NCLT
-
జొమాటోపై దివాలా పిటిషన్
న్యూఢిల్లీ: ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ జొమాటోపై గతంలో దాఖలు చేసిన దివాలా పిటిషన్ను పునరుద్ధరించమంటూ జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ)ని తాజాగా నోనా లైఫ్స్టైల్ ప్రయివేట్ లిమిటెడ్ అభ్యర్ధించింది.జొమాటోకు ఆపరేషనల్ క్రెడిటర్ అయిన నోనా లైఫ్స్టైల్ 2024లో దివాలా చర్యలకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ పిటిషన్పై విచారణ చేపట్టేందుకు ఎన్సీఎల్టీ అనుమతించలేదు.ఈ నేపథ్యంలో జోమాటోపై పిటిషన్ను పునరుద్ధరించవలసిందిగా దుస్తుల సరఫరాదారు నోనా లైఫ్స్టైల్ మరోసారి ఢిల్లీ ఎన్సీఎల్టీ బెంచ్ను ఆశ్రయించింది. జొమాటోపై కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియకు ఆదేశించవలసిందిగా అభ్యరి్థంచింది. అయితే ఇద్దరు సభ్యుల ఎన్సీఎల్టీ బెంచ్ విచారణను ఏప్రిల్కు వాయిదా వేసింది. -
స్పైస్జెట్కు కొత్త చిక్కులు
చవక విమానయాన సేవలు అందిస్తున్న స్పైస్జెట్కు కొత్త సమస్యలు ఎదురయ్యాయి. విమానాల లీజు రంగంలో ఉన్న ఐర్లాండ్కు చెందిన మూడు సంస్థలు, ఒక మాజీ పైలట్ స్పైస్జెట్పై ఎన్సీఎల్టీలో దివాలా పిటిషన్లు దాఖలు చేయడం ఇందుకు కారణం. స్పైస్జెట్ సుమారు రూ.110 కోట్లు బకాయి పడిందని, ఐబీసీ సెక్షన్ 9 కింద దివాలా ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ ఎన్జీఎఫ్ ఆల్ఫా, ఎన్జీఎఫ్ జెనెసిస్, ఎన్జీఎఫ్ చార్లీ పిటిషన్లు దాఖలు చేశాయి.ఈ వారం ప్రారంభంలో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ విచారణ సందర్భంగా పరిష్కార చర్చలు జరుగుతున్నందున ఈ విషయాన్ని పరిష్కరించడానికి స్పైస్జెట్ కొంత సమయం కోరింది. తదుపరి విచారణ కోసం 2025 ఏప్రిల్ 7న మూడు పిటిషన్లను లిస్ట్ చేయాలని ఎన్సీఎల్టీ ఆదేశించింది. లీజుదారులు గతంలో స్పైస్జెట్కు ఐదు బోయింగ్ 737 విమానాలను లీజుకు ఇచ్చాయి.ఇంజిన్లతో సహా విమానంలోని భాగాలను దొంగిలించి ఇతర విమానాలలో ఉపయోగించారని ఆరోపిస్తూ ఈ కంపెనీలు స్పైస్జెట్కు లీగల్ నోటీసును పంపించాయి. 19 సంవత్సరాలుగా విమానయాన రంగంలో ఉన్న స్పైస్జెట్.. ఎన్సీఎల్టీ, అప్పీలేట్ ట్రిబ్యునల్ ఎన్సీఎల్ఏటీ వద్ద విల్లిస్ లీజ్, ఎయిర్కాజిల్ ఐర్లాండ్, విల్మింగ్టన్, సెలెస్టియల్ ఏవియేషన్ వంటి రుణదాతల నుండి దివాలా పిటిషన్లను ఎదుర్కొంటోంది. -
ఆఫ్లైన్లోకి వెళ్లిన ఆన్లైన్ సేవలు
ఆన్లైన్ క్విక్ కామర్స్ సర్వీసులు అందించే డంజో మొబైల్ యాప్, వెబ్సైట్ సేవలు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి. ఇప్పటి వరకు కంపెనీ సీఈఓగా వ్యవహరించిన కబీర్ బిశ్వాస్ డంజోకు రాజీనామా చేసిన కొద్దిసేపటికే ఇలా సర్వీసులు ఆఫ్లైన్లోకి వెళ్లాయి. తాను ఫిప్కార్ట్ క్విక్ కామర్స్ విభాగంలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అయితే ఇంకా దీనిపై స్పష్టత రాలేదు.గత ఏడాది కాలంగా డంజో ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులే ఇలా సర్వీసులు ఆఫ్లైన్లోకి వెళ్లేందుకు కారణమని కొందరు చెబుతున్నారు. జనవరి 2022లో రిలయన్స్ రిటైల్ నుంచి గణనీయంగా 200 మిలియన్ డాలర్ల(రూ.1,600 కోట్లు) పెట్టుబడితో సహా 450 మిలియన్ డాలర్లకు(సుమారు రూ.3500 కోట్లు) పైగా నిధులు సమీకరించినప్పటికీ డంజో తన మార్కెట్ స్థానాన్ని కాపాడుకోవడానికి తీవ్రంగా కృషి చేసింది. ఇప్పటికే సమీకరించిన నిధులతో కంపెనీ కార్యకలాపాల నిర్వహణ భారంగా మారింది. అదనపు ఈక్విటీని సమీకరించలేకపోవడంతో కంపెనీ మరింత నష్టాల్లో జారుకుంది. తీసుకున్న బకాయిలు చెల్లించకపోవడంతో డంజో రుణదాతలు కంపెనీని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)కు తీసుకెళ్లాయి. దాంతో పరిస్థితి మరింత దిగజారింది. డంజోలో 26% వాటాను కలిగి ఉన్న రిలయన్స్ రిటైల్, గూగుల్తో సహా ఇతర పెట్టుబడిదారులు అదనపు నిధుల సమీకరణకు సంబంధించిన చర్చల నుంచి దూరంగా ఉన్నారు.ఇదీ చదవండి: ‘మీ లాభాల కోసం మేం చావలేం’ఈ నేపథ్యంలో కంపెనీ సీఈఓ బిశ్వాస్ సంస్థను వీడడం పెద్దదెబ్బగా మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇకమీదట డంజోను నిర్వహించడానికి బోర్డు లేదా నాయకత్వం లేకుండా పోయింది. పెండింగ్ జీతాలు, ఇన్వెస్టర్ల నిష్క్రమణ కారణంగా కంపెనీలోని చాలా మంది ఉద్యోగులు సంస్థను వీడారు. తమకు జీతాలు చెల్లించడం లేదంటూ కొందరు ఉద్యోగులు బిశ్వాస్పై ఫిర్యాదు చేశారు. ఈ తరుణంలో ఆయన ఫ్లిప్కార్ట్ క్విక్ కామర్స్ విభాగంలో చేరుతున్నారనే వార్తలు రావడం గమనార్హం. -
‘విలీనానికి ఆర్బీఐ ఎన్ఓసీ అవసరం లేదు’
ప్రముఖ ఆన్లైన్ క్విక్ కామర్స్ యూనికార్న్ జెప్టో మాతృ సంస్థల విలీనానికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుంచి నిరభ్యంతర పత్రం (NOC) అవసరం లేదని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) స్పష్టం చేసింది. ఈ నిర్ణయం జెప్టో తన కార్పొరేట్ కార్యకలాపాలు క్రమబద్ధీకరించడానికి, రాబోయే ఐపీఓకు సిద్ధం కావడానికి మార్గం సుగమం చేస్తుంది.భారత్లో జెప్టోను నిర్వహిస్తున్న ముంబైకి చెందిన కిరాణాకార్ట్ టెక్నాలజీస్ను, సింగపూర్కు చెందిన అనుబంధ సంస్థ కిరాణాకార్ట్ పీటీఈ లిమిటెడ్తో విలీనం చేయడానికి ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ ఆమోదం తెలిపింది. ఈ విలీనం ‘క్రాస్ బోర్డర్ విలీన నిబంధనల రెగ్యులేషన్ 9’ కిందకు వస్తుందని ట్రైబ్యునల్ పేర్కొంది. దీనికి ఆర్బీఐ ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకపోవడంతో విలీన ప్రక్రియ సులువైనట్లు అధికారులు తెలిపారు.చట్టపరమైన సంస్థల సంఖ్యను తగ్గించడం ద్వారా కార్పొరేట్ కంపెనీల కార్యకలాపాలను, వాటి నిర్మాణాన్ని సరళీకృతం చేయాలనే ఉద్దేశంతో ఎన్సీఎల్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. జెప్టో సైతం తన వినియోగదారులకు మరింత మెరుగైన సేవలందించేందుకు రివర్స్ ఫ్లిప్(మాతృ సంస్థల విలీనం) నిర్ణయం తీసుకుంది. ఈ చర్య వ్యాపార కార్యకలాపాలను పెంచుతుందని, వేగంగా నిర్ణయాలు తీసుకునేందుకు దోహదం చేస్తుందని, ఖర్చులను తగ్గిస్తుందని, భవిష్యత్తు నిధుల సేకరణను సులభతరం చేస్తుందని భావిస్తున్నారు.ఇదీ చదవండి: పండగ వేళ పసిడి ప్రియులకు గుడ్న్యూస్కంపెనీ బోర్డు 2024 అక్టోబర్లో ఈ విలీనం కోసం ఎన్సీఎల్టీలో అప్పీలు చేసుకుంది. అయితే ఈ ప్రక్రియ ఏప్రిల్ 2025 నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు. రోజర్పే, ఫ్లిప్కార్ట్, పైన్ ల్యాబ్స్, మీషో వంటి కంపెనీలు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకునేందుకు తాజా ఎన్సీఎల్టీ నిర్ణయంతో ఆమోదం తెలిపినట్లయింది. -
ఎన్పీఏ కేసులు.. ఆర్థిక శాఖ కీలక సూచనలు
న్యూఢిల్లీ: జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ), జాతీయ అస్సెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్ఏఆర్సీఎల్) వద్ద ఎన్పీఏ కేసుల సత్వర పరిష్కారానికి వీలుగా బ్యాంక్లను కేంద్ర ఆర్థిక శాఖ కీలక సూచనలు చేసింది. విధానపరమైన జాప్యం, కేసుల విచారణలో వాయిదాలను సాధ్యమైన మేర తగ్గించేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని, ఆయా కేసుల పురోగతిని పర్యవేక్షించాలని కోరింది.వసూలు కాని నిరర్థక రుణ ఖాతాలను ఎన్ఏఆర్సీఎల్కు విక్రయించడం లేదంటే దివాలా పరిష్కార చర్యలు కోరుతూ ఎన్సీఎల్టీ ముందుకు బ్యాంక్లు తీసుకెళ్లడం తెలిసిందే. ఎన్సీఎల్టీలో కేసుల తాజా సమాచారాన్ని బ్యాంక్లు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా కార్పొరేట్ శాఖ ఒక పోర్టల్ను కూడా అభివృద్ధి చేస్తోంది. ఎన్ఏఆర్సీఎల్, ఎన్సీఎల్టీలో కేసుల పరిష్కార యంత్రాంగం సమర్థతను పెంచడం, నిర్వహణ సవాళ్ల పరిష్కారం కోసం కేంద్ర ఆర్థిక సేవల కార్యదర్శి ఎం.నాగరాజు అధ్యక్షతన తాజాగా సమావేశం జరిగింది.కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేసే విషయమై ఇందులో చర్చించినట్టు ఆర్థిక శాఖ తన ప్రకటనలో తెలిపింది. రూ.95,711 కోట్ల విలువతో కూడిన 22 మొండి ఖాలాలను ఎన్ఏఆర్సీఎల్ సొంతం చేసుకోగా, రూ.1.28 లక్షల కోట్ల విలువ చేసే మరో 28 ఎన్పీఏ ఖాతాలను బ్యాంక్లు పరిష్కరించుకున్నట్టు సమావేశంలో చర్చకు వచ్చినట్టు పేర్కొంది. -
జెట్ ఎయిర్వేస్ కథ కంచికి..
న్యూఢిల్లీ: ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన జెట్ ఎయిర్వేస్ దివాలా పరిష్కార ప్రక్రియలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కంపెనీని లిక్విడేట్ చేయాలంటూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే, పరిష్కార ప్రణాళిక నిబంధనలను పాటించనందుకు గాను జలాన్ కల్రాక్ కన్సార్షియం (జేకేసీ) ఇన్వెస్ట్ చేసిన రూ. 200 కోట్ల మొత్తాన్ని జప్తు చేయాలని సూచించింది. ఇక రూ. 150 కోట్ల పర్ఫార్మెన్స్ గ్యారంటీని క్లెయిమ్ చేసుకునేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సారథ్యంలోని కన్సార్షియానికి అనుమతినిచ్చింది. రాజ్యాంగంలోని 142 ఆరి్టకల్ కింద సంక్రమించిన అధికారాలను వినియోగించుకుంటూ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పర్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా బెంచ్ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. తాజా పరిణామాలతో పాతికేళ్ల పైగా సాగిన జెట్ ఎయిర్వేస్ ప్రస్థానం ముగిసినట్లేనని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఎన్సీఎల్ఏటీకి అక్షింతలు.. జేకేసీ సమర్పించిన పనితీరు ఆధారిత బ్యాంక్ గ్యారంటీని (పీబీజీ) పాక్షిక చెల్లింపు కింద సర్దుబాటు చేసేందుకు నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) అనుమతించడాన్ని సుప్రీం కోర్టు ఆక్షేపించింది. దివాలా కోడ్ (ఐబీసీ) సూత్రాలకు విరుద్ధంగా పేమెంట్ నిబంధనలను పూర్తిగా పాటించకుండానే ముందుకెళ్లేందుకు జేకేసీకి వెసులుబాటునిచ్చినట్లయిందని వ్యా ఖ్యానించింది.జెట్ ఎయిర్వేస్ పరిష్కార ప్రణాళిక ఆమోదం పొంది అయిదేళ్లు గడిచినా కూడా కనీస పురోగతి కూడా లేదని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. దివాలా కేసుల విషయంలో ఈ తీర్పు ఓ ’కనువిప్పు’లాంటిదని, ఆర్థికాంశాలకు సంబంధించి ఇచ్చిన హామీలను సకాలంలో తీర్చాల్సిన అవసరాన్ని ఈ ఉత్తర్వులు స్పష్టం చేస్తాయని పేర్కొంది. 1992లో ప్రారంభం.. ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్కు సేల్స్ ఏజంటుగా వ్యవహరించిన నరేశ్ గోయల్ 1992లో జెట్ ఎయిర్వేస్ను ప్రారంభించారు. తొలుత ముంబై–అహ్మదాబాద్ మధ్య ఎయిర్ ట్యాక్సీ సర్వీసుగా కంపెనీ కార్యకలాపాలు మొదలుపెట్టింది. ఒక దశలో జెట్ ఎయిర్వేస్కి 120 పైగా విమానాలు ఉండేవి. ఇదీ చదవండి: అనిల్ అంబానీకి షాక్!.. రిలయన్స్ పవర్పై మూడేళ్ళ నిషేధం1,300 మంది పైలట్లు, 20,000 మంది పైచిలుకు ఉద్యోగులు ఉండేవారు. అయితే, తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో 2019లో కంపెనీ తాత్కాలికంగా కార్యకలాపాలు నిలిపివేసింది. అప్పటికి జెట్ ఎయిర్వేస్ వివిధ బ్యాంకులకు రూ. 8,500 కోట్ల రుణాలతో పాటు పలువురు వెండార్లు, ప్యాసింజర్లకు ఇవ్వాల్సిన రీఫండ్లు, ఉద్యోగుల జీతాలకు సంబంధించి వేల కోట్ల రూపాయలు బాకీ పడింది. దీంతో 2019 జూన్లో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) జెట్ ఎయిర్వేస్పై దివాలా పిటీషన్ను విచారణకు స్వీకరించింది. ఈ క్రమంలో దివాలా పరిష్కార ప్రక్రియ కింద 2021లో కంపెనీని జేకేసీ దక్కించుకుంది. 2024 నుంచి కార్యకలాపాలు పునఃప్రారంభించనున్నట్లు కూడా జెట్ ఎయిర్వేస్ ప్రకటించింది. అయితే, నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన మొత్తాన్ని జేకేసీ సకాలంలో చెల్లించకపోవడంతో వివాదం చివరికి సుప్రీం కోర్టుకు చేరింది. గురువారం బీఎస్ఈలో జెట్ ఎయిర్వేస్ షేరు ధర 5 శాతం లోయర్ సర్క్యూట్తో 34.04 వద్ద క్లోజయ్యింది. -
జగన్ ను రాజకీయంగా దెబ్బతీయడానికే కుట్ర..?
