ఎమార్‌ డీమెర్జర్‌కు ఎన్‌సీఎల్‌టీ ఓకే | NCERT is okay for Emaar Deemer | Sakshi
Sakshi News home page

ఎమార్‌ డీమెర్జర్‌కు ఎన్‌సీఎల్‌టీ ఓకే

Published Wed, Jan 10 2018 1:10 AM | Last Updated on Wed, Jan 10 2018 1:10 AM

NCERT is okay for Emaar Deemer - Sakshi

న్యూఢిల్లీ: ఎమార్‌ ఎంజీఎఫ్‌ ల్యాండ్‌ కంపెనీ డీమెర్జర్‌కు నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ఆమోదం తెలిపింది. దీంతో ఎమార్‌ ఎంజీఎఫ్‌ ల్యాండ్‌ జాయింట్‌ వెంచర్‌ ఇక ఎమార్‌ ప్రాపర్టీస్, ఎమార్‌ డెవలప్‌మెంట్‌లుగా విడిపోతుంది. ఈ జేవీకి  చెందిన అన్ని రుణాలు, హక్కులు, అధికారాలు ఎంజీఎఫ్‌ డెవలప్‌మెంట్‌కు బదిలీ అవుతాయని ట్రిబ్యునల్‌ పేర్కొంది.

ఈ జేవీకి సంబంధించి విచారణలో ఉన్న అన్ని అంశాల బాధ్యత కూడా ఎంజీఎఫ్‌ డెవలప్‌మెంట్‌ కంపెనీకే ఉంటుంది. ఎమార్‌ ఎంజీఎఫ్‌  ల్యాండ్‌కు చెందిన ప్రతి 416 షేర్లకు ఎంజీఎఫ్‌ డెవలప్‌మెంట్స్‌ కంపెనీ ఒక్కోటి రూ.10 విలువైన 9 ఈక్విటీ షేర్లను జారీ చేస్తుందని పేర్కొంది. ఎమార్‌ ఎంజీఎఫ్‌ ల్యాండ్‌కు చెందిన రూ.713 కోట్ల డిబెంచర్లతో సహా ప్రస్తుత, భవిష్యత్తు రుణాలు కూడా ఎమ్‌జీఎఫ్‌ డెవలప్‌మెంట్‌కు బదిలీ అవుతాయని ఎన్‌సీఎల్‌టీ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement