 1.20 లక్షల కోట్ల మేర మొండిబాకీలను రైటాఫ్ చేశాయి. ఆయా బ్యాంకులన్నీ కలిపి ప్రకటించిన నష్టాలతో పోలిస్తే రద్దు చేసిన బాకీల విలువ ఏకంగా ఒకటిన్నర రెట్లు అధికం కావడం గమనార్హం. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2013–14లో రూ. 34,409 కోట్లుగా ఉన్న రైటాఫ్లు.. అయిదేళ్లలో నాలుగు రెట్లు పెరిగాయి. 2017–18 నాటికి రూ. 1.20 లక్షల కోట్లకు (ప్రొవిజనల్) చేరాయి. బ్యాంకింగ్ పరిభాషలో రైటాఫ్ చేయడమంటే.. మొండిపద్దుకు సంబంధించి బ్యాంకు తనకొచ్చిన ఆదాయం నుంచి 100 శాతం ప్రొవిజనింగ్ చేయాల్సి ఉంటుంది. అయితే, దీనివల్ల మొండిబాకీలను ఖాతాల నుంచి తొలగించినట్లయినప్పటికీ.. బ్యాంకు నిర్వహణ లాభాలు దెబ్బతింటాయి. ఈ పరిణామాల కారణంగానే పీఎస్బీలు గత ఆర్థిక సంవత్సరంలో ఇటు భారీగా రైటాఫ్లతో పాటు అటు రికార్డు స్థాయిలో నష్టాలు కూడా ప్రకటించాయి. 2016–17 దాకా ఎంతో కొంత లాభాలు ప్రకటిస్తూ వచ్చిన పీఎస్బీలు 2017–18లో ఏకంగా రూ. 85,370 కోట్ల నష్టాన్ని నమోదు చేశాయి. 2017–18లో ఎస్బీఐ రైటాఫ్ చేసిన మొండిబాకీలు రూ. 40,196 కోట్లు. -
బ్యాంకింగ్ స్కాంలతో భారీ నష్టం, కోట్లకు కోట్లు ఆవిరి
ఇండోర్ : ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇటీవల చోటు చేసుకుంటున్న కుంభకోణాలు చూస్తూనే ఉన్నాం. ఈ కుంభకోణాలు బ్యాంకులను భారీ మొత్తంలో ముంచెత్తుతున్నాయి. తాజాగా సమాచార హక్కు చట్టంలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. 2017-18 ఆర్థిక సంవత్సరంలో చోటు చేసుకున్న బ్యాంకింగ్ కుంభకోణాలతో దేశంలో ఉన్న 21 ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.25,775 కోట్ల నష్టం వాటిల్లిందని వెల్లడైంది. వీటిలో ఎక్కువగా నష్టపోయింది పంజాబ్ నేషనల్ బ్యాంకేనని తెలిసింది. ఈ ఏడాది ముగింపు వరకు వివిధ రకాల కుంభకోణాలతో పీఎన్బీకి అత్యధిక మొత్తంలో రూ.6461.13 కోట్ల నష్టం వాటిల్లినట్టు ఆర్టీఐ డేటాలో తేలింది. చంద్రశేఖర్ గౌడ్ అనే వ్యక్తి రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా వద్ద ఈ పిటిషన్ దాఖలు చేయడంతో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ బ్యాంకింగ్ కుంభకోణాల్లో అతిపెద్దది డైమండ్ కింగ్ నీరవ్ మోదీ, మెహుల్ చౌక్సిలది. వీరు పీఎన్బీ అధికారులతో కుమ్మకై, బ్యాంకులో దాదాపు రూ.12,636 కోట్ల కుంభకోణానికి పాల్పడి దేశం విడిచి పారిపోయారు. ప్రస్తుతం ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్(ఈడీ) దర్యాప్తు చేస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ రంగంలో అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు 2017-18 ఆర్థిక సంవత్సరంలో పలు బ్యాంకింగ్ కుంభకోణాల వల్ల రూ.2390.75 కోట్ల నష్టం వచ్చినట్టు ఆర్ఐటీ సమాధానంలో తెలిసింది. ఇదే కాలంలో బ్యాంకు ఆఫ్ ఇండియాకు రూ.2,224.86 కోట్లు, బ్యాంకు ఆఫ్ బరోడాకు రూ.1,928.25 కోట్లు, అలహాబాద్ బ్యాంకుకు రూ.1520.37 కోట్లు, ఆంధ్రాబ్యాంకుకు రూ.1,303.30 కోట్లు, యూకో బ్యాంకుకు రూ.1,224.64 కోట్లు, ఐడీబీఐ బ్యాంకుకు రూ.1,116.53 కోట్లు, యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు రూ.1,095.84 కోట్లు, సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు రూ.1,084.50 కోట్లు, బ్యాంకు ఆఫ్ మహారాష్ట్రకు రూ.1,029.23 కోట్లు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు రూ.1,015.79 కోట్ల నష్టం వచ్చినట్టు వెల్లడైంది. కుంభకోణాలతో ప్రస్తుతం బ్యాంకులు తీవ్ర ఆందోళనకర పరిస్థితుల్లో ఉన్నాయని ఎకనామిస్ట్ జయంతిలాల్ భండారి అన్నారు. దీని వల్ల ప్రస్తుతం బ్యాంకులు పెద్ద మొత్తంలో ఆర్థిక నష్టాలను ఎదుర్కొనడమే కాకుండా... భవిష్యత్తులో కొత్త రుణాలు అందివ్వడంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపనుందని పేర్కొన్నారు. ఈ పరిస్థితి దేశ ఆర్థిక వ్యవస్థకు అంత మంచిది కాదని హెచ్చరించారు. -
పీఎన్బీ రేటింగ్ డౌన్గ్రేడ్: మూడీస్
ముంబై: కుంభకోణం, భారీ నష్టాలతో సతమతమవుతున్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) రేటింగ్ను మూడీస్ డౌన్గ్రేడ్ చేసింది. లాభదాయకతపై తీవ్ర ప్రతికూల ప్రభావాల కారణంగా బీఏ/ఎన్పీ రేటింగ్ నుంచి బీఏఏ3/పీ–3కి డౌన్గ్రేడ్ చేసినట్లు పేర్కొంది. ఇతరత్రా వనరుల మద్దతు లేకుండా నిలదొక్కుకోగలిగే సామర్థ్యానికి సంబంధించిన బేస్లైన్ క్రెడిట్ అసెస్మెంట్ను (బీసీఏ) కూడా తగ్గించింది. అయితే, అవుట్లుక్ మాత్రం స్థిరంగానే కొనసాగిస్తున్నట్లు మూడీస్ పేర్కొంది. వచ్చే ఏడాది మార్చి ఆఖరు నాటికి బాసెల్ నిబంధనలకు తగ్గట్లుగా కనీస మూలధనం ఉండాలన్నా... పీఎన్బీ బయటి నుంచి సుమారు రూ. 12,000–13,000 కోట్లు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. అయితే, ప్రభుత్వం నుంచి కొంత మొత్తం లభించడంతో పాటు ఇతరత్రా రియల్టీ ఆస్తులు, అనుబంధ సంస్థ పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్లో పాక్షికంగా వాటాలను విక్రయించడం ద్వారా సమకూర్చుకున్నా.. స్కామ్ బైటపడక పూర్వం ఉన్న స్థాయికి మూలధనం పెరగకపోవచ్చని రేటింగ్ ఏజెన్సీ పేర్కొంది. -
పీఎన్బీని దాటిన ‘హౌసింగ్ ఫైనాన్స్’
న్యూఢిల్లీ: నీరవ్ మోదీ కుంభకోణం దెబ్బ నుంచి బైటపడటానికి ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) నానా తంటాలు పడుతోంది. అయితే, దీని ప్రతికూల ప్రభావాలతో దాని మార్కెట్ విలువ గణనీయంగా హరించుకుపోయింది. అనుబంధ సంస్థ పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ (పీఎన్బీహెచ్ఎఫ్) కన్నా మాతృ సంస్థ పీఎన్బీ మార్కెట్ క్యాప్ తగ్గిపోయింది. గురువారం మార్కెట్ ముగిసే సమయానికి పీఎన్బీహెచ్ఎఫ్ మార్కెట్ వేల్యుయేషన్ రూ. 21,172 కోట్లు కాగా పీఎన్బీ విలువ రూ. 21,105 కోట్లకు చేరింది. మాతృసంస్థ కన్నా పీఎన్బీహెచ్ఎఫ్ విలువ రూ. 68 కోట్లు అధికం కావడం గమనార్హం. గురువారం బీఎస్ఈలో పీఎన్బీ షేరు 1.19 శాతం లాభంతో రూ. 76.45 వద్ద ముగియగా, పీఎన్బీహెచ్ఎఫ్ షేరు 0.44 శాతం క్షీణించి రూ. 1,265 వద్ద క్లోజయ్యింది. పీఎన్బీహెచ్ఎఫ్లో పీఎన్బీకి 32.96 శాతం వాటాలు ఉన్నాయి. స్కామ్ బైటపడకముందు ఫిబ్రవరిలో పీఎన్బీ మార్కెట్ క్యాప్ ప్రస్తుతమున్న దానికి రెట్టింపు స్థాయిలో రూ. 44,625 కోట్ల పైచిలుకు ఉండేది. అయితే, రూ. 14,000 కోట్ల నీరవ్ మోదీ కుంభకోణం వెలుగుచూసినప్పట్నుంచీ షేరు పతనమవుతూ వస్తోంది. ఇక నాలుగో త్రైమాసికంలో భారీ నష్టాలతో ఆర్థిక ఫలితాల కారణంగా కేవలం రెండు రోజుల వ్యవధిలోనే పీఎన్బీ స్టాక్ సుమారు 15 శాతం క్షీణించింది. ఈ నేపథ్యంలో పీఎన్బీ షేరు పెట్టుబడికి అంత అనువైనది కాకపోవచ్చంటూ ఎడెల్వీస్ రీసెర్చ్ ఒక నివేదికలో పేర్కొంది. -
హాంకాంగ్ కోర్టు మెట్లెక్కిన పీఎన్బీ
హాంకాంగ్లో ఉన్న నీరవ్ మోదీని ఎలాగైనా భారత్కు రప్పించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేలకోట్లు ఎగొట్టి విదేశాలకు పారిపోయిన ఈయన్ని ఇటీవలే హాంకాంగ్లో ఉన్నట్టు దర్యాప్తు సంస్థలు గుర్తించిన సంగతి తెలిసిందే. నీరవ్ను అరెస్ట్చేసి తమకు అప్పగించాలని భారత్ అధికారులు, హాంకాంగ్ అథారిటీలను కోరడంతో వారు కూడా సానుకూలంగా స్పందించారు. తాజాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా నీరవ్ మోదీకి వ్యతిరేకంగా హాంకాంగ్ హైకోర్టును ఆశ్రయించింది. హాంకాంగ్ హైకోర్టును మాత్రమే కాక, నీరవ్ మోదీ, మెహుల్ చౌక్సి ఆస్తులు, వ్యాపారాలు ఉన్న ఇతర దేశాల కోర్టులను సైతం పీఎన్బీ ఆశ్రయించింది. హైకోర్టు నోటీసులను హాంకాంగ్ న్యూస్పేపర్లు శనివారం ప్రచురించాయి. కాగ, పీఎన్బీకి దాదాపు రూ.13,500 కోట్లు ఎగవేసిన నీరవ్ మోదీపై ఇండియాటుడే సైతం పలు కీలక విషయాలను వెలుగులోకి తెస్తోంది. నీరవ్ సీక్రెట్ అకౌంట్లు, అతనికి విదేశాల్లో ఉన్న వ్యాపారాలు, నీరవ్ కుంభకోణంపై అతని కుటుంబ సభ్యుల స్పందన వంటి పలు విషయాలను ఇండియాటుడే విడుదల చేసింది. మరోవైపు ఉద్దేశ్యపూర్వక రుణ ఎగవేతదారులపై బ్యాంకు సైతం కొరడా ఝళిపించడం ప్రారంభించింది. 1,084 వేల మంది రుణ ఎగవేతదారులను గుర్తించిన పీఎన్బీ, వారిలో 260 మంది ఫోటోలను పేపర్లలో కూడా ప్రచురించింది. -
‘మిషన్ గాంధీగిరీ’తో రూ. 1,800 కోట్ల రికవరీ
న్యూఢిల్లీ: మొండిబాకీలను రాబట్టుకునేందుకు దాదాపు ఏడాదికాలంగా కొనసాగిస్తున్న మిషన్ గాంధీగిరీ ద్వారా .. రూ. 1,800 కోట్లు రికవరీ కాగలవని ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) అంచనా వేస్తోంది. గతేడాది మేలో ప్రారంభించిన ఈ కార్యక్రమంతో సానుకూల ఫలితాలనిస్తోందని, సగటున నెలకు రూ. 150 కోట్ల మేర వసూళ్లు లక్ష్యంగా పెట్టుకున్నట్లు బ్యాంక్ వర్గాలు తెలిపాయి. మొండిబాకీదారుల పేర్లను బైటపెట్టడం ద్వారా వారిపై సామాజికంగా ఒత్తిడి పెంచి, బాకీలు రాబట్టుకోవాలన్నది మిషన్ గాంధీగిరీ ఉద్దేశమని పేర్కొన్నాయి. బ్యాంకు సర్కిల్స్ అన్నింట్లోనూ ఇందుకోసం ప్రత్యేకంగా రికవరీ టీమ్ కూడా ఏర్పాటు చేసినట్లు పీఎన్బీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. మొండిబాకీలపై పీఎన్బీ తీసుకుంటున్న చర్యల ఫలితంగా గత కొన్ని నెలల్లో 150 పైచిలుకు ఉద్దేశపూర్వక ఎగవేతదారుల పాస్పోర్టులను జప్తు చేసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. గత తొమ్మిది నెలల్లో డిఫాల్టర్లపై 37 ఎఫ్ఐఆర్లు కూడా నమోదైనట్లు చెప్పారు. -
మా బ్యాంకులో మీ డబ్బు భద్రం!!
న్యూఢిల్లీ: భారీ కుంభకోణంలో చిక్కుకున్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) తమ ఖాతాదారులకు డిపాజిట్లపై భరోసా కల్పించే ప్రయత్నాలు చేస్తోంది. కస్టమర్స్ సొమ్ముకు తమ బ్యాంకులో పూర్తి భద్రత ఉంటుందని, వారెప్పుడైనా డిపాజిట్.. విత్డ్రా చేసుకోవచ్చని పునరుద్ఘాటించింది. వీటిపై వదంతులను నమ్మొద్దని విజ్ఞప్తి చేసింది. వ్యవస్థలో అనైతిక విధానాలను ఉపేక్షించే ప్రసక్తే లేదని, మోసపూరిత లావాదేవీల్లాంటివేమైనా జరిగాయని తెలిసిన మరుక్షణం దర్యాప్తు సంస్థలు, నియంత్రణ సంస్థలకు సమాచారం వెళ్లిపోతుందని .. కఠిన చర్యలు ఉంటాయని పీఎన్బీ తెలిపింది. స్కామ్ ప్రభావం పడిన ఇతర బ్యాంకులతో కూడా సంప్రదింపులు జరుపుతున్నామని, తాజా పరిణామాలు ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉన్నామని వివరించింది. ఇటీవలి రూ. 13,000 కోట్ల కుంభకోణానికి సంబంధించి ఖాతాదారుల సందేహాలను నివృత్తి చేసేలా ఇచ్చిన వివరణలో పీఎన్బీ ఈ అంశాలు పేర్కొంది. వజ్రాభరణాల వ్యాపారి నీవర్ మోదీ, మెహుల్ చోక్సీలు రూ. 11,400 కోట్ల మేర పీఎన్బీని మోసం చేసినట్లు ఇటీవల బైటపడిన సంగతి తెలిసిందే. మరింత లోతుగా దర్యాప్తు చేయగా ఈ మొత్తం రూ. 13,000 కోట్లకి చేరింది. పీఎన్బీ ఉద్యోగులతో కుమ్మక్కై, బ్యాంకు నుంచి తీసుకున్న నకిలీ లెటర్స్ ఆఫ్ అండర్టేకింగ్ (ఎల్వోయూ)తో మోదీ తదితరులు ఈ స్కామ్కి తెరతీశారు. ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్బీఐతో పాటు యూనియన్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్ మొదలైన దాదాపు 30 బ్యాంకులపై ఈ స్కామ్ ప్రభావం పడింది. -
పీఎన్బీ స్కాం: బ్యాంకు కీలక ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ: వేలకోట్ల రూపాయల కుంభకోణంలో చిక్కుకున్న పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) సోమవారం కీలక ప్రకటన చేసింది. దాదాపు రూ.13వేల కోట్ల స్కాం రేపిన ప్రకంపనల నేపథ్యంలో వినియోగదారులకు భరోసా ఇస్తూ ప్రకటన జారీ చేసింది. వినియోగదారుల సొమ్ము పూర్తి భద్రంగా ఉందనీ, ఎలాంటి వదంతులను నమ్మవద్దని కోరింది. కస్టమర్లు తమ సొమ్మును ఎపుడైనా ఉపసంహరణ, లేదా డిపాజిట్ యథావిధిగా చేసుకోవచ్చని హామీ ఇచ్చింది. అనైతిక ,అక్రమ పద్ధతులను తాము సహించబోమని స్పష్టం చేసింది. ఖాతాదారుల ఆందోళనలను పరిష్కరించాలని కోరుతూ తరచూ అడిగే ప్రశ్నలు(FAQs) పై వివరణాత్మక ప్రకటన ఇచ్చింది. అక్రమ పద్దతులను, మోసపూరిత లావాదేవీలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించమని పేర్కొంది. ఈ క్రమంలోనే ఈ స్కాంకు సంబంధించి నియంత్రణాధికారులు, చట్ట సంస్థలకు వెంటనే ఫిర్యాదు చేశామని వివరించింది. -
ప్రభుత్వ బ్యాంకులపై పునరాలోచన అవసరం
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రంగంలో విప్లవాత్మక సంస్కరణల అవసరమని ప్రధానమంత్రి ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ అన్నారు. ప్రభుత్వరంగ బ్యాంకుల యాజమాన్యం విషయంలో పునరాలోచనకు సమయం ఆసన్నమైందన్నారు. ఇటీవలి పీఎన్బీ సహా పలు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో (పీఎస్బీ) మోసాలు వెలుగు చూడడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పరిష్కార యత్నాలకు విఘాతం కలిగించాయన్నారు. పీఎస్బీల్లో ఈ మోసాలు భవిష్యత్తులో చోటు చేసుకోకూడదంటే విప్లవాత్మక అజెండా అవసరమని అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘‘ప్రభుత్వం ట్విన్ బ్యాలన్స్ షీటు (రుణాలు తీసుకున్న సంస్థలు, ఇచ్చిన బ్యాంకులు సమస్యలను ఎదుర్కోవడం) సవాలును పరిష్కరించేందుకు దివాలా పరిష్కార చట్టం (ఐబీసీ), బ్యాంకులకు రీక్యాపిటలైజేషన్ అనే రెండు కీలక చర్యలు చేపట్టింది. నిజాయితీగా చెప్పాలంటే ఆ ప్రయత్నాలన్నింటికీ బ్యాంకుల్లో మోసాలు గండికొట్టాయి’’ అని సుబ్రమణియన్ అన్నారు. ట్విన్ బ్యాలన్స్ షీటు సమస్య నుంచి బయటపడేందుకు తాజా చర్యలు అవసరమని సూచించారు. ప్రఖ్యాత నోబెల్ గ్రహీత ఆర్థిక వేత్త పాల్క్రుగ్మ్యాన్ భారత్లో తయారీ ఉద్యోగాలు లోపించాయనడం నిజమేనని సుబ్రమణియన్ అంగీకరించారు. తయారీ రంగంలో అవకాశాలను భారత్ 25–30 ఏళ్ల క్రితమే చేజార్చుకుందన్నారు. అయితే, భవిష్యత్తులోనూ తయారీ రంగం ఇదే స్థాయిలో ఉద్యోగాలు కల్పిస్తుందన్న నమ్మకం లేదని, నిర్మాణం, వ్యవసాయం, సేవల రంగాలు మరింత ఉద్యోగాలు కల్పించగలవని అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశీయ డిమాండ్పైనే భారత్ ఎదగడం సాధ్యం కాదన్నారు. -
పీఎన్బీ ఉద్యోగినిపై యాసిడ్ దాడి
సాక్షి, లక్నో: పంజాబ్ నేషనల్ మహిళా బ్యాంకు ఉద్యోగిపై యాసిడ్ దాడి కలకలం రేపింది. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. బైక్పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు పీఎన్బీ ఉద్యోగి(29)పై యాసిడ్ చల్లి పారిపోయారు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. అంతేకాదు ఆమెకుసమీపంలో నిలుచ్చున్న మరో ఏడుగురు కూడా గాయాలపాటైనట్టు సమాచారం. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని పక్కనున్న వారు ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. -
నీరవ్ వ్యాపారంపై అంబానీ కీలక వ్యాఖ్యలు
సాక్షి,ముంబై: వేలకోట్ల కుంభకోణానికి పాల్పడి విదేశాలకు చెక్కేసిన డైమండ్ వ్యాపారి నీరవ్మోదీపై విపుల్ అంబానీ కీలక వ్యాఖ్యలు చేశారు. పీఎన్బీ స్కాంలో కీలక నిందితుడుగా ఉన్న నీరవ్ వ్యాపార విస్తరణ క్రమం తనను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసిందని పేర్కొన్నారు. అలాగే భవిష్యత్తులో మరింత విస్తరించేలా భారీ ప్లాన్లను రూపొందించుకున్నారని రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ బంధువు, టవర్ క్యాపిటల్ అండ్ సెక్యూరిటీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విపుల్ అంబానీ వెల్లడించారు. 1999లో వ్యాపారాన్ని ప్రారంభించిన నీరవ్ మోదీ అయిదేళ్లు తిరక్కుండానే తన రత్నాలు, వజ్రాల వ్యాపార సంస్థ ‘ఫైర్స్టార్ గ్రూప్’ ను విదేశాల్లోనూ విస్తరించాడని తెలిపారు. అప్పటికే 6 అంతర్జాతీయ నగరాలకు తన వ్యాపారాన్నివిస్తరింపజేసిన నీరవ్ 2015లో మరింత దూకుడు పెంచాడన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన డైమండ్ వ్యాపార సామ్రాజ్యాన్ని 2020 నాటికి 12 దేశాల్లో భారీగా విస్తరించాలని భావించారట. ఈ సందర్భంగా 30కి పైగా ఔట్లెట్లను నెలకొల్పడమే లక్ష్యంగా పనిచేస్తానని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్లో నీరవ్ వెల్లడించిన విషయాన్ని విపుల్ గుర్తు చేశారు. అంతటి విస్తరణా కార్యక్రమాల్ని చూసిన ఎవరికైనా ఔరా.! అనిపిస్తుందని ఆయన తెలిపారు. ప్రఖ్యాత నటి, మోడల్ నవోమీ వాట్స్ నుంచి జూనియర్ ట్రంప్ వరకు నీరవ్ బిజినెస్ మోడల్ను చూసి అలా ఆశ్చర్యపోయిన వారేనని అన్నారు. నీరవ్ మోదీ, అతని మామ మోహుల్ చోక్సీలు పంజాబ్ నేషనల్ బ్యాంకులో స్కాంలో ఆరోపణలపై విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. -
ఎల్వోయూలు అన్నింటినీ గౌరవిస్తాం
న్యూఢిల్లీ: నీరవ్మోదీ కంపెనీలకు వాస్తవంగా జారీ చేసిన అన్ని ఎల్వోయూలను గౌరవిస్తామని (చెల్లింపులు చేయడం) పంజాబ్ నేషనల్ బ్యాంకు స్పష్టం చేసింది. ఈ పరిస్థితి నుంచి బయటపడగలిగే సామర్థ్యం బ్యాంకుకు ఉందని తెలిపింది. వాటాదారుల అసాధారణ సమావేశం (ఈజీఎం)లో ఎదురైన ప్రశ్నలకు కంపెనీ ఈ మేరకు బదులిచ్చింది. బ్యాంకు జారీ చేసిన ఎల్వోయూల ఆధారంగా వజ్రాల వ్యాపారి నీరవ్మోదీ విదేశీ బ్యాంకు శాఖల నుంచి రూ.13,000 కోట్ల మేర రుణాలు పొంది ఎగవేసిన విషయం తెలిసిందే. ప్రిఫరెన్షియల్ షేర్ల జారీ ద్వారా నిధుల సమీకరణపై వాటాదారుల ఆమోదం కోసం ఏర్పాటు చేసిన ఈజీఎంలో స్కామ్పై బ్యాంకు యాజమాన్యం ప్రశ్నలను ఎదుర్కొన్నది. తనిఖీ, నియంత్రణలను మెరుగుపరిచేందుకు బహుళ అంచెల విధానాన్ని అనుసరించనున్నట్టు బ్యాంకు తెలిపింది. అంతర్గత నియంత్రణ వ్యవస్థను మెరుగుపరిచేందుకు గాను తరచుగా ఇంటర్నల్ ఆడిట్, అవసరమైనప్పుడు ఎక్స్టర్నల్ ఆడిట్ చేపట్టనున్నట్టు బ్యాంకు వర్గాలు తెలిపాయి. దీనికితోడు కరెంట్, సేవింగ్స్ ఖాతా (కాసా)లు, చిన్న డిపాజిటర్లపై దృష్టి సారించాలని నిర్ణయించింది. బ్యాంకు వనరుల్లో 40 శాతం కాసా నుంచే వస్తుండటం గమనార్హం. మరోవైపు 33.49 కోట్ల షేర్లను ఒక్కో షేరు (రూ.2 ముఖ విలువ)ను రూ.161.38 ధరకు కేంద్ర ప్రభుత్వానికి జారీ చేసే ప్రతిపాదనకు వాటాదారులు ఆమోదం తెలిపినట్టు స్టాక్ ఎక్సే్చంజ్లకు పీఎన్బీ సమాచారం ఇచ్చింది. ఈ వాటాల జారీ తర్వాత బ్యాంకులో కేంద్రం వాటా ప్రస్తుతమున్న 57 శాతం నుంచి 62.25 శాతానికి పెరుగుతుంది. -
పీఎన్బీలో మరో కుంభకోణం
న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంకులో చోటుచేసుకున్న కుంభకోణాలు తవ్వే కొద్దీ బయటికి వస్తున్నాయి. నీరవ్ మోదీ కుంభకోణం అనంతరం మరో స్కాం వెలుగులోకి వచ్చింది. ముంబై బ్రాంచ్లో మరో 9.1 కోట్ల రూపాయల మోసం జరిగినట్టు పంజాబ్ నేషనల్ బ్యాంకు గుర్తించింది. ఈ విషయంపై ఫెడరల్ పోలీసు వద్ద పీఎన్బీ ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. నీరవ్ మోదీ పాల్పడిన మాదిరిగానే.. అధికారుల సహకారంతో చంద్రీ పేపర్ అండ్ అలైడ్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమెటెడ్ కంపెనీ కూడా ఈ కుంభకోణానికి పాల్పడినట్టు వెల్లడైంది. అయితే ఈ స్కాంపై ఇటు పీఎన్బీ అధికార ప్రతినిధి కానీ, అటు చంద్రీ పేపర్ కానీ వెంటనే స్పందించలేదు. ఈ స్కాంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగ, గత నెలలో వెలుగులోకి వచ్చిన నీరవ్ మోదీ కుంభకోణంలో పీఎన్బీ ముంబై బ్రాంచ్లో దాదాపు రూ.12,700 కోట్ల అవకతవకలు జరిగినట్టు వెల్లడైన సంగతి తెలిసిందే. ఈ స్కాం బయటికి రాకముందే, ఈ భారీ మోసానికి పాల్పడిన డైమాండ్ కింగ్ నీరవ్ మోదీ, ఆయన మేనమామ మెహుల్ చౌక్సి, కుటుంబ సభ్యులు దేశం విడిచి పారిపోయారు. వీరిని ప్రస్తుతం భారత్కు రప్పించడానికి దర్యాప్తు సంస్థలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. మోదీ, చౌక్సిలకు వ్యతిరేకంగా రెడ్ కార్నర్ నోటీసు జారీచేయాలని ఇంటర్పోల్ను కూడా కోరుతోంది ఈడీ. -
ఎల్వోయూల జారీపై నిషేధం
ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)లో రూ. 13,000 కోట్ల మేర లెటర్స్ ఆఫ్ అండర్టేకింగ్ (ఎల్వోయూ) కుంభకోణం దరిమిలా రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకులు ఎల్వోయూలు జారీ చేయడాన్ని నిషేధించింది. వాణిజ్య రుణాలకు సంబంధించి బ్యాంకులు.. ఎల్వోయూలు, లెటర్స్ ఆఫ్ కంఫర్ట్ (ఎల్వోసీ)ల జారీ చేయడాన్ని నిలిపివేయాలని నిర్ణయించినట్లు ఆర్బీఐ తెలిపింది. ఇది తక్షణం అమల్లోకి వస్తుందని వివరించింది. మార్గదర్శకాలను పునఃసమీక్షించిన అనంతరం.. కేటగిరీ–1 బ్యాంకులు ఎల్వోయూలు/ఎల్వోసీలు జారీ చేసే విధానాన్ని నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఒక నోటిఫికేషన్లో తెలిపింది. అయితే, దిగుమతులకు సంబంధించి వివిధ సంస్థల రుణ అవసరాల కోసం లెటర్స్ ఆఫ్ క్రెడిట్, బ్యాంక్ గ్యారంటీల జారీని బ్యాంకులు య«థాప్రకారం కొనసాగించవచ్చని పేర్కొంది. పీఎన్బీ అధికారులతో కుమ్మక్కై తీసుకున్న ఎల్వోయూల ఆధారంగా వజ్రాభరణాల వ్యాపారులు నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ.. దాదాపు రూ. 13,000 కోట్ల కుంభకోణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రస్తుతం సీబీఐ, ఈడీ సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. ఆర్బీఐ తాజా నిబంధనలతో ఎక్కువగా ఎల్వోయూలమీదే ఆధారపడే వ్యాపార సంస్థలపై ప్రతికూల ప్రభావం పడనుంది. అయితే, బ్యాంక్ గ్యారంటీలు, లెటర్ ఆఫ్ క్రెడిట్ విధానం యథాప్రకారం కొనసాగనున్నందున వాణిజ్యంపై పెద్దగా ప్రభావం ఉండబోదని ఎగుమతిదారుల సమాఖ్య ఎఫ్ఐఈవో డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ పేర్కొన్నారు. ఎల్వోయూలను ఎక్కువగా వజ్రాభరణాల రంగంలోని పెద్ద సంస్థలే ఉపయోగిస్తాయని ఆయన తెలిపారు. మరోవైపు, నీరవ్ మోదీ 2011 మార్చి 10న ముంబైలోని పీఎన్బీ బ్రాడీ హౌస్ శాఖ నుంచి తొలిసారిగా ఎల్వోయూ తీసుకున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభకు తెలిపారు. ఆ తర్వాత 74 నెలల వ్యవధిలో ఏకంగా 1,212 ఎల్వోయూలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలి
ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) స్కామ్ ఆర్థిక వ్యవస్థలో భయాందోళనకు, అచేతనానికి దారితీయరాదని ఫిక్కీ సూచించింది. ఈ విధమైన పరిస్థితి ఏర్పడకుండా చూడాలని ఆర్బీఐ, ప్రభుత్వాలకు లేఖ రాసినట్టు ఫిక్కీ ప్రెసిడెంట్ రషేష్ షా తెలిపారు. షా ఎడెల్వీజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చైర్మన్గానూ వ్యవహరిస్తున్నారు. పీఎన్బీ స్కామ్ యూపీఏ–2 హయాంలోని చివరి రోజులను గుర్తు చేస్తోందని, నాడు సీబీఐ, సీవీసీ, కాగ్ అంటే భయం ఉండేదని షా పేర్కొన్నారు. ఈ తరహా స్కామ్ల తో బ్యాంకింగ్ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందన్న ఆయన, 1992లో హర్షద్ మెహతా స్కామ్, 2001లో కేతన్ పరేఖ్ స్కామ్ల తర్వాత పరిస్థితిని గుర్తు చేశారు. పీఎన్బీ స్కామ్ను వ్యవస్థల బలోపేతా నికి అవకాశంగా సూచించారు. రుణాలపై ప్రభావం పడరాదు పీఎన్బీ స్కామ్తో దర్యాప్తు సంస్థలు, బ్యాంకులు అతిగా స్పందించడం వల్ల వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు రుణాల జారీపై ప్రభావం పడుతుందని అసోచామ్ హెచ్చరించింది. బ్యాంకులు, నియంత్రణ సంస్థలు, ప్రభుత్వ చర్యలు నష్టాన్ని పరిమితం చేసే విధంగా ఉండాలని సూచించింది. ‘‘కుంభకోణాలు బయటకు వచ్చాక, మీడియాలో ప్రముఖంగా వార్తలు రావడంతో ఈ స్థాయి హడావిడి సాధారణమే. కానీ, ఇది బ్యాంకుల విశ్వాసానికి విఘాతం కలిగిస్తుంది. కనుక ఎంతో నిగ్రహంతో ఈ సందర్భాన్ని ఓ అవకాశంగా భావించి వ్యవస్థాపరమైన సమస్యల పరిష్కారానికి వినియోగించుకోవాలి’’ అని అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ సూచించారు. -
అందుకు నో అంటున్న విరాట్ కోహ్లి
సాక్షి, న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)ను నీరవ్ మోదీ నిండాముంచిన వ్యవహారంతో బ్యాంక్ ప్రతిష్ట దారుణంగా దెబ్బతింది. నీరవ్ స్కాం నేపథ్యంలో పీఎన్బీతో తన ఎండార్స్మెంట్ కాంట్రాక్టు రెన్యువల్కు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ విముఖత చూపుతున్నట్టు సమాచారం. అయితే ఈ ఏడాది చివరి వరకూ కాంట్రాక్టు టర్మ్ ముగియనున్నందున అప్పటివరకూ ఎండార్స్మెంట్ను తొలగించబోమని కోహ్లీ బ్రాండ్ వ్యవహారాలను చక్కదిద్దే ఏజెన్సీ కార్నర్స్టోన్ స్పోర్ట్ అండ్ ఎంటర్టైన్మెంట్ స్పష్టం చేసింది. కాంట్రాక్టును పొడిగించడంపై ఇప్పటివరకూ పీఎన్బీతో ఎలాంటి చర్చలూ జరపలేదని సంస్థ సీఈఓ బంటీ సజ్దే చెప్పారు. అయితే నీరవ్ మోదీ స్కాంలో పీఎన్బీని నిందించేందుకు సరైన కారణం లేదని బంటీ పేర్కొనడం గమనార్హం. పీఎన్బీ కుంభకోణం నేపథ్యంలో విరాట్ కోహ్లీ మాత్రం కాంట్రాక్టు పొడిగింపునకు సుముఖత వ్యక్తం చేయరని సమాచారం. -
60 సంస్థల ఆస్తుల విక్రయాలపై నిషేధం
న్యూఢిల్లీ/మారిషస్: పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) రూ.12,700 కోట్ల రూపాయల స్కామ్లో జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) కీలక ఆదేశాలు జారీ చేసింది. నీరవ్మోదీ, మెహుల్చోక్సీ, వారికి సంబంధించిన కంపెనీలు, పీఎన్బీకు చెందిన పలువురు ఉద్యోగులు, పరిమిత బాధ్యత కలిగిన భాగస్వామ్య సంస్థలు ఇలా 60కుపైగా సంస్థలను ఆస్తులు విక్రయించకుండా నిషేధం విధిస్తూ ఎన్సీఎల్టీ ఉత్తర్వులు జారీ చేసినట్టు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ వెల్లడించింది. పీఎన్బీ స్కామ్ నేపథ్యంలో కంపెనీల చట్టంలోని పలు సెక్షన్ల కింద కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఎన్సీఎల్టీ ముందు పిటిషన్ దాఖలు చేయగా ఎక్స్పార్టీ ఆదేశాలు జారీ చేసింది. సెక్షన్ 221 (విచారణ, దర్యాప్తును ఎదుర్కొంటున్న కంపెనీ ఆస్తులను స్తంభింపజేయడం), సెక్షన్ 222 (సెక్యూరిటీలపై నియంత్రణ విధించడం)ల కింద పిటిషన్ను దాఖలు చేసింది. ఆస్తులు విక్రయించకుండా నిషేధానికి గురైన వాటిలో గీతాంజలి జెమ్స్, గిల్లి ఇండియా, నక్షత్ర బ్రాండ్స్, ఫైర్స్టార్ డైమండ్, సోలార్ ఎక్స్పోర్ట్స్, స్టెల్లర్ డైమండ్ తదితర కంపెనీలు, భాగస్వామ్య కంపెనీలు ఉన్నాయి. అవసరమైన చర్యలు తీసుకుంటాం అక్రమ లావాదేవీలకు పాల్పడిన సంస్థలపై అవసరమైన చర్యలు తీసుకుంటామని మారిషస్ ప్రభుత్వం పేర్కొంది. పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) కుంభకోణం వివిధ దేశాలతోనూ ముడిపడి ఉన్నట్టు కనిపిస్తున్న నేపథ్యంలో ఆదివారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. నీరవ్మోదీ, ఆయన బంధువు మెహుల్ చోస్కీలపై మీడియాలో వచ్చిన వార్తలను పరిగణనలోకి తీసుకున్నామని ఫైనాన్సియల్ సర్వీసెస్ కమిషన్ (ఎఫ్ఎస్సీ)తెలిపింది. ‘మీడియా లో వచ్చిన వార్తలను పరిగణలోని తీసుకున్నాం. ఇందుకు సంబంధించి బ్యాంక్ ఆఫ్ మారిషస్, మారిషస్ రెవెన్యూ అథారిటీ, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్లతో సంప్రదింపులు జరుపుతున్నాం. అలాగే ఎఫ్ఎస్సీ కూడా గతంలో కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు వివిధ దేశాలతో సంప్రదింపులు జరుపుతోంది’ అని ఆ ప్రకటనలో పేర్కొంది. -
కస్టమర్లకు షాక్: రుణాలపై వడ్డీరేటు పెంపు
సాక్షి, ముంబై: ప్రభుత్వం రంగ బ్యాంకింగ్ దిగ్గజాలు లెండింగ్ రేట్లను పెంచి బ్యాంకు వినియోగదారులను తీవ్ర నిరాశకు గురిచేశాయి. ఊహించినట్టుగానే దేశీయ అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ), పీఎన్బీ వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. దీంతో రుణ గ్రహీతలపై ఈఎంఐ భారీగా పడనుంది. వార్షిక ఎంసిఎల్ఆర్ రేటును పెంచుతూ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు ఎస్బీఐ వెబ్సైట్లో వివరాలను పొందు పర్చింది. 2016, ఏప్రిల్ తరువాత మొదటిసారి రుణాలపై వడ్డీరేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తాజా పెంపుతో వార్షిక ఎంసీఎల్ఆర్ 8.15శాతంగా ఉంటుంది. ఇప్పటివరకు ఇది 7.9 శాతం మాత్రమే. అటు మరో ప్రభుత్వరంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు కూడా వడ్డీరేట్లను పెంచిది. వార్షిక ఎంసీఎల్ఆర్ను 8.30శాతంగా నిర్ణయించింది. మార్చి 1, 2018నుంచి ఈ రేట్లు అమల్లో రానున్నాయని పీఎన్బీ, ఎస్బీఐ ప్రకటించింది. కాగా డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచిన ఒకరోజు తరువాత ఎస్బీఐ లెండింగ్ రేట్లను సవరించింది. -
పీఎన్బీ హెడ్ క్యాషియర్ మృతి
సాక్షి, లక్నో:దేశవ్యాప్తంగా పీఎన్బీ మెగాస్కాం రేపిన ప్రకంపనలు ఇంకా చల్లారకముందే..ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకులో మరో షాకింగ్ ఉదంతం చోటు చేసుకుంది. బ్యాంకు ఉద్యోగి ఒకరు అనుమానాస్పద రీతిలో గురువారం శవమై తేలారు. దీంతో బ్యాంకింగ్ వర్గాల్లో కలకలం రేగింది. లక్నోకు చెందిన రోహిత్ శ్రీవాత్సవ (28) ఉత్తర ప్రదేశ్లో బలరాంపూర్ పీఎన్బీ బ్రాంచ్లో హెడ్ క్యాషియర్గా పనిచేస్తున్నారు. అయితే రోహిత్ మృతదేహాన్ని మంకాపూర్ రోడ్డులోని కల్వర్ట్లో గుర్తించామని పోలీసు అధికారులు వెల్లడించారు. బంధువులకు సమాచారం అందించి, మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం తరలించామన్నారు. దీనిపై విచారణ కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు. -
విరాట్ కోహ్లి కొనసాగుతాడు
భారీ కుంభకోణంతో సతమతమవుతున్న పంజాబ్ నేషనల్ బ్యాంకుపై పలు తప్పుడు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇన్ని రోజులు బ్యాంకుకు బ్రాండు అంబాసిడర్గా ఉన్న విరాట్ కోహ్లి, ఈ కుంభకోణ నేపథ్యంలో తప్పు కుంటున్నాడని, బ్యాంకు తన కస్టమర్ల విత్డ్రాయల్స్పై పరిమితులు విధిస్తుందని వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే ఈ వార్తలపై పీఎన్బీ క్లారిటీ ఇచ్చింది. తమ బ్రాండు అంబాసిడర్గా విరాట్ కోహ్లి కొనసాగుతాడని పీఎన్బీ పేర్కొంది. కస్టమర్ల విత్డ్రాయల్స్పై ఎలాంటి పరిమితులు విధించడం లేదని, సాధారణ బ్యాంకింగ్ కార్యకలాపాలు కొనసాగుతాయని బ్యాంకు స్పష్టంచేసింది. అదేవిధంగా ఆడిట్ సంస్థ ప్రైస్వాటర్హౌజ్కూపర్స్(పీడబ్ల్యూసీ) పీఎన్బీలో చోటుచేసుకున్న రూ.11,400 కోట్ల కుంభకోణాన్ని విచారణ జరుపనుందని వస్తున్న వార్తలను కూడా బ్యాంకు కొట్టివేసింది. కుంభకోణ నేపథ్యంలో బ్యాంకుతో ఉన్న ఎండోర్స్మెంట్ను విరాట్ రద్దు చేసుకుంటున్నాడంటూ మీడియా రిపోర్టులు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ రిపోర్టులన్నీ పూర్తిగా తప్పుడవని, నిరాధారమైనవని బ్యాంకు క్లారిటీ ఇచ్చింది. తమ బ్రాండు అంబాసిడర్గా విరాట్ కోహ్లి కొనసాగుతాడని బ్యాంకు తెలిపింది. ఈ మోసాన్ని విచారించడానికి పీడబ్ల్యూసీతో కలిసి పనిచేయడం లేదని, అయితే నీరవ్ మోదీకి, ఆయన సంబంధిత కంపెనీలకు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలను తామే సేకరిస్తున్నట్టు బ్యాంకు తెలిపింది. ప్రధానంగా అంతర్జాతీయ ఆర్ధిక నేరాలపై పీడబ్ల్యూసీ విచారణ చేస్తుంది. కానీ ప్రస్తుతం పీడబ్ల్యూసీ సహకారాన్ని పీఎన్బీ తీసుకోవడం లేదు. ఈ పరిస్థితిని పరిస్థితిని సమర్థవంతంగా నిర్వహించడానికి, సంస్థ, వినియోగదారుల, వాటాదారుల కాపాడటానికి తగిన సామర్థ్యాన్ని కలిగి ఉందని బ్యాంక్ పునరుద్ఘాటించింది. -
షాకింగ్: వేలాది పీఎన్బీ కార్డుల డేటా లీక్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ స్కాంగా నిలిచిని పంజాబ్నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో మరిన్ని షాకింగ్ విషయాలు తాజాగా వెలుగు చూశాయి. పీఎన్బీకి చెందిన వేలాదిమంది వినియోగదారుల కార్డుల సమాచారం హ్యాకింగ్కు గురైనట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. కస్టమర్లకు చెందిన గోప్యమైన విషయాలు వెబ్సైట్లో అమ్మకానికి అందుబాటులో ఉన్నాయనీ, కనీసం మూడు నెలలుగా ఈ పక్రియ కొనసాగుతున్నట్టు నివేదించింది. బెంగళూరులోని సింగపూర్-రిజిస్టర్డ్ కంపెనీ ఈ డేటీ చోరికి పాల్పడినట్టు హాంకాంగ్ ఆధారిత పత్రికనుటంకిస్తూ ఆసియా నెట్వర్క్ రిపోర్ట్ చేసింది దాదాపు పీఎన్బీకి చెందిన 10వేల వినియోగదారుల సమాచారం లీక్ అయినట్టు తెలిపింది. ఇది గూగుల్ లాంటి ఇతర సెర్చ్ సైట్లలో ఇది కనిపించదనీ, కానీ చట్టవిరుద్ధంగా సున్నితమైన సమాచారం, కొనుగోలు, విక్రయాలు చేస్తాయని క్లౌడ్ సెక్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ టెక్ అధికారి రాహుల్ శశి తెలిపారు. సీవీవీ సహా పేర్లు, గడువు తేదీలు, వ్యక్తిగత గుర్తింపు సంఖ్యలు , కార్డ్ ధృవీకరణ ఇతర డేటా అమ్మకానికి అందుబాటులో ఉన్నాయన్నారు. ఇలా రెండు సెట్ల డేటా అందుబాటులో ఉన్నట్టు చెప్పారు. సీవీవీ నెంబర్తో సహా కొందరివి, లేకుండా కొంత డేటా బహిర్గమైందన్నారు. డేటాలో చివరి స్టాంపు తేదీ జనవరి 29, 2018 ఉందనీ, అంటే ఇప్పటికీ వేలసంఖ్యలో పీఎన్బీ డేటా వారికి అందుబాటులో ఉన్నట్టుగా భావించాలన్నారు. మరోవైపు దీన్ని ధృవీకరించిన పీఎన్బీ అధికారి విర్వానీ..దీనిపై ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నట్టు తెలిపారు. దీంతో పీఎన్బీ కార్డుదారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. -
నీరవ్ మోదీని చెప్పుతో కొడతా
ముంబై : పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) భారీ కుంభకోణం కేసు నేపథ్యంలో గీతాంజలి జెమ్స్కు చెందిన పలువురు అధికారులతో పాటు, నీరవ్ మోదీకి చెందిన ఫైర్ స్టార్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్లను సీబీఐ అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వీరిని నిన్న సీబీఐ సెషన్స్ కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ కేసు విచారణ నేపథ్యంలో వీరిని మార్చి 5 వరకు పోలీసు కస్టడీలో ఉంచనున్నట్టు సీబీఐ సెషన్స్ కోర్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఫైర్ స్టార్ గ్రూప్కు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ అర్జున్ పాటిల్ భార్య సుజాత పాటిల్ తీవ్రంగా స్పందించారు. నీరవ్ మోదీ భారత్కు వస్తే, తన చెప్పుతో కొడతానంటూ వ్యాఖ్యానించారు. సెషన్స్ కోర్టు వెలుపల సుజాత పాటిల్ ఈ విధంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్ఓయూల దరఖాస్తులను రూపొందించారనే క్రమంలో ఫైర్ స్టార్కు చెందిన ఈ సీనియర్ ఎగ్జిక్యూటివ్ను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ ఎల్ఓయూలతోనే నీరవ్ మోదీ అక్రమాలకు పాల్పడినట్టు తెలుస్తోంది. ''అర్జున్ నెలకు రూ.30వేలు మాత్రమే సంపాదిస్తారు. ఒక్క రూపాయి కూడా అదనంగా తీసుకోరు. ఏం చెప్తే అదే చేస్తారు. ఆయన ఎలాంటి అక్రమాలు పాల్పడలేదు'' అని సుజాత చెప్పారు. రేప్, మర్డర్ చేసిన వారు మాత్రం దర్జాగా బయట తిరుగుతున్నారు, కానీ అమాయకుడైన తన భర్తను మాత్రం అరెస్ట్ చేశారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. సీబీఐ తమ ఇంట్లో సోదాలు చేసిందని, కానీ ఏం దొరకలేదన్నారు. ఈ విషయంలో తామేమీ దాయడం లేదని కుండబద్దలు కొడుతున్నట్టు చెప్పింది. ప్రస్తుత పరిణామాలు టీవీ సీరియల్ మాదిరి ఉన్నాయంటూ ఆమె సీబీఐ, మోదీ, మీడియాను నిందించారు. -
నీరవ్ మోదీ లేఖపై పీఎన్బీ ఆగ్రహం
తనను సర్వనాశనం చేశారంటూ పంజాబ్ నేషనల్ బ్యాంకుకు నీరవ్ మోదీ రాసిన లేఖపై, బ్యాంకు ఆగ్రహం వ్యక్తంచేసింది. తన కంపెనీలకు జారీచేసిన లెటర్స్ ఆఫ్ అండర్టేకింగ్ అక్రమమైనవని, ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఉల్లంఘనకు పాల్పడుతున్నాయని, అందుకే ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని గట్టి చురకలే అందించింది. ఈ నేపథ్యంలోనే స్కాంను బయటికి వెల్లడించామని పేర్కొంది. నీరవ్ పొందిన మొత్తం రుణ ప్రక్రియ 'మనీ లాండరింగ్' కిందకి వస్తుందంటూ పీఎన్బీ స్పష్టంచేసింది. ''మీరు ఎల్ఓయూలను అక్రమంగా పొందారు. కొందరు బ్యాంకు అధికారుల ద్వారా అనధికారిక మార్గంలో వీటిని ఉపయోగించుకున్నారు. ఇలాంటి వాటిని బ్యాంకు ఉపేక్షించదు. ఈ అక్రమ కార్యకలాపాలు ఎఫ్ఈఎంఏ, మనీ లాండరింగ్ ఉల్లంఘనల కిందకి వస్తాయి'' అని నీరవ్ మోదీ లేఖకు స్పందిస్తూ పీఎన్బీ జనరల్ మేనేజర్ అశ్విని వాట్స్ తిరిగి లేఖ రాశారు. ఈ కార్యకలాపాలను లా అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల దృష్టికి తీసుకురావాలని బ్యాంకు నిర్ణయించిందని తెలిపారు. బ్యాంకు యాజమాన్యం అత్యుత్సాహంతో వ్యవహరించి, తన దారులన్నింటినీ మూసివేసిందని ఆరోపిస్తూ బ్యాంకు యాజమాన్యానికి నీరవ్ మోదీ ఒక లేఖ రాసిన సంగతి తెలిసిందే. తన బ్రాండును దెబ్బతీసిందని ఆరోపించారు. పీఎన్బీ తనపై అన్నీ తప్పుడు ఆరోపణలు చేసిందనీ, ఇప్పటికైనా ఫైర్స్టార్ గ్రూపునకు చెందిన విలువైన ఆస్తులను విక్రయించి, బకాయిలు తీర్చే అవకాశం ఇవ్వాలని కోరాడు. ఈ లేఖపై పీఎన్బీ ఈ విధంగా స్పందించింది. -
పాతాళంలో గీతాంజలి జెమ్స్
పంజాబ్ నేషనల్ బ్యాంకులో చోటుచేసుకున్న కుంభకోణం దెబ్బకు గీతాంజలి జెమ్స్ షేర్లు పాతాళానికి పడిపోయాయి. వరుసగా ఏడు సెషన్ల నుంచి తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. గత వారం నుంచి ఇప్పటి వరకు గీతాంజలి జెమ్స్ షేర్లు దాదాపు 58.5 శాతం కుప్పకూలాయి. దీంతో గీతాంజలి జెమ్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక్కసారిగా రూ.435.41 కోట్లు తుడిచిపెట్టుకుపోయింది. నేటి ట్రేడింగ్లోనే బీఎస్ఈలో ఈ స్టాక్ 4.92 శాతం కిందకి పడిపోయింది. ఎన్ఎస్ఈలో కూడా 4.92 శాతం కిందకి పడిపోయి రూ.26.05 వద్ద ట్రేడవుతోంది. పంజాబ్ నేషనల్ బ్యాంకులో వెలుగుచూసిన రూ.11,400 కోట్ల కుంభకోణంలో ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, ఆయన కుటుంబానికి చెందిన ప్రమేయమున్నట్టు తెలిసింది. దీంతో వారికి చెందిన గీతాంజలి జెమ్స్పై సీబీఐ, ఈడీ అధికారులు భారీ ఎత్తున్న తనిఖీలు చేస్తున్నారు. కొన్ని షోరూంలను సీజ్ కూడా చేశారు. ఐటీ కూడా గీతాంజలి జెమ్స్కు చెందిన కొన్ని ఆస్తులను సీజ్ చేసింది. మరోవైపు గీతాంజలి జెమ్స్ మూతపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగులకు సైతం వార్నింగ్ లేఖలు వెళ్లాయి. ఈ పరిణామాల నేపథ్యంలో గీతాంజలి జెమ్స్ షేరు విలువ భారీగా పతనమవుతోంది. -
18వేల మంది బ్యాంకు ఉద్యోగులు బదిలీ
న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంకులో వెలుగుచూసిన భారీ కుంభకోణంతో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో భారీగా ఉద్యోగుల బదిలీకి తెరలేసింది. వివిధ బ్యాంకుల్లో పనిచేస్తున్న దాదాపు 18వేల మంది బ్యాంకు అధికారులు బదిలీ అయ్యారు. సోమవారమే అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఈ బదిలీ విషయంపై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఓ ప్రకటన జారీచేసింది. 2017 డిసెంబర్ 31 నాటికి మూడేళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగులను బదిలీ చేయాలని బ్యాంకులను ఆదేశించింది. అదేవిధంగా క్లరికల్ స్టాఫ్ ఎవరైతే 2017 డిసెంబర్ 31 నాటికి ఐదేళ్లు పూర్తి చేసుకుంటారో వారిని కూడా బదిలీ చేయాలని తెలిపింది. వెంటనే ఈ బదిలీ ప్రక్రియ చేపట్టాలని ఆదేశాలు జారీచేసింది. ఈ ఆదేశాల మేరకు దాదాపు 18 వేల మంది బ్యాంకు అధికారులు బదిలీ అయినట్టు తెలిసింది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాల మేరకు, ప్రతి మూడేళ్లకు ప్రతి అధికారిని బదిలీ చేస్తుంటామని ఓ బ్యాంకు చెప్పింది. మూడేళ్ల కంటే ఎక్కువగా ఒకే పోస్టులో ఆఫీసర్ ఉంచమని పేర్కొంది. క్లరికల్ స్టాఫ్ విషయంలోనూ ఇదే అమలు చేస్తామని తెలిపింది. అయితే పంజాబ్ నేషనల్ బ్యాంకులో దాదాపు రూ.11,400 కోట్ల కుంభకోణానికి పాల్పడిన నీరవ్మోదీకి, ఆయన కుటుంబ సభ్యులు, గీతాంజలి జెమ్స్ అధికారి మెహుల్ చౌక్సికి ఐదేళ్ల కంటే ఎక్కువగా ఆ బ్యాంకులో పనిచేస్తున్న అధికారులే సాయం చేసినట్టు తెలిసింది. ఈ క్రమంలో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఈ ఆదేశాలు జారీచేసింది. 2011లోనే ఈ స్కాం ప్రారంభమైందని, అప్పటి నుంచి బ్యాంకు అధికారులు నీరవ్ మోదీకి సాయం చేసినట్టు వెల్లడైంది. నీరవ్ సాయం చేసిన ఇద్దరు పీఎన్బీ అధికారులు గత ఐదారేళ్లుగా ఒకే విభాగంలో పనిచేస్తున్నారు. నిజానికి ఇలా జరగకూడదు, ఈ హోదాలో పని చేసే ఉద్యోగులను ఎప్పటికప్పుడు మారుస్తుండాలి. కానీ ఆ విధమైన మార్పు పీఎన్బీలో జరుగలేదు. ఈ క్రమంలో బ్యాంకు అధికారుల బదిలీలు చేపట్టాలని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఆదేశించింది. -
పీఎన్బీ లోన్తో కొన్న కారు ఇదే!
న్యూఢిల్లీ : ఓ వైపు నీరవ్ మోదీ వ్యవహారం పంజాబ్ నేషనల్ బ్యాంకుకు పెద్ద తలనొప్పిలా మారింది. ఎంతో నమ్మకమైన బ్యాంకుగా పేరున్న పీఎన్బీకి, నీరవ్ మోదీ వల్ల ఆ పేరు ఒక్కసారిగా మంట కలిసిపోయింది. దాదాపు రూ.11,400 కోట్ల కుంభకోణం నీరవ్ మోదీ పాల్పడుతున్నప్పటికీ, బ్యాంకు అధికారులు గుర్తించకపోవడం యావత్తు దేశాన్ని నివ్వెరపరిచింది. కానీ కోట్లకుకోట్లు కుంభకోణానికి పాల్పడిన నీరవ్ మోదీ లాంటివారు ఈ బ్యాంకు కస్టమర్లుగా ఉన్నప్పటికీ, వారితో పాటు ఎంతో ఔన్నత్యం ఉన్న కస్టమర్లు కూడా ఈ బ్యాంకుకి ఉన్నారు. దీనికి సాక్ష్యం ఒకప్పటి కస్టమరైన భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రినే. ఆయన చూపిన ఔన్నత్యం ఇప్పటికీ ఎవరూ మరచిపోలేరు. ఈ స్టోరీ 1964కు చెందింది. ప్రధానమంత్రి కాకముందు లాల్ బహదూర్ శాస్త్రికి సొంతిల్లూ, వాహనం ఉండేవి కావు. ప్రధాన మంత్రి అయ్యాక అధికారిక కారులోనే ఆయన పిల్లలు తోంగాలో సెయింట్ కోలంబా స్కూల్లో వెళ్లేవారు. కానీ దీనికి లాల్ బహదూర్ శాస్త్రి అనుమతించేవారు కాదు. ఈ సమయంలోనే తమకు ఓ సొంత కారు ఉంటే బాగుంటుందని తమ పిల్లలు సూచించారు. పలు ఎంక్వయిరీలు చేసిన తర్వాత కొత్త ఫియాట్ కారు కొనాలని శాస్త్రి నిర్ణయించారు. ఆ రోజుల్లో ఒక ఫియట్ కారు 12,000 రూపాయలకు దొరికేది. కానీ ఆయన బ్యాంక్ ఖాతాలో కేవలం 7 వేల రూపాయిలు మాత్రమే ఉన్నాయని తెలిసింది. కారు కొనడానికి కావాల్సిన మిగతా మొత్తం అంటే 5 వేల రూపాయల కోసం శాస్త్రి బ్యాంకు రుణం తీసుకోవాలని నిర్ణయించారు. అలా 5వేల రూపాయల రుణం తీసుకుని పంజాబ్ నేషనల్ బ్యాంక్కు లాల్ బహదూర్ శాస్త్రి కస్టమర్ అయిపోయారు. ఇది జరిగిన ఒక సంవత్సరం తరువాత ఆ లోన్ తీర్చకముందే శాస్త్రి చనిపోయారు. ఆయన తరవాత ప్రధానమంత్రి అయిన ఇందిరా గాంధీ, ఆ లోన్ను మాఫీ చేయాలని ప్రభుత్వం తరఫున నిర్ణయించారు. కానీ శాస్త్రి భార్య లలితా శాస్త్రి దానికి ఎంతమాత్రం ఒప్పుకోలేదు. శాస్త్రి చనిపోయిన తర్వాత నాలుగేళ్లవరకు తనకొచ్చే పెన్షన్తో బ్యాంక్ రుణం మొత్తం తమ అమ్మ తీర్చేసినట్టు లాల్ బహదూర్ శాస్త్రి కొడుకు అనిల్ శాస్త్రి తెలిపారు. క్రీమ్ రంగులో 1964 మోడల్ అయిన ఈ ఫియాట్ ఎంతో ఆకర్షణీయంగా ఉండేదని తెలిపారు. ప్రస్తుతం ఈ కారు ఢిల్లీలోని మోతిలాల్ నెహ్రూ మార్గ్ 1లో లాల్ బహదూర్ శాస్త్రి మెమోరియల్లో ఉంది. ఎక్కడెక్కడి నుంచో ప్రజలు ఈ కారును, ఆయన స్మృతులను చూడటానికి వస్తుంటారు. "కారు కొనడానికి మా నాన్నగారి దగ్గర తగినంత డబ్బు లేదని తెలిశాక, కారు వద్దులెండి అని మేము చెప్పాం. కానీ ఆయన పంజాబ్ నేషనల్ బ్యాంకులో రుణం తీసుకుని మరీ కారును కొనుగోలు చేశారు" అని అనిల్ శాస్త్రి తెలిపారు. -
పీఎన్బీ స్కాంపై మౌనం వీడిన జైట్లీ
న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంకులో చోటుచేసుకున్న కుంభకోణంపై ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ మౌనం వీడారు. ఈ స్కాంపై తొలిసారి స్పందించారు. ఈ స్కాంలో ఆడిటర్లు, బ్యాంకర్లనే జైట్లీ నిందించారు. పీఎన్బీలో చోటుచేసుకున్న ఈ రూ.11,400 కోట్ల కుంభకోణానికి వీరే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ''నిర్ణయాలు తీసుకునే అధికారం బ్యాంకు మేనేజ్మెంట్కి ఉంటే, దాన్ని సమర్థవంతంగా, సరియైన పద్ధతిలో ఉపయోగించుకోవాలి. ఒకవేళ దానిలో ఏమైనా లోపాలు గుర్తిస్తే, దానికి వారే బాధ్యత వహించాలి'' అని జైట్లీ ఏడీఎఫ్ఐఏపీ వార్షిక సమావేశంలో అన్నారు. ఆడిటర్లు ఏం చేస్తున్నారు? అంతర్గత, బహిర్గత ఆడిటర్లు దీన్ని గుర్తించడం విఫలమైతే, సీఏ నిపుణులు గురించి తీవ్రంగా ఆలోచించాల్సి ఉందని భావిస్తున్నా అని పేర్కొన్నారు. బ్యాంకుల నిర్వహణపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. బ్యాంకుల సిస్టమ్ నమ్మకం, రుణగ్రహీత, రుణదాత రిలేషన్షిప్పై ఆధారపడి ఉంటుందన్నారు. కాగ, పీఎన్బీలో నీరవ్ మోదీ, మెహుల్ చౌక్సి రూ.11,400 కోట్ల కుంభకోణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ స్కాం వెలుగులోకి వచ్చాక, ఈడీ, సీబీఐ వీరి సంస్థలపై భారీ ఎత్తున్న తనిఖీలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ మోసంలో 120 షెల్ కంపెనీలు పాలుపంచుకున్నట్టు ఈడీ ఆరోపిస్తోంది. వీటిలో 80 కంపెనీలు నీరవ్ మోదీ, చౌక్సి రన్ చేస్తున్నట్టు పేర్కొంది. ఈ కేసులో భాగమైన మెహుల్ చౌక్సి ప్రమోటర్గా ఉన్న గీతాంజలి జెమ్స్, దాని అసోసియేటెడ్ సంస్థలపై ఐటీ కూడా దాడులు చేసింది. ముంబై, పుణే, సూరత్, హైదరాబాద్, బెంగళూరు వంటి పలు నగరాల్లో ఉన్న కంపెనీల్లో కూడా తనిఖీలు నిర్వహిస్తోంది. -
పీఎన్బీ స్కాం : రోడ్డున పడబోతున్న ఉద్యోగులు
పంజాబ్ నేషనల్ బ్యాంకులో చోటుచేసుకున్న భారీ కుంభకోణం గీతాంజలి జెమ్స్ ఉద్యోగులకు ఎసరు తెచ్చి పెట్టింది. నీరవ్ మోదీ అంకుల్ మెహుల్ చౌక్సికి చెందిన ఈ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులను రిలీవింగ్ లెటర్లు తీసుకోవాలంటూ గీతాంజలి జెమ్స్ కోరింది. ఈ నేపథ్యంలో గీతాంజలి జెమ్స్ను మూసివేసే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలుస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంకులో పాల్పడిన రూ.11,400 కోట్ల కుంభకోణంలో నీరవ్ మోదీ, ఆయన అంకుల్ మెహుల్ చౌక్సిలు ప్రధాన పాత్రదారులుగా ఉన్నారు. ఈ స్కాం వెలుగులోకి రాకముందే నీరవ్ మోదీ, చౌక్సి దేశం విడిచి పారిపోయారు. అయితే పీఎన్బీ మోసంలో చౌక్సి ప్రమేయాన్ని గీతాంజలి జెమ్స్ ఖండిస్తోంది. చౌక్సికి వ్యతిరేకంగా వస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నట్టు రెగ్యులేటరీ ఫైలింగ్లో పేర్కొంది. మోదీకి వ్యతిరేకంగా వస్తున్న ఆరోపణలు కూడా తప్పుడువేనంటూ నీరవ్ మోదీ న్యాయవాది విజయ్ అగర్వాల్ పేర్కొంటున్నారు. ''ఎవరూ దీన్ని హేతుబద్ధంగా చూడటం లేదు. అన్ని కేసుల్లో ఇదే జరుగుతుంది. బోఫోర్స్ కేసులో, 2జీ కేసులో, బొగ్గు కుంభకోణం కేసులో ఇదే జరిగింది. ఈ కేసులో కూడా ఇదే జరుగుతుంది. ఎవరూ దీన్ని హేతుబద్ధంగా చూడరు'' అని అగర్వాల్ అన్నారు. -
2016లోనే బ్యాంకులకు ఆర్బీఐ వార్నింగ్
పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో ప్రధాన లోపం స్విఫ్ట్ సిస్టమ్. ఈ సిస్టమ్ ద్వారానే వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ రూ.11,400 కోట్ల స్కాంకు పాల్పడ్డారు. అయితే ఎంతో జాగ్రత్తతో ఉండాల్సిన ఈ స్విఫ్ట్ సిస్టమ్పై బ్యాంకు అధికారులు ఎందుకింత నిర్లక్ష్యంగా వహించారంటే సమాధానమే ఉండదు. అయితే స్విఫ్ట్ ఇంటర్బ్యాంకు నెట్వర్క్లో లోపాలున్నాయని, వాటిని దుర్వినియోగ పరుస్తున్నట్టు పీఎన్బీ స్కాం బయటకి రాకముందు రెండేళ్ల క్రితమే రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా, బ్యాంకులకు హెచ్చరికలు జారీచేసింది. స్విఫ్ట్ ఇంటర్బ్యాంక్ నెట్వర్క్ ద్వారా నిధులను అనధికారికంగా బదిలీ చేస్తున్నారని సెంట్రల్ బ్యాంకు 2016 ఆగస్టులోనే వార్నింగ్ ఇచ్చింది. సైబర్ సెక్యురిటీ ఫ్రేమ్వర్క్ను బ్యాంకులు ఏర్పాటుచేయాలని ఆర్బీఐ సర్క్యూలర్ జారీచేసింది. కరెస్పాండెంట్ బ్యాంకులకు పంపించే పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ కంట్రోల్స్ను బలోపేతం చేయాలని పేర్కొంది. హానికరమైన సాఫ్ట్వేర్ స్క్రిప్ట్/కార్యకలాపాలు ఏమైనా జరుగుతున్నాయో గుర్తించడం కోసం స్విఫ్ట్ ఇన్ఫ్రాక్ట్రక్చర్ను వెంటనే సమగ్రంగా ఆడిట్ చేయాలని సర్క్యూలర్లో తెలిపింది. ఏమైనా హానికరమైన వాటివి గుర్తిస్తే, వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించింది. కానీ బ్యాంకులు మాత్రం ఈ హెచ్చరికలపై నిర్లక్ష్యం వహించాయి. ఈ నిర్లక్ష్యానికి ప్రతిఫలమే పీఎన్బీలో జరిగిన రూ.11,400 కోట్ల కుంభకోణం. నీరవ్ మోదీ, ముంబై బ్రాంచులోని ఇద్దరు బ్యాంకు అధికారులు కలిసి నకిలీ ఎల్ఓయూలతో విదేశీ బ్యాంకుల నుంచి రుణం పొందారు. ఈ ఎల్ఓయూలను పంపించడం, తెరవడం, మార్పులు చేయడం వంటి పనులన్నీ ఈ స్విఫ్ట్ సిస్టమ్ ద్వారానే జరుగుతాయి. ఈ సిస్టమ్ ద్వారా ఏదైనా బ్యాంకుకు సందేశం అందినప్పుడు, విదేశీ బ్యాంకు దీనిని అధికారికమైన, కచ్చితమైన సందేశంగా భావిస్తుంది. దీనిని అనుమానించదు. స్విఫ్ట్ సిస్టమ్ను ఉపయోగించుకుని, నకిలీ ఎల్ఓయూలతో నీరవ్మోదీ ఈ భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. పైగా పీఎన్బీ స్విఫ్ట్ సిస్టమ్, కోర్ బ్యాంకింగ్లో లింక్ అయి లేదు. దీంతో స్కాం గుర్తించడం చాలా కష్టతరమైంది. -
స్కాం అనంతరం పీఎన్బీకి మరో షాక్
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో ప్రభుత్వ రంగ రెండో అతిపెద్ద బ్యాంకుగా పేరొందిన పంజాబ్ నేషనల్ బ్యాంకుకు మరో షాక్ ఎదురైంది. రూ.11,400 కోట్ల కుంభకోణ నేపథ్యంలో పీఎన్బీ రేటింగ్ను నెగిటివ్లోకి మారుస్తున్నట్టు రేటింగ్ ఏజెన్సీ ఫిచ్, రేటింగ్ను డౌన్గ్రేడ్ చేస్తున్నట్టు మరో ఏజెన్సీ మూడీస్ ప్రకటించాయి. బ్యాంకింగ్ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణం పీఎన్బీలో చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. సెలబ్రిటీల డైమాండ్ కింగ్ నీరవ్మోదీ ఈ మోసానికి పాల్పడ్డారు. అంతర్గతంగా, బహిర్గతంగా బ్యాంకు రిస్క్ కంట్రోల్స్పై ఈ మోసం పలు అనుమానాలకు తావిస్తుందని, గత కొన్నేళ్లుగా ఈ కుంభకోణం జరుగుతున్నప్పటికీ, ఎవరూ గుర్తించకపోవడం నిర్వహణ పర్యవేక్షణ నాణ్యతా లోపాన్ని ఎత్తిచూపుతుందని ఫిచ్ తెలిపింది. పీఎన్బీకి ప్రతికూల పరిశీలనలో 'బీబీ' వైబిలిటీ రేటింగ్ను ఇస్తున్నట్టు ఫిచ్ రేటింగ్స్ ప్రకటించింది. వైబిలిటీ రేటింగ్ ఫైనాన్సియల్ ఇన్స్టిట్యూషన్ క్రెడిట్ విలువను అంచనావేస్తుందని, ఇది సంస్థ విఫలమైనట్టు సూచిస్తుందని ఫిచ్ తెలిపింది. రేటింగ్ డౌన్గ్రేడ్లో ఉంచుతున్నట్టు తెలిపిన మూడీస్ కూడా... మోసపూరిత లావాదేవీలు చూపుతున్న ఆర్థిక ప్రభావం, బ్యాంకు క్యాపిటలైజేషన్ ప్రొఫైల్ మెరుగుపరచడానికి మేనేజ్మెంట్ తీసుకుంటున్న చర్యలు, బ్యాంకుపై రెగ్యులేటరీ తీసుకునే చర్యలు వంటి వాటిపై ఫోకస్ చేసినట్టు పేర్కొంది. ఈ మోసపూరిత లావాదేవీల ఫలితంగా బ్యాంకు లాభాలు తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లాయని ఏజెన్సీ తెలిపింది. అయితే అసలైన ప్రభావం సమయం, అవసరాలకు అనుగుణంగా వుంటుందని ఏజెన్సీ చెప్పింది. బ్యాంకు బేస్లైన్ క్రెడిట్ అసెస్మెంట్(బీసీఏ), అడ్జస్టెడ్ బీసీఏ బీఏ3గా, కౌంటర్పార్టీ రిస్క్ అసెస్మెంట్ రేటింగ్ బీఏఏ3(సీఆర్)/పీ-3(సీఆర్)ను డౌన్గ్రేడ్ రివ్యూలో ఉంచుతున్నట్టు మూడీస్ తెలిపింది. -
34 వేల దిగువకు సెన్సెక్స్
పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) కుంభకోణం ప్రకంపనలు సోమవారం స్టాక్ మార్కెట్ను నష్టాల పాలు చేశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 34 వేల పాయింట్లు, నిఫ్టీ 10,400 పాయింట్ల దిగువకు పడిపోయాయి. ఈ స్టాక్ సూచీలు వరుసగా రెండో ట్రేడింగ్ సెషన్లోనూ పతనమయ్యాయి. సెన్సెక్స్ 236 పాయింట్లు నష్టపోయి 33,775 పాయింట్ల వద్ద, నిఫ్టీ 74 పాయింట్ల నష్టంతో 10,378 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్కు ఇది రెండు నెలల కనిష్ట స్థాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఎగియడంతో ద్రవ్యలోటు మరింతగా పెరుగుతుందన్న భయాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీశాయి. సెన్సెక్స్ ఒక దశలో 112 పాయింట్లు లాభపడగా, మరో దశలో 456 పాయింట్లు నష్టపోయింది. మొత్తం మీద 568 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ఇంట్రాడేలో నిఫ్టీ 10,303 పాయింట్లకు పడిపోయింది. బ్యాంక్ షేర్లు బేర్.. పీఎన్బీ స్కామ్ ప్రభుత్వ రంగ బ్యాంక్ షేర్లపై బాగానే ప్రతికూల ప్రభావం చూపుతోంది. పలు ప్రభుత్వ రంగ బ్యాంక్ షేర్లు ఇంట్రాడేలో ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాంక్ షేర్లపై ఒత్తిడి కొనసాగుతుందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. ఈ తుఫాన్ చల్లబడేదాకా ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణి అవలంభిస్తారని వివరించారు. యూకో బ్యాంక్ 4.6 శాతం, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7 శాతం, అలహాబాద్ బ్యాంక్ 6.3 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా 5.4 శాతం, సిండికేట్ బ్యాంక్6.4 శాతం, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 6.7 శాతం, కార్పొరేషన్ బ్యాంక్ 3.1 శాతం, ఎస్బీఐ 1.5 శాతం, ఫెడరల్ బ్యాంక్ 2.6 శాతం, ఇండస్ఇండ్ బ్యాంక్ 1.6 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 0.3 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 0.2 శాతం చొప్పున నష్టపోయాయి. 4 రోజుల్లో 10 వేల కోట్లు ఆవిరి.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ పతనం వరుసగా నాలుగో ట్రేడింగ్ సెషన్లోనూ కొనసాగింది. సోమవారం ఈ షేర్ 7.3 శాతం క్షీణించి రూ.116 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 10 శాతం నష్టపోయి తాజా ఏడాది కనిష్ట స్థాయి, రూ.114ను తాకింది. గత నాలుగు ట్రేడింగ్ సెషన్లలో ఈ షేర్ 28 శాతం క్షీణించింది. ఈ నాలుగు రోజుల్లో రూ.10,975 కోట్ల మార్కెట్ క్యాప్ ఆవిరైంది. భూషణ్ స్టీల్ రేసులో ముందు వరుసలో ఉందన్న వార్తల నేపథ్యంలో టాటా స్టీల్ షేర్ 5.8 శాతం నష్టపోయింది. సెన్సెక్స్లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. -
పీఎన్బీ స్కాం : ప్రధాని కీలక ఆదేశాలు
ముంబై : పంజాబ్ నేషనల్ బ్యాంకు-నీరవ్ మోదీ కుంభకోణం కేసులో ప్రధానమంత్రి నరేంద్రమోదీ కీలక ఆదేశాలు జారీచేశారు. దాదాపు రూ.11,400 కోట్ల కుంభకోణానికి పాల్పడిన వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆర్థిక, న్యాయ మంత్రిత్వ శాఖలకు నరేంద్రమోదీ ఆదేశించినట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. ఈ కేసును పరిష్కరించడం కోసం ప్రధానమంత్రి కార్యాలయంతో కలిసి ఆర్థిక మంత్రిత్వ శాఖ పనిచేస్తుందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ్ ప్రతాప్ శుక్లా చెప్పారు. ఈ మోసంలో ప్రధాన సూత్రదారుడైన నీరవ్ మోదీని కచ్చితంగా శిక్షించనున్నామని, ఆయనను భారత్ తిరిగి రప్పించడంపై ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తుందని పేర్కొన్నారు. ''ప్రధానమంత్రి ఆఫీసుతో ఆర్థికమంత్రిత్వ శాఖ చర్చిస్తుంది. పీఎంఓ ఏం నిర్ణయిస్తే, అదే ఆర్థిక మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది'' అని శుక్లా తెలిపారు. రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన పంజాబ్ నేషనల్ బ్యాంకులో ప్రముఖ వజ్రాల వ్యాపారి అయిన నీరవ్ మోదీ రూ.11,400 కోట్ల కుంభకోణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ కుంభకోణం వెలుగులోకి రాకముందే నీరవ్ మోదీ దేశం విడిచి పారిపోయాడు. ప్రస్తుతం ఆయన్ను తిరిగి వెనక్కి రప్పించడానికి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. అంతేకాక ఆయనకు చెందిన పలు ఆస్తులను, షోరూంలను, వజ్రాలను, బంగారాన్ని కూడా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు స్వాధీనం చేసుకున్నాయి. నేడు కుంభకోణం జరిగిన పీఎన్బీ ముంబై బ్రాంచును సైతం సీబీఐ సీజ్ చేసింది. నీరవ్ మోదీ ఫైర్స్టార్ డైమాండ్ కంపెనీకి చెందిన చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ విపుల్ అంబానీని సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. మూడు, నాలుగేళ్ల నుంచి విపుల్ అంబానీ ఈ స్థానంలో ఉన్నట్టు తెలిసింది. కుంభకోణంలో భాగమైన బ్యాంకు అధికారులు గోకుల్నాథ్ శెట్టి, మనోజ్ ఖాతర్, నీరవ్ మోదీ కంపెనీ సిగ్నేటర్ను కూడా సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గీతాంజలి గ్రూప్కు చెందిన 18 భారత్ ఆధారిత సబ్సిడరీల ఆర్థిక లావాదేవీలను సైతం పరిశీలిస్తున్నారు. -
గీతాంజలి వెబ్సైట్ షట్డౌన్
ముంబై : పీఎన్బీ-నీరవ్ మోదీ మోసపూరిత కేసులో భాగమైన గీతాంజలి గ్రూప్ వెబ్సైట్ షట్డౌన్ అయ్యింది. వెబ్సైట్ ఓపెన్ చేయగానే 'మెయింటన్స్ మోడ్'లో ఉన్నట్టు ఓ మెసేజ్ దర్శనిస్తోంది. '' ఈ అసౌకర్యానికి చింతిస్తున్నాం. ప్రస్తుతం తమ వెబ్సైట్ షెడ్యూల్ చేయబడిన నిర్వహణలో ఉంది. అర్థం చేసుకునందుకు ధన్యవాదాలు'' అనే మెసేజ్ ఈ వెబ్సైట్పై కనబడుతోంది. గతవారం చివరి వరకు ఈ వెబ్సైట్ మామూలుగానే పనిచేసింది. అయితే ఎప్పుడు ఈ వెబ్సైట్ పనిచేయడం ఆగిపోయిందో స్పష్టంగా తెలియరావడం లేదు. ప్రస్తుతం ఈ వెబ్సైట్ సీబీఐ, ఈడీ అధికారుల కనుసన్నల్లో ఉంది. గీతాంజలి గ్రూప్కు యజమాని మెహుల్ చౌక్సి. డైమాండ్ కింగ్ నీరవ్ మోదీకి ఈయన మేనమామ. రూ.11,400 కోట్ల పీఎన్బీ స్కాంకు పాల్పడిన వారిలో నీరవ్ మోదీతో పాటు మెహుల్ చౌక్సి కూడా ఉన్నారు. 2011లోనే ఈ స్కాం ప్రారంభమైనట్టు తెలిసింది. కానీ ఈ ఏడాది జనవరి మూడో వారంలో ఈ స్కాం వెలుగులోకి వచ్చింది. తమ బ్యాంకు ముంబై బ్రాంచులో భారీ ఎత్తున్న స్కాం జరుగుతున్నట్టు పీఎన్బీఐ ఉన్నతాధికారులు గుర్తించారు. అంతర్గత విచారణ జరిపిన అనంతరం సీబీఐకి, స్టాక్ ఎక్స్చేంజీలకు తెలిపారు. అయితే ఈ స్కాం బయటికి రాకముందే, కుంభకోణానికి పాల్పడిన నీరవ్మోదీ, మెహుల్ చౌక్సి విదేశాలకు చెక్కేశారు. -
ఆ స్కాంకు వారందరూ బలయ్యారు!
లక్నో : నీరవ్ మోదీ, మెహుల్ చౌక్సికి చెందిన డైమాండ్ సంస్థల వల్ల నష్టపోయింది కేవలం బ్యాంకుల మాత్రమేనా అంటే ? కాదని తెలిసింది. వీరు చేసిన మోసానికి కేవలం ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రమే కాక, 24 కంపెనీలు, 18 మంది వ్యాపారవేత్తలు బలైనట్టు వెల్లడైంది. వీరందరూ 2013 నుంచి 2017 మధ్యకాలంలో నీరవ్ మోదీ, చౌక్సి జువెల్లరీ బ్రాండులకు ఫ్రాంచైజీలు నిర్వహించారు. ఈ ఇద్దరు చేసిన మోసానికి తామందరం బలైనట్టు ఆర్థిక దివాలా కింద క్రిమినల్ ఫిర్యాదులు దాఖలు చేశారు. వీరందరూ ఢిల్లీ, ఆగ్రా, మీరుట్, బెంగళూరు, మైసూర్, కర్నల్, రాజస్తాన్, గుజరాత్ వంటి ప్రాంతాల్లో చౌక్సికి చెందిన గీతాంజలి జువెల్లరీ, గిలీ పేరుతో ఫ్రాంచైజీ షోరూంలు ఏర్పాటుచేశారు. ఫ్రాంచైజీల నుంచి రూ.3 కోట్ల నుంచి రూ.20 కోట్ల మధ్యలో సెక్యురిటీ డిపాజిట్లు తీసుకుని డైమాండ్ స్టాక్స్ను, విలువైన జెమ్స్ను చౌక్సి సంస్థలు వీరికి పంపేవి. వీటిలో చౌక్సి సంస్థలు క్రిమినల్ కుట్ర, మోసం, ఒప్పందాల ఉల్లంఘన వంటి వాటికి పాల్పడినట్టు వ్యాపారవేత్తలు, కంపెనీలు ఆరోపిస్తున్నాయి. నీరవ్ మోదీ, చౌక్సి సంస్థలపై ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేశాయి. కాగ, పంజాబ్ నేషనల్ బ్యాంకుకు దాదాపు రూ.11,400 కోట్లు నీరవ్ మోదీ, మెహుల్ చౌక్సి కన్నం వేసిన సంగతి తెలిసిందే. ఇన్ని కోట్ల మోసం చేసిన వీరు, పీఎన్బీ ఈ స్కాం బయటపెట్టే లోపలే దేశం విడిచి పారిపోయారు. ప్రస్తుతం వీరి డైమాండ్ సంస్థలను, జువెల్లరీ షోరూంలను, ప్రాపర్టీలను, ఆస్తులను సీబీఐ, ఈడీ సీజ్చేస్తోంది. అంతేకాక వీరిని పట్టుకోవడానికి తీవ్ర ఎత్తున ప్రయత్నిస్తోంది. తొలిసారి ఈ స్కాంను ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త వైభవ్ కురానియా బయటపెట్టారు. 2013లో చౌక్సి సంస్థల్లో ఈ మోసాన్ని ఆయన గుర్తించారు. రాజోరి గార్డెన్లో వైభవ్ ఓ రిటైల్స్టోర్ను ఏర్పాటుచేశారు. చౌక్సి సంస్థ గీతాంజలి పేమెంట్ తీసుకున్నప్పటికీ రూ.3 కోట్ల స్టాక్స్ను అతనికి పంపించకపోయే సరికి వైభవ్ తన రిటైల్ స్టోర్ను క్లోజ్ చేశారు. మార్కెట్ ధర తక్కువగా ఉన్నప్పటికీ, ఈ షోరూంలో ధర దానికి 3 నుంచి 4 సార్లు ఎక్కువగా ఉంటుందని తాజా ఎఫ్ఐఆర్లలో పేర్కొన్నారు. -
200 షెల్ కంపెనీలు, బినామీ ఆస్తులు
న్యూఢిల్లీ/ముంబై: వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, అతని వ్యాపార భాగస్వామి మెహుల్ చోక్సీలు పీఎన్బీని రూ. 11,400 కోట్లకు మోసగించిన కేసులో దర్యాప్తు సంస్థలు దాదాపు 200 షెల్(నకిలీ) కంపెనీలు, బినామీ ఆస్తుల్ని గుర్తించాయి. భారత్తో పాటు విదేశాల్లోని ఈ కంపెనీల ద్వారా అక్రమ లావాదేవీలు నెరపి.. స్థలాలు, బంగారం, విలువైన రాళ్ల రూపంలో బినామీ ఆస్తుల్ని కూడగట్టినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), ఐటీ శాఖలు నిర్ధారణకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈడీ, ఐటీ శాఖల అధికారులు బృందంగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మరోవైపు వరుసగా నాలుగోరోజైన ఆదివారం కూడా మోదీ, చోక్సీల ఆస్తులపై ఈడీ దాడులు కొనసాగించింది. దేశవ్యాప్తంగా 15 నగరాల్లోని 45 చోట్ల నగల దుకాణాలు, తయారీ కేంద్రాల్లో సోదాలు నిర్వహించి రూ. 20 కోట్ల మేర వజ్రాలు, బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. దాదాపు 24 స్థిరాస్తుల్ని గుర్తించి మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) కింద అటాచ్ చేసేందుకు సిద్ధమైంది. ఈ కేసులో ఈడీ రూ. 5,674 కోట్ల మేర వజ్రాలు, బంగారు ఆభరణాలు, ఇతర విలువైన రాళ్లు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ‘ఆదాయపు పన్ను శాఖ తాత్కాలికంగా అటాచ్ చేసిన 29 ఆస్తుల విలువను కూడా అంచనా వేస్తున్నాం. త్వరలో మరిన్ని ఆస్తుల్ని అటాచ్ చేస్తాం’ అని ఈడీ తెలిపింది. అందరికీ పర్సంటేజీలు.. మెహుల్ చోక్సీ ప్రమోటర్గా ఉన్న గీతాంజలి గ్రూప్ కంపెనీల అనుబంధ సంస్థల ఆస్తిఅప్పుల పట్టీని ఆదివారం తనిఖీ చేసిన సీబీఐ.. కస్టడీలో ఉన్న పీఎన్బీ ఉద్యోగులు గోకుల్ నాథ్ శెట్టి (రిటైర్డ్), మనోజ్ ఖారత్, నీరవ్ హామీదారు హేమంత్ భట్ను ప్రశ్నించింది. విచారణలో శెట్టి, ఖారత్లు పలు ఆసక్తికర అంశాల్ని వెల్లడించినట్లు సమాచారం. నీరవ్ , చోక్సీలకు ‘లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ (ఎల్ఓయూ), లెటర్ ఆఫ్ క్రెడిట్ల జారీ కోసం మంజూరు చేసిన మొత్తానికి అనుగుణంగా పర్సంటేజీలు వసూలు చేసేవారని, కుంభకోణంతో ప్రమేయమున్న అందరు అధికారులకు ఆ మొత్తాన్ని పంచేవారని తెలుస్తోంది. పీఎన్బీ కుంభకోణానికి కేంద్ర బిందువైన ముంబైలోని బ్రాడీ రోడ్డు బ్రాం చ్ను సీబీఐ దాదాపుగా తమ ఆధీనంలోకి తీసుకుని విస్తృతంగా తనిఖీలు నిర్వహించింది. సోమవారం కూడా తనిఖీలు కొనసాగుతాయని సీబీఐ అధికారులు వెల్లడించారు. ఈ కేసులో మరో ఆరుగురు వ్యక్తుల్ని విచారించిన దర్యాప్తు సంస్థ.. వారి పేర్లు చెప్పేందుకు నిరాకరించింది. వారిలో పలువురు బ్యాంకు అధికారులుండగా.. ఒకట్రెండు రోజుల్లో వారిని మరోసారి విచారించవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. బ్యాంకు సర్వర్ల నుంచి స్వా«ధీనం చేసుకున్న రికార్డుల్ని అధ్యయనం చేస్తున్నామని, క్విడ్ ప్రో కో కోణంలో కూడా దర్యాప్తు ఉంటుందని.. ప్రస్తుతం దృష్టంతా కేసును పూర్తిగా వెలికితీసి.. నిధులు ఎక్కడికి మళ్లాయో తెలుసుకోవడంపైనే ఉందని సీబీఐ వెల్లడించింది. శ్వేతపత్రం విడుదల చేయాలి: కాంగ్రెస్ దేశంలోని ఆర్థిక మోసగాళ్లతో బీజేపీ అగ్ర నాయకత్వానికి సంబంధాలున్నాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. గత ఐదేళ్లలో రూ. 61 వేల కోట్ల మేర బ్యాంకు కుంభకోణాలు చోటుచేసుకున్నట్లు ఆర్బీఐ వెల్లడించిందని, ఆ ఐదేళ్లలో నాలుగేళ్లు ఎన్డీఏనే అధికారంలో ఉందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ తివారీ ఢిల్లీలో పేర్కొన్నారు. ఆర్థిక మోసగాళ్లకు, బీజేపీ అగ్ర నాయకత్వానికి సంబంధాలు.. దేశ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర సందేహాల్ని రేకెత్తిస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే పార్లమెంటు సమావేశాల లోపు బ్యాంకింగ్ వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని, బ్యాంకుల నుంచి కోట్ల రుణాలు తీసుకొని మోసగించిన సంస్థలు, ప్రమోటర్లు, కార్పొరేట్ సంస్థల యజమానుల వివరాల్ని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు బయటపెట్టేలా కేంద్రం ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు. గత ఏడాది డిసెంబర్ 31 వరకు ఉన్న ఎన్పీఏలు(నిరర్ధక ఆస్తులు), బ్యాంకుల్ని మోసగించిన సంస్థల వివరాల్ని వెబ్సైట్లలో ప్రజలకు తెలిసేలా అన్ని బ్యాంకులు ఉంచాలన్నారు. కాంగ్రెస్ హయాంలోనే బ్యాంకు మోసాలకు బీజం పడిందంటున్న బీజేపీ గత నాలుగేళ్ల కాలంలో వాటిపై ఎందుకు విచారణ జరపలేదని ప్రశ్నించారు. దేశంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లో ఎన్పీఏల మొత్తం విలువ రూ. 8,36,782 కోట్లు కాగా.. ఈ విషయంలో ప్రపంచంలో భారత్ ఐదో స్థానంలో ఉందని, ఎన్పీఏల్లో కార్పొరేట్ కంపెనీల వాటా 77 శాతమని తివారీ తెలిపారు. రెండు నిమిషాలు కూడా మాట్లాడలేరా?: రాహుల్ పీఎన్బీ కుంభకోణంలో ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీలు నోరు విప్పాలని, తప్పు చేసిన వారిలా ప్రవర్తించవద్దని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సూచించారు. ‘పరీక్షల్లో ఎలా ఉత్తీర్ణులవ్వాలో విద్యార్థులకు ప్రధాని మోదీ రెండు గంటలు పాఠాలు చెప్పారు. అయితే రూ.22 వేల కోట్ల బ్యాంకింగ్ కుంభకోణంపై మాత్రం రెండు నిమిషాలు కూడా మాట్లాడరు. జైట్లీ దాక్కుంటున్నారు’ అని ట్వీటర్లో ఎద్దేవా చేశారు. -
అసలు పాపం వారిదే..నీరవ్ను వదిలిపెట్టం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వం రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకులో చోటు చేసుకున్న వేల కోట్ల కుంభకోణంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కేంద్ర ప్రభుత్వాన్ని రక్షించే పనిలో పడ్డారు. ప్రధానంగా కాంగ్రెస్ ఆరోపణల నేపథ్యంలో శనివారం ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. దావోస్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాపార వేత్తలతో దిగిన ఫోటోలో డైమండ్ వ్యాపారి నీరవ్మోదీ ఉండటంపై విమర్శలకు దిగిన కాంగ్రెస్కు కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. ఈ విషయంలో కాంగ్రెస్ అవాస్తవాలు చెబుతోందన్నారు. గీతాంజలి ఆభరణాల ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొన్నవిషయాన్నిగుర్తు చేసిన ఆమె రాహుల్పై తన దాడిని ఎక్కుపెట్టారు. ఈ స్కాంలో అసలు పాపం అంతా కాంగ్రెస్దేనని, దాన్ని కప్పిపుచ్చుకోడానికే బీజేపీపై ఎదురు దాడిచేస్తున్నారని దుయ్యబట్టారు. ముఖ్యంగా కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వి భార్యకు భార్య అనితా సింగ్కు నీరవ్ మోదీకి చెందిన కంపెనీలో షేర్లు ఉన్నాయని కేంద్రమంత్రి ఆరోపించారు. నీరవ్ మోదీ కంపెనీలలో ఒకటైన ఫైర్స్టార్ డైమండ్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ కు అనితా సింఘ్వి ,(కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ మను సింఘ్వి భార్య) , కుమారుడు అవిష్కార్ సింఘ్వి డైరెక్టర్లుగా ఉన్న అద్వైతా హోల్డింగ్స్ ప్రెవేట్ లిమిటెడ్ హోల్డింగ్స్ స్థలాన్ని 2002 నుంచి అద్దెకు ఇచ్చారని, రెండు కంపెనీల మధ్య రుణ లావాదేవీలు జరిగాయని పేర్కొన్నారు. ఇందులో ప్రమోటర్లుగా కాంగ్రెస్వారే లబ్ధి దారులుగా ఉన్నారని ఆరోపించారు. వారసత్వ, వారసత్వ ఆస్తులు అన్నీ కాంగ్రెస్ పార్టీకి చెందినవని ఆమె ఆరోపించారు. అలాగే మనీలాండరింగ్ కేసులో నిందితుడుగా ఉన్న నీరవ్ మోదీ దేశం విడిచిపారిపోయినా, పట్టుకుని తీరతామన్నారు.ఆయన్ను అరెస్టు చేసేందుకవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నీరవ్ మోదీ సహా అవినీతి, కుంభకోణాలకు పాల్పడిన వారిని కాపాడే ఉద్దేశం మోదీ ప్రభుత్వానికి లేదన్నారు. కుంభకోణాలకు పాల్పడిన క్షమించే ప్రసక్తే లేదనీ, శిక్షించి తీరుతామన్నారు. -
అసత్యాలు ప్రచారం చేస్తే.. డిఫమేషన్ వేస్తా
సాక్షి, న్యూఢిల్లీ: సంచలనం రేపిన పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) స్కాం నేపథ్యంలో బీజీపీ, కాంగ్రెస్ మాటల యుద్ధం మరింత ముదురుతోంది. యూపీఏ హయాంలోనే జరిగిందనీ ఈ ఉంభకోణం బీజేపీ వాదిస్తుండగా, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి బీజీపీ వత్తాసు వుందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అయితే కేంద్రమంత్రి నిర్మాలా సీతారామన్ తాజా వ్యాఖ్యలపై సీనియర్ కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వి మండిపడ్డారు. ముఖ్యంగా పీఎన్బీ మెగా స్కాంలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్ మోదీ కంపెనీలో తన కుటుంబీకులకు షేర్లు ఉన్నాయన్నఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. నిరాధార ఆరోపణలు చేసిన రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్పై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. అంతేకాదు నిర్మలా సీతారామన్ చేసిన నిరాధార ఆరోపణలను ప్రచురించే అన్ని మీడియా సంస్థలపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. వ్యక్తిగతంగా తనకు గానీ, తనభార్య, కుమారుడికిగానీ గీతాంజలి,నీరవ్ మోదీతో ఎలాంటి సంబంధాలు లేవనీ, నిరాధారమైన, అవాస్తవమైన ఆరోపణలు పౌర , క్రిమినల్ సహా అన్ని చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తన భార్య, కుమారుడు డైరెక్టర్లుగా ఉన్న కంపెనీకి చెందిన స్థలంలో అయిదేళ్ల క్రితం నీరవ్ మోదీకి చెందిన కంపెనీ అద్దెకు తీసుకున్నారనీ, ఈ ఒప్పందం 2017 డిసెంబరుతోనే ముగిసిపోయినట్టు చెప్పుకొచ్చారు. కాగా కాంగ్రెస్ అభిషేక్ మను సింఘ్వి భార్యకు నీరవ్ మోదీకి చెందిన ఫైర్ స్టార్ డైమండ్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్లో షేర్లు ఉన్నాయంటూ నిర్మలా సీతారామన్ శనివారం తీవ్ర ఆరోపణలు చేశారు. -
గాంధీ, నెహ్రూల ఖాతాలున్న బ్యాంక్కే కన్నం..
సాక్షి, న్యూఢిల్లీ : ఎంతో ఘన చరిత్ర కలిగిన ‘పంజాబ్ నేషనల్ బ్యాంక్’ పరువు ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ కారణంగా నేడు నీట మునిగింది. దాదాపు 123 ఏళ్ల క్రితం, అంటే భారత్కు స్వాతంత్య్రం రాకముందే 1895లో పాకిస్థాన్లోని లాహోర్ కేంద్రంగా ఈ బ్యాంక్ ఆవిర్భవించింది. ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు లాలా లజ్పతి రాయ్ ఈ బ్యాంకును ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఆర్యసమాజ్ సభ్యుడైన ఓ మిత్రుడు ఇచ్చిన సలహా మేరకు ‘ఇండియన్ మనీ, ఇండియన్ మెన్’ అనే నినాదంతో ఈ బ్యాంకు ఏర్పాటుకు రాయ్ కృషి చేశారు. 1894, మే నెలలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ వ్యవస్థాపక బాడీ ఏర్పాటయింది. అప్పటికీ పంజాబ్ పారిశ్రామికవేత్తల్లో ఒకరైన లాలా హరికిషన్ లాల్, ‘ది ట్రిబ్యున్’ ఆంగ్ల దినపత్రిక వ్యవస్థాపక సభ్యుడు దయాల్ సింగ్ మజీతియాలు ఆ బాడీలో ఉన్నారు. రెండు లక్షల రూపాయల పెట్టుబడి, 20 వేల రూపాయల మూలధనం పెట్టుబడితో 1895లో బ్యాంక్ మొదటి బ్రాంచి ప్రారంభమైంది. బ్యాంకులో తొలి ఖాతాను లాలా లజ్పతి రాయ్ తెరిచారు. ఆ తర్వాత భారత తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ, జాతిపిత మహాత్మా గాంధీలు కూడా ఇందులో ఖాతాదారులయ్యారు. అనతి కాలంలోనే ఈ బ్యాంకు అనేక బ్రాంచీలుగా విస్తరించినప్పటికీ 1929లో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఆర్థిక సంక్షోభం వల్ల ఈ బ్యాంకు కూడా దిబ్బతిన్నది. ఏకంగా 92 బ్రాంచీలను మూసుకోవాల్సి వచ్చింది. దేశ విభజనకు కొన్ని నెలల ముందు బ్యాంక్ తన ప్రధాన కార్యాలయాన్ని పాకిస్థాన్లోని లాహోర్ నుంచి న్యూఢిల్లీకి మార్చుకుంది. దేశ విభజన సందర్భంగా మొత్తం డిపాజిట్లలో 40 శాతం డిపాజిట్లను కోల్పోవాల్సి వచ్చింది. బ్యాంకును ఏర్పాటు చేసిన తొలి 60 ఏళ్ల కాలంలోనే పంజాబ్ నేషనల్ బ్యాంక్ దేశవ్యాప్తంగా 270 బ్రాంచీలను ఏర్పాటు చేయగలిగింది. 1950, 1960 దశకంలో భారత్ బ్యాంక్, ఇండో కమర్షియల్ బ్యాంకులను కలుపుకొని మరింత బలపడింది. 1969లో అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ఈ బ్యాంక్తోపాటు దేశంలోని మరో 13 బ్యాంకులను జాతీయం చేశారు. అప్పటికే బ్యాంక్ 70 శాతం భారత ఖాతాదారుల డిపాజిట్లతో కళకళలాడుతోంది. ప్రస్తుతం ఈ బ్యాంకుకు దేశవ్యాప్తంగా ఏడువేల బ్రాంచ్లున్నాయి. ప్రపంచంలో అతిపెద్ద ప్రభుత్వం కంపెనీల్లో ఒకటిగా ఫోర్బ్స్ జాబితాలో కూడా చోటు సంపాదించుకుంది. 2010 నుంచి 2015 మధ్య పంజాబ్ నేషనల్ బ్యాంక్తోపాటు దేశంలోని పలు ప్రభుత్వ బ్యాంకులు తీవ్రంగా నష్టపోయాయి. అవినీతికి అలవాటుపడిన అధికారులు అడ్డగోలుగా వేల కోట్ల రూపాయలు రుణాలు ఇవ్వడంతో వడ్డీలు పడిపోయి నిరర్థక ఆస్తులు పెరిగిపోయాయి. దీన్ని అరికట్టడం కోసమే భారతీయ రిజర్వ్ బ్యాంక్ 2015, డిసెంబర్ నెలలో కఠిన నియమ, నిబంధనలను ప్రకటించింది. 2016 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ బ్యాంక్ నిరర్థక ఆస్తులు 55,800 కోట్ల రూపాయలకు చేరుకుంది. పైగా అదే సంవత్సరానికి 3,974 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. భారతీయ బ్యాంకుల చరిత్రలోనే ఇంతటి నష్టం ఏర్పడడం ఇదే మొదటిసారి. 2017 ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్కు చెందిన 9వేల కోట్ల మొండి బకాయిలను రద్దు చేశారు. 2018, మార్చి నెల నాటికి 5,473 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో బ్యాంకు కోలుకుంటుందని భావిస్తున్న సమయంలో నీరవ్ మోదీ కుంభకోణం వెలుగుచూసింది. -
పీఎన్బీ స్కాం కీలక వ్యక్తులు అరెస్ట్
ముంబై : పంజాబ్ నేషనల్ బ్యాంకు భారీ కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన బ్యాంకు అధికారులను సీబీఐ అదుపులోకి తీసుకుంది. ప్రధాన సూత్రదారుడు, ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్మోదీకి సహకరించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పటి పీఎన్బీ డిప్యూటీ మేనేజర్ గోకుల్ నాధ్ శెట్టిని, పీఎన్బీ ఎస్డబ్ల్యూఓ మనోజ్ ఖారత్ను, నీరవ్ మోదీ గ్రూప్ సంస్థలకు అధికారిక సంతకందారు హేమంత్ భట్ను సీబీఐ అరెస్ట్చేసింది. ఎటువంటి రుణ పరిమితి లేకుండా లేదా నగదు మార్జిన్ లేకుండానే 'లెటర్స్ ఆఫ్ అండర్ టేకింగ్' (ఎల్ఒయు) పొందేందుకు గోకుల్ నాథ్ శెట్టి, మనోజ్ ఖారత్, హేమంత్ భట్లతో కలిసి నీరవ్మోదీ ఈ కుట్రకు పాల్పడ్డారని పీఎన్బీ తన ఫిర్యాదులో పేర్కొన్న సంగతి తెలిసిందే. వీరిని నేడు ముంబైలోని సీబీఐ స్పెషల్ కోర్టు ముందు హాజరుపరచనున్నారు. కాగ, నీరవ్ మోదీకి గోకుల్ నాథ్ శెట్టి అత్యంత సన్నిహితుడిగా ఉండేవాడని తెలుస్తోంది. ఈ క్రమంలో ముంబైలోని ఆయన నివాసంలో కూడా సీబీఐ సోదాలు నిర్వహించింది. ఈ స్కాంలో గోకుల్ శెట్టిని సహ నిందితుడిగా బ్యాంకు పేర్కొంది. దాదాపు రూ.11,400 కోట్ల కుంభకోణానికి పాల్పడిన నీరవ్ మోదీ ప్రస్తుతం విదేశాల్లో దాక్కున్నట్టు తెలుస్తోంది. ఈ కుంభకోణం బయటపడుతుందనే సమయంలోనే అంటే జనవరి 1నే నీరవ్ విదేశాలకు చెక్కేశాడు. ఆయన ప్రస్తుతం న్యూయార్క్లోని జేడబ్ల్యూ మారియట్స్ ఎస్సెక్స్ హౌజ్లో ఉన్నట్టు సమాచారం. నీరవ్ మోదీని పట్టుకోవడం కోసం సీబీఐ, ఈడీ అధికారులు వేట కొనసాగించారు. ఆయన్ను పట్టుకునేందుకు భారత్ ఇంటర్పోల్ సహాయం కోరింది. మరోవైపు పీఎన్బీలో స్కాం దెబ్బకు బ్యాంకులు విలవిలలాడుతున్నాయి. వేలకోట్ల రూపాయల్లో బ్యాంకులు భారీగా రుణాలు ఇచ్చాయి. దీంతో ఆ బ్యాంకులు తలలు పట్టుకుంటున్నాయి. -
వేల కోట్ల డబ్బు ఎవరికి చేరింది?
ముంబై : పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేల కోట్ల రూపాయల్లో కన్నం వేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ఆ నగదును విదేశాలకు తరలించినట్టు తెలిసింది. పీఎన్బీ నగదును అక్రమంగా విదేశీ కంపెనీలకు చెల్లించి, డైమాండ్ వ్యాపారాల్లో నీరవ్ మోదీ భారీ మొత్తంలో లబ్ది పొందారు. అయితే ఆ డబ్బు ఎవరికి వెళ్లింది? ఎవరూ ఈ అక్రమ నగదును సొంతం చేసుకున్నారు? అని సర్వత్రా చర్చనీయాంశమైంది. ఔరా జెమ్ కంపెనీ, సినో ట్రేడర్స్ కంపెనీ, యునిటీ ట్రేడింగ్, సన్షైన్ జెమ్స్, ట్రై కలర్ జెమ్స్, పసిఫిక్ డైమాండ్ విదేశీ కంపెనీలు ఈ నగదును పొందినట్టు తెలిసింది. గత ఏడేళ్లుగా పీఎన్బీ, ఇచ్చిన ఉత్తర్వులపై భారతీయ బ్యాంకులు ఈ కంపెనీలకు డబ్బులు చెల్లించినట్టు ఉంది. ఈ కంపెనీల పేర్లు పీఎన్బీ, సీబీఐకి దాఖలు చేసిన ఫిర్యాదులో వెల్లడయ్యాయి. అయితే ఈ నగదును ఎలా వాడారన్నది మిస్టరీగానే ఉంది. పసిఫిక్ డైమాండ్స్ ఎఫ్జడ్ఈ, యూనిటీ ట్రేడింగ్ ఎఫ్జడ్ఈ, ట్రై కలర్ జెమ్స్ ఎఫ్జడ్ఈ ఈ మూడు యూనిటెడ్ అరబ్ ఎమిరేట్స్కు చెందినవి కాగ, సన్షైన్ జెమ్స్, సినో ట్రేడర్స్ హాంకాంగ్ చెందినవిగా తెలుస్తోంది. ఔరా జెమ్ ఏ దేశ కంపెనీనో ఇంకా తెలియలేదు. తమ విదేశీ కార్యాలయాలు, ఈ కంపెనీల క్రెడిబిలీటిని పరీక్షిస్తున్నాయని, 2010 నుంచి ఇప్పటివరకు జరిగిన లావాదేవీలపై ఆరా తీస్తున్నట్టు సీనియర్ కౌంటర్పార్టీ బ్యాంకర్ చెప్పారు. వారం తర్వాత ఈ కంపెనీలపై ఓ నివేదిక వస్తుందని, ఆ సమాచారం మేరకు అంతర్గత విచారణ కూడా చేపడతామని పేర్కొన్నారు. బాహ్యాంగా కన్సల్టెంట్ను ఏర్పాటుచేయాలా? లేదా? అన్నది ఇంకా నిర్ణయించాల్సి ఉందన్నారు. నీరవ్ మోదీ, మెహల్ చౌక్సి గీతాంజలి జెమ్స్ కంపెనీలతో సంబంధాలున్న మరికొన్ని కంపెనీలను కూడా ఇన్వెస్టిగేటర్లు, బ్యాంకర్లు అనుమానస్పంద కంపెనీలుగా భావిస్తున్నారు. మొత్తం 150 లెటర్స్ ఆఫ్ అండర్టేకింగ్స్ ద్వారా నీరవ్ మోదీ పీఎన్బీకి రూ.11,400 కోట్లు కన్నం వేశారు. పీఎన్బీ ఉద్యోగులు బ్యాంకు ఉన్నతాధికారులకు తెలియకుండా ఈ మోసానికి పాల్పడ్డారు. -
నీరవ్, చోక్సీల పాస్పోర్టులు రద్దు
న్యూఢిల్లీ: వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, అతని కుటుంబ సభ్యులు పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ)ను రూ. 11,400 కోట్ల మేర మోసగించిన కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థలు శుక్రవారం తనిఖీలు కొనసాగించాయి. ఈ దాడుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రూ. 549 కోట్ల విలువైన ఆభరణాల్ని స్వాధీనం చేసుకుంది. ఈడీ సలహా మేరకు నీరవ్, చోక్సీల పాస్పోర్టుల్ని విదేశాంగ శాఖ 4 వారాల పాటు రద్దు చేసింది. వారంలోగా తమ ముందు హాజరుకావాలని ఆదేశిస్తూ వారిద్దరికీ మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) కింద ఈడీ సమన్లు జారీ చేసింది. నీరవ్, చోక్సీలు దేశం విడిచి పారిపోవడంతో.. ఆ ఇద్దరి కంపెనీల డైరెక్టర్లకు నోటీసులను పంపింది. నీరవ్ మోదీ తన పేరు మీదే నగల దుకాణాల్ని నిర్వహిస్తుండగా, గీతాంజలి జెమ్స్కు చోక్సీ ప్రమోటర్గా ఉన్నారు. మరోవైపు శుక్రవారం ఈడీ ముంబై, ఢిల్లీ, సూరత్, హైదరాబాద్, జైపూర్ సహా పలు ప్రాంతాల్లో తనిఖీల్ని కొనసాగించగా, సీబీఐ దేశ వ్యాప్తంగా 6 నగరాల్లోని 26 ప్రాంతాల్లో దాడులు చేసింది. నీరవ్ మోదీ కేసులో గురువారం రూ. 5,100 కోట్ల విలువైన వజ్రాలు, విలువైన రాళ్లు, బంగారం స్వాధీనం చేసుకున్న ఈడీ.. వాటి విలువను అంచనావేసే పనిలో ఉంది. రూ. 4,886 కోట్ల నష్టం ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ పీఎన్బీ ఫిర్యాదు మేరకు నీరవ్ మోదీ మామ, గీతాంజలి గ్రూపు ప్రమోటర్ మెహుల్ చోక్సీపై సీబీఐ తాజాగా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఫిబ్రవరి 13 నాటి ఫిర్యాదు ఆధారంగా ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. 2017–18లో చోక్సీ కంపెనీకి చెందిన గీతాంజలి జెమ్స్, నక్షత్ర, గిలి కంపెనీలు 143 ఎల్వోయూ(లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్)లతో రూ. 4,886 కోట్ల నష్టం కలిగించారని ఎఫ్ఐఆర్లో సీబీఐ పేర్కొంది. ముంబై, పుణే, సూరత్, జైపూర్, హైదరాబాద్, కోయంబత్తూర్లోని గీతాంజలి గ్రూపు దుకాణాలు, కార్యాలయాల్లో సీబీఐ తనిఖీలు చేపట్టింది. ‘మెహుల్ చోక్సీకి చెందిన గీతాంజలి గ్రూపు కార్యాలయాలు, ఎఫ్ఐఆర్లోని కంపెనీలకు చెందిన ఇతర డైరెక్టర్లకు చెందిన కార్యాలయాలు, ఇళ్లలో తనిఖీలు చేశాం’ అని సీబీఐ ప్రతినిధి చెప్పారు. నీరవ్, చోక్సీలు ఎక్కడున్నారో తెలుసుకునేందుకు డిఫ్యూజన్ నోటీసు జారీ చేయాలని ఇంటర్పోల్ను సీబీఐ కోరింది. మరోవైపు చోక్సీతో పాటు ఇతరులపై మనీ ల్యాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ... నీరవ్కు చెందిన విదేశీ దుకాణాల్లో లావాదేవీలు జరగకుండా నిషేధించింది. న్యూయార్క్లో నీరవ్? నీరవ్ మోదీ, అతని వ్యాపార భాగస్వామి మెహుల్ చోక్సీల పాస్పోర్టుల్ని విదేశాంగ శాఖ తాత్కాలికంగా నాలుగు వారాల పాటు రద్దు చేసింది. పాస్పోర్టుల్ని ఎందుకు రద్దు చేయకూడదో సమాధానం చెప్పేందుకు వారిద్దరికీ వారం గడువు నిచ్చామని ఆ శాఖ తెలిపింది. గడువులోగా వారు స్పందించకపోతే పాస్పోర్టుల్ని పూర్తిగా రద్దు చేస్తామని స్పష్టం చేసింది. ప్రస్తుతం నీరవ్ న్యూయార్క్లో ఉన్నాడంటూ వార్తలొచ్చినా, అతను ఎక్కడున్నాడో తెలియదని విదేశాంగ శాఖ పేర్కొంది. మరో 8 మంది పీఎన్బీ అధికారులపై వేటు ఈ కేసుతో ప్రమేయమున్న మరో 8 మంది అధికారుల్ని పీఎన్బీ శుక్రవారం సస్పెండ్ చేసింది. వీరిలో జనరల్ మేనేజర్ స్థాయి అధికారి కూడా ఉన్నారని సీనియర్ ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు. బుధవారం 10 మంది అధికారుల్ని పీఎన్బీ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇతర బ్యాంకులకు మార్చి 31లోపు బకాయిల్ని పీఎన్బీ చెల్లిస్తుందని, అంతర్గత వనరుల నుంచి ఆ బ్యాంకు నిధుల్ని సమకూర్చుకుంటుందని ఆ అధికారి తెలిపారు. ట్విటర్ వేదికగా మోదీపై రాహుల్ వ్యంగ్యాస్త్రాలు ప్రధాని మోదీపైనా, కేంద్ర ప్రభుత్వం పైనా కాంగ్రెస్ విమర్శల పర్వం కొనసాగించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విటర్లో స్పందిస్తూ.. ‘మోసగాడి పలాయన సూత్రం.. ల(మో) + నీ(మో)––– న(మో)తో–––> భా(గో)’ అంటూ "# ModiRobsIndia హ్యాష్ట్యాగ్తో ట్వీట్ చేశారు. ‘లలిత్ మోదీ, నీరవ్ మోదీ... నరేంద్ర మోదీతో పారిపోవడం’ అని అర్థం వచ్చేలా ఈ ట్వీట్ ఉంది. యూపీఏ కుంభకోణాన్ని బయటపెట్టాం: బీజేపీ యూపీఏ హయాంలో జరిగిన పీఎన్బీ కుంభకోణాన్ని బీజేపీ ప్రభుత్వం బయటపెట్టిందని బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. 2013 సెప్టెంబర్ 13వ తేదీన ఢిల్లీలోని నీరవ్ మోదీ నగల దుకాణాన్ని అప్పటి ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ సందర్శించారని, ఆ మరునాడే మోదీకి అలహాబాద్ బ్యాంక్ రుణం మంజూరయిందని వెల్లడించారు. ఆ బ్యాంక్ డైరెక్టర్లలో ఒకరైన దినేశ్ దుబే వ్యతిరేకించినప్పటికీ, యూపీఏ పెద్దల ఒత్తిడితోనే నీరవ్ మోదీకి రుణం మంజూరయిందని ఆరోపించారు. హైదరాబాద్లో భారీగా ఆస్తులు సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ శివారులోని రావిర్యాల సెజ్, పహాడీషరీఫ్లోని గీతాంజలి జెమ్స్తో పాటు నీరవ్కు చెందిన 4 సహచర కంపెనీల్లో ఈడీ శుక్రవారం సోదాలు చేసింది. ఈ సోదాల్లో వజ్రాలతో పాటు అత్యంత విలువైన తయారీ ముడిసరుకును స్వాధీనం చేసుకుంది. రావిర్యాలలోని సెజ్లో గీతాంజలి గ్రూప్ చైర్మన్ మెహుల్ చోక్సీ రూ.500 కోట్లతో వజ్రాభరణాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. దేశవ్యాప్తంగా నీరవ్, చోక్సీలకున్న తయారీ కేంద్రాల్లో హైదరాబాద్ కేంద్రమే అతి పెద్దదని ఈడీ అధికారులు తెలిపారు. రావిర్యాల తయారీ యూనిట్లో మెషినరీ, వజ్రాభరణాల ముడిసరుకు మొత్తం కలిపి రూ.3వేల కోట్ల విలువైన ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ వర్గాల సమాచారం. కుటుంబసభ్యుల ఆస్తుల అటాచ్ నీరవ్ మోదీకి ఆదాయపు పన్ను శాఖ గట్టి షాకిచ్చింది. అతని కుటుంబ సభ్యులు, వారి కంపెనీలకు చెందిన 29 ఆస్తులు, 105 బ్యాంకు ఖాతాల్ని తాత్కాలికంగా అటాచ్ చేసింది. విదేశాల్లో అక్రమాస్తులు కలిగి ఉన్నందుకు నీరవ్పై ఐటీ శాఖ నల్లధన నిరోధక చట్టాన్ని ప్రయోగించింది. ఈ అక్రమాస్తులు సింగపూర్లో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ముంబైలోని ప్రత్యేక కోర్టులో నీరవ్పై పలు ఐటీ సెక్షన్ల కింద చార్జ్షీట్ దాఖలు చేసింది. శుక్రవారం ఢిల్లీలో నీరవ్ మోదీ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు -
కుంభకోణంపై నాలుగు రోజులకే సీబీఐకి ఫిర్యాదు
వజ్రాభరణాల వ్యాపారి నీరవ్ మోదీ కుంభకోణాన్ని గుర్తించిన నాలుగు రోజుల్లోనే ఇటు రిజర్వ్ బ్యాంక్కు అటు సీబీఐకి పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత పది రోజులకు స్టాక్ ఎక్స్చేంజీలకు తెలియజేసింది. రూ. 11,400 కోట్ల భారీ కుంభకోణంపై వివరణ ఇవ్వాలంటూ స్టాక్ ఎక్స్చేంజీలు సూచించిన మీదట పీఎన్బీ ఈ విషయాలు వెల్లడించింది. మోసం చోటుచేసుకున్న పరిణామక్రమాన్ని వివరించింది. మోదీ, ఆయన కంపెనీలు నకిలీ బ్యాంక్ గ్యారంటీలను ఏ విధంగా ఉపయోగించుకుని విదేశాల్లోని భారతీయ బ్యాంకుల శాఖల నుంచి రుణాలను తీసుకుని, మోసానికి పాల్పడినదీ స్టాక్ ఎక్స్చేంజీలకు పీఎన్బీ సవివరంగా తెలియజేసింది. పరిణామక్రమం ఇదీ.. ♦ 2018 జనవరి 25న పీఎన్బీ ఈ స్కామ్ను గుర్తించింది. జనవరి 29న రిజర్వ్ బ్యాంక్కు ఫ్రాడ్ రిపోర్టు సమర్పించింది. అదే రోజున ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలంటూ సీబీఐకి క్రిమినల్ కంప్లైంటు కూడా ఇచ్చింది. ఫిబ్రవరి 5న స్టాక్ ఎక్సే్చంజీలకు ఈ మోసం గురించి తెలియజేసింది. ♦ మళ్లీ ఫిబ్రవరి 7న ఆర్బీఐకి మరో ఫ్రాడ్ రిపోర్టును సమర్పించింది. అదే రోజున సీబీఐకి ఇంకో ఫిర్యాదు కూడా చేసింది. ఫిబ్రవరి 13న నీరవ్ మోదీ గ్రూప్, గీతాంజలి గ్రూప్, చంద్రి పేపర్ అండ్ అలైడ్ ప్రోడక్ట్స్ సంస్థలపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి కూడా పీఎన్బీ ఫిర్యాదు చేసింది. వీటి గురించి ఆ మరుసటి రోజున స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేసింది. ఫిర్యాదుల సారాంశం ఇదీ.. ♦ పీఎన్బీ ముంబై శాఖలోని ఫారిన్ ఎక్సే్చంజీ విభాగంలో డిప్యుటీ జీఎంగా పనిచేసిన గోకుల్నాథ్ శెట్టి (ప్రస్తుతం రిటైర్డ్) తదితర ఉద్యోగులతో మోదీ, ఆయనకు చెందిన కంపెనీలు కుమ్మక్కయ్యాయి. ముత్యాల దిగుమతికి నిధుల అవసరాల పేరిట పీఎన్బీ నుంచి మోసపూరితంగా 1.77 బిలియన్ డాలర్ల విలువ చేసే గ్యారంటీలు పొందాయి. వాటిని ఉపయోగించుకుని విదేశాల్లోని భారతీయ బ్యాంకుల శాఖల నుంచి రుణాలు తీసుకున్నాయి. ♦ ఆ తర్వాత 2018 జనవరి 16న ముంబైలోని బ్రాడీ హౌస్ పీఎన్బీ శాఖకు దిగుమతి పత్రాలతో వచ్చిన నీరవ్ మోదీ గ్రూప్నకు చెందిన సంస్థలు .. విదేశీ సరఫరాదారులకు చెల్లింపులు జరిపేందుకు బ్యాంకు గ్యారంటీలు ఇవ్వాలంటూ కోరాయి. అప్పటికి శెట్టి రిటైరయ్యారు. 100 శాతం నగదు మార్జిన్ లేనందున లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ (ఎల్వోయూ) ఇవ్వడం కుదరదంటూ పీఎన్బీ సిబ్బంది.. మోదీ సంస్థలకు స్పష్టం చేశాయి. అయితే, తాము చాలా ఏళ్లుగా ఇలాంటి వెసులుబాటు పొందుతున్నామంటూ సదరు సంస్థలు వెల్లడించాయి. దీంతో .. పీఎన్బీ వెంటనే ఈ అంశాన్ని పరిశీలించింది. గతంలో కూడా ఎల్వోయూలు జారీ అయినట్లు గుర్తించింది. వాటి ఆధారంగా రుణాలు ఇవ్వాలంటూ.. బ్యాంకు అంతర్గత వ్యవస్థలో ఎక్కడా నమోదు చేయకుండా స్విఫ్ట్ విధానం ద్వారా విదేశీ బ్యాంకులకు సందేశాలు వెళ్లినట్లు గుర్తించింది. ♦ ఇవన్నీ బైటపడటంతో .. సదరు మొత్తాలను చెల్లించాలంటూ మోదీ గ్రూప్, గీతాంజలి గ్రూప్ వర్గాలతో ఢిల్లీ, ముంబైలలో పీఎన్బీ చర్చలు జరిపింది. అటుపైన నీరవ్ మోదీకి చెందిన మూడు గ్రూప్ సంస్థల ప్రమేయమున్న రూ. 280 కోట్ల మోసానికి సంబంధించి 2018 జనవరి 29న ఎఫ్ఎంఆర్–1 (మోసాలపై ఫిర్యాదు చేసేందుకు ఆర్బీఐ నిర్దేశిత ఫార్మాట్)ను రిజర్వ్ బ్యాంక్కు సమర్పించింది. అటుపై ఫిబ్రవరి7న గీతాంజలి గ్రూప్నకు చెందిన రెండు కంపెనీలు మోసపూరితంగా తీసుకున్న సుమారు రూ. 65.25 కోట్ల ఎల్వోయూలు మెచ్యూర్ కావడంతో మరో రిపోర్టును ఆర్బీఐకి పంపింది. హాంకాంగ్లోని అలహాబాద్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు శాఖల నుంచి ఈ వ్యవహారానికి సంబంధించి మరింత సమాచారం కోరింది. -
పీఎన్బీ ట్రేడింగ్పై సెబీ దర్యాప్తు
న్యూఢిల్లీ: దాదాపు రూ. 11,400 కోట్ల పైచిలుకు కుంభకోణంలో చిక్కుకున్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) వ్యవహారంపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మరింత లోతుగా విచారణ చేపట్టింది. పీఎన్బీతో పాటు గీతాంజలి జెమ్స్ సంస్థల షేర్ల ట్రేడింగ్ లావాదేవీలు, స్టాక్ ఎక్స్చేంజీలకు సదరు సంస్థలు వివరాలు వెల్లడించడంలో చోటుచేసుకున్న వైఫల్యాలు తదితర అంశాలపై దృష్టి సారించింది. వాస్తవానికి గీతాంజలి జెమ్స్ చీఫ్ మోహుల్ చోక్సీ తదితరులపై గతంలో కూడా ఎన్ఎస్ఈ చర్యలు తీసుకుంది. సెక్యూరిటీస్ మార్కెట్ చట్టాల ఉల్లంఘనలకు గాను మోహుల్ చోక్సీ తదితరులు గీతాంజలి షేర్లలో ట్రేడింగ్ చేయకుండా 2013 జులైలో ఎన్ఎస్ఈ నిషేధం విధించింది. బ్రోకరేజి డిఫాల్ట్ సహా చోక్సీ పలు కేసులు విచారణ ఎదుర్కొంటున్నారు. తాజాగా స్కామ్లో కీలకమైన వజ్రాభరణాల డిజైనర్ నీరవ్ మోదీతో సంబంధమున్న వారితో పాటు సంబంధిత సంస్థల స్టాక్ మార్కెట్ లావాదేవీలను సెబీ, స్టాక్ ఎక్స్చేంజీలు పరిశీలిస్తున్నాయి. మరోవైపు, పీఎన్బీ, గీతాంజలి జెమ్స్ వ్యవహారంలో ఆడిటర్ల పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో చార్టర్డ్ అకౌంటెంట్స్ అసోసియేషన్ ఐసీఏఐ దృష్టి సారించింది. ఇందుకు సంబంధించిన సమాచారమేదైనా ఉంటే తమకు తెలియజేయాలంటూ దర్యాప్తు సంస్థలను, సెబీని కోరింది. సుమోటో కింద పీఎన్బీ, గీతాంజలి జెమ్స్ వ్యవహారంపై సమీక్ష జరపాలంటూ అంతర్గత ఫైనాన్షియల్ రిపోర్టింగ్ రివ్యూ బోర్డు (ఎఫ్ఆర్ఆర్బీ)కి సూచించినట్లు ఇటీవలే ఐసీఏఐ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టిన నవీన్ ఎన్డీ గుప్తా తెలిపారు. ఇదిలావుండగా, కుంభకోణంలో కీలక పాత్రధారి అయిన నీరవ్ మోదీ 150 షెల్ కంపెనీలు ఏర్పాటు చేసినట్లు తమ దర్యాప్తులో తేలిందని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రకటించింది. ఎస్బీఐ ఇచ్చినది రూ. 1,360 కోట్లు.. పీఎన్బీ జారీ చేసిన లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ (ఎల్వోయూ)ల ఆధారంగా నీరవ్ మోదీకి ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాదాపు రూ. 1,360 కోట్లు, యూనియన్ బ్యాంక్ సుమారు రూ. 1,915 కోట్లు ఇచ్చాయి. పీఎన్బీ ద్వారానే తప్ప తాము నేరుగా మోదీకి రుణాలివ్వలేదని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ స్పష్టం చేశారు. అయితే, మోదీ మేనమామ అయిన మోహుల్ చోక్సీకి చెందిన గీతాంజలి జెమ్స్కి మాత్రం ఎస్బీఐ సొంతంగా స్వల్ప మొత్తంలో రుణం ఇచ్చినట్లు వివరించారు. కానీ, తమ మొత్తం రుణాల పోర్ట్ఫోలియోలో వజ్రాభరణాల రంగానికి ఇచ్చినది 1 శాతం కన్నా తక్కువే ఉంటుందని ఆయన చెప్పారు. దేశీయంగా ఎస్బీఐ సుమారు రూ. 16 లక్షల కోట్ల రుణాలివ్వగా.. ఇందులో వజ్రాభరణాల రంగ రుణాలు రూ.13,000 కోట్ల కన్నా తక్కువేనన్నారు. పీఎన్బీ తరహా ఉదంతాలు తలెత్తకుండా జాగ్రత్తపడేలా తమ రిస్క్ మేనేజ్మెంటు విధానం పటిష్టంగా ఉందని కుమార్ పేర్కొన్నారు. అటు, పీఎన్బీ ఎల్వోయూల ఆధారంగా ఇచ్చిన రుణ మొత్తం సురక్షితంగానే ఉంటుందని, తాము రాబట్టుకోగలమని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది. మరోవైపు, పీఎన్బీ ఎల్వోయూల ఆధారంగా తాము 367 మిలియన్ డాలర్ల మేర రుణమిచ్చినట్లుగా అలహాబాద్ బ్యాంకు వెల్లడించింది. అయితే, ఈ మొత్తాన్ని రాబట్టుకోగలమని ధీమా వ్యక్తం చేసింది. రూ. 500 కోట్ల స్థిరాస్తుల అమ్మకంపై పీఎన్బీ దృష్టి కుంభకోణం నేపథ్యంలో.. పీఎన్బీ కొన్ని స్థిరాస్తుల విక్రయ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని యోచిస్తోంది. ప్రస్తుతం ఉపయోగంలో లేని కొన్ని ఆఫీస్ భవంతులు మొదలైన వాటిని సుమారు రూ. 500 కోట్లకు విక్రయించాలని బ్యాంకు భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. తగు చర్యలు తీసుకుంటాం: ఆర్బీఐ కుంభకోణం నేపథ్యంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్లోని (పీఎన్బీ) అంతర్గత వ్యవస్థల పనితీరును సమీక్షించినట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. కొందరు ఉద్యోగుల తప్పుడు ధోరణులు, అంతర్గతంగా రిస్కు మేనేజ్మెంట్ వ్యవస్థల వైఫల్యం వల్లే ఈ మోసం చోటు చేసుకున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. ఇప్పటికే.. పీఎన్బీలోని కంట్రోల్ వ్యవస్థలను సమీక్షించినట్లు, పర్యవేక్షణపరంగా తగు చర్యలు తీసుకోనున్నట్లు వివరించింది. కఠిన శిక్షలే తక్షణ కర్తవ్యం..! పీఎన్బీ స్కామ్పై కార్పొరేట్లు పీఎన్బీలో చోటుచేసుకున్న స్కామ్పై కార్పొరేట్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆర్థిక మోసాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు, క్లిష్ట పరిస్థితుల నిర్వహణా యంత్రాంగం వంటి చర్యలు తక్షణం అవసరమని అభిప్రాయపడుతున్నాయి. తద్వారానే భారీ ఆర్థిక కుంభకోణాలను వ్యవస్థ నియంత్రించగలుగుతుందని విశ్లేషించారు. కొన్ని ముఖ్య అభిప్రాయాలను చూస్తే.... బ్యాంకుల బలహీనతను సూచిస్తోంది... ఒకే ఒక్క బ్రాంచ్లో ఇంత మొత్తం మోసపూరిత లావాదేవీలు జరిగాయంటే, భారతీయ బ్యాంకులు ప్రత్యేకించి ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎంత దుర్బల స్థితిలో ఉన్నాయో అర్థం అవుతోంది. భారత్ ఫైనాన్షియల్ వ్యవస్థలో నాటుకుపోయిన లోటుపాట్లకు ఇది అద్దం పడుతోంది. దీనితోపాటు బ్యాంకింగ్ వ్యవస్థలో రిస్క్ మేనేజ్మెంట్ వ్యవస్థ ఎంత లోపభూయిష్టంగా ఉందో తాజా స్కామ్ సూచిస్తోంది. అభివృద్ధి చెందుతున్న భారత్ ఆర్థిక వ్యవస్థ స్థాయికి దేశీయ ఫైనాన్షియల్ వ్యవస్థలూ ఎదగాల్సి ఉంది. ఈ విషయంలో ఇప్పటికైనా మన కళ్లు తెరుచుకోవాలి. ఆర్బీఐ కూడా జరిగిన అవకతవకలను సకాలంలో గుర్తించలేకపోవడం ప్రత్యేకించి చెప్పుకోతగింది. బ్యాంక్ బ్రాంచీలపై ఆర్బీఐ పర్యవేక్షణ ఏదో ఒక సాదాసీదా వ్యవహారంగా తయారైంది. తాజా ఉదంతం బ్యాంకింగ్ వ్యవస్థపై డిపాజిటర్ల విశ్వాసాన్ని దెబ్బతీయరాదు. – డీఎస్ రావత్, సెక్రటరీ జనరల్, అసోచామ్ బ్యాంకింగ్కు ప్రతికూలమే! ప్రభుత్వ రంగ బ్యాంకులో ఇటీవల చోటుచేసుకున్న చట్టవ్యతిరేక, అనైతిక వ్యాపార విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. చట్టప్రకారం మోసగాళ్లకు తీవ్ర శిక్ష పడాలి. బ్యాంకును మోసపుచ్చిన కంపెనీలపై సత్వర, కఠిన చర్యలు తీసుకోవాలి. వ్యాపార సంస్థలకు సంబంధించిన స్వేచ్ఛను మేము కోరుకుంటాం. సమర్థిస్తాం. అయితే అక్రమ, అనైతిక వ్యాపార విధానాలకు ఎట్టిపరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వబోము. ఆర్థిక నేరాలకు అసలు మూలం ఎక్కడో తొలుత గుర్తించాలని మేము కోరుకుంటున్నాం. కస్టమర్లకు, షేర్ హోల్డర్లకు ఏదైనా బ్యాంక్ తన విధులను నిర్వర్తించే క్రమంలో సక్రమమైన విధివిధానాలకు చట్టవ్యతిరేక విధానాల ద్వారా తూట్లు పొడవకూడదు. ఇందుకు వీలు కల్పించని వ్యవస్థ ఏర్పడాలని కోరుకుంటున్నాం. అసలే మొండిబకాయిల తీవ్ర సమస్యతో సతమతమవుతున్న బ్యాంకులపై తాజా కుంభకోణం తీవ్ర ప్రభావాన్ని చూపించేదే. – రాషేశ్ షా, ఫిక్కీ ప్రెసిడెంట్ -
బియాస్లో నిమజ్జనం చేయాలి
జాతిహితం బ్యాంకుల జాతీయకరణను కొనసాగించడమే కాకుండా రూ. 2.11 లక్షల కోట్ల పన్ను చెల్లింపుదారుల డబ్బును కరిగించేసిన రాజకీయ తప్పిదాన్ని మనం ఏమని పిలవాలి? పంజాబ్ నేషనల్ బ్యాంకు.. మహారాష్ట్ర సుగర్ బెల్ట్కి చెందిన రాజకీయ బందిపోట్ల యాజ మాన్యంలోని చిన్న సహకార బ్యాంకును పోలిన మరీ పనికిరాని బ్యాంకు ఏమీ కాదు. అది దేశంలోనే రెండవ అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు. ప్రపంచంలోనే అత్యంత ధనిక బంది పోట్లు సంవత్సరాలుగా ఆ బ్యాంకులో దూరారని బయటపడ్డ కుంభకోణం తెలుపుతోంది. ఇది మీకు ఆవలింతలు తెప్పించినా మరొకసారి కూడా చెప్పక తప్పదు. చాలామంది లాగే ఈ సూక్తి గురించి నేను కొంచెం చెబుతాను. సంక్షోభంలో ఉన్న అవతలి వారిని అణచివేసే అవకాశం వచ్చినప్పుడు ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. ఇంత ప్రాచుర్యం ఉన్నప్పటికీ ఈ ప్రవచనాన్ని చాలా తక్కువ సందర్భాలలో మాత్రమే ప్రయోగిస్తూ ఉంటారు. ఎందుకంటే దీనిని ప్రయోగించాలంటే ఒకింత సాహసం అవసరం. అధికారులకీ, ఉద్యోగంలో ఉంటూ కాలక్షేపం చేసేవాళ్లకీ, రిస్క్ తీసుకోవడానికి ఏమాత్రం ఇచ్ఛగించని వారికి ఇది ఐచ్ఛికం కూడా. ఇక్కడ ఈ సూక్తిని మళ్లీ మోగించడానికి కారణం– ప్రధాని నరేంద్ర మోదీ పైన చెప్పుకున్న ఆ ముగ్గురు మనుషుల లాంటి వారు కాదని చెప్పడానికే. ఇందిరాగాంధీ తరువాత భారత రాజకీయాలలో రిస్క్ను ఎదుర్కొనడానికి ఏమాత్రం వెనుకాడని నాయకుడు నరేంద్ర మోదీయే. అయితే హాస్యాస్పదమైన విషయం ఏమిటంటే, సరిగ్గా ఇందిరాగాంధీ చేసిన ఘోరమైన చర్యలను తుడిచిపెట్టడానికి ఆయనకు తగిన ధైర్యం ఉండాలని మనం కోరుకుంటున్నాం. 1969లో కాంగ్రెస్ పార్టీని చీల్చిన తరువాత సోషలిస్టు సమాజం కోసమన్న పేరుతో ఇందిరాగాంధీ పెద్ద వాణిజ్య బ్యాంకులను జాతీయం చేస్తున్నట్టు నాటకీయంగా ప్రకటించారు. 1991లో బ్యాంకు సంస్కరణలు అమలు పరిచేవరకు కూడా ఈ బ్యాంకుల జాతీయకరణ కార్యక్రమం సాగింది. బీమా, బ్యాంకుల జాతీయకరణ ద్వారా, అభివృద్ధికి సంబంధించిన అన్ని ఆర్థిక సంస్థలను ఆమె ప్రభుత్వ అధీనంలోకి తెచ్చారు. ఆ విధంగా మొత్తం భారత సంప్రదాయక ఆర్థిక వనరుల మీద ప్రభుత్వం పెత్తనం తీసుకువచ్చారు. అయితే తను చేపట్టిన నకిలీ, సంపద తరుగుదల సామ్యవాదాలకే ఎన్నికల తరువాత ఎన్నికలలో ఆమెకు విజయాలు చేకూరాయి. తాను సంపన్నుల నడ్డి విరుస్తున్నానని ఆమె పేదలను నమ్మించగలిగారు. అలాగే భవిష్యత్తులో పేదల కోసం ఏదో మేలు చేయబోతున్నట్టు నమ్మించారు. అయితే పేదలకు ఎలాంటి మేలు జరగలేదు. కానీ వారు మాత్రం మోసానికి గురవుతూనే ఉన్నారు. ఆమె ఎన్నికలలో తన విజయ యాత్రను సాగిస్తూనే ఉన్నారు. 1973లో చమురు సెగ తగలడం (యోమ్ కిప్పుర్ యుద్ధం తరువాత)తో పాటు, ఇతర పరిణామాలతో భారత ద్రవ్యోల్బణం రేటును తారస్థాయికి, అంటే 1920ల నాటి స్థాయికి తీసుకుపోయాయి. దీని తోనే ఆమె ఆర్థిక విధానాలలోని డొల్లతనం బయటపడిపోయింది. సోషలిస్టు పూనకంతో వేగిపోయిన ఆ దశ నుంచి బయటపడి మళ్లీ పునరుత్తేజం పొందడానికి గడచిన నలభయ్ సంవత్సరాల నుంచి భారతదేశం శ్రమిస్తూనే ఉంది. భారతదేశం తన మూర్ఖత్వం ఏమిటో తను గుర్తించింది కానీ, మనం మరో జాతీయ ప్రయోజనాన్ని పరీక్షించే పనిలో ఉండడం వల్ల ఆ పని చాలా ఆలస్యమైపోయింది. ప్రభుత్వాల ప్రజాకర్షక విధానం ఎంత ఆకర్షణీయమో, ఎంత సులభమో, ఆఖరికి ఎంత ప్రమాద రహితమో మన రాజకీయ చరిత్ర చక్కగా చెబుతుంది. ఆ విధానాన్ని తల కిందులు చేయడం ఎలాంటి సవాలో, ఎంత ప్రమాదకరమో, అందువల్ల ఎంత అపఖ్యాతి పాలు కావలసి వస్తుందో కూడా రాజకీయ చరిత్ర చెబుతుంది. సంస్కరణవాదులలో అతి సాహసికులు మాత్రమే అలాంటి ‘పాంగాస్’(గనిలోకి నడవడం అని స్థూలంగా చెప్పవచ్చు)కు సిద్ధపడతారు. పీవీ నరసింహారావు, డాక్టర్ మన్మోహన్సింగ్ 1991లో ఇలాంటి సాహసం చేశారు. తరువాత యశ్వంత్ సిన్హా, జస్వంత్ సింగ్లతో కలసి అటల్ బిహారీ వాజపేయి కూడా అలాంటి సాహసం చేసినవారే. అయితే మోదీ నుంచి ఇంతకు మించిన నాటకీయమైన దానిని దేనినో మనం ఆశిస్తున్నాం. ఇందిర పుణ్యమా అని దాదాపు దివాలా స్థితికి వచ్చిన బ్యాంకులు ఆయనకు దక్కాయి. గడచిన నాలుగేళ్లుగా వాటిని ఆయన తాజా మూలధనం మూటలతో నింపుతూనే ఉన్నారు. దేశంలోని సంపన్నవర్గాలకీ, అత్యంత అవినీతి పరులకీ రుణాలు పందారం చేసి, పన్ను చెల్లింపుదారులు నిజాయితీగా చెల్లించిన ధనాన్ని ఆ బ్యాంకులకు ధారపోస్తున్నారు. దేశంలోని 21 ప్రభుత్వ రంగ బ్యాంకులే దేశ ఆర్థిక వ్యవస్థకు ఇప్పటికీ కీలకంగా ఉన్నాయి. 55 నుంచి 60 శాతం వరకు భారత్ మార్కెట్కు ఈ బ్యాంకులే జవాబుదారులు. ఇందులో ఎక్కువ బ్యాంకులు షేర్మార్కెట్లో లిస్ట్ అయినవే కూడా. అయితే ఈ విషయాన్ని బాగా గుర్తు పెట్టుకోండి. మీరంతా ఊపిరి బిగపట్టి వినండి. ఘనత వహించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా అన్ని బ్యాంకుల మార్కెట్ కేపిటలైజేషన్ (విలువ) (ఇవాళ్టికి రూ. 50,000 కోట్లు) పాతికేళ్ల క్రితమే ఆవిర్భవించిన హెచ్డీఎఫ్సీ బ్యాంకు మార్కెట్ కేపిటలైజేషన్ కంటే తక్కువ. ప్రైవేటు బ్యాంకులతో పోల్చి చూస్తే ప్రభుత్వ రంగ బ్యాంకులు దశాబ్దాల నాటి ఇంకా చెప్పాలంటే శతాబ్దాల క్రితం నాటి వారసత్వాన్నే కొనసాగిస్తున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ సంపదను కోల్పోతున్న క్రమం ఈ రీతిలో ఉంది. ఏదైనా కంపెనీలో ఎవరైనా వాటాదారుని పిలిచి అడగండి. మీ ధనంతో మీ యాజమాన్యం కనుక నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మీరు బయటకి వస్తారా అని అడగండి. వారు తప్పనిసరిగా వస్తారు. కానీ వారు ప్రభుత్వ రంగ సంస్థలో ఉంటే మాత్రం ఆ పని చేయరు. పైగా ఆ ఉత్పాతాన్ని ఇంకొంత విస్తరింపచేయడానికి ఇంకొంత ధనాన్ని కూడా ధారపోస్తారు. ఎందుకు? ఎందుకంటే, అది మీ ధనం కాదని మీకు తెలుసు. ఆ ధనం ఆలోచనలేని వాళ్లది. మూర్ఖులది. వీరి ధనాన్ని ధారపోసి భవిష్యత్తులో వారికోసం ఏదో చేస్తామన్న భ్రాంతిని కలిగిస్తాం. ఇది చాలా అన్యాయమే అయినప్పటికీ పన్ను ఎగవేతదారులు, దివాలాకోరులు తాము దివాలా తీయించినవాటినే మరిన్ని రాయితీలతో తిరిగి తీసుకోవాలని అనుకుంటున్నారు. దావోస్లో ప్రధాని మోదీతో కలిపి తీయించుకున్న గ్రూప్ ఫొటోలో అలాంటి వ్యక్తులు కనిపిస్తారు. భారతీయ బ్యాంకులు ఆగి ఆగి ఇలాంటి దారుణమైన రుణ సంక్షోభంలో చిక్కుకుంటూ ఉంటాయి. ఇలాంటి పనికి పాల్పడినవారి జాబితాను పరిశీలిస్తే ఒకే రకమైన వ్యక్తులే ఇలాంటి పాల్పడుతున్న సంగతి అర్థమవుతుంది. ఇదెలా జరుగుతుందంటే వారు తిరిగి రుణం కోసం అదే సర్కారీ బ్యాంకులకు వెళ్లగలరు. మళ్లీ మోసపూరితమైన ప్రతిపాదనలు చూపి రుణాలు తీసుకోగలరు. మళ్లీ చెల్లించడం విఫలం కాగలరు కూడా. చారిత్రకంగా ఇదంతా మనకు తెలిసినప్పటికీ నమ్మశక్యమైన ఒక ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్నాం. అక్కడ రుణం క్షమించదగినదే. ఈ జాబితాలో ఉన్నవారు మళ్లీ మళ్లీ మోసగిస్తున్న బ్యాంకులన్నీ ప్రభుత్వ బ్యాంకులేనని మళ్లీ గుర్తు చేస్తున్నాను. ప్రైవేటు బ్యాంకులు ఆఖరికి మాల్యా నుంచి కూడా తమకు రావలసినదంతా వసూలు చేసుకున్నాయి. బ్యాంకుల జాతీయకరణ ద్వారా ఇందిరాగాంధీ పేదలకు ఎలాంటి మేలు జరగాలని ఆశించారో కానీ, దానిని చాలా కార్పొరేట్ సంస్థలు తెలివిగా తమకి ఉపయోగించుకుంటున్నాయి. 2008 నవంబర్ 13న, ఫరీద్ జకారియా న్యూఢిల్లీలో జవహర్లాల్ నెహ్రూ వార్షిక స్మారకోపన్యాసం చేశారు. సంపన్న ఆర్థిక వ్యవస్థలు కుప్పగూలుతున్న క్రమం నుంచి భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ తప్పించుకోవడంపై ఆయన అభినందనలు కురిపించారు. సదస్సు నిర్వాహకురాలి స్థాయిలో ప్రసంగించిన సోనియాగాంధీ, దివంగత ప్రధాని ఇందిరాగాంధీ భవిష్యజ్ఞానం గురించి పదే పదే ప్రస్తావించారు. భారతీయ బ్యాంకులు సమర్థవంతమైన క్రమబద్ధీకరణ వల్ల కాకుండా ప్రభుత్వ యాజమాన్యంలో ఉండటమే సంక్షోభం నుంచి తప్పించుకోవడానికి ఏకైక కారణం అనే రీతిలో ఆమె ప్రసంగం సాగింది. గత సంవత్సరం జరిగిన హిందూస్తాన్ టైమ్స్ లీడర్షిప్ సదస్సుæ సందర్భంగా కూడా సోనియా గాంధీ ఈ అంశాన్నే పదే పదే నొక్కి చెప్పారు. ఇందిరాగాంధీ చేసిన అతి గొప్ప ఆర్థిక తప్పిదానికి గాంధీ (నెహ్రూ) కుటుంబం అంత గొప్ప విలువను ఇచ్చి పరిరక్షిస్తూ వస్తోంది. బ్యాంకులను ప్రభుత్వ యాజమాన్యం నుంచి తప్పించడం కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏ ప్రభుత్వానికి కూడా సాధ్యం కాదనే భావనను కాంగ్రెస్ అధిష్టానం బలంగా ముద్రించింది. కానీ ప్రధాని నరేంద్రమోదీ సైతం అలాంటి మనోభావానికి ఎందుకు కట్టుబడి ఉన్నారనేదే మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. జవహర్లాల్ నెహ్రూ అమలు పర్చిన ప్రతి విధానాన్ని తిరగదోడాలని నరేంద్రమోదీ కోరుకోవడం ఆశ్చర్యకరమైన విషయం. వీలు చిక్కినప్పుడల్లా నెహ్రూకు మరకలంటించాలని మోదీ చూస్తుంటారు. కాని నెహ్రూ కుమార్తె చేపట్టిన అత్యంత అవివేకపు విధానాల్లో కీలకమైనదాన్ని మోదీ ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదు. దేశంలో బ్యాంకుల జాతీయకరణ కంటే మించిన అవివేకపు చర్య మరొకటి లేదు. దేశంలోని బ్యాంకులు సంపన్నులకు తప్ప పేదలకు రుణాలు ఇవ్వడం లేదనే అతి అంచనాకు ఇందిరాగాంధీ 1969లో వచ్చారు. కానీ ఆమె చేసిన బ్యాంకుల జాతీయకరణకు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అదే బ్యాంకులు కుప్పగూలిపోతున్నాయి. కారణం.. అవి ఎలాంటి ప్రశ్నలూ వేయకుండానే సంపన్నులకు రుణాలను అధిక మోతాదులో గుమ్మరించి, ప్రజాధనం దోపిడీకి మార్గం వేయడమే. బ్యాంకుల జాతీయీకరణను కొనసాగించడమే కాకుండా 2.11 లక్షల కోట్ల పన్ను చెల్లింపుదారుల డబ్బును కరిగించేసిన రాజకీయ తప్పిదాన్ని మనం ఏమని పిలవాలి? పంజాబ్ నేషనల్ బ్యాంకు.. మహారాష్ట్ర సుగర్ బెల్ట్కి చెందిన రాజకీయ బందిపోట్ల యాజమాన్యంలోని చిన్న సహకార బ్యాంకును పోలిన మరీ పనికిరాని బ్యాంకు ఏమీ కాదు. అది దేశంలోనే రెండవ అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు. ప్రపంచంలోనే అత్యంత ధనిక బందిపోట్లు సంవత్సరాలుగా ఆ బ్యాంకులో దూరారని ఇప్పుడు బయటపడ్డ కుంభకోణం తెలుపుతోంది. పలుసార్లు చేసిన ఆడిటింగ్ కానీ, ప్రభుత్వం లేక ఆర్థిక శాఖ నామినేట్ చేసిన ప్రభుత్వ బోర్డు సభ్యులు కానీ ఈ భారీ కుంభకోణం గురించి కనిపెట్టలేకపోయారు. ఈ స్థాయిలో బ్యాంకులు చిల్లు వేయడం, జాగరూకత లేకపోవడం, ఆడిటింగ్ వైఫల్యం మొత్తం జాతి సిగ్గుపడాల్సిన విషయం. అందుకే నరేంద్రమోదీ ఈ బ్యాంకును ఇక ఎత్తికుదేయాల్సి ఉంటుంది. దాన్ని అమ్మేసి ఇక ఈ ఉదంతాన్ని మర్చిపోవాల్సి ఉంది. ఇంతకుమించిన ప్రజాకర్షక అంశం ఇప్పుడు మరొకటి ఉండదు. తాను అసహ్యించుకుంటున్న కాంగ్రెస్ రాజరికంలోని రెండో కీలకమైన సభ్యుడిని తప్పుబట్టే విషయంలో మోదీకి ఈ చర్యే పూర్తి సంతృప్తిని కలిగిస్తుంది కూడా. వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta శేఖర్ గుప్తా -
పీఎన్బీ స్కాం: న్యూ ట్విస్ట్
సాక్షి, ముంబై: నీరవ్ మోదీ (48) న్యూయార్క్లో ఒక హోటల్లో ఉన్నాడని పలు వార్తలు హల్ చల్ చేస్తుండగా... ఆయన ఎక్కడ ఉన్నదీ తమకు స్పష్టంగా తెలియదనీ విదేశాంగ శాఖ ప్రకటించింది. నీరవ్ మోదీ తమ అధికారులు ఎవరితోనూ సన్నిహితంగా లేడని, ఈ దశలో ఎక్కడ ఉన్నదీ చెప్పలేమని విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం అతని పాస్పోర్ట్ నిలిపివేసినందువల్ల ఇక వేరే ఏ దేశానికి వెళ్లలేడని ఆయన పేర్కొన్నారు. ఇపుడు ఎక్కడ ఉన్నాడో అక్కడే ఉంటాడన్నారు. వేలకోట్ల రూపాయల ఎగవేసి లండన్కు చెక్కేసిన మాల్యాను ఇండియాకు వెనక్కి రప్పించేందుకు కష్టాలు పడుతున్న కేంద్రప్రభుత్వానికి మోదీని తిరిగి దేశానికి రప్పించడం పెద్ద సవాలేనని నిపుణులు భావిస్తున్నారు. అంతేకాదు నీరవ్ మోదీ కేసు మాల్యా మాదిరిగా లోన్ డిఫాల్ట్ కేసు కాదని, నీరవ్ మోదీ వేల కోట్ల రూపాయల మేర బ్యాంకులను బురిడీ కొట్టించాడని, మోస పూరితంగా వ్యవహరించాడని ఇది తీవ్రమైన అంశంగా పరిగణించాలని అభిప్రాయపడ్డారు. అయితే బెల్జియన్ పాస్పోర్ట్ ఉంటే.. పీఎన్బీకి భారీ ఎత్తున నష్టం కలిగించి దేశం విడిచిన డైమండ్ వ్యాపారిని దేశానికి రప్పించడం అంత సులువు కాదని వ్యాఖ్యానించారు. మరోవైపు దర్యాప్తు సంస్థ సీబీఐ తాజా ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. గీతాంజలి జెమ్స్ సహా (గిలి ఇండియా, నక్షత్ర బ్రాండ్) మూడు కంపెనీలను ఎఫ్ఐఆర్లో చేర్చింది. గీతాంజలి జెమ్స్ రూ. 4,886కోట్ల మేరకు మోసానికి పాల్పడిందని సీబీఐ వెల్లడించింది. ఈ మూడు కంపెనీలకు 36 అనుబంధ సంస్థలున్నాయి. వీటిల్లో 17 సంస్థలు ముంబైలోను, ఒకటి హైదరాబాద్లోను ఉండగా, మిగిలినవి విదేశాల్లో ఉన్నాయని సీబీఐ శుక్రవారం నాటి విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ముంబై, పుణే, సూరత్, హైదరాబాద్, కోయంబత్తూర్ తదితర 26 ప్రదేశాల్లో సోదాలు నిర్వహిస్తోంది. గీతాంజలి గ్రూపునకు చెందిన ఆస్తులు, ఇతర నిందిత కంపెనీ డైరెక్టర్ల నివాసాలతోపాటు ప్లాంట్లు, ఫ్యాక్టరీలు, కార్యాలయాల్లో ఈ దాడులు చేపట్టినట్టు సీబీఐ అధికారి తెలిపారు. అలాగే మోదీ అరెస్ట్కు సహకరించాల్సిందిగా ఇంటర్పోల్ను సీబీఐ కోరింది. ఇది ఇలా ఉంటే భారీ స్కాం వెలుగులోకి రావడంతో పంజాబ్ నేషనల్ బ్యాంకు శుక్రవారం సాయంత్రం ఇన్వెస్టర్లతో సమావేశం నిర్వహించింది. ఆరునెలల్లో పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తీసుకొస్తామని హామి ఇచ్చింది. -
మెగా స్కాం: ఢమాలన్న గీతాంజలి
సాక్షి, ముంబై: పీఎన్బీ మోగా స్కాం రేపిన ప్రకంపనలు జ్యుయలరీ షేర్లకు అశనిపాతంలా చుట్టుకున్నాయి. వేలకోట్ల స్కాంలో కీలకు నిందితుడైన మెహుల్ చెక్సీకి చెందిన గీతాంజలి జెమ్స్ శుక్రవారం కూడా ఢమాల్ అంది. వరుసగా మూడో సెషన్లో అమ్మకాల వెల్లువ సాగడంతో 52వారాల కనిష్టాన్ని తాకింది. గీతాంజలి జెమ్స్ 20శాతం కుదేలైంది. ఇతర ఆభరణాల షేర్లలో తంగమైయిల్ జ్యువెలరీ 5 శాతం , త్రిభువన్ దాస్ భీంజీ జవేరి (టీబీజెడ్) 3శాతం, రాజేష్ ఎక్స్పోర్ట్ 1 శాతం నష్టపోయింది. పీసీ జ్యువెలర్స్ మాత్రం పాజిటివ్గా ట్రేడ్అయింది. కాగా ప్రభుత్వ రంగ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) ముంబై బ్రాంచీలో జరిగిన 177 కోట్ల డాలర్ల(సుమారు రూ. 11,400 కోట్లు) కుంభకోణంలో గీతాంజలి జెమ్స్మై కూడా కేసు నమోదుకావడంతో ఇన్వెస్టర్లు ఈ కౌంటర్లో మరోసారి భారీ అమ్మకాలకు తెరతీశారు. గీతాంజలి, గిన్ని, నక్షత్ర, నీరవ్మోదీ లాంటి అతిపెద్ద జ్యువెలర్స్నుపరిశీలిస్తున్నామని సీనియర్ అధికారి ఒకరు ప్రకటించారు. వివిధ బ్యాంకులతో వారి లావాదేవీలను సీబీఐ, ఈడీ పరిశీలిస్తోందని చెప్పారు. మరోవైపు ముంబై బ్రాంచీలో కుంభకోణం పీఎన్బీ షేరు సైతం వరుసగా మూడో రోజూ నష్టాలతోనే ముగిసింది. 2శాతం పతనమైంది. అటు ఈ భారీ స్కాం వెలుగు చూడటంలో మార్కెట్ రెగ్యులేటరీ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ విచారణ ప్రారంభించింది. సెబీ, స్టాక్ ఎక్స్ఛేంజీలు ఇప్పటికే చోక్సీ తో సహా నీరవ్ మోదీకి మోడీకి అన్ని సంస్థల స్టాక్ మార్కెట్ ట్రేడింగ్, తదితర అంశాల విశ్లేషణ మొదలు పెట్టింది. సెక్యూరిటీ చట్టాలను ఉల్లంఘించిన వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని రెగ్యులేటరీ అధికారి తెలిపారు. -
మరో 8మంది అధికారులపై వేటు
సాక్షి, న్యూఢిల్లీ: పీఎన్బీ స్కాంలో తాజాగా మరో ఎనిమిదిమంది అధికారులపై వేటు పడింది. అనుమానిత లావాదేవీలు జరిపారన్న ఆరపణలతో ఒక జనరల్ మెనేజర్ సహా ఎనిమిదిమందిని సస్పండ్ చేసినట్టు ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. దీంతో ఈ మెగా స్కాంలో మొత్తం సస్పెండ్ అయిన పీఎన్బీ అధికారులు సంఖ్య 18కి చేరింది. ఆర్బీఐ ఆదేశాల ప్రకారం మార్చి 31 నాటికి ఇతర బ్యాంకుల పూర్తి బకాయిలను చెల్లించాల్సిన నేపథ్యంలో అంతర్గత వనరుల ద్వారా నిధులు సమకూరుస్తామని కూడా ఆ అధికారి తెలిపారు. మరిన్ని వివరాలను వెల్లడించేందుకు సంబంధిత 36 అకౌంట్ ఖాతాలపై దర్యాప్తు చేయనుందని తెలిపారు. దర్యాప్తు నివేదిక ఆధారంగా ఎల్వోయూ ( బ్యాంకింగ్ పరిభాషలో ఎల్వోయూ అనేది ఇతర బ్యాంకుల శాఖలకు ఒక బ్యాంక్ జారీచేసే ఒక హామీ. ఈ ఎల్ఓయూ ద్వారా విదేశీ బ్యాంకులు రుణగ్రహీతలకు రుణాలను అందిస్తాయి) కింద క్రెడిట్ అయిన నిధులను పూర్తిగా చెల్లిస్తామన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్రం పీఎన్బీకి రూ. 5,473 కోట్లను ప్రకటించినట్టు చెప్పారు. -
నిందితుల పాస్పోర్టులు నిలిపివేత.. కానీ
సాక్షి, న్యూఢిల్లీ: పీఎన్బీ మెగా స్కాంలో ప్రధాన నిందితుడు నీరవ్ మోదీపై చర్యల్లో భాగంగా కీలక పరిణామం చోటు చేసుకుంది. మోదీ, ఆయన వ్యాపార భాగస్వామి, గీతాంజలి ప్రమోటర్ మాహుల్ చోక్సి పాస్పోర్ట్లను కేంద్రం నిలిపివేసింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖకు చెందిన పాస్పోర్ట్ జారీ కార్యాలయం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విజ్ఞప్తి మేరకు వారి పాస్పోర్ట్లను నాలుగు వారాలపాటు సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఇంటర్పోల్ కూడా నోటీసులు జారీ చేసింది. అలాగే వారి పాస్పోర్ట్లను ఎందుకు రద్దు చేయకూడదో వారంలోపు స్పందించాల్సిందిగా కోరింది. నిర్దేశించిన గడువు లోపు నిందితులు స్పందించకపోతే, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పాస్పోర్ట్లను పూర్తిగా స్వాధీనం చేసుకోనుంది. అయితే నీరవ్మోదీ మరికొన్ని దేశాల్లో పౌరసత్వం లేదా శాశ్వత నివాస హోదాను కలిగి ఉండవచ్చని కొన్ని నివేదికల ద్వారా తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారం నిర్వహిస్తున్న మోదీ అమెరికాలోఎక్కువ సమయం గడుపుతాడనీ, అతనికి బెల్జియం పాస్పోర్ట్ కూడా ఉందని తెలుస్తోంది. అంతేకాదు తరచుగా ఇండియాకు వచ్చే మోదీ గత రెండేళ్లుగా ఇండియాకు రావడం బాగా తగ్గించేడశాడంటూ కీలక సమాచారాన్ని ఉటంకిస్తూ ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ చేసింది. సన్నిహితులకు మాత్రం ఫోన్ల ద్వారా నిరంతరం అందుబాటులో ఉండేవాడని నివేదించింది. మరోవైపు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన రూ.11,400కోట్ల అతిభారీ కుంభకోణంలో ఈడీ అధికారుల దాడులు కొనసాగనున్నాయి. నీరవ్ మోదీకి చెందిన మరో 50 సంస్థలపై దాడులు నిర్వహిస్తామని అధికారులు తాజాగా ప్రకటించారు. కాగా మనీలాండరింగ్ ఆరోపణలతో ఇప్పటికే నీరవ్మోదీ, మెహుల్ చోక్సికి ఈడీ సమన్లు జారీ చేసింది. వీటిపై వారంలోగా స్పందించాలని ఆదేశించింది. పాస్పోర్ట్ చట్టం 1967 సెక్షన్ 10 (3) (సి) కింద వారి పాస్పోర్ట్లను రద్దు చేస్తామని హెచ్చరించింది. -
స్కాం ఎఫెక్ట్: మార్కెట్ల పతనం
సాక్షి,ముంబై: దేశీయస్టాక్మార్కెట్లు అనూహ్యంగా భారీ నష్టాల్లో ముగిశాయి. ప్రధానంగా పీఎస్యూ బ్యాంక్ షేర్లకు పీఎన్బీ మెగా స్కాం సెగ తగిలింది. దీంతో ఫైనాన్షియల్ సంస్థలు,బ్యాంకింగ్ షేర్లలో సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది. అలాగే మెటల్, ఆటో రంగాల నష్టాలు మార్కెట్లను ప్రభావితం చేశాయి. ఒక్క ఐటీ,పార్మ తప్ప అన్ని సెక్టార్లలో నష్టాలే. దీంతో ఒక దశలో సెన్సెక్స్ 330పాయింట్లు పతనమై 34వేల దిగువకు చేరింది. చివరకు వారాంతంలో సెన్సెక్స్ 287పాయింట్ల పతనంతో 34, 010వద్ద, నిఫ్టీ 93 93 పాయింట్ల నష్టంతో 10452 వద్ద ముగిసింది. ఎస్బీఐ, పీఎన్బీ,బీఓబీ, కెనరా బ్యాంకు, ఆంధ్రా, ఐసీఐసీఐ,యస్బ్యాంక్తోపాటు ఐషర్, ఐబీ హౌసింగ్, వేదాంతా, భారతీ, మారుతీ, టాటా స్టీల్, మదరన్ సుమీ భారీగా నష్టపోయాయి. అంబుజా, కొటక్ బ్యాంక్, ఇన్ఫోసిస్, టీసీఎస్, డాక్టర్ రెడ్డీస్, ఏషియన్ పెయింట్స్, హెచ్సీఎల్ టెక్, మైండ్ ట్రీ స్వల్పంగా లాభపడ్డాయి. -
ఏడాది క్రితమే పీఎన్బీ స్కాం వెలుగులోకి..
నేడు పేపర్లు, టీవీల్లో మేజర్ వార్త ఏదైనా ఉంది అంటే అది పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణమే. వేల కోట్ల రూపాయల నగదును దోచుకున్న ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ విదేశాలకు పారిపోయారు. దేశీయ బ్యాంకింగ్ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణంగా ఇది వెలుగులోకి వచ్చింది. విజయ్మాల్యా, సుబ్రతారాయ్, సత్యం రామలింగ రాజులను మించి నీరవ్ మోదీ ఈ కుంభకోణానికి పాల్పడ్డారు. అయితే ఈ స్కాంపై గతేడాదే అథారిటీలకు ముందస్తు హెచ్చరికలు వెళ్లినప్పటికీ, వారి పట్టించుకోలేదని తెలుస్తోంది. 2016 జూలైలో బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త హరి ప్రసాద్ గతేడాదే ఈ కుంభకోణాన్ని బయటపెట్టారు. దీనిపై ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ కూడా రాశారు. విజయ్ మాల్యాను మించిపోయే అతిపెద్ద కుంభకోణం చోటుచేసుకోబోతుందని అథారిటీలను హెచ్చరించారు. '' విజయ్ మాల్యా, సహారా గ్రూప్ సుబ్రతా రాయ్, సత్యం గ్రూప్ రామలింగరాజులకు మాదిరిగా ముంబైకు చెందిన ఓ వ్యక్తి లేదా కంపెనీ వేలకోట్ల రూపాయల ప్రజల నగదును దోచుకుంటోంది. వెయ్యి కోట్ల మేర ప్రజల దనం దుర్వినియోగం పాలవుతోంది. ఈ మోసదారుడు ఎవరో కాదు గీతాంజలి జెమ్స్ మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్ మెహల్ చౌక్సి. గీతాంజలి జెమ్స్ లిమిటెడ్, మెహల్ చౌక్సి, ఇతర సబ్సిడరీలు, స్కాంకు పాల్పడే కంపెనీల వివరాలన్నింటిన్నీ పీడీఎఫ్లో ఎన్క్లోజ్ చేసి ఆర్ఓసీ మహారాష్ట్రకు లేఖ పంపించా. కానీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇదే లేఖను పీఎంఓకు కూడా పంపించా. కానీ వారు నా లేఖను పరిగణలోకి తీసుకోలేదు. రెండు లేదా మూడు నెలల అనంతరం నా కేసును మూసివేస్తున్నట్టు ఆర్ఓసీ మహారాష్ట్ర నుంచి లేఖ వచ్చింది. విజయ్మాల్యా లాగా వీరు దేశం విడిచి పారిపోకుండా చూడాలంటూ అభ్యర్థించా. కానీ ఎలాంటి ప్రయోజనం కలుగలేదు'' అని ప్రసాద్ చెప్పారు. జరుగబోయే స్కాం గురించి ముందస్తుగా అధికారులను హెచ్చరించినప్పటికీ, వారు ఇలా నిర్లక్ష్యపూర్వకంగా స్పందించడంతో, వ్యవస్థపై తనకున్న నమ్మకం పోయిందన్నారు ప్రసాద్. అయితే ప్రసాద్, చోక్సికి వ్యతిరేకంగా ఎలాంటి ఫైట్ చేయలేదు. ఈ కుంభకోణం గురించి తనకు లీక్ కావడంతో, ముందస్తుగానే పీఎంఓకు అలర్ట్ ఇచ్చారు. కానీ వారు పట్టించుకోలేదు. ప్రసాద్కు ఇవ్వాల్సిన రూ.13 కోట్లను ఇవ్వకుండా.. ఆయన్ను చోక్సి మోసం చేశారు. బెంగళూరులోని గీతాంజలి జెమ్స్ ఫ్రాంచైజీని ప్రసాద్ నిర్వహిస్తున్నారు. చెల్లిస్తానన్న ఏ నగదును చోక్సి తనకు ఇవ్వలేదని ప్రసాద్ ఆరోపించారు. స్టోర్ ప్రాంతాల అద్దె ఇలాంటివేమీ తనకు ఇవ్వకుండా ఎగొట్టారన్నారు. ఈ విషయంపై ప్రసాద్ బెంగళూరులోని సెంట్రల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు కూడా దాఖలు చేశారు. ఏడాది అనంతరం ప్రసాద్ చెప్పినట్టు బ్యాంకింగ్ రంగంలోనే అతిపెద్ద కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఏడాది క్రితమే అధికారులు స్పందించి ఉంటే, ఈ స్కాం ఇంతదూరం వచ్చేది కాదని ప్రజలు, విపక్షాలు మండిపడుతున్నాయి. -
నీరవ్ మోదీతో ముఖేష్ అంబానీకి లింక్?
ఆయన పేరుకి డైమాండ్ కింగ్. పెద్ద పెద్ద షోరూంలతో కోట్లలో వ్యాపారం చేస్తున్నారు. కానీ ప్రజల సొమ్మును మాత్రం పీల్చుకుతిన్నారు. అసలు విషయం బయటికి వచ్చేసరికి దేశం విడిచి పోయారు. ఆయనే ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ.11,400 కోట్ల మేర కన్నం వేసి, నాకేం సంబంధం లేదన్నటూ న్యూయార్క్ వెళ్లిపోయారు. స్కాం బయటికి వచ్చేసరికి, ఆయన విదేశాల్లో ఉన్నారు. ఈ అవినీతి తిమింగలాన్ని పట్టుకోవడానికి సీబీఐ, ఈడీలు తీవ్ర కసరత్తు ప్రారంభించేశాయి. అయితే ఈ డైమాండ్ కింగ్కు, దేశంలో అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీకి సంబంధాలున్నట్టు తెలిసింది. బిలీనియర్ అంబానీ బ్రదర్ల మేనకోడలు ఇషితా సల్గాంకర్, నీరవ్ మోదీ తమ్ముడు నిషాల్ మోదీని పెళ్లి చేసుకుంది. ఇలా ఈ రెండు కుటుంబాలకు సంబంధం ఏర్పడింది. నిషాల్, ఇషితా పెద్ద సమక్షంలో లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వీరి వివాహం అంగరంగ వైభవంగా 2016లో గోవాలో జరిగింది. ప్రముఖ వ్యాపారవేత్తల నుంచి బాలీవుడు స్టార్ల వరకు అందరూ ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. వీరి ప్రీ-వెడ్డింగ్ పార్టీని ముఖేష్ అంబానీనే స్వయంగా చేశారు. బంకింగ్హామ్ ప్యాలెస్ తర్వాత ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రాపర్టీ ముంబై యాంటిలియా హౌస్లో వీరి ప్రీ-వెడ్డింగ్ పార్టీ జరిగింది. ఇషితా ప్రముఖ గోవా పారిశ్రామిక వేత్త దత్రాజ్ సల్గాంకర్ కుమార్తె కావడం విశేషం. అంబానీ కుటుంబానికి, దత్రాజ్ కుటుంబానికి మంచి సన్నిహిత సంబంధాలున్నాయి. అంబానీ చెల్లెలు దీప్తి సల్గాంకర్ను దత్రాజ్ పెళ్లి చేసుకున్నారు. నీరవ్ మోదీ తమ్ముడు నిషాల్ మోదీ కూడా తన మేనమామ మెహల్ చోక్సి నేతృత్వంలో డైమాండ్ వ్యాపారమే నిర్వహిస్తున్నారు. గీతాంజలి జెమ్స్కు మెహల్ చోక్సి యజమాని. నిషాల్ ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పీ, పారాగన్ జువెల్లరీ ఎల్ఎల్పీ, పారగన్ మెర్కండైజింగ్ ఎల్ఎల్పీ, పంచజన్య డైమాండ్స్ ఎల్ఎల్పీ ఇవన్నీ నీరవ్ మోదీకి డిజైన్ పార్టనర్లుగా ఉన్నారు. -
బాధ్యత ఎవరిది?
పీఎన్బీ ఉద్యోగులు నీరవ్ మోదీ కంపెనీలకు అక్రమంగా లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్ (ఎల్వోయూ)లు జారీ చేయడం, వీటిని ఆధారం చేసుకుని విదేశాల్లోని బ్యాంకు శాఖలు బయ్యర్స్ క్రెడిట్ (కొనుగోలు రుణాలు) ఇవ్వడం చేశాయి. వీటి విలువ సుమారు రూ.11,400 కోట్లు (1.77 బిలియన్ డాలర్లు) అని పీఎన్బీఐ స్టాక్ ఎక్సేంజ్లకు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. అయితే, ఈ కేసులో ఇప్పుడు ఏంటి పరిష్కారం అన్న సందేహాలు రావచ్చు. మోదీ సంస్థలు పీఎన్బీకి బకాయి పడినంత చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. దీంతో పీఎన్బీ బయ్యర్స్ క్రెడిట్ ఇచ్చిన బ్యాంకులకు తిరిగి చెల్లింపులు చేస్తుంది. తనకు ఆరు నెలల సమయం ఇస్తే రూ.6,000 కోట్లు చెల్లిస్తానంటూ మోదీ ఇప్పటికే పీఎన్బీకి తెలిపినట్టు వార్తలు వెలువడ్డాయి. అయితే, మోదీ చెల్లించకపోతే?ఈ బాధ్యత ఎవరిది పీఎన్బీదా లేక ఎల్వోయూ ఆధారంగా రుణాలిచ్చిన బ్యాంకులదా...? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలి. ఎల్వోయూ: ఎల్వోయూ అన్నది ఓ దేశీయ బ్యాంకు తన ఖాతాదారుని తరఫున అంతర్జాతీయ లావాదేవీ నిర్వహించేందుకు ఇచ్చే అంగీకార పత్రం. దీన్ని సాధారణంగా వాణిజ్య రుణ పత్రంగా ఉపయోగిస్తుంటారు. రుణం తీసుకోవాలనుకున్న వ్యక్తి స్థానిక బ్యాంకును సంప్రదించి విదేశీ బ్యాంకు లేదా భారత బ్యాంకుకు చెందిన విదేశీ శాఖ పేరిట ఎల్వోయూ జారీ చేయాలని కోరొచ్చు. ఆ ఎల్వోయూ ఆధారంగా విదేశాల్లోని బ్యాంకు శాఖ బయ్యర్స్ క్రెడిట్ (వాణిజ్య రుణం/ కొనుగోలుకు రుణం)ను విడుదల చేస్తుంది. అప్పుడు ఆ మొత్తం స్థానిక బ్యాంకు నోస్ట్రో ఖాతాలో జమ అవుతుంది. నోస్ట్రో అకౌంట్ అన్నది ఫారీన్ కరెన్సీ బ్యాంకు అకౌంట్. అప్పుడు రుణ గ్రహీత ఈ మొత్తాన్ని తన అవసరాలకు వినియోగించుకోవచ్చు. సాధారణంగా ఆభరణాల కంపెనీలకు ఎల్వోయూపై ముడి వజ్రాల కొనుగోలు కోసం బ్యాంకులు స్వల్పకాలిక రుణాలు ఇస్తుంటాయి. ముడి వజ్రాన్ని సానబెట్టి దాన్ని తుది ఉత్పత్తిగా మార్చి ఎగుమతి చేసిన తర్వాత వచ్చే నిధులతో అంతర్జాతీయ బ్యాంకు శాఖకు చెల్లింపులు చేస్తాయి ఆభరణాల కంపెనీలు. ఒకవేళ రుణ గ్రహీత విదేశీ బ్యాంకు నుంచి తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించడంలో విఫలమైతే... ఆ మొత్తాన్ని చెల్లించాల్సిన బాధ్యత అతనికి ఎల్వోయూ జారీ చేసిన బ్యాంకుపైనే ఉంటుంది. చాలా కేసుల్లో ఖాతాదారులు 100 శాతం క్యాష్ మార్జిన్ను ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాలో ఉంచితేనే బ్యాంకులు ఆ విలువకు సరిపడా ఎల్వోయూలను జారీ చేస్తుంటాయి. ఒకవేళ ఖాతాదారుడు చేతులెత్తేస్తే క్యాష్ మార్జిన్తో విదేశీ శాఖకు చెల్లింపులు చేస్తుంది. పీఎన్బీపైనే బాధ్యత...: బ్యాంకర్ల అభిప్రాయం ప్రకారం ‘‘ సందిగ్ధత ఏమీ లేదు. వాస్తవ అంశాల ప్రకారం చూస్తే తుది బాధ్యత పీఎన్బీపైనే ఉంటుంది. పీఎన్బీ గ్యారంటీ ఆధారంగానే రుణం జారీ చేయడం జరిగింది. అంతేకాదు పీఎన్బీకి చెందిన నోస్ట్రో ఖాతా నుంచే ఆ రుణాన్ని పంపిణీ చేయడం కూడా జరిగింది’’ అని పేర్కొన్నారు. పీఎన్బీ వాదన ఏమిటంటే విదేశీ బ్యాంకు శాఖలు ఆర్బీఐ మార్గదర్శకాలను సరిగా పట్టించుకోలేదని, నిబంధనల ప్రకారం ఇచ్చిన రుణాన్ని తిరిగి 90 రోజుల్లోనే వసూలు చేసుకోవాల్సి ఉంటుందని పీఎన్బీ వాదన. మరి 2011 నుంచి ఎల్వోయూల ఆధారంగా రుణాల జారీ వ్యవహారం నడుస్తున్నట్టు పీఎన్బీ వెల్లడించిన నేపథ్యంలో ఇంతకాలం పాటు బయ్యర్స్ క్రెడిట్ ఇచ్చిన విదేశీ బ్యాంకు శాఖలు ఏం చేస్తున్నాయన్న సందేహం కూడా రాకమానదు. -
స్కాం ఎఫెక్ట్ : రూ. 7వేల కోట్లు ఆవిరి
సాక్షి, ముంబై: మాల్యా తరహాలో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ భారీ కుంభకోణం వెలుగు చూడటంతో మార్కెట్లో జ్యువెల్లరీ షేర్లు భారీగా నష్టపోయాయి. ఇన్వెస్టర్ల అమ్మకాలతో పలుషేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. అంతేకాదు పీఎన్బీ ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ. 7వేల కోట్లు ఆహుతైపోయింది. ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ లావాదేవీల్లో భారీగా అక్రమాలు ఆరోపణల నేపథ్యంలో మార్కెట్ లో ఆందోళన నెలకొంది. దీంతో అటు జ్యువెలరీ, బ్యాంక్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. దీంతోపాటు ప్రభుత్వ రంగ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) ముంబై బ్రాంచీలో సుమారు రూ. 11,400 కోట్లమేర అక్రమ లావాదేవీలు జరిగిన నేపథ్యంలో జ్యువెలరీ స్టాక్స్లో ఇన్వెస్టర్లు అమ్మకాల వెల్లువ సాగింది. ముఖ్యంగా పీసీ జ్యువెలర్స్ షేరు దాదాపు 9 శాతం పతనంకాగా గీతాంజలి జెమ్స్ షేర్ లో అదే ధోరణి. ఇంకా తంగమాయిల్ జ్యువెలరీ , టీబీజెడ్, రాజేష్ ఎక్స్పోర్ట్స్, రినైసన్స్ జ్యువెలరీ నష్టపోయిన వాటిల్లో ఉన్నాయి. మరోవైపు పంజాబ్ నేషనల్ బ్యాంక్ షేరు కూడా దాదాపు 13 శాతం కుప్పకూలింది. రెండు రోజుల్లో మొత్తం 18శాతం నష్టపోయింది. బుధవారం నాటి ట్రేడింగ్లో ఇన్వెస్టర్లు మూడు వేలకోట్ల రూపాయలను కోల్పోగా, సీబీఐ ప్రకటన వెలువడిన వెంటనే గురువారం మరో నాలుగు వేల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సందర ఆవిరైపోయింది. దీంతో మొత్తం రూ7వేల కోట్ల సంపద నిమిషాల్లో గాల్లో కలిసిపోయింది. మరోవైపు ఇప్పటికే పీఎన్బీలో జరిగిన కుంభకోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్తోపాటు సీబీఐ పలు వ్యక్తులపై కేసులు నమోదు చేశాయి. ఫైర్స్టార్ డైమండ్ కంపెనీ చీఫ్ నీరవ్ మోదీతోపాటు, అతడి భార్య, సోదరుడు, తదితరులపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. -
మాల్యాను మించిన మరో కేడీ
సాక్షి, ముంబై: వేలకోట్ల రూపాయలు ఎగవేసి లండన్కు చెక్కేసిన లిక్కర్ కింగ్ విజయ్మాల్యాను మించిన భారీ అవినీతి తిమింగలం సీబీఐ వలకు చిక్కింది. ఆ తిమింగలమే ప్రభుత్వ రంగ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంక్లో భారీ స్కాంకు పాల్పడిన నిందితుడు ప్రముఖ సెలబ్రిటీ డైమండ్ వ్యాపారి కావడం గమనార్హం. వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రూ.11,400 కోట్ల మేర పంజాబ్ నేషనల్ బ్యాంకులో మోసపూరిత లావాదేవీలను గుర్తించినట్టు పంజాబ్ నేషనల్ బ్యాంకు బీఎస్ఈ ఫైలింగ్లో పేర్కొంది. దీంతో సీబీఐ, ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారులతో కుమ్మక్కై అండర్టేకింగ్ లెటర్లు సంపాదించి వాటిని విదేశాల్లో సొమ్ము చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో నీరవ్ మోదీ ఆఫీసులు, షోరూమ్లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడి చేశారు. ముంబై, ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. మాల్యా తరహాలో భారీ కుంభకోణం వెలుగులోకి రాడంతో మార్కెట్ వర్గాల్లో కలవరం మొదలైంది. దీంతో పంజాబ్ నేషనల్ కుంభకోణంపై బ్యాంకు అధికారులు మీడియా సమావేశం నిర్వహించారు. ఎలాంటి అక్రమాలను సహించమని, క్లీన్ బ్యాంకింగ్కు కట్టుబడి ఉన్నామని పీఎన్బీ ఎండీ , సీఈవో సునీల్ మెహతా ప్రకటించారు. వేలకోట్ల రూపాయలను ఎగవేసి సింగపూర్కు చెక్కేసిన నీరవ్ మోదీపై లుక్ అవుట్ జారీ అయిందని బ్యాంక్ అధికారులు వెల్లడించారు. జనవరి 30న ఎఫ్ఐఆర్ నమోదు అయిందనీ విచారణ అనంతరం పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు. అలాగే ఈ కేసులో తమ బ్యాంకుకు చెందిన ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసినట్టు చెప్పారు. దీనికి సంబంధించి రిజర్వ్ బ్యాంకు నుంచి ఇప్పటివరకు తమకు ఎలాంటి ఆదేశాలు లేవని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అవసరమైతే ఫోరెన్సిక్ ఆడిట్ కూడా చేపడతామన్నారు. 2011 నుంచి అవినీతి లావాదేవీలు చోటు చేసుకున్నట్టు జనవరి మూడవ వారంలోనే గుర్తించామన్నారు. మూడు నాలుగురోజులు అంతర్గత విచారణ అనంతరం దీనిపై సీబీఐకి ఫిర్యాదు చేశామని ఎండీ ప్రకటించారు. అక్రమ, అనధికారిక లావాదేవీలకు పాల్పడిన అధికారులపై చర్యతీసుకుంటున్నామన్నారు. నిందితులను క్షమించేదిలేదనీ, ఖాతాదారుల ఆర్థిక ప్రయోజనాలను కాపాడతామని హామీ ఇచ్చారు. మరోవైపు ఈ పరిణామాల నేపథ్యంలో పీఎన్బీ షేరు 13శాతం కుప్పకూలింది. -
నీరవ్ మోదీ కేసులో కీలక విషయాలు
ముంబై : పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ కుంభకోణానికి పాల్పడి, విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీ కేసులో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముంబైలో ఆయన నివాసముంటున్న రిజిస్ట్రర్ ప్లాట్కి నీరవ్ మోదీ గత కొంత కాలంగా రాలేదని తెలిసింది. ముంబైలోని పెడరూట్ క్రాస్విన్నర్ హౌజ్లోని నాలుగో నెంబర్ ప్లాట్లో ఆయన తన కుటుంబసభ్యులతో కలిసి నివాసముండేవారు. కానీ గత రెండు నెలలుగా ఆయన అక్కడికి రాలేదని తెలిసింది. అంతేకాక పీఎన్బీలో ఇంత భారీ మొత్తంలో స్కాం చేసినప్పటికీ, నీరవ్ మోదీ ఇంట్లో మాత్రం ఎలాంటి తనిఖీలు జరుగలేదు. ఇప్పటి వరకు ఆయన ప్లాట్కు పోలీసులు కానీ, బ్యాంకు అధికారులు కానీ, సీబీఐ అధికారులు ఎవరూ రాలేదని నీరవ్ మోదీ సర్వెంట్ చెప్పాడు. ప్రస్తుతం మోదీ ఆఫీసులు, దుకాణాలు, వర్క్షాపుల్లోనే అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఢిల్లీ, సూరత్, ఢిల్లీలలో 13 ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆఫీసుల్లో తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు ఇప్పటి వరకు నీరవ్ మోదీ ఇంట్లో తనిఖీలు చేయకపోవడం చర్చనీయాంశమైంది. అంతేకాక బ్యాంకులకు వేలకోట్లు ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా లాగానే, ప్రస్తుతం నీరవ్ మోదీ కూడా వ్యవహరించారు. పీఎన్బీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకముందే నీరవ్ మోదీ విదేశాలకు చెక్కేశారు. పీఎన్బీకి రూ.280 కోట్ల చీటింగ్ కేసులో కొన్ని రోజుల కిందటే ఆయన్ని సీబీఐ అదుపులోకి తీసుకుని వదిలిపెట్టింది. అనంతరం పీఎన్బీ ఈ భారీ కుంభకోణాన్ని వెలుగులోకి తీసుకు వచ్చింది. నీరవ్ మోదీ విదేశాలకు పారిపోవడంపై అధికారులు, ప్రభుత్వం నిర్లక్ష్యం కొట్టుచ్చినట్టు కనిపిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మాల్యా కంటే అధికంగా నీరవ్ మోదీ ఈ కుంభకోణానికి పాల్పడ్డారు. దాదాపు రూ.11వేల కోట్ల మోసపూరిత లావాదేవీలు చేపట్టినట్టు పీఎన్బీ తేల్చింది. ఈ నగదును విదేశాలకు పంపినట్టు కూడా తెలుస్తోంది. ఈ కేసుపై సీబీఐ, ఈడీ రెండూ దర్యాప్తును ముమ్మరం చేశాయి. పీఎన్బీ మాత్రమే కాక, మొత్తం 30 బ్యాంకులు ఈ కుంభకోణ భారీన పడినట్టు తెలుస్తోంది. మరోవైపు నీరవ్ మోదీ జువెల్లరీస్కు బ్రాండు అంబాసిడర్గా వ్యవహరిస్తున్న బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, ఆయన కంపెనీకి నోటీసులు పంపింది. తనకు ప్రకటన డబ్బులు చెల్లించలేదని ఆ నోటీసుల్లో పేర్కొంది. -
విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీ
ముంబై : పంజాబ్ నేషనల్ బ్యాంకులో వెలుగుచూసిన భారీ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ దేశం విడిచి పారిపోయారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ) ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదుచేయక ముందే నీరవ్ మోదీ భారత్ను విడిచి స్విట్జర్లాండ్కు పారిపోయినట్టు తెలిసింది. పీఎన్బీలోని ముంబై బ్రాంచులో రూ.11వేల కోట్ల అక్రమాలు చోటుచేసుకున్నాయని బ్యాంకు బుధవారం రెగ్యులేటరీకి రిపోర్టు చేసింది. ఇన్నివేల కోట్ల నగదును విదేశాలకు తరలించినట్టు తేల్చింది. ఈ భారీ కుంభకోణం వెలుగులోకి రాగానే, బ్యాంకింగ్ రంగం తీవ్ర షాకింగ్కు గురైంది. ఈ అక్రమాల్లో బడా వజ్రాల వ్యాపారి, బిలీనియర్ నీరవ్ మోదీ పాత్ర ఉన్నట్టు పీఎన్బీ ఆరోపించింది. ఈయనపై సీబీఐ వద్ద రెండు ఫిర్యాదులు కూడా దాఖలు చేసింది. ఈ కుంభకోణం వెలుగులోకి రాకముందు నీరవ్పై రూ.280 కోట్ల చీటింగ్ కేసు నమోదైంది. ప్రస్తుతం పీఎన్బీ కుంభకోణంలో నీరవ్ పాత్ర ఉన్నట్టు ఆరోపిస్తూ, ఆయనకు వ్యతిరేకంగా సీబీఐతో పాటు ఈడీ కూడా మనీ లాండరింగ్ కేసు నమోదుచేసింది. అయితే రూ.5000 కోట్లను తిరిగి బ్యాంకులకు చెల్లించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు నీరవ్ మోదీ చెబుతున్నారు. మరోవైపు నీరవ్ మోదీ, పీఎన్బీ కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ముంబైలోని నీరవ్ మోదీ దుకాణాల్లో అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. అంతేకాక దేశవ్యాప్తంగా 21 ప్రాంతాల్లో తనిఖీలు జరుగుతున్నాయి. పీఎన్బీ మాజీ డీజీఎం గోఖుల్ శెట్టికి ఈడీ సమన్లు జారీచేసింది. అంతేకాక ఈ అక్రమాల్లో పాలుపంచుకున్నారనే ఆరోపణలతో 10 మంది బ్యాంకు ఉద్యోగులను పీఎన్బీ నిన్ననే(బుధవారమే) సస్పెండ్ చేసింది. పీఎన్బీతో పాటు యూనియన్ బ్యాంకు, ఎస్బీఐ ఓవర్సీస్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, అలహాబాద్ బ్యాంకులు కూడా నీరవ్ మోదీకి రుణాలు ఇచ్చినట్టు తెలిసింది. పీఎన్బీ కుంభకోణం వెలుగులోకి రాగానే, పలు బడా జువెల్లరీ సంస్థలపై కూడా ఇన్వెస్టిగేషనల్ ఏజెన్సీలు విచారణ చేపడుతున్నాయి. మార్కెట్ రెగ్యులేటరీ సెబీ కూడా ఈ స్కాంపై విచారణ చేపట్టనున్నట్టు తెలుస్తోంది. బ్యాంకులు, ఇతర లిస్టెడ్ కంపెనీలపై సెబీ దృష్టిసారించింది. భారీ కుంభకోణం నేపథ్యంలో పీఎన్బీ బ్యాంకు షేరు రెండు రోజుల్లో దాదాపు 17 శాతం నష్టపోయింది. ప్రముఖ జువెల్లరీ కంపెనీ షేర్లు కూడా భారీగా పడిపోతున్నాయి. -
పీఎన్బీ భారీ స్కాం : బ్యాంకులకు ఆదేశాలు
న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంకులో చోటు చేసుకున్న భారీ కుంభకోణం నేపథ్యంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు జారీచేసింది. అన్ని బ్యాంకులు వెంటనే స్టేటస్ రిపోర్టును అందించాలని ఆదేశించింది. సత్యం కంప్యూటర్స్ రూ.9వేల కోట్ల స్కాం అనంతరం, పీఎన్బీలో చోటుచేసుకున్న ఈ కుంభకోణమే అతిపెద్దది. దాదాపు రూ.11,346 కోట్ల మోసపూరిత లావాదేవీలు జరిగినట్టు బ్యాంకు గుర్తించింది. పెద్ద పెద్ద అవినీతి తిమింగలాలు తప్పించుకోవడానికి వీలులేదని, ఇదే సమయంలో నిజాయితీ రుణగ్రహీత వేధించబడవద్దని ఆర్థిక మంత్రిత్వ శాఖ అన్ని బ్యాంకులకు సీరియస్ ఆదేశాలు జారీచేసింది. వెంటనే స్టేటస్ రిపోర్టును తమకు అందించాలని తెలిపింది. పీఎన్బీలో చోటుచేసుకున్న ఈ కుంభకోణంపై సీబీఐ, ఈడీ విచారణను ముమ్మరం చేశాయి. కొంతమంది అకౌంట్ హోల్డర్స్ ప్రయోజనార్థం పీఎన్బీ ముంబై బ్రాంచులో ఈ మోసపూరిత లావాదేవీలు జరిగినట్టు తన రెగ్యులేటరీ ఫైలింగ్లో పేర్కొంది. ఈ మోసపూరిత లావాదేవీల నగదు విదేశాలకు తరలి వెళ్లినట్టు తెలుస్తోంది. దీంతో విదేశీ బ్యాంకు బ్రాంచులపై కూడా విచారణ చేపడుతున్నారు. ప్రముఖ జువెల్లరీ, బిలీనియర్ నిరీవ్ మోదీకి, ఈ స్కాంకు సంబంధం ఉన్నట్టు బ్యాంకు ఆరోపిస్తోంది. అంతేకాక మరో నాలుగు బడా జువెల్లరీ సంస్థలపై కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు నీరవ్మోదీ, మెహల్చౌక్సి బ్యాంకు అకౌంట్లు మోసపూరితమైనవిగా తేలింది. -
అసలెవరీ నీరవ్ మోదీ?
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ కుంభకోణం చోటుచేసుకున్నట్టు వెల్లడైన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని బ్యాంకే బుధవారం తేల్చింది. దాదాపు రూ.11,346 కోట్ల మేర మోసపూరిత లావాదేవీలు జరిగినట్టు బుధవారం బీఎస్ఈ ఫైలింగ్లో బ్యాంకు పేర్కొంది. అయితే ఈ భారీ కుంభకోణానికి, ప్రముఖ వజ్రాల వ్యాపారి, బిలీనియర్ నీరవ్ మోదీకి లింక్లున్నట్టు కూడా ఆరోపించింది. అయితే 10 రోజుల ముందు వరకు నీరవ్ మోదీ అంతపెద్ద సెలబ్రిటీ ఏమీ కాదు. ఎప్పుడైతే సీబీఐ వద్ద పంజాబ్ నేషనల్ బ్యాంకు తన ఫిర్యాదును దాఖలు చేసిందో ఇక అప్పటి నుంచి ఆయన ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. నీరవ్ మోదీ ఒక పవర్ ఫుల్ వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు, వజ్రాల కొనుగోలుదారి. బ్యాంకుకు దాదాపు రూ.280 కోట్ల మేర మోసం చేశారనే ఆరోపణలతో నీరవ్ మోదీపై ఫిబ్రవరి 5న సీబీఐ కేసు బుక్ చేసింది. తర్వాతి వారంలోనే బ్యాంకులోని ముంబై బ్రాంచులో భారీ మొత్తంలో కుంభకోణం చోటు చేసుకుందని, దాదాపు రూ.11,346 కోట్ల మేర మోసపూరిత లావాదేవీలు జరిగాయంటూ ఫిర్యాదు చేసింది. ఈ కుంభకోణంతో లింక్ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్ మోదీ, భారత్లో అత్యంత చిన్న వయసులోనే బిలీనియర్గా ఫోర్బ్స్ లిస్టులో చోటు దక్కించుకున్న వ్యక్తి.. 2.3 బిలియన్ డాలర్ల ఫైర్ స్టార్ డైమండ్ వ్యవస్థాపకుడు. వజ్రాల వ్యాపారుల కుటుంబంలోనే పుట్టిన నీరవ్ మోదీ, వజ్రాల వృత్తినే తన వ్యాపారంగా ఎంచుకున్నారు. ఆసియాలోని చైనా నుంచి నార్త్ అమెరికాలోని హవాయి దీవుల వరకు మూడు ఖండాలలో ఆయన తన వ్యాపారాలను విస్తరించారు. 2013లో ఫోర్బ్స్ బిలీనియర్స్ జాబితాలో తొలిసారి చోటు దక్కించుకున్నారు. 2016 ఫోర్బ్స్ బిలీనియర్స్ జాబితాలో ప్రపంచవ్యాప్తంగా నీరవ్మోదీకి 1,067 ర్యాంకు ఉండగా... భారత్లో ఆయన 46వ బిలీనియర్గా నిలిచారు. గతేడాది భారత్ నుంచి ఫోర్బ్స్ జాబితాలో 82వ ర్యాంకును పొందారు. 2014లో ఢిల్లీలో తన తొలి ఫ్లాగ్షిప్ స్టోర్ను లాంచ్ చేశారు. అనంతరం 2016లో న్యూయార్క్లో కూడా ఒక స్టోర్ను ఏర్పాటుచేశారు. ఇలా తన వ్యాపారాలను, స్టోర్లను గ్లోబల్గా విస్తరించుకుంటూ వెళ్లారు. ఆయన జువెల్లరీ డిజైన్లకు బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు. ఫ్యాషన్కు ఐకాన్గా నీరవ్ మోదీ జువెల్లరీస్ను చెప్పుకోవచ్చు. లగ్జరీ డైమాండ్ జువెల్లరీ డిజైనర్గా ఆయనకు పేరుంది. కేవలం వజ్రాలను జువెల్లరీగా ప్రమోట్ చేయడమే కాకుండా.. పెట్టుబడులుగా కూడా ప్రమోట్ చేస్తున్నారు. అయితే పీఎన్బీ నమోదుచేసిన చీటింగ్ కేసులో భాగంగా ఐటీ అధికారులు నీరవ్ మోదీ ఆఫీసులు ఢిల్లీ, సూరత్, జైపూర్ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఆయనకు వ్యతిరేకంగా ఇప్పటికే పలు రైడ్స్ కూడా జరిగాయి. నీరవ్మోదీతో పాటు మరో నాలుగు బడా జ్యుయలరీ సంస్థలపైనా దర్యాప్తు సంస్థలు విచారణను సీబీఐ ముమ్మరం చేసింది. ఈ విచారణలో పీఎన్బీఐ స్కాంలో నీరవ్ మోదీ, బడా జ్యుయలరీ సంస్థల పాత్ర ఏ మేర ఉందో బయటపడబోతుంది. -
పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ కుంభకోణం
ముంబై : పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ కుంభకోణం చోటు చేసుకుంది. బ్యాంకుకు చెందిన ముంబై బ్రాంచులో భారీగా మోసపూరిత లావాదేవీలు చోటుచేసుకున్నట్టు వెల్లడైంది. తన బ్యాంకులో దాదాపు రూ.11,359 కోట్లకు పైగా విలువైన మోసపూరిత లావాదేవీలను గుర్తించినట్టు పంజాబ్ నేషనల్ బ్యాంకు బీఎస్ఈ ఫైలింగ్లో పేర్కొంది. కొంతమంది అకౌంట్ హోల్డర్స్ ప్రయోజనార్థం ముంబైలోని తమ ఒక బ్రాంచులో ఈ మోసపూరిత లావాదేవీలు జరిగాయని తెలిపింది. ఈ నగదును ముంబై బ్రాంచు నుంచి విదేశాలకు పంపినట్టు తెలిసింది. ఈ లావాదేవీల ఆధారంగా విదేశాల్లోని వినియోగదారుల బ్యాంకు అకౌంట్లకు నగదును పంపినట్టు కనిపిస్తున్నాయని పేర్కొంది. ఈ విషయాన్ని ఇప్పటికే లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు విచారించడం ప్రారంభించాయని పీఎన్బీ తెలిపింది. పారదర్శకతమైన బ్యాంకింగ్ సేవలు అందించేందుకే బ్యాంకు కట్టుబడి ఉందని పీఎన్బీ చెప్పింది. ఈ వార్తల నేపథ్యంలో పీఎన్బీ బ్యాంకు షేరు భారీగా పడిపోయింది. దాదాపు 6 శాతం ఈ బ్యాంకు షేరు క్షీణించింది. -
పీఎన్బీ లాభం రూ.230 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రూ.230 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత క్యూ3లో ఆర్జించిన నికర లాభం రూ.207 కోట్లతో పోలిస్తే 11% వృద్ధి సాధించామని బ్యాంక్ తెలిపింది. ఇతర ఆదాయం, నిర్వహణ ఆదాయాలు పెరగడంతో నికర లాభం పుంజుకుందని, అయితే కేటాయింపులు పెరగడంతో వృద్ధి కూడా పరిమితంగానే నమోదయిందని విశ్లేషకులు పేర్కొన్నారు. ఎన్ఐఐ 7% అప్..: మొత్తం ఆదాయం రూ.14,124 కోట్ల నుంచి 8% వృద్ధితో రూ.15,257 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం 7% వృద్ధితో రూ.3,989 కోట్లకు చేరుకుందని, రుణ వృద్ధి 17%గా ఉందని తెలిపింది. ఈ క్యూ3లో బ్యాంక్ రూ.558 కోట్ల నికర లాభం, రూ.4,123 కోట్ల నికర వడ్డీ ఆదాయం ఆర్జిస్తుందని విశ్లేషకులు అంచనా వేశారు. మెరుగుపడిన రుణ నాణ్యత...: ఈ క్యూ3లో స్థూల మొండి బకాయిలు రూ.57,519 కోట్లకు, నికర మొండి బకాయిలు రూ.34,076 కోట్లకు తగ్గాయని పీఎన్బీ తెలిపింది. శాతాల పరంగా చూస్తే, స్థూల మొండి బకాయిలు 13.70% నుంచి 12.11%కి, నికర మొండి బకాయిలు 9.09% నుంచి 7.55 శాతానికి తగ్గాయి. పన్ను మినహా ఇతర అంశాలకు కేటాయింపులు రూ.2,562 కోట్ల నుంచి 74% (క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన 80%) వృద్ధితో రూ.4,467 కోట్లకు పెరిగాయి. ప్రభుత్వం చేయనున్న రూ.5,473 కోట్ల మూలధన పెట్టుబడులకు తమ డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని పీఎన్బీ పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో పీఎన్బీ షేరు 1.8% నష్టంతో రూ.160 వద్ద ముగిసింది. -
300 బ్రాంచ్లు మూత..
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంకు తన శాఖలను మూసివేయబోతుంది. వచ్చే 12 నెలల్లో నష్టాల్లో నడుస్తున్న 300 శాఖలను మూసివేయాలని లేదా వాటిని వేరే ప్రాంతానికి తరలించేయాలని ప్లాన్ చేస్తోంది. నష్టాల్లో నడుస్తున్న శాఖలను లాభాల్లోకి తీసుకురానున్నామని చీఫ్ ఎగ్జిక్యూటివ్, మేనేజింగ్ డైరెక్టర్ సునిల్ మెహతా తెలిపారు. దీనిపై పూర్తిగా అధ్యయనం చేసేందుకు సీనియర్ అధికారులతో ఓ గ్రూప్ ఏర్పాటుచేశామని బ్యాంకు చెప్పింది. బ్యాంకు నెట్వర్క్ హేతుబద్దీకరణకు ఈ గ్రూప్ పలు వ్యూహాలను రూపొందించనుందని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి బ్యాంకుకు 6,937 శాఖలున్నాయి. తన నెట్వర్క్కు మరో 178 శాఖలను కలుపుకుంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో కూడా మరో మూడు శాఖలను కలుపుకుని, సెప్టెంబర్ నాటికి మొత్తం 6,940 శాఖలను కలిగి ఉంది. పీఎన్బీకి ప్రస్తుతం 100 మిలియన్ కస్టమర్లుండగా.. 9,753 ఏటీఎంలు, 8,224 బీసీ అవుట్లెట్లు ఉన్నాయి. ఆర్బీఐ మే నెలలో పునఃసమీక్షించిన బ్యాంకింగ్ అవుట్లెట్ విధానంలో బ్యాంకులు తమ శాఖలను ప్రారంభించడానికి, వేరే ప్రాంతానికి తరలించడానికి, మూసివేయడానికి మరింత సుస్థిరతను అందించింది. ఈ నేపథ్యంలో పీఎన్బీ తన 300 బ్రాంచులను మూసివేయాలని లేదా తరలింపు చేయాలని భావిస్తోంది. -
కస్టమర్లకు షాకిచ్చిన మరో బ్యాంకు
సాక్షి, ముంబై: డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే దిశగా మరో ప్రభుత్వ రంగ బ్యాకు తన కస్టమర్లకు షాక్ ఇచ్చింది. దేశీయ రెండవ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు కూడా చార్జీల వడ్డన మొదలు పెట్టేసింది. ఇప్పటివరకూ ఉచితంగా అందిస్తున్న ఏటీఎం ట్రాన్సాక్షన్లపై ఇక మీదట బాదుడు షురూ చేయనుంది. పీఎన్బీ ఏటీఏల విత్డ్రాలపై నియంత్రణ విధించింది. ఏటీఎం ద్వారా నెలకు 5 లావాదేవీలు మించితే చార్జీని వసూలు చేయనున్నట్టు ఒక ప్రకటలో తెలిపింది. అక్టోబర్ 1 నుంచి ఈసవరించిన నిబంధనలు అమలు కానున్నాయి. సేవింగ్ / కరెంట్/ ఓవర్డ్రాఫ్ట్ ఖాతాదారులందరూ నెలకు అయిదు సార్లు పరిమితికి మించితే ఒక్కో లావాదేవీకి రూ.10 వసూలు చేయనున్నట్టు పేర్కొంది. పీఎన్బీ ఏటీఎం లావాదేవీలకుడా ఇది వర్తిస్తుందని తెలిపింది. అయితే, బ్యాలెన్స్ ఎంక్వయిరీ, ఫండ్ బదిలీ లేదా గ్రీన్ పిన్ అభ్యర్థన లాంటి ఇతర నాన్ ఫైనాన్షియల్ లావాదేవీలకు ఎటువంటి ఛార్జ్ ఉండదని బ్యాంకు స్పష్టం చేసింది. తద్వారా ఉచిత లావాదేలకు చరమగీతం పాడి ఖాతాదారులపై భారం పెంచింది. -
పీఎన్బీ పండుగ శుభవార్త!
సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త అందించింది. రానున్న దసరా దీపావళి సందర్భంగా కస్టర్లకు రుణాలపై తక్కువ వడ్డీరేట్ల ఆఫర్ను ప్రకటించింది. రుణాల వడ్డీరేటులో (ఎంసీఎల్ఆర్) కోత పెట్టింది. 20-25 బేసిస్పాయింట్లను తగ్గిస్తున్నట్టు గురువారం వెల్లడించింది. ఈ తగ్గింపురేట్లు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్టు తెలిపింది. తాజా నిర్ణయం ప్రకారం పీఎన్బీ ప్రస్తుత బేస్ వడ్డీరేటు 9.15శాతంగా ఉండనుంది. ఇప్పటివరకు ఇది 9.35 శాతం. వార్షిక ఎంసీఎల్ఆర్ 8.15 శాతంగాను, మూడు నెలల కాలానికి 8 శాతంగా ఉంది. -
సేవింగ్స్ వడ్డీరేట్లకు మరో రెండు బ్యాంకుల కోత
పీఎన్బీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పొదుపు ఖాతాలపై అరశాతం కట్ న్యూఢిల్లీ: దిగ్గజ ఎస్బీఐ తదితర బ్యాంకుల బాటలోనే తాజాగా పీఎన్బీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పొదుపు ఖాతాల డిపాజిట్లపై వడ్డీ రేట్లను అరశాతం తగ్గించాయి. రూ. 50 లక్షల దాకా బ్యాలెన్స్ ఉండే పొదుపు ఖాతాలపై వడ్డీ రేటును 3.50 శాతం తగ్గిస్తున్నట్లు పీఎన్బీ తెలిపింది. అలాగే వివిధ మెచ్యూరిటీలకు సంబంధించి రూ. 1 కోటి దాకా ఫిక్స్డ్ డిపాజిట్లపై కూడా వడ్డీ రేటును 15–40 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తున్నట్లు వివరించింది. అటు హెచ్డీఎఫ్సీ బ్యాంకు సైతం రూ. 50 లక్షల లోపు బ్యాలెన్స్ ఉన్న పొదుపు ఖాతాలపై వడ్డీ రేటును 4 శాతం నుంచి 3.5 శాతానికి తగ్గిస్తున్నట్లు, రూ. 50 లక్షల పైగా బ్యాలెన్స్ ఉన్న ఖాతాలపై యథాప్రకారం 4 శాతం వడ్డీ రేటు కొనసాగిస్తున్నట్లు తెలిపింది. రెండు బ్యాంకులు సవరించిన వడ్డీ రేట్లు ఆగస్టు 19 నుంచి అమల్లోకి వస్తాయి. అన్నింటికన్నా ముందుగా పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్ల తగ్గింపునకు ఎస్బీఐ శ్రీకారం చుట్టింది. అర శాతం తగ్గించి 3.5 శాతానికి పరిమితం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత యాక్సిస్ బ్యాంక్, బీఓబీ కూడా రూ. 50 లక్షల్లోపు ఖాతాలపై ఇదే బాటలో 3.5% వడ్డీ రేటు ఖరారు చేశాయి. -
పీఎన్బీ లాభం 12% వృద్ధి
క్యూ1లో రూ.343 కోట్లు న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ పంజాబ్ నేషనల్ బ్యాంకు జూన్ త్రైమాసికంలో మెరుగైన ఫలితాలను ప్రకటించింది. లాభం 12 శాతం వృద్ధితో రూ.343 కోట్లుగా నమోదైంది. ఆదాయం సైతం 7 శాతం పెరిగి రూ.14,468 కోట్లకు చేరింది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో లాభం రూ.306 కోట్లు, ఆదాయం రూ.13,475 కోట్లుగా ఉంది. ఆస్తుల నాణ్యత సైతం కొద్దిగా మెరుగైంది. స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ) 13.75 శాతం నుంచి 13.66 శాతానికి తగ్గగా, నికర ఎన్పీఏలు 9.16 శాతం నుంచి 8.67 శాతానికి దిగివచ్చాయి. దీంతో ఎన్పీఏలకు చేసిన కేటాయింపులు 19 శాతం తగ్గి రూ.2,559 కోట్లుగా ఉన్నాయి. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో ఎన్పీఏలకు కేటాయింపులు రూ.3,165 కోట్లు కావడం గమనార్హం. అయితే, మార్చి క్వార్టర్లో ఉన్న స్థూల ఎన్పీఏలు 12.53 శాతం కంటే పెరిగినట్టు తెలుస్తోంది. మెరుగైన ఫలితాలతో పీఎన్బీ స్టాక్ ధర బీఎస్ఈలో ఒక శాతం పెరిగి రూ.158.90 వద్ద క్లోజయింది. -
ఇక ఆ డెబిట్ కార్డులు రద్దు
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) మాస్ట్రో డెబిట్ కార్డు హోల్డర్లకు షాక్ ఇవ్వనుంది. మాస్ట్రో డెబిట్ కార్డులను త్వరలో రద్దు చేయనున్నట్టు పేర్కొంది. జూలై 31 నుంచి ఈ కార్డులను నిలిపివేయనున్నట్టు బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు తమ ఖాతాదారులకు బ్యాంకు సమాచారాన్ని కూడా అందిస్తోంది. తాము జారీ చేసిన అన్ని మాస్ట్రో కార్డులను జులై 31 నుంచి బ్లాక్ చేస్తామనీ, భద్రతను మరింత పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని బ్యాంకు అధికారులు ప్రకటించారు. ఇప్పటికే ఈ కార్డులు కలిగి ఉన్నవారు మరింత భద్రతతో కూడిన ఈఎంవీ చిప్ ఆధారిత కార్డులతో మార్చుకోవాలని వినియోగదారులను కోరింది. అలా మార్చుకోకపోతే ఆ కార్డులను పూర్తిగా బ్లాక్ చేస్తామని ప్రకటించింది. ఇందుకు జూలై 31ను గడువుగా విధించింది. 2015 లో జారీ చేసిన ఆర్బీఐ ఆదేశాల ప్రకారం అన్ని బ్యాంకులు చాలా సురక్షితమైన ఈఎంవీ చిప్ ఆధారిత కార్డులకు మైగ్రేట్ అవుతున్నట్టు బ్యాంక్ అధికారి ఒకరు తెలిపారు. డిసెంబర్ 31, 2018 నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉందని చెప్పారు. మరోవైపు కొత్త కార్డులతో మార్చుకోవడానికి బ్యాంకు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయమని బ్యాంక్ స్పష్టం చేసింది. మాస్ట్రో డెబిట్ కార్డు కలిగి ఉన్నవారు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏ బ్రాంచి నుంచైనా ఉచితంగా చిప్ ఆధారిత కార్డుతో మార్చుకోవచ్చని వివరించింది. కాగా పాత మాస్ట్రో డెబిట్ కార్డులతో సుమారు లక్ష మంది ఖాతాదారులు ఉన్నట్లు బ్యాంకు గుర్తించింది. అలాగే తమ ఖాతాదారులకు ఎస్ఎంఎస్లను కూడా పంపించిందని బ్యాంకు ఒక అధికారి తెలిపారు. -
కలుపుకునే ‘కింగ్’లు ఇవే
♦ పీఎన్బీ, బీవోబీ, బీవోఐ, కెనరా బ్యాంకులు ♦ ఇతర బ్యాంకులను విలీనం చేసుకునేందుకే ఎంపిక ♦ ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పణ న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకుల్లో (పీఎస్బీలు) భారీ స్థాయిలో విలీనాలు త్వరలో కార్యరూపం దాల్చనున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వరంగంలో 21 బ్యాంకులు ఉండగా, విలీనాలతో ఓ నాలుగైదు పెద్ద బ్యాంకులను ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగంలో బలంగా ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ), బ్యాంకు ఆఫ్ బరోడా (బీవోబీ), బ్యాంకు ఆఫ్ ఇండియా (బీవోఐ), కెనరా బ్యాంకులను ఎంపిక చేసినట్టు ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. ప్రభుత్వరంగంలోని చిన్న బ్యాంకులను విలీనం చేసుకునే సామర్థ్యం వీటికుందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే చిన్న బ్యాంకులను విలీనం చేసుకునేందుకు గల అవకాశాలను అన్వేషించాలంటూ ఈ బ్యాంకులను కేంద్ర ఆర్థిక శాఖ కోరినట్టు ఆ అధికారి వెల్లడించారు. విలీనానికి తమ వైపు నుంచి ఉన్న సానుకూలతలు, ప్రతికూలతలపై ఈ సంస్థలు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా సమర్పించాయి. ఈ ప్రక్రియ ఇప్పటికే మొదలైందని, ఇందుకు ఎటువంటి కాల పరిమితి లేదని ఆ అధికారి స్పష్టం చేశారు. ఎస్బీఐలో ఐదు అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంకు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి కలసిపోయిన విషయం విదితమే. భవిష్యత్తులో మరిన్ని విలీనాలు ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇప్పటికే తెలిపారు. విలీనం ఫలితమిచ్చేనా...? విలీనం చేసుకునేట్టు అయితే ఒకే ప్రాంతంలో శాఖలు పెరిగిపోవడం, సాంకేతిక అనుసంధానత, పోటీ వ్యతిరేక అంశాలు ఏవైనా తలెత్తుతాయా? తదితర వివరాలను ఆర్థిక శాఖ కోరింది. విలీనం అనంతరం ప్రతికూలత ఫలితాలు ఎదురవ్వకుండా చూడడమే దీని ఉద్దేశం. అయితే, ఈ విలీనాలు పీఎస్బీల బలోపేతానికి తోడ్పడతాయన్న విషయంలో విశ్లేషకులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విలీనం వెనుకనున్న ఉద్దేశమేంటని రేటింగ్ సంస్థ ఇక్రా గ్రూప్ హెడ్ కార్తీక్ శ్రీనివాసన్ సందేహం వ్యక్తం చేశారు. బలహీనంగా ఉన్న రెండు బ్యాంకుల విలీనంతో ఒక బలమైన బ్యాంకు ఏర్పడదన్నది ఆయన అభిప్రాయం. అలాగే, ఒక బలమైన బ్యాంకు, ఒక బలహీన బ్యాంకును విలీనం చేసినా పటిష్ట బ్యాంకు ఏర్పాటు అసాధ్యమన్నారు. విలీనం చేసుకున్న బ్యాంకు బలిపశువుగా మారే ప్రమాదమూ లేకపోలేదన్నారు. ఎస్బీఐ ఇందుకు ఉదాహరణ అని... ఆరు బ్యాంకుల విలీనం తర్వాత ఎస్బీఐ రూ.3,000 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించిందని, అదే విడిగా ఎస్బీఐ బ్యాంకు ఫలితాలను చూసుకుంటే రూ.2,815 కోట్ల లాభాన్ని ఆర్జించినట్టు ఆయన వివరించారు. సిండికేట్, విజయా, కెనరా విలీనం! విలీనానికి ఎంపిక చేసే సంస్థలు చిన్నవైనప్పటికీ ఆర్థికంగా స్థిరమైనవే అయి ఉండాలన్నది ఆర్థిక శాఖ ప్రతిపాదన. బెంగళూరు ప్రధాన కార్యాలయం గల కెనరా బ్యాంకు, విజయా బ్యాంకుతోపాటు సిండికేట్ బ్యాంకు (ప్రధాన కార్యాలయం మణిపాల్, కర్ణాటక)లు ఇప్పటికే విలీనంపై చర్చలు ప్రారంభించాయని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అలాగే కోల్కతా ప్రధాన కేంద్రంగా గల అలహాబాద్ బ్యాంకు, యూకో బ్యాంకు సైతం ఒక్కటిగా ఏర్పడవచ్చని చెప్పారు. మొండిబకాయిల సమస్య విలీనాలకు ఆటంకం కాబోదన్నారు. ఆర్బీఐ ఆంక్షల పరిధిలోకి సెంట్రల్ బ్యాంక్ భారీగా ఎన్పీఏల సమస్యను, ఆస్తులపై ప్రతికూల రాబడులను ఎదుర్కొంటున్న సెంట్రల్ బ్యాంకు కూడా ఆర్బీఐ దిద్దుబాటు కార్యాచరణ పరిధిలోకి వచ్చింది. ఈ విషయాన్ని బ్యాంకు స్టాక్ ఎక్సే్ఛంజ్లకు తెలియజేసింది. ఇప్పటికే ఐడీబీఐ, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, యూకో బ్యాంకు, దేనా బ్యాంకులు సైతం ఆర్బీఐ ఆంక్షల పరిధిలో ఉన్న విషయం తెలిసిందే. -
పంజాబ్ నేషనల్ బ్యాంక్ లాభం రూ.262కోట్లు
ముంబై: ప్రభుత్వ రంగ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) 2016-17 సంవత్సరానికి ఆశాజనక ఫలితాలను ప్రకటించింది. క్యూ4(జనవరి-మార్చి)లో రూ. 262 కోట్ల నికర లాభాలను నమోదు చేసింది. గత ఏడాది ఇదే క్వార్టర్ తో రూ. 12,669.21 కోట్లతో పోలిస్తే మొత్తం ఆదాయం రూ. 14,989.33గా నమోదుచేసింది. బ్యాడ్ లోన్లు తగ్గడం, వడ్డీ సంబంధ ఆదాయంలో పురోగతి ఫలితంగా ఈ లాభాలనుసాధించినట్టు పీఎన్బీ ప్రకటించింది. నికరవడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) 33 శాతం ఎగసి రూ. రూ. 3683 కోట్లను తాకింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 13.7 శాతం నుంచి 12.53 శాతానికి బలహీనపడ్డాయని కొత్తగా నియమితులైన బ్యాంక్ డైరెక్టర్ సునీల్ మెహతా తెలిపారు. తన బ్యాలెన్స్ షీట్ను మెరుగుపరిచేందుకు తన ఆస్తులను విక్రయించాలని యోచిస్తున్నచెప్పారు. రుతుపవనాలపై ఐఎండీ మంచి అంచనాలతో గ్రామీణ ఆదాయం బావుంటుందని అంచనావేశారు. ప్రభుత్వం ప్రకటించిన పథకాల వల్ల గ్రామీణ గృహ రంగంలో వృద్ధి ఉంటుందని మేము భావిస్తున్నామని మెహతా అన్నారు. రిటైల్, ఎంఎస్ఎంఈ, వ్యవసాయ రంగాల నుంచి లభిస్తున్న మంచి గిరాకీని చూస్తూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు 10-12 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నామని చెప్పారు. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన 2016-17లో గత ఏడాది 3,690వేలకోట్ల నష్టంతో పోలిస్తేనికర లాభం 1187వేలకోట్లుగా ఉంది. రూ. 57,225కోట్ల ఆదాయం సాధించింది. గత ఏడాది ఇది రూ. 56,903 కోట్లుగా ఉంది. అలాగే నికర ఎన్పీఏలు సైతం 8.61 శాతం నుంచి 7.81 శాతానికి దిగి వచ్చాయి. ప్రొవిజన్లు రూ. 9878 కోట్ల నుంచి తగ్గి రూ. 5753 కోట్లకు పరిమితమయ్యాయి. ఇతర ఆదాయం 68 శాతం జంప్చేసి రూ. 3102 కోట్లకు చేరింది. ఈ ఫలితాల నేపథ్యంలో పీఎన్బీ షేరు 4.55 శాతం లాభంతో ముగిసింది. -
పీఎన్బీ లాభం నాలుగింతలు
క్యూ3లో రూ. 207 కోట్లు... న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో నాలుగు రెట్లు పెరిగింది. గత క్యూ3లో రూ.51 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.207 కోట్లకు ఎగసిందని బ్యాంక్ తెలియజేసింది. ట్రెజరీ ఆదాయం పెరగడం, డిపాజిట్ల వ్యయం తగ్గడం, మొండి బకాయిల వసూళ్ల కారణంగా ఈ స్థాయి నికర లాభం వచ్చిందని బ్యాంక్ ఎండీ ఉషా అనంత సుబ్రహ్మణ్యం చెప్పారు. అయితే రుణ నాణ్యత తగ్గిందని పేర్కొన్నారు. గత క్యూ3లో రూ.8.47గా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ3లో 13.70%కి, అలాగే 5.86%గా ఉన్న నికర మొండి బకాయిలు 9.09%కి పెరిగాయి. మొత్తం ఆదాయం రూ.13,891 కోట్ల నుంచి 4% పెరిగి రూ.14,498 కోట్లకు పెరిగింది. ఫీజు ఆదాయంతో కలుపుకొని ఇతర ఆదాయం రూ.1,671 కోట్ల నుంచి 50% వృద్ధితో రూ.2,513 కోట్లకు పెరిగిందన్నారు. అయితే నికర వడ్డీ ఆదాయం 9% తగ్గి రూ.3,731 కోట్లకు చేరిందని ఉష తెలిపారు. మొండి బకాయిల వసూళ్లపై దృష్టి.. రుణాలు పెరగకగపోవడం వల్లే మొండి బకాయిలు పెరిగాయని, అంతేకానీ, పెద్ద కరెన్సీ నోట్ల రద్దు వల్ల కాదని ఉషా వివరించారు. గత క్యూ3లో రూ.2,867 కోట్లుగా ఉన్న కేటాయింపులు స్వల్పంగా పెరిగి రూ.2,947 కోట్లకు చేరాయని తెలిపారు. రుణాలు పెంచడం, మొండి బకాయిల వసూళ్లపై దృష్టి సారించనున్నామని పేర్కొన్నారు. సరైన సమయం, అవకాశం వచ్చినప్పుడు అనుబంధ కంపెనీల్లో వాటా వాటా విక్రయిస్తామని వివరించారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో పీఎన్బీ షేర్ ధర బీఎస్ఈలో 1.4% లాభపడి రూ.152 వద్ద ముగిసింది. -
గృహ, వాహన రుణాలు మరింత చౌక!
ఎస్బీఐ రుణ రేట్లు 0.90% తగ్గింపు అదే బాటలో పీఎన్బీ, యూనియన్ బ్యాంకులు జనవరి 1 నుంచే అమల్లోకి.. న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ సూచనల మేరకు బ్యాంకులు వడ్డీ రేట్ల కోత దిశగా చర్యలు ప్రారంభించాయి. దేశంలోనే అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐ తన ప్రామాణిక లెండింగ్ రేటును 90 బేసిస్ పాయింట్లు (0.90%) తగ్గిస్తూ ఆదివారం నిర్ణయాన్ని ప్రకటించింది. ఇదే బాటలో పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ), యూనియన్ బ్యాంకులు సైతం నడిచాయి. పీఎన్బీ 70 బేసిస్ పాయింట్లు, యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా 90 బేసిస్ పాయింట్ల మేర కోత విధించాయి. దీనివల్ల గృహ, వాహన రుణాలు మరింత చౌకగా మారనున్నాయి. డీమోనిటైజేషన్ నేపథ్యంలో భారీ స్థాయిలో డిపాజిట్లు రావడంతో బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించడం ద్వారా పెద్ద ఎత్తున రుణ విపణిని పెంచుకునే వ్యూహంతో ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. బ్యాంకులు ఈ స్థాయిలో లెండింగ్ రేటును తగ్గించడం ఇటీవలి కాలంలో ఇదే ప్రథమం. నెల నుంచి మూడేళ్ల రుణాలపై... ఎస్బీఐకి చెందిన నిధుల సేకరణ వ్యయం ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్)ను ఏడాది కాల వ్యవధికి ప్రస్తుతం 8.90 శాతం ఉండగా, తాజాగా దాన్ని 8 శాతానికి తగ్గించింది. రెండేళ్లు, మూడేళ్లు కాల వ్యవధిగల రుణాలపై ఇంతే మొత్తం తగ్గిస్తూ 8.10, 8.15 శాతానికి తీసుకొచ్చింది. ఒక నెల, మూడు నెలలు, ఆరు నెలల కాలావధి కలిగిన రుణాలపైనా వడ్డీ రేటును 0.9 శాతం తగ్గించింది. రేట్ల తగ్గింపు ఈ నెల 1 నుంచే అమల్లోకి వస్తాయని ఎస్బీఐ తెలిపింది. పీఎన్బీ ఏడాది కాల వ్యవధిగల రుణాలపై ఎంసీఎల్ఆర్ను 0.7 శాతం తగ్గించింది. దీంతో ఎంసీఎల్ఆర్ 8.45 శాతానికి దిగి వచ్చింది. మూడేళ్లు, ఐదేళ్ల రుణాలపైనా ఇంతే మొత్తం తగ్గించడం ద్వారా ఎంసీఎల్ఆర్ను 8.60 శాతం, 8.75 శాతాలకు సవరించింది. గత నవంబర్ నుంచి తాము మొత్తం 0.85 శాతం మేర ఎంసీఎల్ఆర్ను తగ్గించామని పీఎన్బీ తన ప్రకటనలో తెలిపింది. కాగా, యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా కూడా ఏడాది కాల వ్యవధిగల రుణాలపై ఎంసీఎల్ఆర్ను 0.65 శాతం నుంచి 0.90 శాతం వరకు తగ్గిస్తున్నట్టు ఆదివారం ప్రకటించింది. దీంతో గతేడాది కాల వ్యవధిగల రుణాలపై ప్రామాణిక వడ్డీ రేటు 8.65 శాతానికి తగ్గింది. గతవారం ఎస్బీఐ అనుబంధ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ట్రావెన్కోర్తోపాటు ఐడీబీఐ బ్యాంకు సైతం లెండింగ్ రేటును తగ్గించిన విషయం తెలిసిందే. త్వరలో డిపాజిట్లపైనా కోత ‘‘డిపాజిట్ల రాక అధిక స్థాయిలో ఉన్నందున బ్యాంకుల వద్ద లిక్విడిటీ అధిక స్థాయికి చేరింది. దీంతో లెండింగ్ రేటు తగ్గింపు నిర్ణయాన్ని తీసుకున్నాం. దీనివల్ల రుణాలకు డిమాండ్ పెరుగుతుంది. డిపాజిట్లపై వడ్డీ రేట్లను కూడా సమీక్షిస్తాం’’ అని ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య పేర్కొన్నారు. ఆర్థిక రంగానికి సానుకూలం... బ్యాంకుల నిర్ణయాన్ని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ ఆహ్వానించారు. దీనివల్ల రుణాల జారీ ఊపందుకుంటుందని, ఇది ఆర్థిక రంగానికి సానుకూలమన్నారు. డీమోనిటైజేషన్ తర్వాత వడ్డీ రేట్లను తగ్గించే ధోరణి మొదలైందని, బ్యాంకుల వద్ద గణనీయ స్థాయిలో తక్కువ వ్యయ ఆధారిత నిధులు ఉన్నట్టు ట్వీట్ చేశారు. ఎంసీఎల్ఆర్ అంటే... బ్యాంకులు గతేడాది జూన్లో బేస్ రేటు విధానం నుంచి నూతన బెంచ్మార్క్ లెండింగ్ రేటు అయిన ఎంసీఎల్ఆర్కు మళ్లాయి. ఆర్బీఐ రేట్ల తగ్గింపును రుణగ్రహీతలకు పూర్తి స్థాయిలో బదిలీ చేసేందుకు ఈ విధానాన్ని అప్పటి గవర్నర్ రఘురామ్ రాజన్ తీసుకొచ్చారు. ఎంసీఎల్ఆర్ అనేది బ్యాంకులు కొత్తగా జారీ చేసే రుణాలపై అమలు చేసే కనీస వడ్డీ రేటు. అంటే కచ్చితంగా ఇంతే మొత్తంపై రుణాలు జారీ చేయాలని లేదు. కాకపోతే ఇంతకంటే తక్కువ రేటుకు బ్యాంకులు రుణాలను ఇవ్వవు. ఈ విధానం కింద బ్యాంకులు నిధుల సేకరణ వ్యయాలు, వివిధ కాలావధిగల డిపాజిట్లపై అయ్యే వ్యయాలు, రుణాల జారీకి అయ్యే వ్యయం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎంసీఎల్ఆర్ను నిర్ణయిస్తాయి. రాజన్ తన హయాంలో 1.5 శాతం మేర రేట్లను తగ్గించగా... తర్వాత వచ్చిన ఉర్జిత్ పటేల్ మరో పావు శాతం మేర కోత విధించారు. అయినా బ్యాంకులు వీటిలో సగం శాతం కూడా కస్టమర్లకు బదిలీ చేయని విషయం గమనార్హం. రుణ రేట్లు ఎంత తగ్గొచ్చు... బ్యాంకులు సాధారణంగా గృహ రుణాలకు ఎంసీఎల్ఆర్పై 0.25–0.60 శాతం స్ప్రెడ్తో గృహ రుణ వడ్డీ రేట్లను నిర్ణయిస్తున్నాయి. ఒక్కో బ్యాంకు ఒక్కో కాలావధిగల ఎంసీఎల్ఆర్ ఆధారంగా రుణాలిస్తున్నాయి. ప్రధాన బ్యాంకులైన ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్లు ఒక ఏడాది ఎంసీఎల్ఆర్ రేటుపై 25 శాతం స్ప్రెడ్ వేసుకొని గృహ రుణాలపై రేట్లను నిర్ణయిస్తున్నాయి. ఉదాహరణకు ఎస్బీఐకి సంబంధించిన ఏడాది ఎంసీఎల్ఆర్ ఇప్పటివరకూ 8.9 శాతం అయినందున, 75 లక్షల వరకూ తీసుకునే గృహ రుణంపై 9.15 శాతం వడ్డీని విధిస్తున్నది. మహిళలకైతే ఇది 9.10 శాతం. ఇప్పుడు తాజాగా ఎస్బీఐ ఏడాది ఎంసీఎల్ఆర్ను 8 శాతానికి తగ్గించినందున గృహ రుణంపై రేటు 8.25 శాతం (మహిళలకు 8.2 శాతం) వుండవచ్చు. వాహన రుణాలు, వ్యక్తిగత రుణాలు, కార్పొరేట్ రుణాలు...ఇలా వివిధ రకాల రుణాలకు బ్యాంకు వివిధ కాలావధులకు సంబంధించిన ఒక ఎంసీఎల్ఆర్ను బెంచ్మార్క్గా పెట్టుకుని, దానికి కొంత స్ప్రెడ్ను జతచేసి బ్యాంకులు రేట్లను నిర్ణయిస్తాయి. -
పీఎన్బీ లాభాల క్షీణత
చెన్నై: ప్రభుత్వరంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ నికర లాభాల్లో క్షీణతను నమోదు చేసింది. సెప్టెంబర్ 30 తో ముగిసిన త్రైమాసికంలో రూ. 549.36 కోట్ల నికర లాభం పోస్ట్ చేసింది. గత ఆర్థిక త్రైమాసికం రూ 621.03 కోట్ల పోలిస్తే ఇది 11.5 తగ్గినట్టు కంపెనీ బీఎస్ సీ ఫైలింగ్ లో తెలిపింది. మొత్తం ఆదాయం స్వల్పంగా పెరిగి రూ 14,218.27 కోట్లుగా నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంలో ఇది రూ 13,702 కోట్లుగా ఉంది. అయితే, మూడు నెలల కాలంలో బ్యాంకు సంపాదించిన మొత్తం వడ్డీ 4.16 శాతం క్షీణించి రూ 11,830.36 కోట్లు. గత ఏడాది రూ. 12,345 కోట్లుగా ఉంది. బ్యాడ్ రుణాల శాతం 34.6 శాతం పెరిగి రూ 2,534కోట్లు, గత ఏడాది రూ. 1,882కోట్ల బ్యాడ్ లోన్ల విలువ ఉన్నట్టు కంపెనీ తెలిపింది. స్థూల మొండి బకాయిలు 13,63 శాతం పెరిగాయి. ఇదే కాలంలో గత ఆర్థిక సంవత్సరంలో 6.36 శాతం ఉండగా రెండవ త్రైమాసికంలోనికర మొండి బకాయిలు కూడా 9.10 శాతానికిపెరిగాయి. -
బెజవాడలో హీరో నాగశౌర్య
-
పీఎన్బీ గృహ, కార్ల రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు లేదు
♦ డాక్యుమెంటేషన్ ఫీజు కూడా రద్దు ♦ సెప్టెంబర్ 30 వరకూ ఆఫర్ న్యూఢిల్లీ: కొత్త గృహ, కార్ల రుణాలపై ప్రాసెసింగ్, డాక్యుమెంటేషన్ చార్జీలను ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) రద్దు చేసింది. ఈ రుణాలపై ఎలాంటి ప్రాసెసింగ్, డాక్యుమెంటేషన్ చార్జీలు ఉండని ఈ ‘మాన్సూన్ బొనాంజా’ ఆఫర్ సెప్టెం బర్ 30 వరకూ ఉంటుందని పీఎన్బీ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ రుణాలు ముఖ్యంగా గృహ, కారు, విద్యా రుణాలపైననే దృష్టి పెడతామని వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ తరహా ఆకర్షణీయ ఆఫర్ను ప్రకటించిన తొలి బ్యాంక్ తమదేనని తెలిపింది. కొన్ని ఎంపిక చేసిన టర్మ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను ఈ బ్యాంక్ ఇటీవల 0.25 శాతం వరకూ తగ్గించింది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి ఈ బ్యాంక్కు రూ.5,367 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. ఈ స్థాయి త్రైమాసిక నష్టాలు వచ్చిన ఏకైక ప్రభుత్వ రంగ బ్యాంక్ ఇదే. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి ఈ బ్యాంక్ రూ.307 కోట్ల నికర లాభాలు ఆర్జించింది. 2014-15 ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.3,281 కోట్లుగా ఉన్న బ్యాంక్ మొండిబకాయిల కేటాయింపులు గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో మూడు రెట్లకు పైగా పెరిగి రూ.11,380 కోట్లకు ఎగిశాయి. స్థూల మొండిబకాయిలు 6.55% నుంచి 12.9 శాతానికి, నికర మొండి బకాయిలు 4.06% నుంచి 8.61 శాతానికి పెరిగాయి. -
ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లు తగ్గించిన పీఎన్బీ
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) తాజాగా ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లను 0.25 శాతం వరకు తగ్గించింది. ఈ తగ్గింపు ఎంపిక చేసిన మెచ్యూరిటీలకు మాత్రమే వర్తిస్తుందని బ్యాంక్ తెలిపింది. రిటైల్ టర్మ్ డి పాజిట్ల (మెచ్యూరిటీ కాలం ఏడాది, ఆపై ఉన్నవి) వడ్డీ రేట్లను 0.05-0.25 శాతం మధ్యలో తగ్గించినట్లు పేర్కొంది. కొత్త రేట్లు జూలై 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. -
మాల్యా మొత్తం అప్పు కట్టాల్సిందే: పీఎన్బీ చీఫ్