-
రూ.7.7 కోట్లు బాకీ.. కంపెనీపై దివాలా చర్యలు
రుణ చెల్లింపుల్లో విఫలమైనందుకు గాను సిస్కా ఎల్ఈడీ లైట్స్పై దివాలా చట్టం కింద చర్యలు తీసుకోనున్నారు. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి రూ.7.70 కోట్ల బాకీల వసూలు కోసం రుణదాత సన్స్టార్ ఇండస్ట్రీస్ దాఖలు చేసిన పిటీషన్ను విచారణకు స్వీకరించింది.సిస్కా ఎల్ఈడీ లైట్స్ బోర్డును రద్దు చేసి దివాలా పరిష్కార ప్రొఫెషనల్గా దేవాశీష్ నందాను ఎన్సీఎల్టీ నియమించింది. సన్స్టార్ సరఫరా చేసిన ఉత్పత్తుల నాణ్యతపై వివాదం నెలకొందని, ఆ కంపెనీ దివాలా చట్టాన్ని దుర్వినియోగం చేస్తోందన్న సిస్కా వాదనలను తోసిపుచ్చింది. సన్స్టార్కి సిస్కా రుణం చెల్లించాల్సి ఉందనడానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నట్లు ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే పిటీషన్ను విచారణకు స్వీకరిస్తున్నట్లు వివరించింది.ఇదీ చదవండి: అదానీ ప్రాజెక్ట్పై కొత్త ప్రభుత్వం పునఃపరిశీలనఎస్ఎస్కే గ్రూప్లో భాగంగా ఉన్న సిస్కా ఎల్ఈడీ లైట్స్కి ఎలక్ట్రికల్ గృహోపకరణాల సంస్థ సన్స్టార్ ఇండస్ట్రీస్ 60 రోజుల క్రెడిట్ వ్యవధితో ఉత్పత్తులను సరఫరా చేసేది. తొలినాళ్లలో సక్రమంగానే చెల్లింపులు జరిపినప్పటికీ 2023 మార్చి నుంచి జులై వరకు పంపిన 25 ఇన్వాయిస్లను చెల్లించకుండా డిఫాల్ట్ కావడంతో సన్స్టార్ ఎన్సీఎల్టీని ఆశ్రయించింది. -
ఎన్సీఎల్ఏటీలో కాఫీ డే సంస్థకి ఊరట
న్యూఢిల్లీ: నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ)లో కాఫీ డే ఎంటర్ప్రైజెస్ (సీడీఈఎల్)కి ఊరట లభించింది. కంపెనీపై దివాలా ప్రక్రియ ప్రారంభించాలంటూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఇచ్చిన ఆదేశాలపై ఎన్సీఎల్ఏటీ తదుపరి విచారణ వరకు స్టే విధించింది. కంపెనీ పిటీషన్పై మూడు వారాల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలంటూ ఐడీబీఐ ట్రస్టీషిప్ సరీ్వసెస్ (ఐడీబీఐటీఎస్ఎల్)ను ఆదేశించింది. వివరాల్లోకి వెడితే, రూ. 228.45 కోట్ల మొత్తాన్ని చెల్లించడంలో డిఫాల్ట్ అయిన కాఫీ డే సంస్థపై దివాలా ప్రక్రియ కింద చర్యలు తీసుకోవాలంటూ ఎన్సీఎల్టీ బెంగళూరు బెంచ్ని ఐడీబీఐటీఎస్ఎల్ ఆశ్రయించింది. దీన్ని విచారణకు స్వీకరించిన ఎన్సీఎల్టీ, కంపెనీ కార్యకలాపాల నిర్వహణ కోసం తాత్కాలిక పరిష్కార నిపుణుడిని నియమించింది. అయితే, సస్పెండ్ అయిన కంపెనీ బోర్డు సీఈవో మాళవిక హెగ్డే ఈ ఆదేశాలను సవాలు చేస్తూ ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించగా తాజా ఉత్తర్వులు జారీ అయ్యాయి. -
దివాలా అస్త్రం నుంచి బయటపడ్డ బైజూస్
న్యూఢిల్లీ: ఎడ్టెక్ దిగ్గజం బైజూస్ దివాలాకు సంబంధించిన ఎన్సీఎల్టీ వివాదాన్ని పరిష్కరించుకుంది. ఈమేరకు బీసీసీఐతో కుదుర్చుకున్న రూ.158 కోట్ల పరిష్కార ఒప్పందాన్ని అప్పీలేట్ ట్రిబ్యునల్ ఆమోదించింది. బెంగళూరు ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన రూలింగ్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ ఎన్సీఎల్ఏటీ (నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్– చెన్నై బెంచ్) కొట్టివేసింది. దాంతో బైజూస్కు ఊరట లభించినట్లయింది.బీసీసీఐ స్పాన్సర్షిప్ కోసం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం బైజూస్ డబ్బు చెల్లించాల్సి ఉంది. ఈమేరకు కుదిరిన రూ.158 కోట్ల పరిష్కార ఒప్పందాన్ని అప్పీలేట్ ట్రిబ్యునల్ ఆమోదించింది. అయితే, అండర్టేకింగ్లో పేర్కొన్న నిర్దిష్ట తేదీల్లో చెల్లింపులు చేయడంలో ఏదైనా వైఫల్యం జరిగితే, తిరిగి బైజూస్పై దివాలా ప్రక్రియ పునరుద్ధరించేలా హెచ్చరికతో కూడిన ఉత్తర్వులను అప్పీలేట్ ట్రిబ్యునల్ జారీ చేసింది. అమెరికా రుణదాతలు చేసిన ఆరోపణల ప్రకారం.. బైజూస్ తాను తీసుకున్న రుణాలను నిర్దిష్ట లక్ష్యాలకు కాకుండా ‘రౌండ్–ట్రిప్పింగ్’కు వినియోగించుకుందని పేర్కొన్నారు. గతంలో చేసిన ఈ ఆరోపణలను కూడా అప్పీలేట్ ట్రిబ్యునల్ కొట్టివేసింది. దానికి తగిన సాక్ష్యాలను అందించడంలో రుణదాతలు విఫలమయ్యారని పేర్కొంది. బైజూస్ వ్యవస్థాపకులు రవీంద్రన్ సోదరుడు–రిజు రవీంద్రన్ తన షేర్ల విక్రయం ద్వారా వచ్చిన మొత్తాలను ఇప్పటివరకూ రుణ చెల్లింపులకు వినియోగించినట్లు పేర్కొంటూ... రౌండ్ ట్రిప్పింగ్ ఆరోపణలకు సాక్ష్యాలు లేవని తెలిపింది. రుణ చెల్లింపుల షెడ్యూల్ ఇదీ... ఒప్పందం ప్రకారం, రిజు రవీంద్రన్ జూలై 31న బీసీసీఐకి బైజూస్ చెల్లించాల్సిన బకాయిల్లో రూ.50 కోట్లు చెల్లించారు. శుక్రవారం (ఆగస్టు 2న) మరో రూ.25 కోట్లు చెల్లించాల్సి ఉంది. మిగిలిన రూ.83 కోట్లను ఆగస్టు 9న ఆర్టీజీఎస్ ద్వారా చెల్లించనున్నారు. వివాదమేమిటీ? బీసీసీఐ, బైజూస్లు 2019 జూలై 25న కుదుర్చుకున్న ’టీమ్ స్పాన్సర్ ఒప్పందం’ కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం..భారత క్రికెట్ జట్టు కిట్పై తన ట్రేడ్మార్క్/బ్రాండ్ పేరును ప్రదర్శించే ప్రత్యేక హక్కు బైజూస్కు ఉంది. అలాగే క్రికెట్ సిరీస్ల ప్రసార సమయంలో ప్రకటనలు, ఆతిథ్య హక్కులనూ కలిగి ఉంది. 2023 మార్చి 31 తేదీ వరకూ ఈ సర్వీసులు బైజూస్కు అందుబాటులో ఉంటాయి. ఇందుకు సంబంధించి బైజూన్ (కార్పొరేట్ డెబిటార్), ఆపరేషనల్ క్రెడిటార్ (బీసీసీఐ)కు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జూన్ 2022లో జరిగిన భారత్–దక్షిణాఫ్రికా క్రికెట్ సిరీస్కు సంబంధించి బైజూస్ ఒక ఇన్వాయిస్పై రూ. 25.35 కోట్లు చెల్లించింది. తదుపరి ఇన్వాయిస్లకు చెల్లించడంలో విఫలమైంది. రూ.143 కోట్ల బ్యాంక్ గ్యారెంటీని బీసీసీఐ క్యాష్ చేసుకున్నప్పటికీ అది పూర్తి బకాయిని కవర్ చేయలేకపోయింది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, శ్రీలంక, న్యూజిలాండ్, ఆసియా కప్, ఐసీసీ టి20లతో సహా సిరీస్లు, టూర్లకు ఆగస్టు 2022 నుంచి జనవరి 2023 మధ్య స్పాన్సర్షిప్ రుసుము రూ.158.9 కోట్లు చెల్లించాల్సి ఉంది. దీనితో బీసీసీఐ బైజూస్పై ఎన్సీఎల్టీ బెంగళూరు బెంచ్ను ఆశ్రయించింది. బైజూన్ రూ.159 కోట్లు చెల్లించడంలో విఫలమైందని పేర్కొంటూ, మాతృ సంస్థ థిక్ అండ్ లేర్న్పై దివాలా చర్యలకు అనుమతించాలని కోరింది. ఈ పిటిషన్ను జులై 16న అనుమతిస్తూ, ఎన్సీఎల్టీ మధ్యంతర దివాలా పరిష్కార నిపుణుడిగా (ఐఆర్పీ) పంకజ్ శ్రీవాస్తవను నియమించింది. దాంతో సంస్థ ఫౌండర్ అండ్ సీఈఓ రవీంద్రన్ ఐఆర్పీకి రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని కూడా ఎన్సీఎల్టీ స్పష్టం చేసింది. అయితే దీనిపై బైజూస్ అప్పీలేట్ ట్రిబ్యునల్ను ఆశ్రయించింది.కష్టాల కడలిలో... బైజూస్ విలువ ఒకప్పుడు 22 బిలియన్ డాలర్లుగా ఉండేది. అయితే మహమ్మారి నియంత్రణలను సడలించిన తర్వాత పాఠశాలలను తిరిగి తెరవడం ఎడ్టెక్ సంస్థకు గొడ్డలిపెట్టయ్యింది. బ్లాక్రాక్ ఇటీవల సంస్థ విలువను 1 బిలియన్ డాలర్లను తగ్గించింది. రెండేళ్ల క్రితం ఫైనాన్షియల్ రిపోరి్టంగ్ డెడ్లైన్లను పాటించడంలో విఫలమవడం, రాబడి అంచనాలకు 50 శాతానికి పైగా తగ్గించడం వంటి అంశాలతో కంపెనీ కష్టాలు తీవ్రమయ్యాయి. ప్రోసస్ అండ్ పీక్ 15సహా బైజూస్ మాతృసంస్థలో పెట్టుబడిపెట్టిన వారంతా ఫిబ్రవరిలో జరిగిన అసాధారణ సమావేశంలో (ఈజీఎం) ‘‘తప్పుడు నిర్వహణ విధానాలు– వైఫల్యాల‘ ఆరోపణలతో రవీంద్రన్ను సీఈఓగా తొలగించాలని వోటు వేశారు. అయితే రవీంద్రన్ ఈ ఆరోపణలను ఖండించారు. ఈ వోటింగ్ చట్టబద్దతను ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ వివాదంపై న్యాయపోరాటం కొనసాగుతోంది.భారీ విజయమిది: బైజూస్ ఎడ్టెక్ సంస్థకు, వ్యవస్థాపకులకు ఇది భారీ విజయమని బైజూస్ ఒక ప్రకటనలో పేర్కొంది. మరోవైపు వ్యవస్థాపకులు బైజూ రవీంద్రన్ ఈ పరిణామంపై మాట్లాడుతూ, తాజా ఎన్సీఎల్ఏటీ ఉత్తర్వు్య కేవలం చట్టపరమైన విజయం మాత్రమే కాదని, గత రెండేళ్లలో బైజూ కుటుంబం చేసిన వీరోచిత ప్రయత్నాలకు నిదర్శనమని అన్నారు. తమ వ్యవస్థాపక బృందం సభ్యులు సవాళ్లను ఎదుర్కొంటూ, అవిశ్రాంతంగా పనిచేస్తున్నారని పేర్కొంటూ, వారి త్యాగం నిరుపమానమైందన్నారు. ప్రతి ఒక్కరికీ తాను ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వివరించారు. ప్రతి కష్టం పోరాడాలన్న తమ దృఢ నిశ్చయాన్ని పటిష్ట పరిచాయని అన్నారు. -
రూ.947 కోట్ల మోసం.. త్వరలో బిల్డప్ బాబాయ్ ఆస్తుల వేలం.. ఎన్సీఎల్టీ నోటీసులు
ఆంధ్రప్రదేశ్లోని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు డైరెక్టర్గా వ్యవహరిస్తున్న ఇండ్ భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ కంపెనీ ఆస్తుల వేలం జరగబోతుంది. ఈమేరకు కంపెనీ స్థిరచరాస్తులను వేలం వేస్తున్నట్లు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ప్రకటించింది. నోటీసులో తెలిపిన వివరాల ప్రకారం..రూ.360 కోట్ల విలువైన ఆస్తులను వేలం వేయనున్నారు.కంపెనీ బ్యాంకుల కన్సార్టియం వద్ద దాదాపు రూ.947 కోట్లు అప్పు చేసింది. దాన్ని తిరిగి తిరిగిచెల్లించకపోవడంతో నిరర్థక ఆస్తిగా మారింది. ఎలాగైనా ఆ డబ్బును రాబట్టుకునేందుకు బ్యాంకులు కేంద్రాన్ని ఆశ్రయించాయి. దేశ ఆర్థికవ్యవస్థపై ప్రభావం పడకూడదనే ఉద్దేశంతో కేంద్రం ఆ కేసును సీబీఐకు అప్పగించింది. 2019లోనే ఈ కంపెనీ డైరెక్టర్లపై కేసు నమోదు చేసింది. బ్యాంక్రప్సీ బోర్డు(ఐబీబీఐ) ఆధ్వర్యంలో ఉన్న నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) తాజాగా ఆస్తులు వేలం వేయాలని నిర్ణయించింది. దాంతో కంపెనీ చేసిన అప్పులను కొద్ది మొత్తంలో తగ్గించవచ్చనే ఉద్దేశంతో ఎన్సీఎల్టీ ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది.సీబీఐ ఛార్జ్షీట్..రూ.947.70 కోట్ల రుణాల మోసానికి సంబంధించి రఘురామకృష్ణంరాజు, ఆయన కంపెనీ ఇండ్ భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్తో పాటు మరో 15 మందిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) 2019లో ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఇండ్-భారత్ రుణదాతల కన్సార్టియం నుంచి రూ.947 కోట్లు తీసుకుని చెల్లించకుండా మోసం చేస్తున్నట్లు సీబీఐ తెలిపింది. ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్(పీఎఫ్సీ) రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఆర్ఈసీ), ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ (ఐఐఎఫ్సీఎల్) నుంచి కంపెనీకు చెందిన తమిళనాడులోని టుటికోరిన్ థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు కోసం అప్పు చేసినట్లు చెప్పింది.ఇండ్ భారత్ పవర్ ఇన్ఫ్రా లిమిటెడ్, ఆర్కే ఎనర్జీ (రామేశ్వరం), సిబా సీబేస్, ఇండ్ భారత్ పవర్ జెన్కామ్, ఇండ్ భారత్ ఎనర్జీ ఉత్కల్, ఇండ్ భారత్ పవర్ వంటి కంపెనీ డైరెక్టర్లలో ఒకరైన మధుసూధన్ రెడ్డి పేరును కూడా సీబీఐ ఛార్జ్షీటులో పేర్కొంది. కంపెనీ కాంట్రాక్టర్లు సోకియో పవర్ ప్రైవేట్ లిమిటెడ్, వై.నాగార్జున రావు, సీఏలు ఎంఎస్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ జాబాద్తో పాటు కంపెనీ భాగస్వామ్యంలో ఉన్న టిఆర్ చద్దా అండ్ కంపెనీ, ఇండ్ భారత్ గ్రూప్కు చెందిన సి.వేణును నిందితులుగా చేర్చారు.ఇదిలాఉండగా, ఐబీబీఐ-ఎన్సీఎల్టీ ఆధ్వర్యంలో ఆస్తుల వేలానికి వెళ్తున్న కంపెనీలు నిబంధనలకు విరుద్ధంగా తమ బినామీల ద్వారా తిరిగి వాటిని దక్కించుకునే ప్రమాదం ఉంది. ముందుగా అప్పుచేసి కొనుగోలు చేసిన ఆస్తుల విలువతో పోలిస్తే ఆక్షన్లో దక్కించుకున్న వాటికి వ్యత్యాసం ఉంటుంది. దాంతో భారీగా లాభపడవచ్చని కొన్ని కంపెనీలు దురుద్దేశంతోనే దివాలా ప్రక్రియకు నమోదు చేసుకుంటాయి. రాజకీయమైనా, వ్యాపారమైనా సమర్థంగా నిర్వహించే సత్తా ఉంటేనే విజయం సాధిస్తారు. రాజకీయ ప్రచారంలో భాగంగా నీతులు చెబుతున్న రఘురామ వాటిని పాటించడేమో. బ్యాంకులకు అప్పులు కట్టకుండా ఎగనామం పెడితే ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రజలను మోసం చేసినట్లే. ఈ విషయాన్ని ప్రజలు గమనించరని భావిస్తున్నాడేమో పాపం. ఎలాగైనా ఈసారి ఎన్నికల్లో ప్రజలు తనకు సరైన గుణపాఠం చెబుతారని తెలుస్తుంది.ఇదీ చదవండి: గోల్డ్ఫైనాన్స్ తీసుకుంటే రూ.20వేలే ఇస్తారట! మిగతా డబ్బు..?ఆంద్రప్రదేశ్ రాజకీయాల్లో బిల్డప్బాబాయ్గా పేరున్న రఘురామకృష్ణరాజుపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, దిల్లీ, మహారాష్ట్రల్లో 19 కేసులు నమోదయ్యాయి. ఆయనపై దిల్లీలో సీబీఐ కేసులు కూడా ఉన్నాయి.ఇండ్ భారత్ పవర్ ఇన్ఫ్రా లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్గా ఉండి ఫోర్జరీ, నకిలీ పత్రాలు సృష్టించడం, రూ.25 కోట్ల చెల్లింపులు చేయకపోవడానికి సంబంధించి మహారాష్ట్రలోని థానేలో ఆర్థిక నేరాల విభాగం 2022 జనవరి 27న ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీనికి సంబంధించి హైదరాబాద్ కోర్టులో రెండు కేసులు, ముంబై కోర్టులో ఒక కేసు కొనసాగుతున్నాయి. -
సుజనా అప్పుల లెక్క తీయండి
సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబుకు సన్నిహితుడు, విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి, మాజీ ఎంపీ వై. సుజనా చౌదరి వ్యక్తిగత దివాలా ప్రక్రియకు రిజల్యూషన్ ప్రొఫెషనల్గా మలిగి మధుసూదన రెడ్డిని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) హైదరాబాద్ బెంచ్ నియమించింది. సుజనా చౌదరి అప్పుల లెక్కలు తీయాలని ఆదేశించింది. సుజనా చౌదరి దివాలా పరిష్కార ప్రక్రియకు ఇప్పటికే అంగీకరించిన ఎస్సీఎల్టీ.. ఆ తీర్పు పూర్తి ప్రతిని తాజాగా విడుదల చేసింది. దివాలా ప్రక్రియ ముగిసే వరకు సుజనా (రుణ గ్రహీత) ఆస్తుల క్రయవిక్రయాలు, ఇతరుల పేరిట బదిలీ చేయడం లాంటివి చెల్లవని తేల్చిచెప్పింది. దివాలా ప్రక్రియ అంతా ఎలా నిర్వహించాలో ఎన్సీఎల్టీ జ్యుడిషియల్ సభ్యుడు రాజీవ్ భరద్వాజ్, టెక్నికల్ సభ్యుడు సంజయ్పూరి ధర్మాసనం రిజల్యూషన్ ప్రొఫెషనల్కు స్పష్టంగా వివరించింది. దివాలా ప్రక్రియకు వెళ్లిన స్ప్లెండిడ్ మెటల్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఎస్బీఐకి రూ. 562,84,30,310 (అసలు, వడ్డీ కలిపి) రుణ బకాయి పడిందని, దీనికి సుజనా చౌదరి వ్యక్తిగతంగా గ్యారెంటీ ఇచ్చినందున, ఆయనను దివాలాదారునిగా ప్రకటించి, రుణ పరిష్కార ప్రక్రియ ప్రారంభించాలని కోరుతూ బ్యాంకు 2021లో ఎన్సీఎల్టీని ఆశ్రయించింది. దీనిపై విచారించిన ఎన్సీఎల్టీ మధ్యంతర రిజల్యూషన్ ప్రొఫెషల్ (ఐఆర్పీ)గా మధుసూదన్ రెడ్డిని నియమించింది. వ్యకిగత హామీదారుకు రుణాల చెల్లింపు కోసం బ్యాంక్ సమయం ఇచ్చిందని, అయినా చెల్లించడంలో ఆయన విఫలమయ్యారని ఐఆర్పీ నివేదిక అందజేశారు. పిటిషన్ను అనుమతించి దివాలా ప్రక్రియను ప్రారంభించవచ్చని చెప్పారు. ఈ నివేదికను పరిశీలించి, ఇరుపక్షాల వాదనలు విన్న ఎన్సీఎల్టీ తీర్పు వెలువరించింది. తీర్పులో ప్రధానాంశాలు.. సుజనా చౌదరిపై దివాలా పరిష్కార ప్రక్రియను ప్రారంభిస్తున్నాం. ఆయన వ్యక్తిగత హామీదారుగా ఉన్నందున అన్ని అప్పులపై 180 రోజుల పాటు మారటోరియం వర్తిస్తుంది. ఈ సమయంలో ఆయన తన ఆస్తుల క్రయవిక్రయాలు, ఇతరులకు బదిలీ వంటి లావాదేవీలు నిషేధం. మా ఉత్తర్వుల కాపీ ఎన్సీఎల్టీ వెబ్సైట్లో అప్లోడ్ చేసిన 7 రోజుల్లోగా సుజనాకు అప్పులు ఇచ్చిన వారి నుంచి వివరాలు కోరుతూ రిజల్యూషన్ ప్రొఫెషనల్ పూర్తి వివరాలతో పబ్లిక్ నోటీస్ జారీ చేయాలి. వ్యక్తిగత హామీదారు సుజనా, కార్పొరేట్ రుణగ్రహీత స్ప్లెండిడ్ కంపెనీ ఉంటున్న రాష్ట్రంలో విస్తృత సర్కులేషన్ ఉన్న ఆంగ్ల, మాతృ భాష (తెలుగు) పత్రికల్లో ఈ నోటీసులు ప్రచురించాలి. ఆ తర్వాత రుణ దాతలు క్లెయిమ్లు సమర్పించేందుకు 21 రోజుల సమయం ఇవ్వాలి. 30 రోజుల్లోగా రిజల్యూషన్ ప్రొఫెషనల్ రుణదాతల జాబితా, ఇతర వివరాలన్నీ సిద్ధం చేయాలి. రుణదాతలకు ఎలా చెల్లింపులు చేస్తారో సుజనా నివేదిక ఇవ్వాలి. రుణదాతల జాబితా, సుజనా నివేదికను ఎన్సీఎల్టీ బెంచ్ (అడ్జ్యుడికేటింగ్ అథారిటీ)కి రిజల్యూషన్ ప్రొఫెషనల్ అందజేస్తారు. చివరి క్లెయిమ్ అందిన 21 రోజుల్లోగా ఈ ప్రక్రియ అంతా పూర్తి కావాలి. అప్పటి నుంచి 28 రోజుల్లోగా రిజల్యూషన్ ప్రొఫెషనల్ రుణదాతలతో సమావేశం ఏర్పాటు చేయాలి. ఈ సమావేశం అవసరం లేదని రిజల్యూషన్ ప్రొఫెషనల్ సిఫార్సు చేస్తే, దానికి కారణాలను తెలపాలి. సుజనా నివేదికను రుణదాతలకు అందజేసి, వారి అభిప్రాయం తీసుకుని, ఆ వివరాలను ఎన్సీఎల్టీకి సమర్పించాలి’ అని పేర్కొంది. సుజనా చెల్లింపుల విధానానికి రుణదాతలు అంగీకరిస్తే అంతటితో ప్రక్రియ ముగుస్తుంది. లేదంటే ఆస్తులు వేలం వేసి చెల్లించేలా దివాలా ప్రక్రియ ముందుకు వెళ్లనుంది. -
సుజనా చౌదరి దివాలా
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నేత, మాజీ ఎంపీ, ఎన్డీఏ కూటమి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి సుజనా చౌదరి వ్యక్తిగత దివాలా ప్రక్రియకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) హైదరాబాద్ బెంచ్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దివాళా పరిష్కారకర్త (రెజల్యూషన్ ప్రొఫెషనల్)ను నియమిస్తూ.. ఈ ప్రక్రియ పూర్తయ్యేవరకు ఆయన ఆస్తుల క్రయవిక్రయాలను నిలిపివేసింది. దివాలా ప్రక్రియకు వెళ్లిన స్లె్పండిడ్ మెటల్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఎస్బీఐలో రూ. 500 కోట్లకు రుణం తీసుకుంది. దీనికి సుజనా చౌదరి వ్యక్తిగతంగా గ్యారెంటీ ఇచ్చారు. దీంతో సుజనా చౌదరి వ్యక్తిగత దివాలా ప్రక్రియ ప్రారంభించి, పరిష్కారాన్ని చేపట్టాలని ఎస్బీఐ 2021లో ఎన్సీఎల్టీలో పిటిషన్ దాఖలు చేసింది. ఆయన ఆస్తుల మదింపు చేపట్టి, వేలం ద్వారా ఎస్బీఐ రుణాలను చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. ఈ పిటిషన్పై ఎన్సీఎల్టీ జ్యుడిషియల్ సభ్యుడు రాజీవ్ భరద్వాజ్, టెక్నికల్ సభ్యుడు సంజయ్ పూరి బెంచ్ విచారణ జరిపి, తాజా ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషనర్ తరఫున న్యాయవాది వీవీఎస్ఎన్ రాజు వాదనలు వినిపించారు. రుణదాతకు ఏదైనా కంపెనీ, వ్యక్తులు రుణాన్ని ఎగవేసినప్పుడు దానికి వ్యక్తిగతంగా గ్యారెంటీ ఉన్న వాళ్లు బాధ్యత వహించాలని చట్టం చెబుతోందన్నారు. గతంలో సుప్రీంకోర్టు కూడా ఈ విషయాన్ని పలు తీర్పుల సందర్భంగా చెప్పిందన్నారు. హామీదారుగా ఉన్న సుజనా చౌదరి తప్పకుండా బాధ్యత వహించేలా ఆదేశాలివ్వాలని కోరారు. సుజనా తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు పూర్తికావడం, మధ్యంతర పరిష్కార ప్రక్రియ (ఐఆర్పీ) ఇచ్చిన నివేదికను పరిశీలించిన బెంచ్.. సుజనా వ్యక్తిగత దివాలా ప్రక్రియకు అనుమతించింది. దీంతో బీజేపీ నేతకు షాక్ తగిలినట్లయింది. దీని ప్రకారం దివాలా ప్రక్రియను ప్రారంభించేందుకు పరిష్కారకర్తను నియమిస్తారని, ఆయన సుజనా అప్పులు, ఆస్తులను పరిశీలించి, ఆయా రుణదాతలకు ఇవ్వాల్సిన నిష్పత్తి మేరకు పరిష్కారాన్ని సూచిస్తారని సమాచారం. -
ఒకప్పుడు షేర్ ధర రూ.2,700.. ఇప్పుడు ‘జిరో’.. భారీగా నష్టపోయిన ఇన్వెస్టర్లు..
అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ స్టాక్ మార్కెట్ నుంచి త్వరలో డీలిస్ట్ అవ్వబోతుంది. రిలయన్స్ క్యాపిటల్ను హిందూజా గ్రూప్ కంపెనీ ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ కొనుగోలు చేసిన తరుణంలో తాజా పరిణామం చోటుచేసుకుంది. ఇకపై దేశీయ స్టాక్ మార్కెట్లలో రిలయన్స్ క్యాపిటల్ షేర్లు ట్రేడ్ అవ్వవు. ఎందుకంటే కంపెనీ కొత్త యజమాని హిందూజా గ్రూప్ షేర్లను డీలిస్ట్ చేయాలని నిర్ణయించటమే దీనికి ప్రధాన కారణం. వాస్తవానికి 2008లో కంపెనీ షేర్ ధర ఒక్కోటి రూ.2,700 కంటే ఎక్కువగా ఉంది. అయితే ప్రస్తుతం షేర్ ధర దాదాపు 99 శాతం క్షీణించి రూ.11 వద్ద ఉంది. షేర్ల డీలిస్టింగ్ జరిగితే ఈక్విటీ షేర్ హోల్డర్ల ఇన్వెస్ట్మెంట్ సున్నా కాబోతోంది. కొత్తగా కొనుగోలు చేసిన కంపెనీ పాత కంపెనీలోని ఇన్వెస్టర్లకు ఎలాంటి వాటాలు ఇవ్వబోదని వెల్లడైంది. దీనివల్ల అనిల్ అంబానీ కంపెనీలో షేర్లు కలిగి ఉన్న వ్యక్తులకు భారీగా నష్టం జరగనుంది. ఇప్పటికే రిలయన్స్ క్యాపిటల్పై నియంత్రణ సాధించేందుకు హిందూజా గ్రూప్ కంపెనీ ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ సమర్పించిన రూ.9,650 కోట్ల రిజల్యూషన్ ప్లాన్ను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) గత మంగళవారం ఆమోదించింది. ఇదీ చదవండి: మరో గ్లోబల్ బ్రాండ్ను తీసుకొస్తున్న అంబానీ కంపెనీ ఇందులో రుణదాతలు 63 శాతం బకాయి నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. అలాగే కంపెనీకి వ్యతిరేకంగా క్లెయిమ్ చేసిన మొత్తం రూ.38,526.42 కోట్లలో రూ.26,086.75 కోట్ల క్లెయిమ్లను మాత్రమే ట్రిబ్యునల్ ఆమోదించింది. -
అప్పులతో కుంగిన అనిల్ అంబానీ కంపెనీకి ఊరట..
ముంబై: అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ క్యాపిటల్కి భారీ ఊరట లభించింది. రుణభారంతో కుంగిన రిలయన్స్ క్యాపిటల్కి సంబంధించి హిందుజా–ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ ప్రతిపాదించిన రూ. 9,650 కోట్ల పరిష్కార ప్రణాళికకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం కంపెనీ రుణదాతలు భారీగా 63 శాతం రుణాలను వదులుకోవాల్సి వస్తుంది. అలాగే, ప్రణాళిక అమల్లో భాగంగా ఆర్క్యాప్ షేర్లను ఇండస్ఇండ్కు బదలాయించాక, దాన్ని స్టాక్ ఎక్స్చేంజీల నుంచి తొలగిస్తారు. మొత్తం రూ. 38,526 కోట్ల రుణాల క్లెయిమ్లకు గాను ఎన్సీఎల్టీ రూ. 26,086 కోట్ల క్లెయిమ్లనే అనుమతించింది. కానీ, 2023 జూన్లో బిడ్ వేసిన ఇండస్ఇండ్ అందులో రూ. 9,661 కోట్లు (37%) కడతానని ప్రతిపాదించింది. రిలయన్స్ క్యాపిటల్ కార్యకలాపాల పునర్వ్యవస్థీకరణకు మార్గాన్ని అందించడంలో ఎన్సీఎల్టీ ఆమోదం కీలకమని గమనించవచ్చు. -
ఎడ్టెక్ కంపెనీకు నోటీసులు.. ఎందుకో తెలుసా..
ఫ్రాన్స్ కంపెనీ పిటీషన్ దాఖలు చేయడంతో బైజూస్ సంస్థ తాజాగా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్ (ఎన్సీఎల్టీ) నోటీసులు అందుకుంది. ఫ్రాన్స్కు చెందిన టెలీపెర్ఫార్మెన్స్ బిజినెస్ సర్వీసెస్ పిటీషన్ వేయడంతో బైజూస్కు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్ (ఎన్సీఎల్టీ) నోటీసులు ఇష్యూ చేసింది. బైజూస్ ఎడ్టెక్ కంపెనీ రూ.4 కోట్లు అప్పు పడిందని, దాన్ని తిరిగి చెల్లించడం లేదని ఈ పిటీషన్లో టెలీపెర్ఫార్మెన్స్ బిజినెస్ పేర్కొంది. నిబంధనల ప్రకారం నోటీసులపై బైజూస్ రెండు వారాల్లో స్పందించాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా, టెలీపెర్ఫార్మెన్స్తోపాటు ఇతర కొన్ని ఔట్సోర్సింగ్ ఏజెన్సీలతో 2022 మధ్య వరకు బైజూస్ వ్యాపారం చేసింది. ఈ కంపెనీలు బైజూస్కు కాలింగ్ ఏజెంట్ల సేవలందించేవి. ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా టెలీపెర్ఫార్మెన్స్, కోజెంట్ బైజూస్కు నిధులు నిలిపేసినట్లు తెలిసింది. ఇదీ చదవండి: వడ్డీ రేట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం! వడ్డీ రేట్లు తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు బైజూస్ అమెరికా విభాగం ఆల్ఫా 2021లో టర్మ్లోన్-బీ తీసుకుంది. అయితే, కంపెనీ 500 మిలియన్ డాలర్ల మొత్తాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఇతర అనుబంధ సంస్థలకు బదలాయించిందని, రుణ చెల్లింపులను వేగవంతం చేయాలని రుణదాతలు అమెరికాలోని డెలావేర్ కోర్టును గతంలో ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీన్ని న్యాయస్థానంలో సవాలు చేసిన బైజూస్.. రుణదాతలతో వివాదాన్ని పరిష్కరించుకునే ప్రయత్నాల్లో ఉంది. -
కమిటీతోనైనా కథ ముగిసేనా?
సాక్షి, హైదరాబాద్: నష్టాలతో మూత పడిన నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్ (ఎన్డీఎస్ఎల్) ఆస్తులను విక్రయించి బ్యాంకులు, ఇతర సంస్థలకు బకాయి లు చెల్లించాల్సిందిగా సుమారు నాలుగున్నర ఏళ్ల క్రితం నేషనల్ కంపెనీ ఆఫ్ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) తీర్పుని చ్చింది. నిజాం షుగర్స్ పునరుద్ధర ణ మార్గాలు మూసుకుపోవడంతో ఆస్తుల విక్ర యం (లిక్విడేషన్) మినహా మరో మార్గం లేదని గతంలోనే స్పష్టం చేసింది. ఎన్సీఎల్టీ తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు చేసినా ఏళ్ల తరబడి నిజాం దక్కన్ షుగర్స్ భవితవ్యం కొలిక్కిరావడం లేదు. ఈ నేపథ్యంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్బాబు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఎన్డీఎస్ఎల్ను తిరిగి తెరిపిస్తామంటూ ‘పునరుద్ధరణ కమిటీ’ని ప్రకటించింది. ఈ కమిటీలో మరో మంత్రి దామోదర రాజనర్సింహ సహ చైర్మన్గా, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, ఎమ్మెల్యేలు పి.సుదర్శన్రెడ్డి, రోహిత్రావు, మాజీ ఎమ్మెల్యే ఎ.చంద్రశేఖర్తో పాటు ఆర్థిక, పరిశ్రమ లు, వ్యవసాయ శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉన్నారు. ఎన్డీఎస్ఎల్ను తిరిగి తెరవడం లక్ష్యంగా ఏర్పాటైన నిజాం షుగర్స్ పునరుద్ధరణ కమిటీ రెండు నెలల్లోగా నివేదిక ఇవ్వాలనే ప్రభుత్వ ఆదేశాలు ఎంత మేర ఫలిస్తాయనే చర్చ జరుగుతోంది. చంద్రబాబు హయాంలో ప్రైవేటు పరం ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలనలో 1937లో ఏర్పాటైన నిజాం చక్కెర కర్మాగారం (ఎన్ఎస్ఎల్) 1990వ దశకం నాటికి నష్టాల బాట పట్టింది. నష్టాల నుంచి నిజాం షుగర్స్ను గట్టెక్కిస్తామనే నెపంతో 2002లో నాటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 51 శాతం వాటాను డెల్టా పేపర్ మిల్లుకు విక్రయించింది. దీంతో దశాబ్దాల తరబడి ఎన్ఎస్ఎల్గా పేరొందిన నిజాం షుగర్స్ ఎన్డీఎస్ఎల్గా పేరు మార్చుకుంది. ప్రైవేటు సంస్థకు 51 శాతం వాటా అప్పగించడంపై అప్పట్లో పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే నష్టాల నుంచి గట్టెక్కే పరిస్థితి లేకపోవడంతో ఎన్డీఎస్ఎల్ను మూసివేస్తున్నట్లు 2015 డిసెంబర్లో యాజమాన్యం ప్రకటించింది. పరిశ్రమ ఆస్తులను విక్రయించి అప్పులు చెల్లించేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఎన్డీఎస్ఎల్ యాజమాన్యం ప్రభుత్వాన్ని కోరింది. అయితే ఈ ప్రతిపాదనను తిరస్కరించిన రాష్ట్ర ప్రభుత్వం రైతుల భాగస్వామ్యంతో సహకార రంగంలో ఎన్డీఎస్ఎల్ను నడిపేందుకు 2015 ఏప్రిల్లో కార్యదర్శుల కమిటీని కూడా ఏర్పాటు చేసింది. డెల్టా పేపర్ మిల్లుకు చెందిన 51 శాతాన్ని టేకోవర్ చేయడంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించి 3 నెలల్లో నివేదిక ఇవ్వాల్సిందిగా జీఓఎంఎస్ 28ను కూడా జారీ చేసింది. ట్రిబ్యునల్ను ఆశ్రయించిన ఎన్డీఎస్ఎల్ అప్పులు పెరిగినందున దివాలా పరిశ్రమగా గుర్తించాలని ఎన్డీఎస్ఎల్ 2017లో నేషనల్ కంపెనీ ఆఫ్ లా ట్రిబ్యునల్ను ఆశ్రయించింది. అప్పులు తీర్చేందుకు కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిసొల్యూషన్ ప్రాసెస్ ప్రారంభించాలని కోరడంతో రుణదాతలతో సంప్రదింపులు జరిపేందుకు ఎన్సీఎల్టీ లిక్విడేటర్ను కూడా నియమించింది. 2017 అక్టోబర్ నుంచి 2018 సెపె్టంబర్ వర కు 11 పర్యాయాలు రుణదాతలతో సంప్రదింపులు జరిపినా పునరుద్ధరణ అంశం కొలిక్కి రాలే దు. పరిశ్రమ కొనుగోలుకు ముందుకు వ చ్చిన కొన్ని సంస్థలు ఎన్డీఎస్ఎల్ ఆస్తులు, అప్పులు పరిశీలించి వెనకడుగు వేశాయి. నాలుగున్నరేళ్ల క్రితం సంస్థకు రూ.360 కోట్ల అప్పులు ఉండగా, ఆస్తుల విలువ కూడా అంతే ఉన్నట్లు తేలింది. సంస్థ పునరుద్ధరణ, అమ్మకం ప్రయత్నాలు కొలి క్కి రాకపోవడంతో ఎన్సీఎల్టీ లిక్విడేషన్కు అనుమతిచ్చింది. ఎన్సీఎల్టీ తీర్పుపై 2019లో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, నేటికీ ఆ కేసులో పురోగతి లేదు. ఎన్డీఎస్ఎల్పై ఇప్పటికే హౌజ్కమిటీ, కార్యదర్శుల కమిటీ వంటివి ఏర్పాటైనా సంస్థ మనుగడపై స్పష్టత ఇవ్వ లేకపోయాయి. ఈ నేపథ్యంలో నిజాం దక్కన్ షుగర్స్ను పునరుద్ధరిస్తామంటూ తాజాగా కమిటీని ఏర్పాటు చేసింది. రెండు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని గడువు నిర్దేశించింది. -
బైజూస్పై దివాలా పిటిషన్
న్యూఢిల్లీ: ఎడ్టెక్ సంస్థ బైజూస్పై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)–బెంగళూరులో దివాలా పిటిషన్ దాఖలైంది. కంపెనీకి 1.2 బిలియన్ డాలర్ల మేర టర్మ్ లోన్–బీ (టీఎల్బీ) ఇచి్చన రుణదాతల్లో 80 శాతం సంస్థలు కలిసి గ్లాస్ ట్రస్ట్ కంపెనీ ద్వారా దీన్ని దాఖలు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, దివాలా పిటిషన్ విషయం ఇంకా బహిరంగంగా వెల్లడి కాలేదు. బైజూస్ ఈ వ్యవహారమంతా నిరాధారమైనదని పేర్కొంది. రుణదాతల చర్యలపై అమెరికా కోర్టుల్లో పలు కేసులు నడుస్తుండగా ఎన్సీఎల్టీని ఆశ్రయించడం సరికాదని వ్యాఖ్యానించింది. అనుబంధ సంస్థలను విక్రయించడం ద్వారా వచ్చే నిధులతో రుణాలను తీర్చేసుకునేందుకు టీఎల్బీ రుణదాతలతో చర్చలు జరుపుతున్నట్లు బైజూస్ చెబుతున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. బ్యాంకులు కాకుండా సంస్థాగత ఇన్వెస్టర్లు ఇచ్చిన రుణాన్ని టీఎల్బీ లోన్గా వ్యవహరిస్తున్నారు. వడ్డీ రేట్లు తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు బైజూస్ అమెరికా విభాగం ఆల్ఫా 2021లో టీఎల్బీ తీసుకుంది. అయితే, కంపెనీ 500 మిలియన్ డాలర్ల మొత్తాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఇతర అనుబంధ సంస్థలకు బదలాయించిందని, రుణ చెల్లింపులను వేగవంతం చేయాలని రుణదాతలు అమెరికాలోని డెలావేర్ కోర్టును ఆశ్రయించారు. దీన్ని న్యాయస్థానంలో సవాలు చేసిన బైజూస్.. రుణదాతలతో వివాదాన్ని పరిష్కరించుకునే ప్రయత్నాల్లో ఉంది. -
లా ట్రిబ్యునల్ను ఆశ్రయించిన అశ్నీర్ గ్రోవర్.. కారణం అదేనా..
ప్రముఖ మొబైల్ యాప్ భారత్పే కో-ఫౌండర్, సంస్థ మాజీ ఎండీ అశ్నీర్ గ్రోవర్ కంపెనీ యాజమాన్యంపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)ను ఆశ్రయించారు. ప్రస్తుత భారత్పే బోర్డు అధికార దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు. భారత్పే ఎండీగా తనను తిరిగి సంస్థలో నియమించాలని కోరుతూ ఆయన ఎన్సీఎల్టీను ఆశ్రయించారు. కంపెనీ రిసీలియెంట్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బోర్డు నిబంధనలను తారుమారు చేసి, యాజమాన్యంలో చట్టవిరుద్ధ మార్పులు చేసిందని చెప్పారు. ఆయన రాజీనామా అనంతరం 2022 మార్చి ఒకటో తేదీ నుంచి జారీ చేసిన షేర్లు / ఈఎస్ఓపీఎస్కు సంబంధించిన కంపెనీ నిర్ణయాలను తిరగదోడాలని డిమాండ్ చేశారు. దీనిపై కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో అడిటింగ్కు ఆదేశించాలని ఎన్సీఎల్టీని కోరారు. భారత్పే సంస్థ నుంచి తన భార్య మాధురి జైన్ తొలగింపు చట్ట విరుద్ధమని, ఆమెను తిరిగి ఉద్యోగంలో నియమించాలన్నారు. తన రాజీనామా తర్వాత బోర్డులో కొత్తగా నియమించిన సభ్యులను తొలగించాలని అభ్యర్థించారు. కంపెనీల చట్టం-2013లోని 241, 242 సెక్షన్ల ప్రకారం పిటిషన్ దాఖలు చేసిన అశ్నీర్ గ్రోవర్..అణచివేతకు పాల్పడుతూ అధికార దుర్వనియోగంతో తనను తొలగించినందుకు కంపెనీ ప్రస్తుత యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదీ చదవండి: ఫ్యుయల్ ఆదా అవ్వాలంటే ఇది యాక్టివేట్ చేయాల్సిందే..! ఇటీవల గ్రోవర్ పిటిషన్ ఎన్సీఎల్టీ బెంచ్ ముందు విచారణకు వచ్చింది. ఈ కేసు తదుపరి విచారణను వచ్చే నెల 11కు వాయిదావేసింది. తన పిటిషన్కు సంబంధించి ప్రాథమిక సాక్ష్యాధారాలు సమర్పించినట్లు తెలిసింది. అశ్నీర్ గ్రోవర్ తన పిటిషన్లో కంపెనీ కో ఫౌండర్ శస్వత్ నక్రానీతోపాటు చైర్మన్ రజనీష్ కుమార్, మాజీ సీఈఓ కం డైరెక్టర్ సుశీల్ సమీర్ తదితర 12 మందిని ప్రతివాదులుగా చేర్చారు. -
అనిల్ అంబానీ ఆస్తులు అమ్మకానికి గ్రీన్ సిగ్నల్.. జాబితాలో ఉన్నవేంటో తెలుసా?
గత కొన్ని సంవత్సరాలకు ముందు ఇండియన్ టెలికాం రంగంలో పెను మార్పులు తీసుకువచ్చిన అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్కు చెందిన కొన్ని రియల్ ఎస్టేట్ ఆస్తులను విక్రయించేందుకు ముంబై ఎన్సిఎల్టి ట్రిబ్యునల్ ఆమోదం తెలిపినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్ ఇటీవల తెలిపింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్)కి చెందిన రిజల్యూషన్ ప్రొఫెషనల్ కంపెనీకి చెందిన కొన్ని అపరిమిత ఆస్తుల విక్రయాన్ని చేపట్టేందుకు ఎన్సిఎల్టి నుంచి అనుమతి కోరుతూ దాఖలు చేసిన దరఖాస్తు విషయంలో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ముంబై బెంచ్ ఆర్డర్ను దాఖలు చేసింది. ఈ ట్రిబ్యునల్ ఆమోదం కోసం రిజల్యూషన్ ప్లాన్ను సమర్పించిన తర్వాత CIRP రెగ్యులేషన్స్లోని రెగ్యులేషన్ 29 ప్రకారం దరఖాస్తుదారు/RP కార్పొరేట్ రుణగ్రహీత ఆస్తులను విక్రయించవచ్చని ఈ ట్రిబ్యునల్ స్పష్టం చేస్తుంది. విక్రయానికి ఎంచుకున్న ఆస్తులలో భూమి, భవనంతో కూడిన RCom చెన్నై హాడో ఆఫీస్ ఉన్నాయి. అంతే కాకుండా చెన్నైలోని అంబత్తూర్లో సుమారు 3.44 ఎకరాల విస్తీర్ణంలో ల్యాండ్, పూణేలో 871.1 చదరపు మీటర్ల ల్యాండ్, భువనేశ్వర్ బేస్డ్ ఆఫీస్ స్పేస్, క్యాంపియన్ ప్రాపర్టీస్ షేర్లలో పెట్టుబడి, రిలయన్స్ రియల్టీ షేర్లలో పెట్టుబడి వంటివి విక్రయించనున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: బిలినీయర్స్ జాబితాలో కొత్త వ్యక్తి.. మద్యం అమ్ముతూ అరుదైన ఘనత వాస్తవానికి 2016లో ముఖేష్ అంబానీ రిలయన్స్ జియో ప్రారంభించిన తర్వాత అనిల్ అంబానీ సంస్థ పరిస్థితి చాలా దిగజారింది. అన్న ప్రకటించిన డేటా వార్ కారణంగా తమ్ముడు భరించలేని నష్టాల్లోకి జారుకున్నాడు. ఆ విధంగానే కంపెనీ తన బ్యాంక్ రుణాలను చెల్లించటంలో డిఫాల్ట్ అయి చివరికి దివాలా ప్రక్రియలోకి వెళ్లిపోయినట్లు సమాచారం. -
బీసీసీఐకి రూ.158 కోట్లు బాకీ.. బైజూస్కు నోటీసులు
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి బాకీ పడిన రూ. 158 కోట్లకు సంబంధించి నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ) ‘బైజూస్’ సంస్థకు నోటీసులు జారీ చేసింది. భారత క్రికెట్ బోర్డు దాఖలు చేసిన పిటిషన్కు స్పందిస్తూ ఎన్సీఎల్టీ ఈ నోటీసులు ఇచ్చింది. ‘దీనిపై స్పందించేందుకు బైజూస్కు రెండు వారాల గడువు ఇచ్చాం. ఆపై మరో వారం రోజుల్లో బీసీసీఐ తమ అభ్యంతరాలను దాఖలు చేయాలి’ అని ఆదేశించిన ఎన్సీఎల్టీ... ఈ కేసును డిసెంబర్ 22కు వాయిదా వేసింది. 2019లో భారత క్రికెట్ జట్టు ప్రధాన స్పాన్సర్గా వచ్చిన బైజూస్ సంస్థ తర్వాతి రోజుల్లో దివాళా తీయడంతో బీసీసీఐకి రూ. 158 కోట్లు బాకీ పడింది. -
ఎన్సీఎల్టీ గ్రీన్ సిగ్నల్..రూ. 51,424 కోట్లు మొండి బాకీలు వసూలు!
