
పాత నోట్లతో లావాదేవీల వివరాలివ్వండి
కంపెనీలను కోరిన కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ: గతేడాది నవంబర్ 8 నుంచి డిసెంబర్ 30 వరకు చెల్లని రూ.500, రూ.1,000 నోట్లతో నిర్వహించిన లావాదేవీలు వివరాలు, ఆ సమయంలో ఎన్ని నోట్లు ఉన్నాయన్నది కంపెనీలు తమ వార్షిక బ్యాలన్స్ షీట్లలో వెల్లడించాలని కార్పొరేట్ వ్యవహారాల శాఖ కోరింది. అలాగే, ఆ కాలంలో చెల్లని నోట్లతో జరిపిన లావాదేవీల వివరాలను కంపెనీలు సరిగ్గానే వెల్లడించాయని ఆడిటర్లు తమ నివేదికల్లో పేర్కొనాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.