న్యూఢిల్లీ: పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన విజయ్మాల్యా... ఆ మొత్తాన్ని చెల్లించాల్సిందేనని పఎన్బీ ఎండీ ఉషా అనంతసుబ్రమణ్యన్ స్పష్టం చేశారు. కొంత మొత్తాన్ని చెల్లిస్తామన్న మాల్యా ఆఫర్ను ఆమె తిరస్కరించారు. బ్యాంకింగ్ కన్సార్షియానికి నేతృత్వం వహించనప్పటికీ, అందులో ఒక భాగంగా వున్న తాము మాల్యా రుణ మొత్తం చెల్లించాల్సిందేనన్నది డిమాండ్ చేస్తున్నామన్నారు. పీఎన్బీకి మాల్యా చెల్లించాల్సిన మొత్తం రూ.800 కోట్లు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాసహా బ్యాంకుల కన్సార్షియంకు వడ్డీతో కలిపి మాల్యా దాదాపు రూ.9,200 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే అసలు దాదాపు రూ.6,000 కోట్లలో రూ.4,000 కోట్లు చెల్లిస్తానని, మిగిలిన రూ.2,000 కోట్లు వివిధ కోర్టుల్లో తాను దాఖలు చేసిన కేసుల విచారణ, తీర్పు ఆధారంగా చెల్లిస్తామని మాల్యా గతంలో ప్రతిపాదించారు. దీనిని బ్యాంకుల కన్సార్షియం తిరస్కరించింది. మాల్యా కేసుపై బ్యాంకర్లు, ఈడీ భేటీ న్యూఢిల్లీ: విజయ్ మాల్యా రుణ ఎగవేతల అంశంపై ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ), 17 బ్యాంకుల కన్సార్షియంకు నేతృత్వం వహిస్తున్న ఎస్బీఐ అధికారులు ఇక్కడ బుధవారం సమావేశం అయ్యారు. తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై వీరు చర్చించినట్లు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఈడీ తరఫున ఆర్థికమంత్రిత్వశాఖ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కేసులో ఇప్పటివరకూ చోటుచేసుకున్న పరిణామాలపై అధికారులు చర్చించారు. సంబంధిత న్యాయ పరమైన అంశాలను సమీక్షించారు. ఇంతకుమించి సమాచారం తెలియరాలేదు. -
ఆ బ్యాంకునూ భారీగా ముంచేసిన బకాయిలు
న్యూఢిల్లీ : దలాల్ స్ట్రీట్ కు భారీ షాకింగ్. భారత బ్యాంకింగ్ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా అతిపెద్ద క్వార్టర్ నష్టం. ఒక్కసారిగా పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ) ఢమాల్ మని పడిపోయింది. బుధవారం ప్రకటించిన మార్చి త్రైమాసిక ఫలితాల్లో రూ.5,370 కోట్ల భారీ నష్టాలను నమోదుచేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.307 నికల లాభాలను చూపించిన పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఈ ఏడాది మార్కెట్ విశ్లేషకులకు షాకిస్తూ భారీ నష్టాల్లో నిలిచింది. ఈ ఏడాది రూ.81కోట్ల లాభాలను నమోదుచేస్తుందని మార్కెట్ విశ్లేషకులు భావించారు. అయితే వీరి అంచనాలన్నీ తలకిందులయ్యాయి. స్థూల మొండిబకాయిలు ఈ త్రైమాసికంలో 12.9 శాతానికి ఎగబాకడంతో, నష్టాలు వాటిల్లాయని బ్యాంకు ప్రకటించింది. డిసెంబర్ త్రైమాసికంలో ఈ బకాయిలు 8.47శాతంగా ఉన్నాయి. మూడో త్రైమాసికంలో ఉన్న రూ.34,338 కోట్ల మొండిబకాయిలు, ఈ నాలుగో త్రైమాసికంలో రూ.55,818 కోట్లకి ఎగబాకాయి. స్థూల మొండి బకాయిలు త్రైమాసికం త్రైమాసికానికి రూ.21,480 కోట్లు పెరిగాయని బ్యాంకు తెలిపింది. ఇప్పటివరకూ విడుదలైన అన్ని బ్యాంకుల మొండి బకాయిల కన్నా ఈ బకాయిలే ఎక్కువ. మూడో అతిపెద్ద పబ్లిక్ రంగ బ్యాంకుగా ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంకు నికర నష్టాల దలాల్ స్ట్రీట్ ను షాకుకు గురిచేసింది. పీఎన్బీ ఫలితాల అనంతరం, మొత్తం 18 పబ్లిక్ రంగ బ్యాంకుల్లో తొమ్మిది బ్యాంకుల మార్చి క్వార్టర్ నష్టాలు ఏకంగా రూ.14,808 కోట్లని గణాంకాలు విడుదలయ్యాయి. బ్యాంకులు నమోదుచేస్తున్న ఈ నష్టాలతో పీఎస్ యూ బ్యాంకింగ్ రంగం మార్కెట్లో తీవ్ర నష్టాలను చవిచూస్తోంది. గత ఐదేళ్ల కాలంలో ఈ నెలలో నిఫ్టీ పీఎస్ యూ బ్యాంకు ఇండెక్స్ 6శాతం మేర పడిపోయింది -
దేశం కోసమైనా అప్పులు తీర్చండి
డిఫాల్టర్లకు పీఎన్బీ ఎండీ ఉష సూచన న్యూఢిల్లీ: చెల్లించగలిగే సామర్థ్యమున్న డిఫాల్టర్లు దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునైనా తీసుకున్న అప్పుల్ని తీర్చాలని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) ఎండీ ఉషా అనంతసుబ్రహ్మణ్యన్ సూచించారు. ‘‘డబ్బులున్నా సరే తీసుకున్న అప్పును తీర్చడానికి ఇష్టపడని వారు కొందరుంటారు. అలాంటివాళ్లు తీర్చాల్సిందే’’ అని ఆమె చెప్పారు. సంక్షోభంలో ఉన్న కింగ్ఫిషర్, ఇతర ఉద్దేశపూర్వక మొండి బకాయిదార్ల నుంచి బకాయిలు రాబట్టేందుకు తీసుకుంటున్న చర్యలపై స్పం దిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఉద్దేశపూర్వక ఎగవేతదారుల(విల్ఫుల్ డిఫాల్టర్లు) వల్ల ఇటు బ్యాంకులకు, అటు ప్రజలకు కూడా నిధులు అందుబాటులో లేకుండా పోతాయన్నారు. ఎగవేతదారుగా యునెటైడ్ బ్రూవరీస్.. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్కిచ్చిన రుణాలకు సంబంధించి దాని హోల్డింగ్ సంస్థ యునెటైడ్ బ్రూవరీస్ హోల్డింగ్స్ను (యూబీహెచ్ఎల్)ను ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా పీఎన్బీ ప్రకటించింది. ఎస్బీఐ ఇప్పటికే యూబీహెచ్ఎల్తో పాటు మాల్యా, కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ను విల్ఫుల్ డిఫాల్టర్లుగా ప్రకటించడం తెలిసిందే. పీఎన్బీకి కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ నుంచి రూ.800 కోట్లు రావాల్సి ఉంది. ఎస్బీఐ సారథ్యంలోని 17 బ్యాంకుల కన్సార్షియం కింగ్ఫిషర్కు రూ.6,900 కోట్ల పైగా రుణాలిచ్చింది. ప్రమోటర్లు తనఖా పెట్టిన షేర్లను విక్రయించగా కేవలం రూ. 1,100 కోట్లే రికవర్ అయ్యాయి. -
డిపాజిట్లపై వడ్డీ తగ్గించిన పీఎన్బీ, యాక్సిస్ బ్యాంక్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) బుధవారం కొన్ని స్థిర డిపాజిట్లపై వడ్డీరేట్లను పావు శాతం తగ్గించింది. రుణ రేట్ల తగ్గింపునకు ఇది సంకేతంగా భావించవచ్చు. బ్యాంక్ తాజా డిపాజిట్ కోత నిర్ణయం జూన్ 8వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పాలసీ రేటు పావు శాతం తగ్గించిన మరుసటి పీఎన్బీ డిపాజిట్ రేటు తగ్గించింది. పాలసీ నిర్ణయం వెలువడిన వెంటనే ఐడీబీఐ బ్యాంక్ డిపాజిట్ రేటు కోత నిర్ణయం తీసుకుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలహాబాద్ బ్యాంక్, పంజాబ్ సింథ్ బ్యాంక్, దేనా బ్యాంక్లు రుణ రేట్లు తగ్గించాయి. యాక్సిస్ ఇలా... కాగా ప్రైవేటురంగంలో మూడవ అతిపెద్ద బ్యాంక్ యాక్సిస్ కూడా కొన్ని మెచ్యూరిటీలపై స్థిర డిపాజిట్ రేట్లను పావు శాతం తగ్గించింది. యాక్సిస్ బ్యాంక్ నిర్ణయం జూన్ 9 నుంచి అమల్లోకి వస్తుంది. -
గృహ రుణాలపై ఎస్బీఐ వడ్డీరేటు తగ్గింపు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రూ.75 లక్షలు పైబడిన గృహ రుణాలపై వడ్డీరేటును 0.15% మేర తగ్గించింది.ఇదే సమయంలో రుణాలకు సంబంధించి శ్లాబ్లను ఎత్తివేసింది. దీని ప్రకారం గృహ రుణం ఇకపై ఎంత మొత్తం అయినా 10.15% వడ్డీ అమలవుతుంది. అయితే మహిళలకు సంబంధించి 5 బేసిస్ పాయింట్లు అంటే 0.05%(100 బేసిస్ పాయింట్లు 1%) రాయితీ ఉంటుంది. ఈ వడ్డీరేటు 10.10%గా అమలవుతుంది. బ్యాంక్ బేస్ రేటు (ఇంతకన్నా తగ్గించి రుణ రేటు ఉండడానికి వీలు లేదు) ప్రస్తుతం 10%. అంటే గృహ రుణం ఇకపై మహిళలకు బేస్ రేటుపై 10% అధికంగా, ఇతరుల విషయంలో 15% అధికంగా ఉంటుందన్నమాట. ఇప్పటి వరకూ ఇలా... ఇప్పటి వరకూ అంటే 2013 డిసెంబర్ 20 నుంచీ అమలవుతున్న విధానం ప్రకారం బ్యాంక్ రెండు స్లాబ్స్లో గృహ రుణం ఉండేది. ఇందులో ఒకటి రూ.75 లక్షల లోపు ఒక స్లాబ్. రూ.75 లక్షల పైబడి స్లాబ్ మరొకటి. రూ.75 లక్షల లోపు రుణంపై మహిళలకు 10.10% వడ్డీ, ఇతరులకు 10.15% అమలయ్యేది. రూ.75 లక్షల పైబడిన రుణంపై మహిళలకు 10.25% రుణం అమలయితే, ఇతరుల విషయంలో ఇది 10.30%గా ఉండేది. ఈ శ్లాబ్లు ఇకపై తొలగిపోయి శ్లాబ్ రహిత తాజా రేట్లు అమలవుతాయి. ఇప్పుడు శ్లాబ్లతో సంబంధం లేకుండా గృహ రుణాలపై మహిళలకు 10.10%, ఇతరులకు 10.15 శాతం చొప్పున వడ్డీ రేటు ఉంటుంది. కాగా, తాజా స్లాబ్ రహిత (యూనిఫామ్) గృహ రుణ రేట్లు 26 ఆగస్టు 2014 నుంచీ అమల్లోకి వచ్చాయి. మహిళల విషయంలో...: గృహ రుణం కోసం దరఖాస్తు చేసుకునే మహిళలు ఏకైక దరఖాస్తుదారుగా ఉండాలి. సహ-దరఖాస్తుదారులు అయితే వారిలో మహిళ మొదటివారై ఉండాలి. ఇదే విషయం ప్రోపర్టీకీ వర్తిస్తుంది. ప్రోపర్టీ కేవలం మహిళకు చెందినదై ఉండాలి. సహ యజమానులైతే, వారిలో మొదటివారు మహిళై ఉండాలి. పీఎన్బీ కూడా... పండుగ సీజన్ నేపథ్యంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) కూడా గృహ రుణాలపై వడ్డీరేట్లను తగ్గించింది. రూ. 2 కోట్ల వరకూ రుణాలపై వడ్డీరేటు 10.25%గా నిర్ణయించింది. అలాగే గృహ, కారు, ద్విచక్ర వాహనాల రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్ చార్జీలను పూర్తిగా రద్దుచేస్తున్నట్లు పేర్కొంది. రూ.2 కోట్ల పైబడిన రిటైల్, హౌసింగ్ రుణాలపై రేట్లు 10.50%గా బ్యాంక్ పే ర్కొంది. ఫ్లోటింగ్ ప్రాతిపదికన ద్విచక్ర వాహన రుణ రేటు 12.25%గా ఉంటుంది. ఫిక్స్డ్ బేసిస్పై కార్ రుణ రేటు 10.65 శాతంగా ఆఫర్ చేస్తోంది. ఫ్లోటింగ్ బేసిస్పై 10.50 శాతమని పేర్కొంది. -
6 రోజుల తర్వాత నష్టాలు
ఆరు రోజుల వరుస లాభాల తరువాత మార్కెట్లు మళ్లీ నష్టపోయాయి. సెన్సెక్స్ 106 పాయింట్లు క్షీణించి 26,314 వద్ద ముగిసింది. గత ఆరు రోజుల్లో 1,091 పాయింట్లు లాభపడ్డ కారణంగా ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ కోసం అమ్మకాలు చేపట్టినట్లు నిపుణులు విశ్లేషించారు. ఇక నిఫ్టీ సైతం 22 పాయింట్లు తగ్గి 7,875 వద్ద నిలిచింది. మంగళవారం ఇంట్రాడేలో సెన్సెక్స్ 26,530 వద్ద, నిఫ్టీ 7,918 వద్ద కొత్త రికార్డులు నెలకొల్పిన సంగతి తెలిసిందే. దేనా బ్యాంక్, ఓబీసీ డీలా కస్టమర్ల ఫిక్స్డ్ డిపాజిట్ సొమ్ము రూ. 439 కోట్లను దుర్వినియోగ పరిచాయన్న ఆరోపణలతో దేనా బ్యాంక్(రూ. 256 కోట్లు), ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(రూ. 180 కోట్లు)లపై ప్రభుత్వం ఫోరెన్సిక్ ఆడిట్కు ఆదేశించిందన్న వార్తలు ఈ బ్యాంక్ షేర్లను పడగొట్టాయి. దేనా బ్యాంక్ 5%, ఓబీసీ 3.5% చొప్పున పతనమయ్యాయి. ఫార్మా, స్మాల్క్యాప్ షేర్ల హవా మార్కెట్ నష్టపోయినప్పటికీ బీఎస్ఈలో హెల్త్కేర్ ఇండెక్స్ 3% ఎగసింది. మార్కెట్ల ట్రెండ్కు విరుద్ధంగా స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా 1% బలపడింది. -
స్టాక్ మార్కెట్లో హైటెన్షన్
ఎగ్జిట్ పోల్స్తో భారీ ఒడిదుడుకులు మార్కెట్ కదలికలపై స్టాక్ నిపుణుల అంచనాలు నేటి సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ విడుదల శుక్రవారం ఉదయం నుంచి ఎన్నికల ఫలితాలు నేడు ఐఐపీ, రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు గురువారం టోకు ధరల ద్రవ్యోల్బణం వివరాలు పీఎన్బీ, డాక్టర్ రెడ్డీస్, టెక్ మహీంద్రా ఫలితాలు న్యూఢిల్లీ: ఎగ్జిట్ పోల్స్, ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఈ వారం మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశముందని స్టాక్ నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల తుది దశ పోలింగ్ సోమవారం(12న)తో ముగియనుంది. దీంతో సాయంత్రం పోలింగ్ సమయం ముగిసిన అర్థగంట తరువాత నుంచి వివిధ సంస్థలు నిర్వహించిన అభిప్రాయ సేకరణ (ఎగ్జిట్ పోల్) ఫలితాలు వెల్లడికానున్నాయి. ఇవి ముగిశాక శుక్రవారం(16న) ఉదయం నుంచీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల అసలు ఫలితాల లెక్కింపు మొదలుకానుంది. వెరసి ఈ వారం స్టాక్ మార్కెట్లు భారీ స్థాయిలో హెచ్చుతగ్గులను చవిచూసే అవకాశమున్నదని అత్యధిక శాతం నిపుణులు అంచనా వేశారు. సుస్థిర ప్రభుత్వమైతే ఓకే ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటైతే దీర్ఘకాలంలో స్టాక్ మార్కెట్లు మెరుగుపడతాయని కొటక్ సెక్యూరిటీస్ ప్రైవేట్ క్లయింట్ గ్రూప్ రీసెర్చ్ వైస్ప్రెసిడెంట్ సంజీవ్ జర్బాడే పేర్కొన్నారు. ఇక ఆర్థిక అంశాల విషయానికివస్తే సోమవారం(12న) మార్చి నెలకు పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ) గణాంకాలు వెల్లడికానున్నాయి. వీటితోపాటు ఏప్రిల్ రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) వివరాలు తెలియనున్నాయి. ఇక గురువారం(15న) టోకు ధరల ద్రవ్యోల్బణం గణాంకాలు వెలువడనున్నాయి. మరోవైపు మరికొన్ని కార్పొరేట్ దిగ్గజాలు క్యూ4 ఫలితాలను ప్రకటించనున్నాయి. ఫలితాల జాబితాలో పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, బజాజ్ ఆటో, ఎన్టీపీసీ ఉన్నాయి. సీట్ బెల్ట్లు బిగించుకోవలసిందే.... ఆర్థిక గణాంకాలు, దిగ్గజ కంపెనీల క్యూ4 ఫలితాలు, లోక్సభ ఫలితాలు వంటి అంశాల నేపథ్యంలో ఈ వారం స్టాక్ మార్కెట్లకు అత్యంత కీలకంగా నిలవనుందని విశ్లేషకులు పేర్కొన్నారు. వెరసి ఇన్వెస్టర్లు, ట్రేడర్లు లేదా బ్రోకర్లు ఎవరైనాగానీ మార్కెట్లో నమోదయ్యే వేగవంతమైన కదలికలను తట్టుకునేందుకు సీట్ బెల్ట్లు బిగించుకోవలసిందేనని వ్యాఖ్యానించారు. సోమవారం వెల్లడికానున్న ఎగ్జిట్ పోల్స్ కారణంగా మార్కెట్ ఆశ్చర్యకర కదలికలను నమోదు చేసే అవకాశముందని చెప్పారు. ఫలితాలదే పైచేయి కంపెనీల ఆర్థిక ఫలితాలు, ద్రవ్యోల్బణం, ఐఐపీ గణాంకాలున్నప్పటికీ మార్కెట్ ట్రెండ్ను నిర్దేశించేది ఎన్నికల ఫలితాలేనని రెలిగేర్ సెక్యూరిటీస్ రిటైల్ పంపిణీ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ అభిప్రాయపడ్డారు. ఈ అన్ని అంశాల నేపథ్యంలో మార్కెట్లలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉన్నదని, అయితే సానుకూల ధృక్పథంతో కొనసాగవచ్చునని తెలిపారు. ఎన్నికల ఫలితాలకు అనుగుణంగా సమీప కాలంలో మార్కెట్ల కదలికలు ఉంటాయని అత్యధిక శాతం మంది నిపుణులు వివరించారు. ఈ వారం అత్యంత కీలకంగా నిలవనుందని చెప్పారు. ఫలితాలు వెల్లడయ్యే రోజు దగ్గరపడుతున్నకొద్దీ మార్కెట్లో సెంటిమెంట్ బలపడుతున్నదని, సానుకూల ఫలితాలను ఇన్వెస్టర్లు అంచనా వేస్తున్నారని తెలిపారు. ఇన్వెస్ట్ చేయొచ్చు... ప్రస్తుతం ఈక్విటీలలో పెట్టుబడులకు అత్యంత అనువైన సమయమని ఏంజెల్ బ్రోకింగ్ చైర్మన్ దినేష్ ఠక్కర్ పేర్కొన్నారు. స్టాక్స్లో పెట్టుబడులను కొనసాగించవచ్చునని చెప్పారు. కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుందన్న అంచనాలతో గడిచిన శుక్రవారం మార్కెట్ల ప్రామాణిక సూచీ సెన్సెక్స్ 650 పాయింట్లు హైజంప్ చేసిన విషయం విదితమే. ఫలితంగా స్టాక్ మార్కెట్ చరిత్రలో తొలిసారి 23,000 పాయింట్లను అధిగమించింది కూడా! రూ. 5,000 కోట్ల పెట్టుబడులు న్యూఢిల్లీ: ఈ నెలలో ఇప్పటి వరకూ విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) దేశీ క్యాపిటల్ మార్కెట్లో రూ. 5,000 కోట్లను నికరంగా ఇన్వెస్ట్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల కారణంగా కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటవుతుందన్న అంచనాలు ప్రధానంగా జోష్ నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. తద్వారా సంస్కరణల అమలు వేగమందుకుంటుందని, పెట్టుబడులు పెరిగి ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని ఎఫ్ఐఐలు ఆశిస్తున్నట్లు తెలిపారు. వెరసి గడిచిన వారంలో(2-9) నికరంగా రూ. 2,124 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయగా, మరో రూ. 2,871 కోట్లను బాండ్లు తదితర డెట్ సెక్యూరిటీలలో ఇన్వెస్ట్ చేశారు. వీటి మొత్తం విలువ దాదాపు రూ. 5,000 కోట్లు(83 కోట్ల డాలర్లు). మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ విడుదల చేసిన తాజా గణాంకాలివి. 9 దశలలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నేటి(12)తో ముగియనుంది. ఫలితాలు శుక్రవారం(16న) వెల్లడికానున్నాయి. ఈ అంచనాలతో ఇటీవల ఎఫ్ఐఐల పెట్టుబడుల జోరు పెరిగిన సంగతి తెలిసిందే. ఈ జనవరి మొదలు ఇప్పటివరకూ ఎఫ్ఐఐల పెట్టుబడులు ఒక్క స్టాక్స్లోనే రూ. 33,923 కోట్లకు చేరుకున్నాయి. ఈ బాటలో రుణ మార్కెట్లో సైతం రూ. 29,217 కోట్లను నికరంగా ఇన్వెస్ట్ చేశారు. -
పంజాబ్ నేషనల్ బ్యాంక్ నిరుత్సాహకర ఫలితాలు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) అక్టోబర్-డిసెంబర్(క్యూ3) కాలానికి నిరుత్సాహకర ఫలితాలు సాధించింది. నికర లాభం 42%పైగా క్షీణించి రూ. 755 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2012-13) క్యూ3లో రూ. 1,306 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. మొండి బకాయిలకు కేటాయింపులు, పన్ను చెల్లింపులు వంటివి పెరగడంతో లాభాలపై ప్రతికూల ప్రభావం పడిందని బ్యాంక్ చైర్మన్ కేఆర్ కామత్ చెప్పారు. మొండిబకాయిల కేటాయింపులు రూ. 466 కోట్ల నుంచి రూ. 1,083 కోట్లకు పెరిగినట్లు వెల్లడించారు. నికర మొండిబకాయిలు(ఎన్పీఏలు) 2.56% నుంచి 2.8%కు పెరిగినట్లు తెలిపారు. నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) 13% ఎగసి రూ. 4,221 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు(ఎన్ఐఎం) 3.57%గా నమోదైంది. మొత్తం ఆదాయం రూ.11,499 కోట్ల నుంచి రూ.11,922 కోట్లకు స్వల్పంగా పెరిగింది. వాటాదారులకు షేరుకి రూ.10 మధ్యంతర డివిడెండ్ను ప్రకటించింది. రిజర్వ్ బ్యాంక్ రెపో రేటు పెంపుపై స్పందిస్తూ రుణాలకు డిమాండ్ పుంజుకుంటే అటు డిపాజిట్లు, ఇటు రుణాలపై వడ్డీ రేట్లు పెంచే అవకాశముంటుందని చెప్పారు. ఫలితాల నేపథ్యంలో బ్యాంక్ షేరు బీఎస్ఈలో 6% జంప్చేసి రూ. 549 వద్ద ముగిసింది. -
ఎస్బీఐ పండుగ ధమాకా
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కొన్ని రుణాలపై వడ్డీరేట్లను తగ్గించింది. కారు, వినియోగ వస్తువులపై వడ్డీరేట్లను తగ్గించడంతోపాటు, ప్రాసెసింగ్ ఫీజులను సైతం తగ్గించాలని నిర్ణయించింది. పండుగ సీజన్లో రుణ డిమాండ్ను ఆకర్షించడంలో భాగంగా బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. ఐఓబీ, దేనా బ్యాంకులు కూడా ఇదే బాటలో నడిచాయి. ఇప్పటికే పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ), ఐడీబీఐ బ్యాంక్లు ఆటోమొబైల్స్సహా టెలివిజన్లు, ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్ల వంటి వినియోగ వస్తువులపై ప్రత్యేక వడ్డీరేట్లను ఆఫర్ చేశాయి. తాజా నిర్ణయంతో ఎస్బీఐ కూడా ఈ జాబితాలో చేరింది. తగ్గింపు ఇలా...: బ్యాంకింగ్ దిగ్గజం రేట్ల తగ్గింపు విషయానికి వస్తే- కారు రుణాలపై వడ్డీరేటు 0.20 శాతం తగ్గింది. 10.55 శాతానికి చేరింది. ప్రాసెసింగ్ ఫీజు రుణ మొత్తంలో 0.51 శాతం తగ్గించింది. అంటే కనీస ప్రాసెసింగ్ ఫీజు రూ.1,020 నుంచి రూ.500 ఫ్లాట్ రేట్కు తగ్గుతుంది. వేతన జీవులకు ప్రత్యేకం తన బ్యాంకులో వేతన అకౌంట్లు ఉన్న ఖాతాదారులకు సంబంధించి వినియోగ వస్తువులు, కారు, ద్విచక్ర వాహనాల కొనుగోళ్ల విషయంలో కూడా ప్రత్యేక పండుగల రుణ పథకాలను బ్యాంక్ ఆవిష్కరించింది. ఈ ఆఫర్ కింద పలు డిస్కౌంట్లు లభించనున్నాయి. 12.05 శాతం నుంచి వడ్డీరేట్లపై రుణ లభ్యత అందుబాటులో ఉంటుంది. ఇందుకు సంబంధించి ‘ఉత్సవ్ కీ ఉమంగ్ ఎస్బీఐ కీ సంగ్’ ఆఫర్ అక్టోబర్ 7 నుంచి 31 జనవరి 2014 వరకూ అందుబాటులో ఉంటుంది. నేపథ్యం ఇదీ...: కొన్ని రంగాలలో డిమాండ్ పెంపు లక్ష్యంగా కొంత తక్కువ రేటుకు ప్రభుత్వ రంగ బ్యాంకులు రుణాలను మంజూరు చేయాలని, ఇందుకు తగిన పెట్టుబడులను ప్రభుత్వం బ్యాంకులకు పంప్ చేయాలని కేంద్రం గతవారం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే పలు బ్యాంకులు ఈ దిశలో అడుగులు వేస్తున్నాయి. ఆర్థిక మంత్రి పీ చిదంబరం, ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్, ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి అరవింద్ మాయారాం మధ్య ఇటీవల జరిగిన సమావేశం ఈ మేరకు ఒక నిర్ణయం తీసుకుంది. ‘బడ్జెట్లో పేర్కొన్న రూ.14,000 కోట్ల కన్నా ఎక్కువగా, బ్యాంకులకు కావాల్సినంత మూలధన నిధులు సమకూర్చాలన్నది ప్రభుత్వ ప్రణాళిక. ఈ చర్య మందగమనాన్ని ఎదుర్కొనేందుకు, ఉత్పత్తిని పెంచేందుకు కూడా దోహదపడగల దని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఇటీవలి పారిశ్రామికోత్పత్తి గణాంకాల ప్రకారం కన్సూమర్ డ్యూరబుల్స్ రంగం గతేడాది జూలైతో పోలిస్తే ఈసారి జూలైలో 9.3 శాతం మేర క్షీణించింది. గతేడాది ఏప్రిల్-జూలై మధ్యకాలంలో 6.1 శాతం వృద్ధి ఉండగా.. ఈసారి అదే వ్యవధిలో ఏకంగా 12 శాతం క్షీణించింది. కార్ల కొనుగోళ్లు సైతం గణనీయంగా పడిపోయాయి. కాగా ఈ ప్రణాళికలను ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ కేసీ చక్రవర్తి వ్యతిరేకిస్తున్నారు. ఇవి బ్యాంకుల అసెట్ క్వాలిటీపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని ఆయన ఇప్పటికే వ్యక్తం చేశారు. ఐవోబీ కూడా... వినియోగ వస్తువులపై రుణ రేట్లను ప్రభుత్వ రంగ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐవోబీ) కూడా 2% వరకూ తగ్గించింది. దీనితో ఈ రేటు 13.25%కి తగ్గింది. తక్షణం ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని బ్యాంక్ ఒక ప్రకటనలో పేర్కొంది. వేతన జీవులు వినిమయ వస్తువుల కొనుగోళ్లకు సంబంధించి ఒక కొత్త వ్యక్తిగత రుణ పథకాన్ని కూడా ఆవిష్కరించినట్లు బ్యాంక్ తెలిపింది. దేనాబ్యాంక్ కాంబో లోన్ ప్లాన్... దేనాబ్యాంక్ కూడా కొన్ని విభాగాలకు సంబంధించి వడ్డీరేట్లను తగ్గించింది. కోటి రూపాయల వరకూ గృహ రుణాలపై వడ్డీరేట్లను బేస్రేట్ 10.25%గా నిర్ణయించినట్లు తెలిపింది. ఆపైన ఈ రేటు 10.50%గా ఉంటుంది. హౌసింగ్ లోను తీసుకున్న వారికి కాంబో ప్లాన్గా కార్, కన్జూమర్ డ్యూరబుల్స్ రుణాన్ని కూడా అందచేస్తామని పేర్కొంది. కాంబోప్లాన్లోని కార్ రుణానికి బేస్ రేట్ వర్తిస్తుంది. వినియోగ వస్తువులపై రుణ రేటు 11.75%గా ఉంది. కాగా కాంబో ఆఫర్తో సంబంధం లేకుండా కార్రుణంపై రేటును 1% తగ్గించింది. దీనితో ఈ రేటు 11%కి చేరింది. -
రుణాలపై వడ్డీ రేట్ల ఊరట..
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులు పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ), ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ), ఐడీబీఐలు వినియోగ వస్తువులు, వాహన రుణాలపై వడ్డీరేట్లను 2.50% దాకా తగ్గించాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులకు మరిన్ని రుణాలిస్తామన్న ప్రభుత్వ హామీతో ఈ బ్యాంకులు వడ్డీరేట్లలో కోత విధించాయని, త్వరలో ఎస్బీఐ కూడా ఇదే బాట పట్టనున్నదని నిపుణులంటున్నారు. పండుగ సీజన్లో రుణాలిచ్చి కొనుగోళ్ల ద్వారా ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు అందించడానికి ప్రభుత్వం ఈ నిధులను అందిస్తోంది. 100% పీఎన్బీ రుణం : కారు కొనుగోళ్లకు 10.65% వడ్డీరేట్లకే రుణాలందిస్తామని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) పేర్కొంది. టూ-వీలర్ల రుణాలపై వడ్డీరేట్లను 12.25%కి, వ్యక్తిగత రుణాలపై వడ్డీరేట్లను 12.75 శాతానికి తగ్గించామని వివరించింది. మొత్తం మీద వడ్డీరేట్లను 1-2.50% మేర తగ్గించామని పేర్కొంది. కారు రుణాలపై ఎలాంటి డాక్యుమెంటేషన్ చార్జీలు వసూలు చేయబోమని, ఎక్స్షోరూమ్ ధరపై 100% రుణమందిస్తామని పేర్కొంది. ఈ ఆఫర్లు వచ్చే ఏడాది జనవరి 31 వరకూ అందుబాటులో ఉంటాయని పీఎన్బీ పేర్కొంది. అయితే గృహ రుణాల రేట్లలో ఎలాంటి మార్పు లేదని తెలిపింది. ఓబీసీ కూడా: వినియోగ వస్తువులు, వ్యక్తిగత, వాణిజ్య వాహన రుణాలపై వడ్డీరేట్లను 0.25 శాతం తగ్గిస్తున్నామని ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ) మంగళవారం తెలిపింది. ఈ వడ్డీరేట్ల తగ్గింపు రేపటి(గురువారం) నుంచి అమల్లోకి వస్తుందని వివరించింది. ఫోర్ వీలర్ల కొనుగోళ్లకు ఇచ్చే రుణాలపై వడ్డీరేట్లను 12.25% నుంచి 12 శాతానికి తగ్గిస్తున్నామని పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే వ్యక్తిగత, వినియోగ వస్తువుల రుణాలపై వడ్డీరేట్లను 12.75% నుంచి 12.50 శాతానికి తగ్గించామని వివరించింది. కార్లు, టూ-వీలర్ల రుణాలకు సంబంధించి మూడేళ్లలో చెల్లించే రుణాలపై 10.75%, మూడేళ్లకు మించిన రుణాలపై 11% వడ్డీ రేట్లకే రుణాలను ఆఫర్ చేస్తున్నామని పేర్కొంది. బేస్రేట్కే ఐడీబీఐ రుణం కొత్తగా గృహ, వాహన రుణాలు తీసుకునే వారికి బేస్ రేట్కే(10.25 శాతం) రుణాలందిస్తామని ఐడీబీఐ పేర్కొంది. ఇది నేటి నుంచే వర్తిస్తుందని వివరించింది. ఈ రుణాలపై ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజులు వసూలు చేయబోమని వివరించింది. గృహ రుణాల రేట్లు అంతే..: ఎస్బీఐ కారు, కన్జూమర్ గూడ్స్ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉంది కానీ గృహ రుణాలపై మాత్రం తగ్గించే అవకాశాలే లేవని ఎస్బీఐ ఎండీ(ఇంచార్జ్) ఎ. కృష్ణకుమార్ స్పష్టం చేశారు. గృహ రుణాల వడ్డీ రేట్లు ఇప్పటికే చాలా కనిష్ట స్థాయిలోనే ఉన్నాయని ఆయన చెప్పారు. రిటైల్ రుణాల వడ్డీ రే ట్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి కొన్ని సూచనలు వచ్చాయని, రాబోయే నెలల్లో వీటి అమలుపై దృష్టి సారిస్తామన్నారు. ఇప్పటికే ఉన్న ఉత్పత్తులపైనే వడ్డీ రేట్ల తగ్గింపు ఉండగలదే తప్ప కొత్త వాటిని జాబితాలో చేర్చే యోచనేమీ లేదని కృష్ణకుమార్ చెప్పారు.