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరంలో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) 180 దివాలా పరిష్కార ప్రణాళికలకు ఆమోదముద్ర వేసింది. ఇంత అత్యధిక సంఖ్యలో ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ లభించడం ఇప్పటివరకూ ప్రథమం. దీనితో మొత్తం రూ. 51,424 కోట్ల మొండి బాకీలు వసూలయ్యాయి. చివరిసారిగా 2019 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా రూ. 1.11 లక్షల కోట్లు వసూలయ్యాయి. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో రావడం ఇదే తొలిసారి. అప్పట్లో 77 ప్రణాళికలకు ఎన్సీఎల్టీ ఆమోదం తెలిపింది. వీటిలో ఎస్సార్ స్టీల్, మోనెట్ ఇస్పాత్ వంటి భారీ ప్రతిపాదనలు ఉన్నాయి. తాజాగా గత ఆర్థిక సంవత్సరంలో ఎన్సీఎల్టీ 1,255 దివాలా ప్రక్రియ దరఖాస్తులను విచారణకు స్వీకరించింది. రూ. 1,42,543 కోట్లకు క్లెయిమ్లు రాగా అందులో 36 శాతం సొమ్మును రుణదాతలకు పొందగలిగారు. దివాలా బోర్డు ఐబీబీఐ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ►2023 ఆర్థిక సంవత్సరం ఆఖరు వరకూ ఎన్సీఎల్టీ 678 ప్రణాళికలను క్లియర్ చేసింది. రుణదాతలు రూ. 2.86 లక్షల కోట్లు రాబట్టుకోగలిగారు. ►ఎన్సీఎల్టీకి దేసవ్యాప్తంగా 31 బెంచ్లు ఉండగా, వాటిలో 28 పనిచేస్తున్నాయి. ట్రిబ్యునల్లో న్యాయమూర్తులు, సహాయక సిబ్బంది కొరత ఉంది. ప్రెసిడెంట్ సహా 63 మంది జ్యుడిషియల్, టెక్నికల్ సిబ్బందిని మంజూరు చేయగా ప్రస్తుతం 37 మందే ఉన్నారు. గతేడాది నవంబర్లో ప్రభుత్వం 15 మంది సిబ్బందిని నియమించింది. ఎన్సీఎల్టీ బెంచ్ పనిచేయాలంటే కనీసం ఒక జ్యుడిషియల్, ఒక టెక్నికల్ సభ్యులు ఉండాలి. ►ఎన్సీఎల్టీ బెంచ్లు ఇప్పటివరకు 6,567 కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రణాళికలను (సీఐఆర్పీ) పరిశీలించగా వాటిలో 4,515 సీఐఆర్పీలపై విచారణ ముగిసింది. ► తయారీ, రియల్ ఎస్టేట్ రంగాల సంస్థలు అత్యధికంగా సీఐఆర్పీపరమైన ప్రక్రియను ఎదుర్కొంటున్నాయి. మొత్తం కేసుల్లో తయారీ రంగ వాటా 39 శాతం, రియల్ ఎస్టేట్ 21 శాతం, నిర్మాణ రంగం 11 శాతం, హోల్సేల్..రిటైల్ ట్రేడ్ వాటా 10 శాతంగా ఉంది. ►నిర్దేశిత గరిష్ట గడువు 330 రోజుల్లోగా తగిన కొనుగోలుదారు ఎవరూ ముందుకు రాకపోవడంతో 76 శాతం పైగా కేసులు లిక్విడేషన్కు దారి తీశాయి. -
జీ ఎంటర్టైన్మెంట్కు ఎన్సీఎల్ఏటీలో ఊరట
న్యూఢిల్లీ: సోనీతో విలీనానికి సంబంధించి జీ ఎంటర్టైన్మెంట్కు ఊరట లభించింది. ఈ డీల్కు అనుమతులను పునరాలోచన చేయాలంటూ బీఎస్ఈ, ఎన్ఎస్ఈలను సూచిస్తూ ఎన్సీఎల్టీ ఇచ్చిన ఉత్తర్వులను ఎన్సీఎల్ఏటీ తోసిపుచ్చింది. ఈ వ్యవహరంలో జీ ఎంటర్టైన్మెంట్ తన వాదనలు వినిపించేందుకే ఎన్సీఎల్టీ అవకాశం ఇవ్వలేదని, ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని పే ర్కొంది. ఇరు పక్షాల వాదనలు విని కొత్తగా ఉత్తర్వులు జారీ చేయాలంటూ కేసును తిరిగి ఎన్సీఎల్టీకి పంపించింది. సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్, జీ ఎంటర్టైన్మెంట్ విలీనానికి 2021లో ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం విలీన సంస్థలో సోనీకి 50.86 శాతం, జీ వ్యవస్థాపకులకు 4 శాతం, మిగతా వాటా జీ ఎంటర్టైన్మెంట్ ఇతర షేర్హోల్డర్లకు ఉంటుంది. అయితే, షిర్పూర్ గోల్డ్ రిఫైనరీలో నిధుల మళ్లింపునకు సంబంధించి జీ ప్రమోటర్ల పేర్ల ప్రస్తావన ఉందన్న అంశంతో ఎన్ఎస్ఈ, బీఎస్ఈ .. విలీన స్కీముపై ఎన్సీఎల్టీకి సందేహాలను తెలియజేశాయి. దీనితో విలీనానికి గతంలో ఇచ్చిన అనుమతులను పునఃసమీక్షించుకుని, తదు పరి విచారణ తేదీలోగా, తగు నిర్ణయం తీసుకోవాలంటూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) సూచించింది. దీన్ని సవాలు చేస్తూ జీ ఎంటర్టైన్మెంట్ పిటీషన్ వేయడంతో నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ తాజా ఆదేశాలు ఇచ్చింది. -
ఎన్సీఎల్ఏటీలో గో ఫస్ట్కు ఊరట
న్యూఢిల్లీ: నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎస్సీఎల్ఏటీ) సోమవారం సంక్షోభంలో ఉన్న ఎయిర్లైన్ గో ఫస్ట్పై దివాలా పరిష్కార ప్రక్రియను సమర్థించింది. దీనితో సంక్షోభంలో పడిన వాడియా గ్రూప్ సంస్థ– గో ఫస్ట్ నుండి తమ విమానాలను వెనక్కి తీసుకునేందుకు ఎయిర్క్రాఫ్ట్ లీజర్లు చేసిన ప్రయత్నాలకు తక్షణం అడ్డుకట్ట పడింది.. క్లెయిమ్లపై ఎన్సీఎల్టీకి వెళ్లవచ్చు... క్లెయిమ్లకు సంబంధించి ఎయిర్క్రాఫ్ట్ లీజర్లు అలాగే గో ఫస్ట్ మధ్యంతర రిజల్యూషన్ ప్రొఫెషనల్ (ఐఆర్పీ) నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎస్సీఎల్టీ)ని ఆశ్రయించాలని చైర్పర్సన్ జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ఇద్దరు సభ్యుల అప్పిలేట్ బెంచ్ ఆదేశించింది. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న గో ఫస్ట్కు మే నెల 10వ తేదీన నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) కాస్త ఊరటనిస్తూ, కంపెనీ స్వచ్ఛందంగా దాఖలు చేసిన దివాలా పిటీషన్ను విచారణకు స్వీకరించింది. అలాగే ఆర్థిక వ్యవహారాలు, చెల్లింపులకు సంబంధించి మారటోరియం విధించింది. మే 4న మధ్యంతర పరిష్కార నిపుణుడిగా (ఐఆర్పీ) అభిలాష్ లాల్ను నియమించడంతో పాటు ఏ ఉద్యోగినీ తీసివేయకూడదని ఆదేశించింది. అలాగే, రద్దయిన మేనేజ్మెంట్.. తక్షణ ఖర్చుల కోసం రూ. 5 కోట్ల మొత్తాన్ని ఐఆర్పీ వద్ద డిపాజిట్ చేయాలని సూచించింది. తమ విజ్ఞప్తులను కూడా తెలుసుకున్న తర్వాతే గో ఫస్ట్ దివాలా పిటీషన్పై తగు నిర్ణయం తీసుకోవాలంటూ సంస్థకు విమానాలను లీజుకిచ్చిన కంపెనీల అభ్యంతరాలను ఎన్సీఎల్టీ తోసిపుచ్చింది. దీనితో దివాలా విచారణ పూర్తయ్యే వరకూ ఇతరత్రా దావాల నుంచి గో ఫస్ట్కు రక్షణ లభించనట్లయ్యింది. సంస్థ ఆస్తులను బదిలీ చేయడానికి గానీ రుణ దాతలు రికవర్ చేసుకోవడానికి గానీ ఈ ఉత్తర్వు్యలతో వీలుండదు. -
స్పైస్జెట్కు ఎన్సీఎల్టీ నోటీసులు
న్యూఢిల్లీ: విమానయాన సంస్థ స్పైస్జెట్పై దివాలా పరిష్కార ప్రక్రియ కింద చర్యలు తీసుకోవాలంటూ కంపెనీకి ఎయిర్క్రాఫ్టులను లీజుకి ఇచ్చిన ఎయిర్క్యాజిల్ (ఐర్లాండ్) పిటీషన్పై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) విచారణ జరిపింది. స్పైస్జెట్కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మే 17కు వాయిదా వేసింది. నోటీసుల జారీ ప్రక్రియ సాధారణమేనని, ఎన్సీఎల్టీ తమకు ప్రతికూలంగా ఉత్తర్వులేమీ ఇవ్వలేదని స్పైస్జెట్ అధికార ప్రతినిధి తెలిపారు. సెటిల్మెంట్ కోసం ఇరు పక్షాలు చర్చలు జరుపుతున్న విషయాన్ని న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుందని పేర్కొన్నారు. ఇకపైనా చర్చలను కొనసాగించవచ్చని వివరించారు. స్పైస్జెట్పై ఎయిర్క్యాజిల్ ఏప్రిల్ 28న పిటిషన్ దాఖలు చేసింది. అయితే, తమ దగ్గర ఎయిర్క్యాజిల్ విమానాలేమీ లేవని, ఈ పిటిషన్తో తమ కార్యకలాపాలపై ఎటువంటి ప్రభావమూ ఉండబోదని స్పైస్జెట్ గత వారం తెలిపింది. ఎన్సీఎల్టీ వెబ్సైట్ ప్రకారం స్పైస్జెట్పై ఇప్పటికే రెండు దివాలా పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలీనానికి ఎన్సీఎల్టీ ఆమోదం
హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకుల విలీనానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆమోదం తెలిపింది. ఈ విలీనానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ), పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) సహా అన్ని రెగ్యులేటరీ సంస్థల నుంచి సూత్రప్రాయ ఆమోదం లభించింది. ఈ విలీనాన్ని వాటాదారులు కూడా ఆమోదించారు. ఇదీ చదవండి: ఇంత తిన్నావేంటి గురూ.. పిజ్జాల కోసం డామినోస్ మాజీ సీఈవో ఖర్చు ఎంతో తెలుసా? హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకుల విలీనానికి స్టాక్ ఎక్స్ఛేంజీలు, కాంపిటీషన్ కమిషన్ ఆమోదం తెలిపాయి. ఈ ప్రక్రియ పూర్తయ్యాక హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 100 శాతం పబ్లిక్ షేర్హోల్డర్ల యాజమాన్యంలో ఉంటుంది. హెచ్డీఎఫ్సీకి చెందిన ప్రస్తుత వాటాదారులకు బ్యాంక్లో 41 శాతం వాటా ఉంటుంది. ఐసీఐసీఐ బ్యాంక్ కంటే పెద్దది ఈ విలీనం తర్వాత ప్రతి హెచ్డీఎఫ్సీ వాటాదారు ప్రతి 25 షేర్లకు హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు చెందిన 42 షేర్లను పొందుతారు. 2021 డిసెంబర్ బ్యాలెన్స్ షీట్ ప్రకారం.. ఈ విలీనం తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ రూ. 17.87 లక్షల కోట్లు. నికర విలువ రూ. 3.3 లక్షల కోట్లకు చేరుతుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ కంటే రెట్టింపు పరిమాణంలో దేశంలో మూడో అతిపెద్ద బ్యాంకుగా అవతరిస్తుంది. ఇదీ చదవండి: Sandeep Bakhshi: ఐసీఐసీఐ బ్యాంకును నిలబెట్టిన సీఈవో ఈయన.. జీతం ఎంతో తెలుసా? -
గెయిల్ గూటికి జేబీఎఫ్ పెట్రోకెమికల్స్
న్యూఢిల్లీ: దివాలా పరిష్కార చర్యల్లో ఉన్న జేబీఎఫ్ పెట్రోకెమికల్స్ కంపెనీని ప్రభుత్వరంగ సంస్థ గెయిల్ కొనుగోలు చేయనుంది. రూ.2,079 కోట్లతో గెయిల్ వేసిన బిడ్కు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆమోదం లభించింది. పెట్రోకెమికల్స్ వ్యాపారాన్ని విస్తరించాలన్న పట్టుదలతో గెయిల్ కొంతకాలంగా ఉంది. ఇప్పుడు జెబీఎఫ్ కొనుగోలుతో కంపెనీ తన లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లేందుకు వీలు పడుతుంది. తాము ఇచ్చిన రుణాలను జేబీఎఫ్ చెల్లించక పోవడంతో రుణదాతలు ఎన్సీఎల్టీ అనుమతితో విక్రయానికి పెట్టారు. దీనికి గెయిల్ సమర్పించిన పరిష్కార ప్రణాళికకు ఎన్సీఎల్టీ అహ్మదాబాద్ బెంచ్ ఆమోదం తెలిపినట్టు స్టాక్ ఎక్సేంజ్లకు సమాచారం ఇచ్చింది. (రిలయన్స్ అధినేత అంబానీ కళ్లు చెదిరే రెసిడెన్షియల్ ప్రాపర్టీస్) ఇండియన్ ఆయిల్, ఓఎన్జీసీ కర్సార్షియంతో పోటీ పడి మరీ గెయిల్ జేబీఎఫ్ బిడ్డింగ్లో విజేతగా నిలిచింది. ఐడీబీఐ బ్యాంక్ రూ.5628 కోట్లను రాబట్టుకునేందుకు జేబీఎఫ్ను వేలం వేసింది. కొనుగోలు లావాదేవీ ఇంకా పూర్తి కావాల్సి ఉందని గెయిల్ తెలిపింది. జేబీఎఫ్కు మంగళూరు సెజ్లో 1.25 మిలియన్ టన్నుల టెరెఫ్తాలిక్ యాసిడ్ తయారీ ప్లాంట్ ఉంది. గెయిల్కు ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని పతా వద్ద పెట్రోకెమికల్ ప్లాంట్ ఉంది. ఇక్కడ 8,10,000 టన్నుల వార్షిక పాలీమర్స్ తయారు చేయగలదు. వచ్చే ఏడాదికి మహారాష్ట్రలోని ఉసార్లో ప్రొపేన్ డీహైడ్రోజెనేషన్ ప్లాంట్ను ఏర్పాటు చేయనుంది (ఇదీ చదవండి: ‘నాటు నాటు’ జోష్ పీక్స్: పలు బ్రాండ్స్ స్టెప్స్ వైరల్, ఫ్యాన్స్ ఫుల్ ఫిదా!) -
’గూగుల్’ కేసులో తాత్కాలిక స్టేకు ఎన్సీఎల్ఏటీ నిరాకరణ
న్యూఢిల్లీ: ప్లే స్టోర్ విధానాలపై కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) జరిమానా విధించిన కేసులో ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించిన టెక్ దిగ్గజం గూగుల్కు ఊరట దక్కలేదు. దీనిపై తాత్కాలిక స్టే ఇచ్చేందుకు నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) నిరాకరించింది. సీసీఐ విధించిన రూ. 936 కోట్లలో పది శాతాన్ని వచ్చే నాలుగు వారాల్లోగా రిజిస్ట్రీలో డిపాజిట్ చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 17కు వాయిదా వేసింది. ప్లే స్టోర్ విధానాల్లో గూగుల్ ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందంటూ సీసీఐ ఈ పెనాల్టీ విధించింది. మరోవైపు, ఆండ్రాయిడ్ మొబైల్ డివైజ్ల విషయంలో ఎన్సీఎల్ఏటీ ఉత్తర్వులను సవాలు చేస్తూ గూగుల్ దాఖలు చేసిన పిటీషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. సోమవారం వాదనలు విననుంది. ఆండ్రాయిడ్ మొబైల్ డివైజ్ల విషయంలో గూగుల్ తన ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందంటూ సీసీఐ రూ. 1,337 కోట్లు జరిమానా విధించగా, దానిపై తాత్కాలిక స్టే ఇచ్చేందుకు ఎన్సీఎల్ఏటీ నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ కేసులోనూ 10 శాతం మొత్తాన్ని డిపాజిట్ చేయాలంటూ ఆదేశించింది. గతేడాది అక్టోబర్లో వారం రోజుల వ్యవధిలోనే ఈ రెండు కేసులకు సంబంధించి గూగుల్కు సీసీఐ మొత్తం రూ. 2,200 కోట్ల మేర జరిమానా విధించింది. చదవండి: కొత్త ఏడాదిలో కస్టమర్లకు షాక్.. కీలక నిర్ణయం తీసుకున్న బీఓబీ! -
టొరంట్కు ఎన్సీఎల్టీ రిలీఫ్
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో చిక్కుకున్న రిలయన్స్ క్యాపిటల్ విక్రయ అంశాన్ని ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ తాజాగా తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలుస్తోంది. దివాలా పరిష్కార ప్రక్రియలో ఉన్న ఆర్క్యాప్ కొనుగోలుకి హిందుజా గ్రూప్ చివర్లో దాఖలు చేసిన సవరించిన బిడ్పై స్టే ఆర్డర్ ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ వివరాల ప్రకారం.. ఆర్క్యాప్ రుణ పరిష్కార ప్రణాళికలో భాగంగా రూ. 8,640 కోట్ల బిడ్తో టొరంట్ గ్రూప్ గరిష్ట బిడ్డర్గా నిలిచింది. అయితే తదుపరి హిందుజా గ్రూప్ రూ. 9,000 కోట్లకు సవరించిన బిడ్ను డిసెంబర్ 21న ఈవేలం ముగిశాక దాఖలు చేసినట్లు టొరంట్ గ్రూప్ ఎన్సీఎల్టీకి ఫిర్యాదు చేసింది. వేలం ముగిసిన తదుపరి రోజు హిందుజా గ్రూప్ సంస్థ ఇండస్ఇండ్ బ్యాంక్ తొలి ఆఫర్ను రూ. 8,100 కోట్లను తదుపరి రూ. 9,000 కోట్లకు సవరించినట్లు టొరంట్ గ్రూప్ ఫిర్యాదులో పేర్కొంది. ఈ అంశంపై వచ్చే వారం విచారణ జరగనున్నట్లు తెలుస్తోంది. కాగా.. మరోపక్క రిలయన్స్ క్యాప్ రుణదాతలు అటు టొరంట్ గ్రూప్, ఇటు హిందుజా గ్రూప్తో రిజల్యూషన్పై చర్చలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. -
సీసీఐ ఆదేశాలపై ఎన్సీఎల్ఏటీకి గూగుల్
న్యూఢిల్లీ: ఆండ్రాయిడ్ మొబైల్ డివైజ్ వ్యవస్థకు సంబంధించి అనుచిత వ్యాపార విధానాలు పాటిస్తోందంటూ కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) భారీ జరిమానా విధించడాన్ని సవాలు చేస్తూ అపీలేట్ ట్రిబ్యునల్ ఎన్సీఎల్ఏటీని టెక్ దిగ్గజం గూగుల్ ఆశ్రయించింది. ఈ ఆదేశాల వల్ల ఆండ్రాయిడ్ భద్రతా ఫీచర్లను విశ్వసించే తమ భారతీయ యూజర్లు, వ్యాపారాల ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని, మొబైల్ పరికరాల రేట్లు పెరిగేందుకు కూడా దారి తీయవచ్చని కంపెనీ అధికార ప్రతినిధి చెప్పారు. ఈ నేపథ్యంలోనే సీసీఐ ఆదేశాలపై స్టే విధించాలని కోరుతూ నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ)ని ఆశ్రయించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తమ యూజర్లు.. భాగస్వాముల ప్రయోజనాలను పరిరక్షించేందుకు కట్టుబడి ఉన్నామని వివరించారు. ఆండ్రాయిడ్ మొబైల్ డివైజ్లకు సంబంధించి గూగుల్ తన ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందంటూ కంపెనీపై సీసీఐ రూ. 1,338 కోట్ల భారీ జరిమానా విధించింది. అలాగే, అనుచిత వ్యాపార విధానాలు మానుకోవాలని కూడా ఆదేశించింది. చదవండి: బీభత్సమైన ఆఫర్: జస్ట్ కామెంట్ చేస్తే చాలు.. ఉచితంగా రూ.30 వేల స్మార్ట్ఫోన్! -
Jet Airways: జెట్ ఎయిర్వేస్ ఉద్యోగులకు భారీ షాక్
ఉద్యోగులకు జెట్ ఎయిర్వేస్ భారీ షాక్ ఇచ్చింది. సంస్థ భవిష్యత్ కోసం పొదుపు మంత్రం జపిస్తోంది. ఇందులో భాగంగా ఎలాంటి వేతనాలు చెల్లించకుండా 60 శాతం ఉద్యోగులను సెలవులపై ఇంటికి పంపించాలని నిర్ణయించింది. మిగిలిన ఉద్యోగులకు 50 శాతం వరకు జీతంలో కోత పెట్టనుంది. 2019లో ఆర్థికంగా కుదేలైన జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాల్ని నిలిపివేసింది. అయితే ఆ తర్వాత జరిగిన వరుస పరిణామాలతో జెట్ ఎయిర్వేస్ను బిడ్డింగ్ జలాన్కర్లాక్ సంస్థ దక్కించింది. నూతన యాజమాన్యం ఈ ఏడాది నుంచి తిరిగి సర్వీసుల్ని ప్రారంభించాలని భావించింది. కానీ ఇప్పుటికే ఉద్యోగులకు చెల్లించాల్సిన జీత భత్యాలపై ఉద్యోగులు, సిబ్బంది సంఘం నేషనల్ లా అప్పీలేట్ ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ) ను ఆశ్రయించారు. దీంతో కథ మొదటికొచ్చింది. సర్వీసుల పునప్రారంభం కంటే ఉద్యోగులకు చెల్లించాల్సిన ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ బకాయిలను చెల్లించాలని నూతన యాజమాన్యాన్ని ఎన్సీఎల్ఏటీ ఆదేశించింది. ఈ నేపథ్యంలో జలాన్ కర్లాక్ కన్సార్షియం ఎయిర్లైన్స్ పూర్తి స్థాయిలో తాము ఆధీనంలోకి రాలేదని, ఇందుకోసం తగిన సమయం పడుతోందంటూ ఎన్సీల్ఏటీకి వివరణిచ్చింది. కాగా, సిబ్బందిని సెలవులపై ఇంటికి పంపేందుకు నిర్ణయం తీసుకుంది. నిధుల్ని ఆదా చేసేందుకు ఈ తరహా చర్యలకు దిగింది. -
దివాలా ప్రక్రియతో రూ. 2.43 లక్షల కోట్ల రికవరీ
న్యూఢిల్లీ: ఎన్సీఎల్టీ పర్యవేక్షణలో దివాలా పరిష్కార ప్రక్రియల ద్వారా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మొండి బాకీలను గణనీయంగా రికవరీ చేసుకోగలుగుతున్నాయి. 2022 సెప్టెంబర్ నాటికి రూ. 2.43 లక్షల కోట్లు రాబట్టుకోగలిగాయి. నిర్దిష్ట తేదీ నాటికి సంక్షోభంలో కూరుకున్న కంపెనీల నుండి మొత్తం రూ. 7.91 లక్షల కోట్లు బ్యాంకులకు రావాల్సి ఉంది. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐ) తమ త్రైమాసిక నివేదికలో ఈ విషయాలు తెలిపింది. మరోవైపు, ప్రస్తుతం కొనసాగుతున్న సీఐఆర్పీల్లో (కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియ) 64 శాతం కేసుల పరిశీలనకు 270 రోజుల పైగా జాప్యం జరుగుతోందని తెలిపింది. సీఐఆర్పీలు నిర్దేశిత కాలవ్యవధిలో పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ జాప్యం జరుగుతుండటం సమస్యగా మారిన నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. దివాలా కోడ్ (ఐబీసీ) ప్రకారం పిటిషన్ స్వీకరించిన తేదీ నుండి 180 రోజుల్లోగా సీఐఆర్పీని పూర్తి చేయాల్సి ఉంటుంది. దివాలా పరిష్కార నిపుణుడి (ఆర్పీ) అభ్యర్థన మేరకు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) దీన్ని మరో 90 రోజుల వరకూ పొడిగించవచ్చు. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రక్రియ 330 రోజుల్లోగా ముగియాలి. లిటిగేషన్లు, ఎన్సీఎల్టీ బెంచీల్లో సిబ్బంది కొరత, మౌలిక సదుపాయాల సమస్యలు, కోవిడ్పరమైన అవాంతరాలు మొదలైనవి పరిష్కార ప్రక్రియల జాప్యానికి కారణమవుతున్నాయి. -
ఎల్టీఐ–మైండ్ట్రీ ఆవిర్భావం
ముంబై: డైవర్సిఫైడ్ దిగ్గజం ఎల్అండ్టీ గ్రూప్ సాఫ్ట్వేర్ కంపెనీలు ఎల్అండ్టీ ఇన్ఫోటెక్, మైండ్ట్రీ లిమిటెడ్ విలీనమయ్యాయి. ఎల్టీఐ–మైండ్ట్రీ పేరుతో కొత్త సంస్థ ఏర్పాటైనట్లు ఎల్అండ్టీ తాజాగా వెల్లడించింది. దీంతో సంయుక్త సంస్థ దేశీ ఐటీ సర్వీసుల రంగంలో 5.25 బిలియన్ డాలర్ల ఆదాయంతో ఆరో పెద్ద కంపెనీగా ఆవిర్భవించినట్లు తెలియజేసింది. విలీనం వెనువెంటనే అమల్లోకి వచ్చినట్లు ఎల్అండ్టీ గ్రూప్ చైర్మన్ ఏఎం నాయక్ ప్రకటించారు. ఎల్టీఐ మైండ్ట్రీలో ట్రేడింగ్ 24 నుంచి ప్రారంభంకానున్నట్లు వెల్లడించారు. రూ. 1.53 లక్షల కోట్ల(సోమవారం ముగింపు) మార్కెట్ విలువతో సాఫ్ట్వేర్ రంగంలో ఐదో ర్యాంకులో నిలుస్తున్నట్లు తెలియజేశారు. విలీన సంస్థలో ఎల్అండ్టీ 68.73 శాతం వాటాను కలిగి ఉంది. విలీనంలో భాగంగా మైండ్ట్రీ వాటాదారులకు తమవద్ద గల ప్రతీ 100 షేర్లకు 73 ఎల్టీఐ షేర్లు జారీ చేయనున్నట్లు నాయక్ తెలియజేశారు. ఇందుకు ఈ నెల 24 రికార్డ్ డేట్గా నిర్ణయించారు. ఈ ఏడాది మే నెలలో రెండు కంపెనీల విలీనానికి తెరతీసిన సంగతి తెలిసిందే. విలీనం నేపథ్యంలో ఎన్ఎస్ఈలో మైండ్ట్రీ షేరు 2.7 శాతం ఎగసి రూ. 3,760 వద్ద, ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ 2 శాతం బలపడి రూ. 5,161 వద్ద ముగిశాయి. -
గంగవరం పోర్ట్.. అదానీ పరం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గంగవరం పోర్ట్ లిమిటెడ్లో (జీపీఎల్) మిగిలిన 58.1 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు ఎన్సీఎల్టీ అహ్మదాబాద్, ఎన్సీఎల్టీ హైదరాబాద్ నుండి అనుమతులు పొందినట్టు అదానీ పోర్ట్స్, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ (ఏపీఎస్ఈజడ్) సోమవారం వెల్లడించింది. షేర్–స్వాప్ విధానం ద్వారా డీవీఎస్ రాజు, కుటుంబం నుండి 58.1 శాతం వాటాను ఏపీఎస్ఈజడ్ కొనుగోలు చేస్తోంది. దీని ఫలితంగా పూర్వపు జీపీఎల్ ప్రమోటర్లకు దాదాపు 4.77 కోట్ల ఏపీఎస్ఈజడ్ షేర్లు జారీ చేస్తారు. కొనుగోలు పూర్తి అయితే జీపీఎల్లో ఏపీఎస్ఈజడ్కు 100 శాతం వాటా ఉంటుంది. జీపీఎల్ను రూ.6,204 కోట్లకు (ఒక్కొక్కటి రూ.120 చొప్పున 51.7 కోట్ల షేర్లు) కొనుగోలు చేసినట్టు ఏపీఎస్ఈజడ్ ప్రకటించింది. గంగవరం పోర్ట్ లిమిటెడ్లో వార్బర్గ్ పింకస్ నుంచి 31.5 శాతం వాటాను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 10 శాతం వాటాను 2021–22లో అదానీ పోర్ట్స్, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ దక్కించుకుంది. చదవండి: మూడేళ్ల సీక్రెట్ బయటపడింది.. స్వయంగా ఆర్డర్లు డెలివరీ చేస్తున్న సీఈఓ! -
గాయత్రి ప్రాజెక్ట్స్పై దివాలా పిటిషన్
న్యూఢిల్లీ: భారీగా పేరుకుపోయిన బాకీలను రాబట్టుకునేందుకు ఈపీసీ (ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్) సంస్థ గాయత్రి ప్రాజెక్ట్స్పై కెనరా బ్యాంక్ దివాలా పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై తదుపరి విచారణను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) అక్టోబర్ 10న (నేడు) చేపట్టనుంది. గాయత్రి ప్రాజెక్ట్స్ సంస్థ బ్యాంకులకు దాదాపు రూ. 6,000 కోట్లు బకాయిపడింది. కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) అత్యధికంగా రుణాలిచ్చాయి. -
సీఈఎల్ విక్రయానికి బ్రేక్
న్యూఢిల్లీ: సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(సీఈఎల్) విక్రయాన్ని తాజాగా ప్రభుత్వం రద్దు చేసింది. కంపెనీ కొనుగోలుకి బిడ్ చేసిన నండల్ ఫైనాన్స్ అండ్ లీజింగ్ డిజిన్వెస్ట్మెంట్ మార్గదర్శకాలను ఉల్లంఘించడమే దీనికి కారణమని ప్రభుత్వ అధికారి ఒకరు పేర్కొన్నారు. నండల్ ఫైనాన్స్పై ఎన్సీఎల్టీలో దివాలా కేసు పెండింగ్లో ఉన్న విషయాన్ని బిడ్డర్ తెలియజేయకపోవడంతో రద్దు నిర్ణయాన్ని తీసుకున్నట్లు వివరించారు. గతేడాది నవంబర్లో ప్రభుత్వం సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ శాఖ(డీఎస్ఐఆర్)కు చెందిన సీఈఎల్ను ఢిల్లీ సంస్థ నండల్ ఫైనాన్స్ అండ్ లీజింగ్కు విక్రయించేందుకు అనుమతించింది. డీల్ విలువ రూ. 210 కోట్లుకాగా.. బిడ్డింగ్ సమయంలో ఎన్సీఎల్టీ కేసు వివరాలను నండల్ ఫైనాన్స్ వెల్లడించలేనట్లు ప్రభుత్వ అధికారి తెలియజేశారు. కాగా.. మరోపక్క పవన్ హన్స్లో వ్యూహాత్మక విక్రయ అంశంపై వచ్చే నెలలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కంపెనీ కొనుగోలుకి గెలుపొందిన బిడ్డర్లలో ఒకటైన అల్మాస్ గ్లోబల్ అపార్చునిటీ ఫండ్ ఎస్పీసీపై ఎన్సీఎల్టీ వద్ద పెండింగ్లో ఉన్న కేసు వివరాలపై అప్పటికి స్పష్టత రానున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. -
బజాజ్ హిందుస్తాన్పై ఎస్బీఐ దివాలా పిటీషన్
న్యూఢిల్లీ: దేశీయంగా అతి పెద్ద చక్కెర, ఇథనాల్ తయారీ సంస్థ బజాజ్ హిందుస్తాన్ షుగర్పై దివాలా చట్టం కింద చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పిటీషన్ వేసింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) అలహాబాద్ బెంచ్లో ఈ మేరకు అభ్యర్ధన దాఖలు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో రుణ వాయిదా, కూపన్ రేటు వడ్డీ చెల్లింపుల్లో జాప్యం చేయడంతో రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం కంపెనీ ఖాతాను మొండి పద్దు (ఎన్పీఏ) కింద వర్గీకరించినట్లు ఎస్బీఐ పేర్కొంది. కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో రూ. 5,607 కోట్ల టర్నోవరుపై రూ. 268 కోట్ల నికర నష్టం (కన్సాలిడేటెడ్) ప్రకటించింది. బజాజ్ హిందుస్తాన్ షుగర్కు ఉత్తర్ప్రదేశ్లో పధ్నాలుగు ప్లాంట్లు ఉన్నాయి. చదవండి👉 కొత్త ఇల్లు కొనేవారికి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ శుభవార్త..! -
సోనీలో జీ ఎంటర్టైన్మెంట్ విలీనానికి ఓకే
న్యూఢిల్లీ: సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియాలో జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ (జీల్) విలీన ప్రతిపాదనకు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ నుంచి ఆమోదం లభించింది. ఈ విషయాన్ని జీల్ ప్రకటించింది. స్టాక్ ఎక్సే్చంజ్ల నుంచి ఆమోదం లభించడం బలమైన, సానుకూల ముందడుగుగా జీల్ పేర్కొంది. దీనివల్ల విలీనానికి సంబంధించి తదుపరి చర్యలు చేపట్టేందుకు వీలుంటుందని వివరించింది. అయితే, ఈ ప్రతిపాదిత విలీనం అన్నది ఇంకా నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. సెబీ, ఎన్సీఎల్టీల, సీసీఐ నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. గతేడాది డిసెంబర్లో ఈ రెండు మీడియా సంస్థలు తప్పనిసరి విలీనానికి ఒప్పందం చేసుకోవడం గమనార్హం. నాడు ప్రకటించిన మేరకు విలీనానంతర సంస్థలో కల్వర్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేటు లిమిటెడ్కు 52.03% వాటా ఉంటే, జీ వాటాదారులకు 47.07% వాటా లభించనుంది. జీల్ ఎండీ, సీఈవోగా ఉన్న పునీత్ గోయెంకా.. విలీనం తర్వా త సంస్థకు ఎండీ, సీఈవోగా కొనసాగనున్నారు. -
పవన్ హన్స్ అమ్మకానికి బ్రేక్
న్యూఢిల్లీ: పీఎస్యూ సంస్థ పవన్ హన్స్ అమ్మకపు ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపి వేసింది. కంపెనీ కొనుగోలుకి ఎంపికైన కన్సార్షియంలోని అల్మాస్ గ్లోబల్కు వ్యతిరేకంగా ఎన్సీఎల్టీ జారీ చేసిన ఆదేశాల నేపథ్యంలో విక్రయాన్ని పక్కన పెట్టింది. తదుపరి చర్యలు తీసుకునేముందు ఎన్సీఎల్టీ ఆదేశాలపై చట్టపరమైన పరిశీలన చేపట్టినట్లు ప్రభుత్వ అధికారి ఒకరు పేర్కొన్నారు. దీంతో బిడ్ను గెలుచుకున్నప్పటికీ లెటర్ ఆఫ్ అవార్డు(ఎల్వోఏ) జారీని చేపట్టబోమని తెలియజేశారు. పవన్ హన్స్ కొనుగోలుకి బిగ్ చార్టర్ ప్రయివేట్ లిమిటెడ్, మహరాజా ఏవియేషన్ ప్రయివేట్, అల్మాస్ గ్లోబల్ అపార్చునిటీ ఫండ్ ఎస్పీసీతో కూడిన స్టార్9 మొబిలిటీ ప్రయివేట్ లిమిటెడ్ కన్సార్షియం బిడ్ గెలుపొందినట్లు ప్రభుత్వం గత నెలలో ప్రకటించింది. పీఎస్యూ సంస్థ కొనుగోలుకి రూ. 211.14 కోట్ల విలువైన బిడ్ను స్టార్9 మొబిలిటీ దాఖలు చేసింది. ఇది ప్రభుత్వం నిర్ణయించిన రూ. 199.92 కోట్ల రిజర్వ్ ధరకంటే అధికం. అయితే కన్సార్షియంలో అల్మాస్ గ్లోబల్ అతిపెద్ద వాటాదారు కావడం గమనార్హం! స్టార్9 మొబిలిటీలో అల్మాస్ గ్లోబల్ అపార్చునిటీ వాటా 49%కాగా.. బిగ్ చార్టర్ 26%, మహరాజా ఏవియేషన్ 25% వాటాలను కలిగి ఉన్నాయి. కోల్కతాకు చెందిన కంపెనీ రిజల్యూషన్లో భాగంగా రుణదాతలకు చెల్లింపుల్లో విఫలమైనట్లు వెలువడిన వార్తలతో అల్మాస్ గ్లోబల్కు వ్యతిరేకంగా ఎన్సీఎల్టీ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. దీంతో రెండో ప్రభుత్వ రంగ కంపెనీలో వ్మూహాత్మక వాటా విక్రయానికి బ్రేకులు పడినట్లయ్యింది. ఇంతక్రితం బిడ్ గెలుపొందిన సంస్థపై ఆరోపణల కారణంగా సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(సీఈఎల్) విక్రయం సైతం నిలిచిపోయింది. -
అరరే.. బిర్లాలకు ఎంత కష్టమొచ్చింది!
న్యూఢిల్లీ: బిర్లా టైర్స్ లిమిటెడ్పై దివాలా చర్యలను ప్రారంభించాలని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) కోల్కతా బెంచ్ ఆదేశించింది. బీకే బిర్లా గ్రూప్ సంస్థ– బిర్లా టైర్స్ రుణదాత, మల్టీ–బిజినెస్ కెమికల్స్ సంస్థ ఎస్ఆర్ఎఫ్ దాఖలు చేసిన కేసులో బెంచ్ ఈ ఆదేశాలు ఇచ్చింది. ఐబీసీ చట్ట నిబంధనల ప్రకారం, బోర్డు ను సస్పెండ్ చేసి, మారటోరియం విధించిన ట్రి బ్యునల్, కంపెనీ కార్యకలాపాలను నిర్వహించడానికి సీక్ అబ్దుల్ సలామ్ను మధ్యంతర రిజల్యూషన్ ప్రొఫెషనల్ (ఐఆర్పీ)గా నియమించింది. టైర్ కార్డ్ ఫ్యాబ్రిక్ సరఫరాలకు సంబంధించి 2021 జూలై 8వ తేదీ నాటికి బిర్లా టైర్స్ తనకు రూ. 15.84 కోట్లు చెల్లించాలని ఎస్ఆర్ఎఫ్ దివాలా పిటిషన్లో పేర్కొంది. ఇందులో రూ. 10.06 కోట్ల అసలుకాగా, 5.78 కోట్లు వడ్డీ. రుణ డిఫాల్ట్కు సంబంధించి ఎస్ఆర్ఎఫ్ సమర్పించిన పత్రాలతో సంతృప్తి చెందినట్లు ట్రిబ్యునల్ పేర్కొంది. ఐబీసీ సెక్షన్ 9 కింద దాఖలు చేసిన ఈ పిటిషన్ను బిర్లా టైర్స్ చాలా ఆషామాషీగా తీసుకుని, వాయిదాలు తీసుకోడానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు కనబడుతోందని ట్రిబ్యునల్ సభ్యులు (టెక్నికల్) హరీష్ చందర్ మరో సభ్యులు (జుడీషియల్) సూరి రోహిత్ కపూర్ వ్యాఖ్యానించడం గమనార్హం. ఎస్ఆర్ఎఫ్ పిటిషన్పై బిర్లా టైర్స్కు ఎన్సీఎల్టీ 2021 అక్టోబర్ 20న నోటీసులు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేసింది. రిప్లై ఇవ్వడానికి మూడు ద ఫాలు బిర్లా టైర్స్ వాయిదాలు తీసుకోవడం గమనార్హం. చదవండి: ఓయో ఖాతాలో డైరక్ట్ బుకర్ -
అప్పుల ఊబి, రిలయన్స్ చేతికి సింటెక్స్!
న్యూఢిల్లీ: రుణ భారంతో కుదేలైన జౌళి ఉత్పత్తి సంస్థ సింటెక్స్ ఇండస్ట్రీస్ కొనుగోలుకి రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) వేసిన సంయుక్త బిడ్ జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ)కి చేరింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, అసెట్ కేర్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఎంటర్ప్రైజ్ (ఏసీఆర్ఈ) దాఖలు చేసిన ఉమ్మడి రిజల్యూషన్ ప్రణాళికను సింటెక్స్ ఇండస్ట్రీస్ రుణదాతలు ఏకగ్రీవ (కమిటీ ఆఫ్ క్రెడిటార్స్– సీఓసీ) ఇటీవలే ఆమోదం వేసిన సంగతి తెలిసిందే. దీంతో బిడ్ను రుణ పరిష్కార నిపుణులు (ఆర్పీ) ఎన్సీఎల్టీ, అహ్మదాబాద్ బెంచ్కు అనుమతి కోసం పంపినట్లు సింటెక్స్ వెల్లడించింది. శ్రీకాంత్ హిమత్సింకా, దినేష్ కుమార్ హిమత్సింకాతో పాటు వెల్స్పన్ గ్రూప్ సంస్థ ఈజీగో టెక్స్టైల్స్, జీహెచ్సీఎల్, హిమత్సింకా వెంచర్స్ వచ్చిన బిడ్స్ను కూడా పరిశీలించిన కమిటీ ఆఫ్ క్రెడిటార్స్, చివరకు ఆర్ఐఎల్, ఏసీఆర్ఈ బిడ్కు ఆమోద ముద్ర వేశాయి. ఆర్ఐఎల్, ఏసీఆర్ఈ ఉమ్మడి బిడ్ల విలువ వివరాలు తెలపనప్పటకీ, ఇది దాదాపు రూ.3,000 కోట్లని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. బకాయిల్లో రుణదాతలు 50 శాతం కంటే ఎక్కువ హెయిర్కట్ (రాయితీ) తీసుకున్నట్లు కూడా సమాచారం. పరిష్కార ప్రణాళిక ప్రకారం, కంపెనీ ప్రస్తుత వాటా మూలధనం సున్నాకి తగ్గిస్తారు. అలాగే కంపెనీ స్టాక్ ఎక్సే్ఛంజీలు, బీఎస్ఈ, ఎన్ఎస్ఈ నుండి డీలిస్ట్ అవుతుంది. సింటెక్స్ ఇండస్ట్రీస్పై దివాలా ప్రక్రియను గతేడాది ఏప్రిల్లో ప్రారంభించారు. కంపెనీపై దాదాపు రూ.7,500 కోట్ల క్లెయిమ్లు (రుణ బకాయిలు) దాఖలయ్యాయి. దివాలా కోడ్ (ఐబీసీ)నిబంధనల ప్రకారం, తుది క్లియరెన్స్ కోసం ఎన్సీఎల్టీ (నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్)కి వెళ్లే ముందు కంపెనీ ఆఫ్ క్రెడిటార్స్ కనీసం 66 శాతం మెజారిటీతో ఒక పరిష్కార ప్రణాళికా బిడ్ను ఆమోదించాల్సి ఉంటుంది. -
అనిల్ అగర్వాల్ చేజారిన వీడియోకాన్!
న్యూఢిల్లీ: దివాలా తీసిన వీడియోకాన్ ఇండస్ట్రీస్ను ‘అతి తక్కువ ధరకు’ కొనుగోలు చేయాలన్న బిలియనీర్ అనిల్ అగర్వాల్ నేతృత్వంలోని ట్విన్ స్టార్ టెక్నాలజీస్ ప్రయత్నం నెరవేరలేదు. ట్విన్ స్టార్ టెక్నాలజీస్ దాఖలు చేసిన బిడ్స్ను ఆమోదిస్తూ ఎన్సీఎల్టీ, ముంబై బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను దివాలా వ్యవహారాల అప్పీల్స్ కోర్టు– ఎన్సీఎల్ఏటీ (నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్) బుధవారం కొట్టివేసింది. దీంతో తాజా బిడ్స్ ఆహ్వానానికి కమిటీ ఆఫ్ క్రెడిటార్స్కు (సీఓసీ) తగిన వెసులుబాటు లభించింది. మొదటి నుంచీ అనిశ్చితే..! నిజానికి ట్విన్ స్టార్ టెక్నాలజీస్ బిడ్కు తొలుత సరేనన్న క్రెడిటార్స్ కమిటీ (సీఓసీ) తరువాత యూ టర్న్ తీసుకుంది. 13 కంపెనీల వీడియోకాన్ గ్రూప్ కొనుగోలుకు తాజా బిడ్స్ను ఆహ్వానించడానికి అనుమతించాలని కోరుతూ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నేతృత్వంలోని క్రెడిటార్స్ కమిటీ దివాలా అప్పిలేట్ ట్రిబ్యునల్ ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించింది. ఇందుకు అనుగుణంగా తిరిగి ఈ అంశాన్ని పునఃబిడ్డింగ్కు వీలుగా క్రెడిటార్స్ కమిటీకి తిప్పి పంపాలని కోరింది. కన్జూమర్ డ్యూరబుల్ సంస్థ వీడియోకాన్ ఇండస్ట్రీస్ కొనుగోలుకు ట్విన్ స్టార్ టెక్నాలజీస్ దాఖలుచేసిన రిజల్యూషన్ బిడ్ ప్రకారం, మొత్తం రుణాల్లో కేవలం 5 శాతమే తమకు లభిస్తుండడమే తాజా బిడ్స్ కోరడానికి కారణమని అప్పిలేట్ ట్రిబ్యునల్కు తెలిపింది. వీడియోకాన్ చెల్లించాల్సింది దాదాపు రూ.64,839 కోట్లయితే ఆ కంపెనీ కొనుగోలుకు బిలియనీర్ అగర్వాల్కు చెందిన ట్విన్ స్టార్ టెక్నాలజీస్ కేవలం రూ.2,962 కోట్లు ఆఫర్ చేసింది. వీడియోకాన్కు రుణాలు ఇచ్చిన ఎస్బీఐ నేతృత్వంలోని సంస్థలకు 94.98 శాతం వోటింగ్కు ప్రాతినిధ్యం ఉంది. ఇందులో ఒక్క ఎస్బీఐ ప్రాతినిధ్య వోటు 18.05 శాతం. ట్విన్ స్టార్ టెక్నాలజీస్ రూ.2,962 కోట్ల బిడ్కు జూన్ 9న ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ ఆమోదముద్ర వేసింది. అయితే ఈ ఆమోదం సందర్భంగా ఈ బిడ్ అతి తక్కువగా ఉందని, దీనివల్ల క్రెడిటార్కు ఒరిగిదేమీ ఉండదని, ట్విన్ స్టార్ టెక్నాలజీస్ చెల్లించేది నామమాత్రమని కూడా ఎన్సీఎల్టీ బెంచ్ వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ రిజల్యూషన్ ప్రణాళికపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఇరువురు క్రెడిటార్లు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (1.97 వోటింగ్ షేర్), ఐఎఫ్సీఐ లిమిటెడ్ (1.03 శాతం వోటింగ్షేర్) గత ఏడాది జూన్ 19న అప్పిలేట్ ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. దీనితో ఎన్సీఎల్టీ ఉత్తర్వుపై అప్పిలేట్ ట్రిబ్యునల్ స్టే విధించింది. యథాతథ పరిస్థితి కొనసాగింపునకు ఆదేశాలు జారీ చేసింది. అయితే అప్పిలేట్ ట్రిబ్యునల్ స్టే ఎత్తివేయాలని కోరుతూ ట్విన్ స్టార్ టెక్నాలజీస్ సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ ఫలితం దక్కలేదు. ఆగస్టు 13న ట్విన్స్టార్ పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. తన రిజల్యూషన్ ప్రణాళికను తొలత ఆమోదించి తరువాత యూ టార్న్ తీసుకోవడం సమంజసం కాదన్నది ట్విన్స్టార్ టెక్నాలజీస్ వాదన. టెలికం శాఖ, ధూత్ నుంచి కూడా వ్యతిరేకత కాగా తమ గ్రూప్ కంపెనీలను కేవలం రూ.2,962 కోట్ల కొనుగోలుకు వీలులేదంటూ వీడియోకాన్ గ్రూప్ చైర్మన్, ఎండీ వేణగోపాల్ ధూత్ దాఖలు చేసిన పిటిషన్ను కూడా అప్పిలేట్ ట్రిబ్యునల్ విచారించింది. వీడియోకాన్ టెలికమ్యూనికేషన్స్సహా ఆ గ్రూప్నకు సంబంధించి 13 కంపెనీలకు ‘ఏకీకృత’ పరిష్కార (రిజల్యూషన్) ప్రణాళికకు ఎన్సీఎల్టీ ఆమోదముద్ర వేయడాన్ని టెలికమ్యూనికేషన్ల శాఖ (డీఓటీ) వ్యతిరేకించింది. ఎన్సీఎల్టీ రూలింగ్ని అప్పీలేట్ ట్రిబ్యునల్లో సవాలు చేసింది. తనకు వీడియోకాన్ టెలికమ్యూనికేషన్స్ దాదాపు రూ.882 కోట్లు బకాయి పడినట్లు తెలిపింది. ఎన్సీఎల్టీలో కేసు విచారణలో ఉండడం వల్ల తానకు రావాల్సిన బకాయిలను రాబట్టుకోవడం సాధ్యంకాదని అప్పీలేట్ ట్రిబ్యునల్కు విన్నవించింది. కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ని ప్రారంభించడం ద్వారా డిఫాల్ట్ టెలికం కంపెనీలు ‘తమకు సంబంధించి రుణ బాధ్యతల నుండి బయటపడలేవని’ తన వాదనల్లో పేర్కొంది. మోసపూరిత విధానాలు పాల్పడిన కంపెనీలు ఐబీసీ నిబంధనావళికింద తప్పించుకోలేవని, తద్వారా ప్రభుత్వానికి చెల్లింపులను ఎగ్గొట్టలేవని స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఆమోదించిన రిజల్యూషన్ ప్లాన్ కింద కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ ద్వారా ఆపరేషనల్ క్రెడిటార్స్కు వచ్చేది అత్యంత తక్కువ మొత్తమని పేర్కొంది. తనవరకూ చూస్తే, తాను చేసే క్లెయిమ్లో లభించేది కేవలం 0.12 శాతమేనని వివరించింది. సీఓసీ నిర్ణయాలపై విమర్శ రిజల్యూషన్ ప్రణాళిక అమల్లో సీఓసీది కీలకపాత్ర. అయితే రుణాల్లో కూరుకుపోయి దివాల పక్రియలో ఉన్న కంపెనీ అమ్మకాలకు సంబంధించి రిజల్యూషన్ ప్రక్రియలో క్రెడిటార్స్ కమిటీ 95 శాతం వరకూ రాయితీ (హెయిర్కట్స్) ఇస్తుండడంపై ఇటీవల తీవ్ర విమర్శలు తలెత్తుతున్నాయి. తమకు రావాల్సిన బకాయిలకు సంబంధించి క్రెడిటార్ల సంఘం భారీ మాఫీలు జరిపి, రిజల్యూషన్ ప్రణాళికలను ఆమోదించడం తగదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐబీసీ (ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ కోడ్) దివాలా ప్రక్రియలో కీలకమైన కమిటీ ఆఫ్ క్రెడిటార్స్ (సీఓసీ)కి ఒక నియమావళిని జారీ చేసే పనిలో కేంద్రం ఉన్నట్లు కనబడుతోంది. ఈ విషయంలో ఆర్థికశాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్లతో కార్పొరేట్ వ్యవహారాల శాఖ చర్చిస్తున్నట్లు కార్పొరేట్ వ్యవహారాల కార్యదర్శి రాజేష్ వర్మ ఇటీవల తెలిపారు. అయితే అధిక హెయిర్కట్స్ విమర్శలపై ఆయన ఈ సందర్భంగా ఆయన ఎటువంటి వ్యాఖ్యలు, ఆ ప్రస్తావన చేయకపోవడం గమనార్హం. ఐబీసీకి పలు సవరణల ద్వారా దీనిని ఎప్పటికప్పుడు మరింత పటిష్టంగా మార్చడం జరుగుతోంది. ఈ దిశలో ఇప్పటికి ఐబీసీకి ఆరు సవరణలు జరిగాయి. ఐబీసీని మరింత సమర్థవంతంగా పటిష్టంగా మార్చడానికి విద్యావేత్తలు, విధాన నిర్ణేతలు, పరిశోధకులు, సంబంధిత ఇతర వర్గాలతో కేంద్రం నిరంతరం చర్చలు జరుపుతుందని, ఆయా సిఫారసులకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకుంటుందని అత్యున్నత స్థాయి వర్గాలు పేర్కొంటున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ ఐదు ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుకోవడంలో ఇది కీలకమని కూడా ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఐబీసీ సెక్షన్ 31 (4) నిబంధనలు పాటించకపోవడమే కారణం! దివాలా కోడ్ (ఐబీసీ) సెక్షన్ 31 (4) ప్రకారం, రిజల్యూషన్ ప్లాన్ను సమర్పించడానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) నుండి ముందస్తు అనుమతి అవసరమని, దీనిని అనిల్ అగర్వాల్ సంస్థ పొందలేదని జరత్ కుమార్ జైన్, అశోక్ కుమార్ మిశ్రాలతో కూడిన ఇరువురు సభ్యుల అప్పీలేట్ ట్రిబ్యునల్ పేర్కొంది. కోడ్ నిబంధనలకు అనుగుణంగా ప్రక్రియను పూర్తి చేయడం కోసం ఈ బిడ్స్ వ్యవహారాన్ని తిరిగి సీఓసీకి పంపుతున్నట్లు 213 పేజీల ఉత్తర్వు్యలో తెలిపింది. దీనిప్రకారం, ఎన్సీఎల్ఏటీ ఉత్తర్వును ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేసి, అది రద్దయితే తప్ప, సీఓసీ ఇప్పుడు వీడియోకాన్ కోసం తాజా బిడ్లను కోరడానికి సౌలభ్యత ఏర్పడింది. పునర్విచారణ, సమీక్ష కోసం రుణదాతలకు రిజల్యూషన్ ప్లాన్ను తిరిగి పంపే అధికారాలు ఎన్సీఎల్టీ, ఎన్సీఎల్ఏటీలు రెండింటికి ఉన్నాయని అప్పీలేట్ ట్రిబ్యునల్ పేర్కొనడం గమనార్హం. సీఓసీకి ఆయా అంశాల్లో ఉన్న అధికారాలను తోసిపుచ్చలేమని స్పష్టం చేసింది. తగిన చర్యలు తీసుకుంటాం: ట్విన్స్టార్ తాము అప్పీలేట్ ట్రిబ్యునల్ ఉత్తర్వుల గురించి తెలుసుకున్నట్లు ట్విన్స్టార్ తరఫు న్యాయవాది గోపాల్ జైన్ పేర్కొన్నారు. తాజా ఆర్డర్ వల్ల వీడియోకాన్ దివాలా పరిష్కార పక్రియ (రిజల్యూషన్) మరింత ఆలస్యం అవుతుందని అన్నారు. వ్రాతపూర్వక ఉత్తర్వు కోసం ఎదురుచేస్తున్నామని, తీర్పును పూర్తి అధ్యయనం తరువాత తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. -
రఘురామ కృష్ణరాజు కంపెనీకి చుక్కెదురు
సాక్షి, ఢిల్లీ: జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్లో ఎంపీ రాఘురామ కృష్ణరాజు కంపెనీకి ఎదురుదెబ్బ తగిలింది. ఇండ్ భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ పిటిషన్ను ఎన్సీఎల్టీ తిరస్కరించింది. వివిధ బ్యాంకుల నుంచి ఇండ్ భారత్ కంపెనీ మొత్తం రూ. 1383 కోట్ల రుణం తీసుకుంది. అయితే రికవరీ కోసం ఢిల్లీలోని డెబిట్ ట్రిబ్యునల్ను బ్యాంకుల కన్సార్షియం అశ్రయించింది. రూ.1327 కోట్ల అప్పులకు గాను తనఖా పెట్టిన ఆస్తుల విలువ రూ. 872 కోట్లే ఉంది. దివాళా అయిన కంపెనీ పరిష్కార ప్రక్రియ చేయాలని పంజాబ్ నేషనల్ బ్యాంక్ కోరింది. దివాలా ప్రక్రియకు అనుమతించవద్దంటూ రఘురామ కంపెనీ వాదించింది. పరిష్కార ప్రక్రియ ఆపాలంటూ ఎన్సీఎల్టీలో రఘురామ కంపెనీ వాదనలు వినిపించింది. అయితే రఘురామ కంపెనీ వాదనలతో జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ ఏకీభవించలేదు. ఆ వాదనను తిరస్కరించిన న్యాయమూర్తి.. దివాలా ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దివాలా పరిష్కార నిపుణుడిని నియమించి, మూడు రోజుల్లో దివాలా ప్రక్రియ గడువుతో సహా వివరాలన్నీ తెలియజేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఫారం–2 దాఖలు చేయాలని స్పష్టం చేశారు. కంపెనీ ఆస్తులపై రఘురామకు ఎలాంటి అధికారం లేదని ట్రిబ్యునల్ పేర్కొంది. మధ్యంతర పరిష్కార ప్రక్రియ పూర్తి చేసే అధికారాన్ని శ్రీకాకుళం వంశీకృష్ణకు అప్పగించింది. మూడు రోజుల్లో ఇండ్ భారత్ కంపెనీని రిజల్యూషన్ స్వాధీనం చేసుకోనుంది. -
Anil Ambani: రిలయన్స్ క్యాపిటల్ దివాలా ప్రొసీడింగ్స్ షురూ!
ముంబై: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన రిలయన్స్ క్యాపిటల్పై ఐబీసీ కింద దివాలా చర్యలు ప్రారంభించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దాఖలు చేసిన పిటిషన్ను సోమవారం ఎన్సీఎల్టీ (నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్), ముంబై బెంచ్ అనుమతించింది. కంపెనీపై కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియను ప్రారంభించాలని గత వారం ఆర్బీఐ ఎన్సీఎల్టీ ముంబై బెంచ్లో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిని అడ్మిట్ చేస్తూ, ప్రదీప్ నరహరి, దేశ్ముఖ్, కపిల్ కుమార్ వాద్రాలతో కూడిన ఎన్సీఎల్టీ బెంచ్ సోమవారం సాయంత్రం రూలింగ్ ఇచ్చింది. పాలనా సంబంధ అంశాల్లో డిఫాల్ట్ అయ్యిందని పేర్కొంటూ అనిల్ అంబానీ ప్రమోట్ చేస్తున్న రిలయన్స్ క్యాపిటల్ బోర్డ్ను నవంబర్ 29న సెంట్రల్ బ్యాంక్ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వై. నాగేశ్వరరావును కంపెనీ అడ్మినిస్ట్రేటర్గా కూడా నియమించింది. పూర్తి సహకారం: రిలయన్స్ క్యాపిటల్ ఇదిలాఉండగా, కంపెనీ ప్రమోటర్లు ఒక ప్రకటన చేస్తూ, 227 సెక్షన్ కింద ఎన్సీఎల్టీలో ఆర్బీఐ దాఖలు చేసిన పిటిషన్ విచారణకు పూర్తిగా సహకరిస్తామని పేర్కొన్నారు. రుణదాతలు, కస్టమర్లు, ఉద్యోగులు, షేర్హోల్డర్లతో సహా తన వాటాదారులందరి పూర్తి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, ఐబీసీ ప్రక్రియ ద్వారా వేగవంతమైన దివాలా పరిష్కార పక్రియకోసం కంపెనీ ఎదురుచూస్తున్నట్లు కూడా ప్రకటన తెలిపింది. ఆర్థిక రంగ నియంత్రణ సంస్థలు, ఫైనాన్షియల్ సర్వీస్ ప్రొవైడర్లు, సంబంధిత వర్గాలను సంప్రదించి ఒక కంపెనీని దివాలా– లిక్విడేషన్ ప్రొసీడింగ్ల కింద కేంద్రం నోటిఫై చేయడానికి దివాలా కోడ్ (ఐబీసీ)లోని సెక్షన్ 227 వీలుకల్పిస్తుంది. రిలయన్స్ క్యాపిటల్ రుణదాతలకు దాదాపు రూ.19,805 కోట్ల బకాయి ఉంది. వీటిలో మెజారిటీ నిధిని ట్రస్టీ విస్ట్రా ఐటీసీఎల్ ఇండియా కింద జారీ చేసిన బాండ్ల ద్వారా సమీకరించడం జరిగింది. ఆర్బీఐ ‘ఐబీసీ’ పిటిషన్ను ఎదుర్కొంటున్న మూడవ సంస్థ రిలయన్స్ క్యాపిటల్ దివాలా కోడ్ కింద ఇటీవల ఆర్బీఐ పిటిషన్ దాఖలు చేసిన మూడవ అతిపెద్ద నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (ఎన్బీఎఫ్సీ). ఇంతక్రితం శ్రేయీ గ్రూప్, దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (డీహెచ్ఎఫ్ఎల్)లపై ఈ తరహా పిటిషన్లను ఆర్బీఐ దాఖలు చేసింది. రిలయన్స్ క్యాపిటల్పై దాదాపు రూ.40,000 కోట్ల రుణం భారం ఉన్నట్లు రిలయన్స్ క్యాపిటల్ తన వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం)లో ప్రకటించింది. రెండవ త్రైమాసికంలో రూ.1,156 కోట్ల నష్టాలను ప్రకటించింది. 2020–21లో కంపెనీ రూ.19,308 కోట్ల ఆదాయంపై రూ.9,287 కోట్ల నష్టాన్ని పోస్ట్ చేసింది. చదవండి :Reliance Capital: అనిల్ అంబానికి షాక్ ! -
మైనారిటీ వాటాదారుల అభిప్రాయాలూ తెలుసుకోండి
ముంబై: వివిధ అంశాలు, సమస్యలపై చర్చకు జీ ఎంటర్టైన్మెంట్ (జీల్) అత్యవసర వాటాదారుల సమావేశాన్ని(ఈజీఎం) నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ మైనారిటీ వాటాదారు ఇన్వెస్కో చేసిన అభ్యర్థనకు ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ సానుకూలంగా స్పందించింది. బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేయవలసిందిగా మీడియా రంగ కంపెనీ జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్(జీల్)ను ఆదేశించింది. అమెరికాకు చెందిన ఇనెస్కో డెవలపింగ్ మార్కెట్స్ ఫండ్, ఓఎఫ్ఐ గ్లోబల్ చైనా ఫండ్తో కలిగి జీ ఎంటర్టైన్మెంట్పై ఈ పిటిషన్ దాఖలు చేశాయి. బోర్డ్ సమావేశం ఏర్పాటు ద్వారా జీల్ సీఈవో, ఎండీ పునీత్ గోయెంకాసహా మరో ఇద్దరు డైరెక్టర్లను తొలగించాలని ఆశిస్తోంది. అలాగే కొత్తగా ఎంపిక చేసిన ఆరుగురు డైరెక్టర్లతో బోర్డును పునర్నిర్మించాలని డిమాండ్ చేస్తోంది. బోర్డ్ సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరాలను షేర్ హోల్డర్లందరికీ తగిన విధంగా తెలియజేయాలని కూడా జీ ఎంటర్టైన్మెంట్నుజీ ఎంటర్టైన్మెంట్, అత్యవసర వాటాదారుల సమావేశం, ఇన్వెస్కో , ఎన్సీఎల్టీ , బోర్డ్ సమావేశం ఎన్సీఎల్టీ ఆదేశించింది. ఈ అంశాలపై తదుపరి విచారణను అక్టోబర్ 4న చేపట్టనున్నట్లు ఇద్దరు సభ్యుల బెంచ్ తెలియజేసింది. మరోపక్క ఈ అంశాలపై చట్ట ప్రకారం కేటాయించిన గడువులోగా బోర్డు సమావేశాన్ని నిర్వహించనున్నట్లు జీల్ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. వాటాలు ఇలా... ఈజీఎంను చేపట్టమంటూ సెప్టెంబర్ 11న జీల్ను అభ్యర్థించినట్లు ఇన్వెస్కో తరఫున వాదనలు వినిపించిన ముకుల్ రోహత్గీ ట్రిబ్యునల్కు తెలియజేశారు. వాటాదారుల ప్రయోజనాల పరిరక్షణార్ధం ప్రస్తుత బోర్డు ఆధ్వర్యంలో కంపెనీ నిర్వహణ చేపట్టరాదంటూ పేర్కొన్నారు. కొత్త డైరెక్టర్లను నియమించుకోవడం ద్వారా బోర్డును తిరిగి నిర్మించాలని కోరారు. దీంతో 45 రోజుల్లోగా ఈజీఎంను చేపట్టవలసిందిగా జీల్ను ఆదేశించమంటూ ఎన్సీఎల్టీని వేడుకున్నారు. ఓఎఫ్ఐ గ్లోబల్ చైనా ఫండ్తో కలిపి ఇన్వెస్కో డెవలపింగ్ మార్కెట్స్ ఫండ్ జీల్లో 17.88 శాతం వాటాను కలిగి ఉంది. కాగా.. సెపె్టంబర్ 22న సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియాతో విలీనమయ్యేందుకు జీల్ ఒప్పందాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ వార్తల నేపథ్యంలో ఎన్ఎస్ఈలో జీల్ షేరు 2 శాతం క్షీణించి రూ. 304 వద్ద ముగిసింది. -
పిరమల్ గ్రూప్ చేతికి డీహెచ్ఎఫ్ఎల్
ముంబై: ఆర్థిక సమస్యల్లో ఇరుక్కుని ఎన్సీఎల్టీకి చేరిన దివాన్ హౌసింగ్ ఫైనాన్స్(డీహెచ్ఎఫ్ఎల్) కొనుగోలు ప్రక్రియను పూర్తిచేసినట్లు పిరమల్ ఎంటర్ప్రైజెస్ తాజాగా వెల్లడించింది. డీహెచ్ఎఫ్ఎల్ రుణదాతలకు రూ. 34,250 కోట్లు చెల్లించినట్లు తెలియజేసింది. రుణ పరిష్కారంలో భాగంగా ఫిక్స్డ్ డిపాజిట్దారులతోపాటు.. రుణదాతలు మొత్తం రూ. 38,000 కోట్లు రికవర్ చేసుకున్నట్లు వివరించింది. నగదు, మారి్పడిరహిత డిబెంచర్ల(ఎన్సీడీలు) జారీ ద్వారా పిరమల్ క్యాపిటల్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్(పీసీహెచ్ఎఫ్ఎల్) సుమారు రూ. 34,250 కోట్లు చెల్లించినట్లు పేర్కొంది. రిజల్యూషన్లో భాగంగా డీహెచ్ఎఫ్ఎల్ వద్దగల మరో రూ. 3,800 కోట్లను రుణదాతలు పొందగలిగినట్లు తెలియజేసింది. ఐబీసీ నిబంధనల ప్రకారం ఫైనాన్షియల్ సరీ్వసుల రంగంలో విజయవంతమైన తొలి రుణ పరిష్కార ప్రణాళికగా డీహెచ్ఎఫ్ఎల్ను పిరమల్ గ్రూప్ చైర్మన్ అజయ్ పిరమల్ పేర్కొన్నారు. ఇకపై రిజల్యూషన్లకు ఇది నమూనాగా నిలవనున్నట్లు అభిప్రాయపడ్డారు. రెండు కంపెనీలను(పీసీహెచ్ఎఫ్ఎల్, డీహెచ్ఎఫ్ఎల్) విలీనం చేయనున్నట్లు వెల్లడించారు. విలీన సంస్థను పిరమల్ క్యాపిటల్ పిరమల్ క్యాపిటల్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్గా వ్యవహరించనున్నట్లు తెలియజేశారు. -
రిలయన్స్తో ఒప్పందంపై ఫ్యూచర్కు ఊరట!
న్యూఢిల్లీ: రిలయన్స్ రిటైల్ లిమిటెడ్కు తన గ్రూప్ సంస్థల విక్రయానికి సంబంధించి కిషోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్కు ఊరట లభించింది. ఈ ఒప్పందానికి ఆమోదం కోసం వాటాదారులు, రుణదాతల అసాధారణ సమావేశం (ఈజీఎం) నిర్వహించడానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) మంగళవారం కిషోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ గ్రూప్కు అనుమతి ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించారు. ఫ్యూచర్ గ్రూప్ కంపెనీల విలీన పథకాన్ని వ్యతిరేకిస్తూ ఇ–కామర్స్ దిగ్గజం అమెజాన్ దాఖలు చేసిన పిటిషన్ను సుచిత్ర కనుపర్తి, చంద్రభన్సింగ్ లతో కూడిన ఇరువురు సభ్యుల ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ తోసిపుచ్చినట్లు సమాచారం.అయితే ఈ వార్తలపై పంపిన ఈమెయిల్స్కు అటు అమెజాన్కానీ, ఇటు ఫ్యూచర్కానీ సమాధానం ఇవ్వలేదు. అమెజాన్కు తక్షణం నష్టం లేదు సంబంధిత వర్గాల కథనం ప్రకారం ఒకవేళ ఫ్యూచర్ జరిపే ఈజీఎం గ్రూప్ సంస్థల విక్రయానికి ఆమోదముద్ర వేసినప్పటికీ, సంబంధిత స్కీమ్కు ఎన్సీఎల్టీ తుది ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుందని ట్రిబ్యునల్ బెంచ్ స్పష్టం చేసింది. ఈ దశలో తన అభ్యంతరాలను అమెజాన్ ఎన్సీఎల్టీ ముందు ఉంచవచ్చని అభిప్రాయపడింది. అందువల్ల ఇప్పుడు ఫ్యూచర్ నిర్వహించే సమావేశం సరికాదనడం తప్పని ఎన్సీఎల్టీ పేర్కొంది. దీనివల్ల తక్షణం అమెజాన్కు జరిగే న్యాయపరమైన నష్టం ఏదీ లేదని స్పష్టం చేసింది. ఫ్యూచర్ గ్రూప్ కంపెనీల విలీన పథకాన్ని ఆమోదిస్తూ, తుది ఉత్తర్వుఇవ్వవద్దని మాత్రమే సుప్రీంకోర్టు తనను ఆదేశించినట్లు వివరించింది. ఫ్యూచర్ ఈజీఎంను నిర్వహించి పథకానికి ముందుగానే ఆమోదముద్ర పొందితే, ‘తరువాత ఆర్ర్బిట్రేషన్ పక్రియలో విజయం సాదిస్తే’ రిలయన్స్తో ఒప్పందం ప్రక్రియ పూర్తికి ఐదారు నెలల సమయం ఆదా అవుతుందనీ వివరించింది. సుదీర్ఘ న్యాయ వివాదం రిలయన్స్కు ఫ్యూచర్ గ్రూప్ల ఆస్తుల విక్రయానికి సంబంధించి రూ.24,713 కోట్ల ఒప్పందం వివాదం ప్రస్తుతం సింగపూర్ అర్ర్బిటేషన్, సుప్రీంకోర్టు న్యాయపరిధిలో ఉన్న సంగతి తెలిసిందే. ఫ్యూచర్ కూపన్స్లో వాటాదారైన అమెజాన్కు.. ఎఫ్ఆర్ఎల్లో కూడా కొన్ని వాటాలు ఉన్నాయి. ఒప్పందం ప్రకారం ఎఫ్ఆర్ఎల్ను కొనుగోలు చేసే హక్కులు కూడా దఖలు పడ్డాయన్నది అమెజాన్ వాదన. మరోవైపు, 2020 ఆగస్టులో తమ రిటైల్ తదితర వ్యాపారాలను రిలయన్స్ రిటైల్కు విక్రయించేలా ఫ్యూచర్ గ్రూప్ ఒప్పందం ప్రకటించింది. దీన్ని వ్యతిరేకిస్తూ అమెజాన్ ఫ్యూచర్ గ్రూప్నకు లీగల్ నోటీసులు పంపింది. అటుపైన సింగపూర్లోని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్ను ఆశ్రయించింది. అక్కడ ఆ సంస్థకు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. అవి భారత్లో చెల్లుబాటు కావంటూ ఫ్యూచర్ గ్రూప్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు సింగిల్ జడ్జి అమెజాన్కు అనుకూలంగా ఉత్తర్వులు ఇవ్వగా.. వాటిపై డివిజనల్ బెంచ్ స్టే విధించింది. ఈ పరిణామాలను సవాలు చేస్తూ అమెజాన్.. సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఇక్కడ అమెజాన్కు అనుకూలంగా రూలింగ్ వచ్చింది. దేశంలో లక్ష కోట్ల రిటైల్ వ్యాపారాన్ని సొంతం చేసుకోవాలన్నదే ఆయా సంస్థల న్యాయపోరాటం ప్రధాన ధ్యేయమన్న విమర్శలు ఉన్నాయి. చదవండి: అమెజాన్ అభ్యంతరాలు సరికాదు.. మరోసారి సుప్రీం కోర్టును కోరిన ఎఫ్ఆర్ఎల్ -
ఎన్సీఎల్ఏటీ చైర్మన్గా జస్టిస్ చీమా కొనసాగొచ్చు
న్యూఢిల్లీ: నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్(ఎన్సీఎల్ఏటీ) చైర్పర్సన్ జస్టిస్ అశోక్ ఇక్బాల్సింగ్ చీమాను గడువు కంటే ముందే పదవీ విరమణ చేయించడంపై తలెత్తిన వివాదానికి తెరపడింది. ఈయన ఈ నెల 20వ తేదీ దాకా పదవిలో కొనసాగుతూ తీర్పులిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. జస్టిస్ చీమా ఎన్సీఎల్ఏటీ చైర్పర్సన్గా ఈ నెల 20న పదవీ విమరణ చేయాల్సి ఉండగా, కేంద్ర ప్రభుత్వం ఈ పదవిలో జస్టిస్ ఎం.వేణుగోపాల్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకం ఈ నెల 11వ తేదీ నుంచే అమల్లోకి వస్తుందని తేల్చిచెప్పింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ జస్టిస్ చీమా సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్ర సర్కారు తరపున అటారీ్న జనరల్ వేణుగోపాల్ వాదనలు వినిపించారు. ఈ నెల 20 దాకా జస్టిస్ చీమా ఎన్సీఎల్ఏటీ చైర్పర్సన్గా కొనసాగవచ్చని, తీర్పులు వెలువరించవచ్చని అన్నారు. జస్టిస్ వేణుగోపాల్ను అప్పటిదాకా సెలవుపై పంపిస్తామని వెల్లడించారు. ట్రిబ్యునళ్ల నియామకాల విషయంలో ధర్మాసనం కేంద్రం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్రం ఇటీవల తీసుకొచి్చన ట్రిబ్యునళ్ల సంస్కరణల చట్టం–2021 ప్రకారం. ఎన్సీఎల్ఏటీ చైర్పర్సన్ను మార్చే అధికారం ప్రభుత్వానికి ఉందని వేణుగోపాల్ చెప్పగా ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. తమ సుమోటో అధికారాలను ఉపయోగించి ఈ చట్టంపై స్టే విధిస్తామని ఒక దశలో ప్రభుత్వాన్ని హెచ్చరించింది. -
ఇదేం పద్ధతి?
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ట్రిబ్యునళ్లలో నియామకాల తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సెర్చ్ అండ్ సెలక్షన్ కమిటీ సిఫారసు చేసిన జాబితాను పక్కనపెట్టి కొందరినే ఏరికోరి నియమించడం ఏమిటని నిలదీసింది. ‘నియామక పత్రాలను పరిశీలిస్తే సెలెక్ట్ లిస్ట్ నుంచి కేవలం ముగ్గురిని ఎంపిక చేసినట్లు స్పష్టమవుతోంది. మిగిలిన వారంతా నిరీక్షణ జాబితాలో ఉన్నవారే. సెలెక్ట్ లిస్ట్లోని ఇతరుల పేర్లను తిరస్కరించారు. సర్వీసు చట్టం ప్రకారం.. సెలెక్ట్ లిస్టును కాదని వెయిటింగ్ లిస్టుకు ప్రాధాన్యం ఇవ్వడం సరైంది కాదు. ఇదేం పద్ధతి? ఇదేం ఎంపిక ప్రక్రియ?’ అని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ఎల్.నాగేశ్వరరావుల సుప్రీంకోర్టు ధర్మాసనం అటార్నీ జనరల్ వేణుగోపాల్ను ప్రశ్నించింది. సెలక్షన్ కమిటీ సిఫారసు చేసిన జాబితాలోని పేర్ల నుంచే ట్రిబ్యునళ్లలో ఖాళీలను రెండు వారాల్లోగా భర్తీ చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుందని వేణుగోపాల్ బదులిచ్చారు. ట్రిబ్యునళ్లలో ఖాళీలను భర్తీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను కోర్టు విచారించింది. ఇన్కం ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్(ఐటీఏటీ) కోసం సెలక్షన్ కమిటీ 41 మందిని సిఫారసు, అందులో నుంచి కేవలం 13 మందిని ఎంపిక చేశారని లాయర్ అరవింద్ దాతర్ చెప్పారు. ఇదేం కొత్త కాదు, ప్రతిసారీ ఇదే కథ అని ధర్మాసనం ఆక్షేపించింది. ట్రిబ్యునళ్లలో నియామకం కోసం తమ దృష్టికి వచ్చిన పేర్లను షార్ట్లిస్టు చేయడానికి కోవిడ్ కాలంలో కోర్టు ఎంతగానో శ్రమించిందని సీజేఐ జస్టిస్ రమణ అన్నారు. ఇప్పుడు ఆ ప్రయత్నమంతా వృథా అయ్యిందని అసహనం వ్యక్తం చేశారు. తాజా నియామకాలను పరిశీలిస్తే ట్రిబ్యునళ్లలో సభ్యుల పదవీ కాలం కేవలం సంవత్సరమే ఉందని పేర్కొన్నారు. సంవత్సరం కోసం జడీ్జలు ట్రిబ్యునల్ సభ్యులుగా వెళ్తారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వమే పాటించకపోతే ఎలా? సెలక్షన్ కమిటీ సిఫారసులను తిరస్కరించే అధికారం ప్రభుత్వానికి ఉందని వేణుగోపాల్ చెప్పగా ధర్మాసనం ప్రతిస్పందించింది. ‘‘మనది రూల్ ఆఫ్ లా పాటించే దేశం. రాజ్యాంగానికి లోబడి పని చేస్తున్నాం. ‘సిఫారసులను అంగీకరించను’ అని ప్రభుత్వం చెప్పడం సరైంది కాదు’’ అని హితవు పలికింది. నియామకాల ప్రక్రియను ప్రభుత్వమే పాటించకపోతే ఆ ప్రక్రియకు విలువ ఏమున్నట్లు? అని వ్యాఖ్యానించింది. ఆదరాబాదరగా నియమించాలి్సన అవసరమేంటి? నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్(ఎన్సీఎల్ఏటీ) తాత్కాలిక చైర్పర్సన్గా జస్టిస్ వేణుగోపాల్ను ఆదరాబాదరగా నియమించడం పట్ల కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై గురువారం విచారణ చేపడతామని సీజేఐ జస్టిస్ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది. -
వ్యక్తిగత హామీదార్లూ బాధ్యులే..!
న్యూఢిల్లీ: కంపెనీలకు రుణాల విషయంలో ఆయా సంస్థలతో పాటు వ్యక్తిగత గ్యారంటార్ల (హామీగా ఉన్నవారు)పైనా ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టీ కోడ్ (ఐబీసీ) ప్రకారం చర్యలు తీసుకోవచ్చని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు శుక్రవారం కీలక తీర్పునిచ్చింది. ఖాయిలా కంపెనీల పునరుద్ధరణ ప్రణాళికలకు ఆమోదముద్ర పడినప్పటికీ, ఐబీసీ నిబంధనావళి కింద చర్యల నుంచి హామీదారులు తప్పించుకోలేరని జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, ఆర్. రవీంద్రలతో కూడిన ధర్మాసనం తన 82 పేజీల ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. బడాపారిశ్రామికవేత్తలపై పిడుగు.. తాజా ఉత్తర్వులతో ఇందుకు సంబంధించి కేంద్రం 2019 నవంబర్ 15న ఇచ్చిన నోటిఫికేషన్ను సుప్రీం తీర్పు సమర్థించినట్లయ్యింది. అలాగే బడా కార్పొరేట్ల రుణాల విషయంలో ఉన్నత స్థాయి పారిశ్రామికవేత్తలు దివాలా చర్యలను ఎదుర్కొనాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. రిలయన్స్ గ్రూప్ చీఫ్ అనిల్ అంబానీ, దివాన్ హౌసింగ్ ఫైనాన్స్కు కార్పొరేషన్ అధిపతి కపిల్ వాధ్వాన్, భూషన్ పవర్ అండ్ స్టీల్ హెడ్ సంజయ్ సింఘాల్ వంటి వారు ఈ జాబితాలో ఉన్నారు. అయితే ఆయా పారిశ్రామికవేత్తలపై రుణ గ్రహీతలు దాఖలు చేసిన కేసులు, అప్పిలేట్ స్థాయిలో ఆయా ఉన్నత స్థాయి కోర్టుల్లో ‘స్టే’లో ఉన్నాయి. కంపెనీలతో పాటు గ్యారంటార్లమీదా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్స్ (ఎన్సీఎల్టీ)ల్లో ఒకేసారి ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ ప్రారంభించడానికి కూడా అత్యున్నత న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. ఇలాంటి ప్రొసీడింగ్స్ను సవాలు చేస్తూ దాఖలైన దాదాపు 75 రిట్ పిటిషన్లు, ట్రాన్ఫర్డ్ కేసులు, ట్రాన్స్ఫర్ పిటిషన్లు అన్నింటినీ తోసిపుచ్చుతున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది. కేంద్రం 2019 నవంబర్ 15న ఇచ్చిన నోటిఫికేషన్ను సవాలుచేస్తూ, పారిశ్రామికవేత్త లలిత్ కుమార్ జైన్ దాఖలు చేసిన పిటిషన్ను ప్రధానంగా తీసుకుని సుప్రీం కోర్టు తాజా రూలింగ్ ఇచ్చింది. -
ఫ్యూచర్ రిటైల్తో రిలయన్స్ ఇండస్ట్రీస్ డీల్కు ఓకే.. కానీ
న్యూఢిల్లీ: ఫ్యూచర్ రిటైల్ వ్యాపారాలను రిలయన్స్ ఇండస్ట్రీస్ కొనుగోలు చేసే డీల్కు సంబంధించి స్టాక్ ఎక్సే్చంజీలు, మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ షరతులతో కూడిన అనుమతులిచ్చాయి. వీటి ప్రకారం.. ఈ ఒప్పందానికి ఫ్యూచర్ గ్రూప్ ఇటు షేర్హోల్డర్లతో పాటు అటు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) అనుమతులు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం న్యాయస్థానాల్లో కొనసాగుతున్న వివాదాలపై తుది తీర్పులకు లోబడి తమ అనుమతులు వర్తిస్తాయని స్టాక్ ఎక్సే్చంజీలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ పేర్కొన్నాయి. అమెజాన్డాట్కామ్ ఫిర్యాదులు, ఫ్యూచర్ రిటైల్ స్పందన మొదలైన వివరాలన్నీ కూడా స్కీమ్లో భాగమైన షేర్హోల్డర్ల దృష్టికి తీసుకెళ్లాలని సూచించాయి. అలాగే, స్కీమ్ ముసాయిదా సమర్పించే ముందు ఎన్సీఎల్టీకి కూడా తెలియజేయాలని పేర్కొన్నాయి. ఎన్సీఎల్టీకి దాఖలు చేసే పిటిషన్లో స్టాక్ ఎక్సే్చంజీలు, సెబీ సూచనలను కూడా పొందుపర్చాలని తెలిపాయి. మరోవైపు ప్రతిపాది త డీల్ను వ్యతిరేకిస్తున్నట్లు ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ స్పష్టం చేసింది. ఈ విషయంలో తమ హక్కులను కాపాడుకునేందుకు చట్టపరంగా ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటామని పేర్కొంది. ఫ్యూచర్ గ్రూప్లో భాగమైన ఫ్యూచర్ కూపన్స్లో అమెజాన్ వాటాలు కొనుగోలు చేసింది. ఫ్యూచర్ కూపన్స్కు లిస్టెడ్ కంపెనీ ఫ్యూచర్ రిటైల్లో వాటాలు ఉండటంతో.. ఈ డీల్ ద్వారా అమెజాన్ కూడా వాటాదారుగా మారింది. ఇక కరోనా సంక్షోభ పరిస్థితుల కారణంగా రిటైల్ విభాగాన్ని రిలయన్స్కు విక్రయించేందుకు ఫ్యూచర్ గ్రూప్ ఒప్పందం కుదుర్చుకుంది. కానీ, ఇది నిబంధనలకు విరుద్ధమంటూ అమెజాన్.. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ప్యానెల్ను ఆశ్రయించింది. అమెజాన్ తీరును వ్యతిరేకిస్తూ ఫ్యూచర్ గ్రూప్ .. ఢిల్లీ హైకోర్టు తలుపు తట్టింది. ఈ వివాదం ప్రస్తు తం ఆర్బిట్రేషన్, న్యాయస్థానాల్లో నలుగుతోంది. -
జీఎంఆర్కు స్టాక్ ఎక్స్ఛేంజీల అనుమతి
ముంబై, సాక్షి: మౌలిక రంగ హైదరాబాద్ దిగ్గజం జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రణాళికలకు స్టాక్ ఎక్స్ఛేంజీల నుంచి గ్రీన్సిగ్నల్ లభించింది. వ్యాపార పునర్వ్యవస్థీకరణ కోసం చేసిన ప్రతిపాదనలకు ఎక్స్ఛేంజీలు ఆమోదించినట్లు జీఎంఆర్ తాజాగా వెల్లడించింది. పునర్వ్యవస్థీకరణలో భాగంగా విమానాశ్రయేతర బిజినెస్ను ప్రత్యేక కంపెనీగా విడదీసేందుకు కంపెనీ ఇప్పటికే ప్రణాళికలు రూపొందించింది. ఈ ప్రతిపాదనలపట్ల ఎలాంటి అభ్యంతరాలూ లేవని ఎక్స్ఛేంజీలు పేర్కొన్నట్లు జీఎంఆర్ తెలియజేసింది. దీంతో ఈ ప్రతిపాదనలపై ఆరు నెలల్లోగా జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ)కు దరఖాస్తు చేయనున్నట్లు వెల్లడించింది. ప్రతిపాదనల్లో భాగంగా కంపెనీ జీఎంఆర్ పవర్ ఇన్ఫ్రా, జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, జీఎంఆర్ పవర్ అండ్ అర్బన్ ఇన్ఫ్రా తదితరాకు సంబంధించి విలీనం, సర్దుబాట్లు తదితర చర్యలు చేపట్టనున్నట్లు తెలియజేసింది. ఈ ఏడాది ఆగస్ట్లో కంపెనీ వ్యూహాత్మక రీస్ట్రక్చరింగ్ ప్రణాళికలకు తెరతీసిన విషయం విదితమే. కాగా.. కార్పొరేట్ హోల్డింగ్ స్ట్రక్చర్ను సులభతరం చేసేందుకు వీలుగా ఎయిర్పోర్ట్యేతర బిజినెస్ను విడదీయనున్నట్లు ఇప్పటికే కంపెనీ తెలియజేసింది. (మార్కెట్ల పతనం- ఫార్మా షేర్ల జోరు) -
నిజాం షుగర్స్ భవిత తేలేదెప్పుడో?
సాక్షి, బోధన్: నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్ భవిత న్యాయస్థానాల చుట్టూ చక్కర్లు కొడుతోంది. విచారణ సాగుతున్న నేపథ్యంలో ఫ్యాక్టరీ పునరుద్ధరణపై తీపి కబురు వస్తోందని చెరుకు రైతులు, కార్మికులు కొండంత ఆశతో ఎదురు చూస్తున్నారు. కానీ న్యాయస్థానాల్లో విచారణ వాయిదా మీద వాయిదా పడటం, ఫ్యాక్టరీ భవిత ఏటూ తేలకపోవడంతో రైతులు, కార్మికులు నిరాశ చెందుతున్నారు. తాజాగా సెప్టెంబర్ 29న ఢిల్లీ ఎన్సీఎల్ఏటీ (నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్)లో కొనసాగిన విచారణ నవంబర్ 10కి వాయిదా పడింది. ప్రైవేటీకరణ నాటి నుంచి నేటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో 2002లో టీడీపీ హయాంలో నిజాంషుగర్ ఫ్యాక్టరీ బోధన్తో పాటు, ముత్యంపేట (జగిత్యాల), మంబోజిపల్లి (మెదక్) యూనిట్లను ప్రైవేటీకరించారు. నాటి నుంచి నిజాం షుగర్స్కు సంబంధించిన అనేక అంశాలపై రైతులు, కారి్మక సంఘాల ప్రతినిధులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అనుహ్యాంగా 2015 డిసెంబర్ 23న ఎన్డీఎస్ఎల్ యాజమాన్యం లే ఆఫ్ ప్రకటించి మూడు ఫ్యాక్టరీలను మూసి వేసింది. లే ఆఫ్ చట్ట విరుద్దమని, ఫ్యాక్టరీ యాజమాన్యం ఏకపక్ష నిర్ణయం తీసుకుందని కారి్మకులు ఫిర్యాదులు చేశారు. దీంతో 2016లో కార్మిక సంఘాలు, ఫ్యాక్టరీ యాజమాన్యంతో కారి్మక సంక్షేమ శాఖ అధికారులు చర్చలు జరిపారు. సమస్య కొలిక్కి రాకపోవడంతో చర్చల నివేదికను ప్రభుత్వానికి సమరి్పంచగా, 2017 ఆగస్టు 31న రాష్ట్ర ప్రభుత్వం కేసును లేబర్ కోర్టుకు అప్పగించింది. కారి్మకుల వేతనాలు, లే ఆఫ్ సమస్య అంశాలపై అప్పటి నుంచి లేబర్ కోర్టులో విచారణ సాగుతోంది. 2014 ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంటామని టీఆర్ఎస్పార్టీ హామీ ఇచ్చింది. కానీ ఆ హామీ ఆచరణకు నోచుకోలేదు. మరో మలుపు.. ఫ్యాక్టరీ మూసివేత, పునరుద్ధణ సమస్య పరిష్కారం కోసం 2017 సెపె్టంబర్లో ఎన్సీఎల్టీ( నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్) హైదరాబాద్ బెంచ్ రంగ ప్రవేశం చేసింది. ఈ ట్రిబ్యునల్కు ఐపీఆర్(ఇంటెర్మీ రిసోల్యూషన్ ప్రొఫిషనల్)గా రాచర్ల రామకృష్ణగుప్తా నియమితులై, అదే ఏడాది అక్టోబర్లో ఫ్యాక్టరీని సందర్శించారు. ఈ ట్రిబ్యునల్లో విచారణ కొనసాగింది. 2019 జూన్3న ఎన్డీఎస్ఎల్ లిక్విడేషన్కు ట్రిబ్యునల్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తు రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీ ఎన్సీఎల్టీని ఆశ్రయించి స్టే తెచ్చింది. అప్పటి నుంచి ఈ ట్రిబ్యునల్లో విచారణ సాగుతోంది. ఈ ప్రక్రియ ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం ఫ్యాక్టరీని నడిపేందుకు ముందుకు వచ్చి విధానపరంగా నిర్ణయం తీసుకుంటేనే సమస్యకు ముగింపు లభిస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే నిజాంషుగర్స్ భవిత ఆధారపడి ఉంది. ఫ్యాక్టరీ పునరుద్ధరణకు నిర్ణయం తీసుకోవాలి ఢిల్లీ ఎన్సీఎల్టీలో కొనసాగుతున్న విచారణకు ముగింపు పలికి రాష్ట్ర ప్రభుత్వం ఫ్యాక్టరీ పునరుద్ధరణపై సానుకూలమైన నిర్ణయం తీసుకోవాలి. ఫ్యాక్టరీ మూసివేతతో కారి్మక కుటుంబాల బతుకులు అధోగతి పాలయ్యాయి. లేఆఫ్ నాటి నుంచి బకాయి వేతనాలు చెల్లించి ఆదుకోవాలి. – రవి శంకర్గౌడ్,ఎన్డీఎస్ఎల్ మజ్దూర్ సభ యూనియన్ ప్రధాన కార్యదర్శి -
అనిల్ అంబానీకి ఎస్బీఐ షాక్
న్యూఢిల్లీ: గ్రూప్ కంపెనీలు తీసుకున్న రుణాలకి ఇచ్చిన వ్యక్తిగత పూచీకత్తులు ఇప్పుడు రిలయన్స్ గ్రూప్ (అడాగ్) అధినేత అనిల్ అంబానీని వెంటాడుతున్నాయి. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) బాకీల రికవరీకి రంగంలోకి దిగింది. ఆయనిచ్చిన రూ. 1,200 కోట్ల వ్యక్తిగత పూచీకత్తుకి సంబంధించిన మొత్తాన్ని రికవర్ చేసుకునే దిశగా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో పిటీషన్ దాఖలు చేసింది. ఈ పిటీషన్పై వారం రోజుల్లోగా సమాధానమివ్వాలంటూ అనిల్ అంబానీని ట్రిబ్యునల్ ఆదేశించింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్), రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ (ఆర్ఐటీఎల్) తీసుకున్న రుణాలకు గాను అనిల్ అంబానీ ఈ వ్యక్తిగత పూచీకత్తునిచ్చినట్లు ఆయన ప్రతినిధి ఒకరు వెల్లడించారు. నిర్దేశిత గడువులోగా తగు సమాధానాలను అంబానీ దాఖలు చేస్తారని వివరించారు. 3 చైనా బ్యాంకులకు చెల్లించాల్సిన 717 మిలియన్ డాలర్ల బాకీలను రుణ ఒప్పందం ప్రకారం 21 రోజుల్లోగా కట్టేయమంటూ గత నెలలో బ్రిటన్ కోర్టు అనిల్ అంబానీని ఆదేశించిన సంగతి తెలిసిందే. గ్రూప్ సంస్థలు తీసుకున్న రుణాలకు ఇచ్చిన వ్యక్తిగత పూచీకత్తులకు ఆయన బాధ్యత వహించాల్సిందేనని, రుణదాతలకు చెల్లింపులు జరపాల్సిందేనని లండన్లోని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ హైకోర్ట్ స్పష్టం చేసింది. -
రూ.1200 కోట్లు చెల్లించండి: ఎస్బీఐ
అనిల్ అంబానీ నుంచి రూ.1,200 కోట్లకు పైగా వసూలు చేసేందుకు ఎస్బీఐ సిద్ధమైంది. గతంలో రిలయన్స్ కమ్యూనికేషన్ తీసుకున్న రుణాలకు అనిల్ అంబానీ వ్యక్తిగత హామీ ఇచ్చారని., ఇప్పుడు వ్యక్తిగత హామి ఇచ్చిన రుణాన్ని అతనే చెల్లించాలంటూ ఎస్బీఐ ఎన్సీఎల్టీని ఆశ్రయించింది. బీఎస్వీ ప్రకాష్ కుమార్ అధ్యక్షతన ఎన్సీఎల్టీ బెంచ్ గురువారం ఈ పిటిషన్పై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా అనిల్ తరుపున న్యాయవాదులు తమకు కొన్ని రోజుల గడువు కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన బెంచ్ వారికి వారం రోజుల గడువు ఇచ్చింది. "ఈ విషయం రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ సంస్థలు పొందిన కార్పొరేట్ రుణానికి సంబంధించినది. అంతేకాని ఇది అంబానీ వ్యక్తిగత రుణానికి సంబంధించనది కాదు. ఈ అంశంపై అంబానీ తగిన విధంగా స్పందిస్తారు.’’ అని అనిల్ అంబానీ అధికార ప్రతినిధి ఒక ఈ-మెయిల్ ద్వారా స్పందించారు. అనిల్ అంబానీ రిలయన్స్ కమ్యూనికేషన్స్కు ఇచ్చిన రుణాలకు వ్యక్తిగత హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆర్కామ్ దివాళా కేసు ఎన్సీఎల్టీ విచారణలో ఉంది. వ్యక్తిగత హామి ఇచ్చిన రుణాన్ని రాబట్టాలనే యోచనలో ఉన్నట్లు ఎస్బీఐ అధికారి ఒకరు తెలిపారు. వ్యక్తిగత దివాలా కేసులపై నిషేధం లేనందున, ఈ విషయంపై అత్యవసర విచారణ జరపాల్సిందిన ఎన్సీఎల్టీని కోరినట్లు అతను తెలిపారు. అలాగే వ్యక్తిగత ఖాతాలు వివరాలు, వాటి పనితీరు లాంటి అంశాలపై వ్యాఖ్యానించకూడదనేది బ్యాంక్ పాలసీ కాబట్టి పూర్తి వివరాలను తాను వెల్లడించలేనని ఎస్బీఐ అధికారి చెప్పుకొచ్చారు. -
బోర్డ్ మీటింగ్స్ వీడియోలో..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీల బోర్డ్ మీటింగ్స్లను వీడియో కాన్ఫరెన్స్లో నిర్వహించే వీలు కల్పించింది కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంసీఏ). దీంతో కంపెనీల విలీనాలు, కొనుగోళ్లు, అమాల్గమేషన్, నిధుల సమీకరణ వంటి కీలక నిర్ణయాల బోర్డ్ మీటింగ్స్లను వీడియో లేదా ఆడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించుకోవచ్చు. జూన్ 30 వరకు వీడియో, ఆడియో ద్వారా సమావేశాలకు అనుమతి ఇస్తున్నట్టు సౌతీస్ట్ రీజియన్ రీజినల్ డైరెక్టర్ (ఆర్డీ) తెలిపింది. ఫైనాన్సియల్ స్టేట్మెంట్స్, అకౌంట్స్, బోర్డ్ రిపోర్ట్స్, మెర్జింగ్స్, రీ–స్ట్రక్చరింగ్ వంటి బోర్డ్ ఆమోదానికి వీడియో కాన్ఫరెన్స్ సేవలను వినియోగించుకోవచ్చని పేర్కొంది. ప్రస్తుతం కేవలం బోర్డ్ మీటింగ్స్కు మాత్రమే వీడియో, ఆడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహణకు అనుమతి ఉంది. మిగిలిన వాటికి కంపెనీ డైరెక్టర్లు సంబంధిత కార్యాలయాలను ఫిజికల్గా కలవాల్సిందే. ప్రయాణ ఆంక్షలున్న నేపథ్యంలో.. ఇప్పటికే ఆర్వోసీ, ఎన్సీఎల్టీ, ఆర్డీ పరిధిలోని కాంపౌండింగ్ అప్లికేషన్స్ విచారణలను హైదరాబాద్లోని ఆర్డీ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహిస్తున్నామని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. అధికారిక ఈ–మెయిల్, ఫ్యాక్స్ ద్వారా మాత్రమే సంప్రదింపులు జరపాలని నిర్ణయించినట్లు ఆర్వోసీ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్, విజయవాడ ఆర్వోసీ లెక్కల ప్రకారం ప్రస్తుతం తెలంగాణలో 80 వేలు, ఆంధ్రప్రదేశ్లో 20 వేల కంపెనీలున్నాయి. కరోనా వైరస్ కారణంగా ప్రయాణ, గ్రూప్ సమావేశాలు వంటి వాటిపై ఆంక్షలున్న నేపథ్యంలో కంపెనీ డైరెక్టర్లు మౌఖికంగా ఆయా కార్యాలయాలను సందర్శించడం శ్రేయస్కరం కాదు. అంతేకాకుండా చాలా కంపెనీల్లో విదేశీ డైరెక్టర్లు, ఇన్వెస్టర్లు ఉంటారు. వీళ్లు ప్రయాణ ఆంక్షల నేపథ్యంలో మౌఖికంగా బోర్డ్ సమావేశంలో పాల్గొనలేరు. అందుకే కంపెనీల రోజు వారి కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇండియన్ కార్పొరేట్ లా సర్వీసెస్ (ఐసీఎల్ఎస్) సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అయితే సంబంధిత బోర్డ్ మీటింగ్స్ తాలూకు వీడియో, ఆడియో కాన్ఫరెన్స్ కాపీలను భద్ర పర్చుకోవాలని ఆయన సూచించారు. ఆర్థిక ఫలితాల ప్రకటనల నేపథ్యంలో ఎంసీఏ ఈ కీలక నిర్ణయం తీసుకోవటం ఆహ్వానించదగినది అని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. 27 వరకూ ఎన్సీఎల్టీ ఫైలింగ్స్ బంద్ దేశవ్యాప్తంగా అన్ని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) బెంచ్లలో ఈ నెల 27 వరకు ఫైలింగ్ కౌంటర్ మూసివేయాలని ఢిల్లీలోని ఎన్సీఎల్టీ ప్రిన్సిపల్ బెంచ్ నిర్ణయించింది. అన్ని ఎన్సీఎల్టీ బెంచ్ల ఫైలింగ్ కౌంటర్ల వద్ద ఎక్కువ మంది సభ్యులు సంచరిస్తున్నారని.. ఇది కోవిడ్ వ్యాప్తికి కారణమవుతుందని∙భావించి ఈ నిర్ణయం తీసుకున్నామని ఎన్సీఎల్టీ తెలిపింది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, అమరావతి, జైపూర్ బెంచ్లలో మాత్రం అత్యవసర మ్యాటర్స్ విషయంలో ఆన్లైన్ ద్వారా ఫైలింగ్ చేసుకునే వీలు కల్పించారు. -
జెట్ ఎయిర్వేస్ దివాలా
ముంబై: జెట్ ఎయిర్వేస్ దివాలా పరిష్కార గడువును 90 రోజుల పాటు పొడిగించేందుకు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) అనుమతించింది. దక్షిణాఫ్రికాకు చెందిన సినర్జీ గ్రూపు మరింత సమయం కోరుతుండడం, మరో ఇద్దరు ఇన్వెస్టర్లు ఆసక్తి వ్యక్తీకరిస్తున్న నేపథ్యంలో జెట్ ఎయిర్ వేస్ రుణ దాతల కమిటీ (సీవోసీ) దివాలా పరిష్కార గడువును పొడిగించాలంటూ ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ను కోరింది. జెట్ ఎయిర్వేస్కు కార్పొరేట్ దివాలా పరిష్కార గడువు (180 రోజులు) ఈ నెల 16న ముగియగా, ఈ గడువును మరో 90 రోజులు పాటు పొడిగిస్తూ ఎన్సీఎల్టీ ఆదేశాలు జారీ చేసింది. జెట్ ఎయిర్వేస్కు సినర్జీ గ్రూపు ఒక్కటే బిడ్ దాఖలు చేయగా, వాటాదారుల ప్రయోజనం దృష్ట్యా పెట్టుబడులపై సరైన నిర్ణయం తీసుకునేందుకు మరింత సమయం కోరుతుండడం గమనార్హం. -
డీహెచ్ఎఫ్ఎల్పై ఎన్సీఎల్టీని ఆశ్రయించిన ఆర్బీఐ
ముంబై: సంక్షోభంలో చిక్కుకున్న డీహెచ్ఎఫ్ఎల్ విషయంలో కార్పొరేట్ దివాలా పరిష్కార చర్యలు ప్రారంభించాలని కోరుతూ జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ముంబై బెంచ్ ముందు ఆర్బీఐ శుక్రవారం పిటిషన్ దాఖలు చేసింది. దివాలా అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ)లోని సెక్షన్ 227 కింద చర్యలు చేపట్టాలని కోరింది. దివాలా పరిష్కార దరఖాస్తు అనుమతించడం లేదా తిరస్కరించేంత వరకు డీహెచ్ఎఫ్ఎల్ సంస్థ రుణ చెల్లింపులపై తాత్కాలిక విరామం (మారటోరియం) ఉంటుందని ఆర్బీఐ తన ప్రకటనలో తెలిపింది. గత నెల 20న డీహెచ్ఎఫ్ఎల్ బోర్డును ఆర్బీఐ రద్దు చేయడంతోపాటు, ఆర్ సుబ్రమణియన్ను అడ్మిని్రస్టేటర్గా నియమించడం తెలిసిందే. దీంతో పాటు, ముగ్గురు నిపుణులు.. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాజీవ్లాల్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ ఎన్ఎస్ కన్నన్, యాంఫి సీఈవో ఎన్ఎస్ వెంకటేశ్తో ఒక అడ్వైజరీ బోర్డును కూడా ఏర్పాటు చేసింది. ఈ బోర్డు సుబ్రమణియన్కు సహకారం అందించనుంది. ఐబీసీ కింద ఎన్సీఎల్టీ వద్ద దివాలా చర్యలు ఎదుర్కోనున్న తొలి బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ) డీహెచ్ఎఫ్ఎల్ కానుంది. -
డీహెచ్ఎఫ్ఎల్ సత్వర పరిష్కారంపై ఎస్బీఐ ఆశలు
న్యూఢిల్లీ: దివాలా ప్రక్రియ కింద చర్యలు ఎదుర్కోబోతున్న డీహెచ్ఎఫ్ఎల్ కేసు.. నిర్దిష్ట గడువులోగా పరిష్కారం కాగలదని బ్యాంకు లు ఆశిస్తున్నట్లు ప్రభుత్వ రంగ ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ తెలిపారు. ‘ఇది ఇప్పుడే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)కు చేరింది. ఎన్సీఎల్టీ అమలు చేసే ప్రక్రియే దీనికీ వర్తిస్తుంది. సాధారణంగా పొడిగింపును కూడా పరిగణనలోకి తీసుకుంటే 330 రోజుల గడువు ఉంటుంది. లేకపోతే 180 రోజుల్లోనే పరిష్కార ప్రక్రియ పూర్తి కావాలి. దివాలా కోడ్(ఐబీసీ) ప్రక్రియ ప్రధాన ఉద్దేశం కూడా ఇదే. నిర్దిష్ట కాలావధులకు లోబడే డీహెచ్ఎఫ్ఎల్ కేసు సత్వరం పరిష్కారం కాగలదని ఆశిస్తున్నాం’ అన్నారు. బ్యాంకులు మినహా ఇతరత్రా ఆర్థిక సంస్థల దివాలాకు సంబంధించి ఐబీసీలో సెక్షన్ 227ను చేరుస్తూ కేంద్రం గత శుక్రవారమే నిర్ణయం తీసుకుంది. దాని కింద ఎన్సీఎల్టీకి చేరిన తొలి కేసు డీహెచ్ఎఫ్ఎల్దే. గృహ రుణాల సంస్థ అయిన డీహెచ్ఎఫ్ఎల్.. 2019 జూలై ఆఖరు నాటికి బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, మ్యూచువల్ ఫండ్స్, బాండ్హోల్డర్లకు ఏకంగా రూ. 83,873 కోట్లు బాకీ పడింది. -
దివాలా వార్తలపై క్లారిటీ ఇచ్చిన లింగమనేని
సాక్షి, హైదరాబాద్: ఎల్ఈపీఎల్ ప్రాజెక్ట్స్ దివాలా తీసినట్టు వచ్చిన కథనాలపై ఆ కంపెనీ అధినేత లింగమనేని రమేశ్ క్లారిటీ ఇచ్చారు. లింగమనేని ప్రాజెక్ట్స్ దివాలా తీసినట్టు ప్రకటించాలని తాము కోరలేదని తెలిపారు. జర్మనీకి చెందిన ఓ సంస్థతో ఎయిర్ కోస్తా ఒప్పందంలో కొన్ని సమస్యలొచ్చాయని, వాటిని పరిష్కరించుకునేలోపే సదరు సంస్థ.. జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో దివాలా పిటిషన్ దాఖలు చేసిందని లింగమనేని రమేశ్ చెప్పుకొచ్చారు. జర్మన్ సంస్థ పిటిషన్ ఆధారంగా కంపెనీ లా ట్రిబ్యునల్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. ఈ వ్యవహారంతో ఎల్ఈపీఎల్లోని ఇతర కంపెనీలకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. తమ ఆర్ధిక పరిస్థితులు బాగాలేవంటూ వచ్చిన కథనాలను తోసిపుచ్చిన ఆయన.. ఆర్థికంగా తమకు ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పుకొచ్చారు. గతంలో తమ రుణదాతలకు చెల్లింపులు చేయలేని పరిస్ధితి ఎప్పుడూ లేదని అన్నారు. 1996లో విజయవాడలో రిజిస్టరైన లింగమనేని రమేశ్కు చెందిన ఎల్ఈపీఎల్ ప్రాజెక్ట్స్ దివాలా తీసినట్టు ఈ నెల 14న కంపెనీ లా ట్రిబ్యునల్ ముందు పిటిషన్ దాఖలైంది. తీసుకున్న రుణాలు చెల్లించలేనంటూ లింగమనేని కంపెనీ చేతులెత్తేయడంతో రుణాలు ఇచ్చిన కంపెనీలకు ఈ నెల 29 వరకు ఎన్సీఎల్టీ అనుమతి ఇచ్చినట్టు కథనాలు వచ్చాయి. లింగమనేనికి చెందిన ఎల్ఈపీఎల్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ దివాలాకు సంబంధించి దినపత్రికల్లో ప్రచురితమైన బహిరంగ ప్రకటన ఇది -
టీవీ9 రవిప్రకాష్ ‘నట’రాజనే
సాక్షి, హైదరాబాద్: టీవీ9 సంస్థను నిర్వహించిన ఐల్యాబ్స్ గ్రూప్ను ఓ కేసులో ఓడించాలనే ఉద్దేశంతో రవిప్రకాష్ అదే సంస్థలో పనిచేస్తున్న నటరాజన్ పేరుతో నకిలీ మెయిల్ ఐడీ సృష్టించి కీలక సమాచారాన్ని సైఫ్ పార్టనర్స్ సంస్థకు పంపినట్టుగా సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. ఐల్యాబ్స్ గ్రూప్ అధ్యక్షుడు టి.కృష్ణ ప్రసాద్ మే 6వ తేదీన ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా 406 ఐపీసీ, 66డీ ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. రవిప్రకాషే ఆ నటరాజన్ అని టెక్నికల్ సాక్ష్యాలతో నిర్ధారించారు. టీవీ9 ఆఫీస్లోని అతని కంప్యూటర్ నుంచే ఈ–మెయిల్ సృష్టించడంతోపాటు సమాచారం సైఫ్పార్టనర్స్కు పంపినట్టుగా తేల్చారు. కేసు పూర్వాపరాలు.. ఐల్యాబ్స్ గ్రూప్ ప్రారంభించిన టీవీ9 సంస్థలో సైఫ్ పార్టనర్స్ కంపెనీ పెట్టుబడులు పెట్టింది. వీరి మధ్య ఆర్థిక లావాదేవీల్లో పొరపొచ్చాలు రావడంతోపాటు టీవీ9ను ఏబీసీఎల్ కంపెనీకి అమ్మేందుకు సిద్ధమవుతున్న సందర్భంలో హైదరాబాద్లోని ఎన్సీఎల్టీని ఆశ్రయించారు. అయితే ఫిబ్రవరి 24న ఐల్యాబ్స్ గ్రూప్లో పనిచేస్తున్న నటరాజన్ అనే ఉద్యోగి పేరు మీదున్న ఈ–మెయిల్ ఐడీ నుంచి ఐల్యాబ్స్కు సంబంధించిన కీలక సమాచారం ఎన్సీఎల్టీ కేసులో ప్రత్యర్థిగా ఉన్న సైఫ్ పార్టనర్స్ ఎండీ రవి అదుసుమిల్లీకి చేరింది.సైఫ్ పార్టనర్స్ అధికారి వివేక్ మాతూర్, జనరల్ కౌన్సిల్ రామానుజ గోపాల్కు మెయిల్ వెళ్లింది. ఇదే సమాచారాన్ని సైఫ్ పార్టనర్స్ ఎన్సీఎల్టీ ముందు ఉంచింది. అయితే ఆ కాపీలను ఎన్సీఎల్టీలో న్యాయవాది ఎన్.లోమేశ్ కొరియర్ ద్వారా ఐల్యాబ్స్ గ్రూప్కు పంపారు. నకిలీ ఉద్యోగిపై ఫిర్యాదు.. ఆ కాపీలను చూసి అవాక్కయిన ఐల్యాబ్స్ గ్రూప్ అధ్యక్షుడు తమ కంపెనీలో నటరాజన్ పేరుతో ఏ ఉద్యోగీ లేడని, థర్డ్ పార్టీలతో కమ్యూనికేట్ చేసేందుకు ఎటువంటి జీ మెయిల్ ఉపయోగించమని పేర్కొంటూ ఏప్రిల్ 24న సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తప్పుడు సమాచారాన్ని సైఫ్ పార్టనర్స్కు పంపారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఆ వ్యక్తి ఎవరో గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్న ఫిర్యాదుతో ఐపీ అడ్రస్ను ట్రేస్ చేశారు. టీవీ9 కార్యాలయంలో జరిగినట్టుగా గుర్తించి.. రవిప్రకాష్ కంప్యూటర్ను స్వాధీనం చేసుకున్నారు. ఇలా టెక్నికల్ డేటా అనాలాసిస్తో ఆ నటరాజన్ ఎవరో కాదు రవిప్రకాషే అని తేల్చారు. -
డెలాయిట్, బీఎస్ఆర్ సంస్థలకు చుక్కెదురు
ముంబై: ఐఎల్అండ్ఎఫ్ఎస్ సంస్థకు ఆడిటింగ్ సేవలు అందించిన డెలాయిట్, బీఎస్ఆర్ అసోసియేట్స్(కేపీఎంజీ సంస్థ)కు ఎన్సీఎల్టీ షాకిచ్చింది. ఐఎల్ఎఫ్ఎస్ గ్రూపులో లోపాలపై ముందుగానే హెచ్చరించడంలో ఇవి విఫలమైన సంగతి తెలిసిందే. దీంతో ఈ సంస్థలపై ఐదేళ్లపాటు నిషేధం విధించాలంటూ కేంద్ర కార్పొరేట్ శాఖ లోగడ పిటిషన్ దాఖలు చేసింది. కాగా, తమపై నిషేధం విధించాలన్న ప్రభుత్వ అభ్యర్థనపై నిర్ణయించే విషయంలో జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) అధికార పరిధిని ప్రశ్నిస్తూ డెలాయిట్, బీఎస్ఆర్ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. కంపెనీల చట్టం కింద నెట్వర్క్ సంస్థలైన డెలాయిట్, బీఎస్ఆర్లను విచారించే న్యాయాధికారం తమకు ఉందని ఎస్సీఎల్టీ స్పష్టం చేసింది. దీంతో ఈ రెండు సంస్థలపై ఐదేళ్ల నిషేధానికి అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కేసు జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ), సుప్రీంకోర్టు ముందుకు వెళుతుందని తమకు తెలుసునంటూ ఆదేశాల జారీ సందర్భంగా ఎన్సీఎల్టీ బెంచ్ వ్యాఖ్యానించడం గమనార్హం. -
జెట్ రేసులో ఇండిగో!
న్యూఢిల్లీ: జెట్ ఎయిర్వేస్కు మళ్లీ మంచి రోజులు వచ్చేట్టున్నాయి. రుణాలు తీర్చలేక, చేతిలో చిల్లిగవ్వ లేక ఈ సంస్థ కార్యకలాపాలు నిలిపివేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ సంస్థకు రూ.8,000 కోట్లకు పైగా రుణాలు ఇచ్చిన బ్యాంకులు వాటిని వసూలు చేసుకునేందుకు మార్గంగా జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్లో పిటిషన్ వేయడం తెలిసిందే. ఓ పరిష్కార నిపుణుడిని నియమించి, 90 రోజుల్లోపు దీనికి పరిష్కారం కనుగొనాలని ఎన్సీఎల్టీ ఆదేశాలు కూడా జారీ చేసింది. దీంతో ఎన్సీఎల్టీ ముంగిటకు చేరిన జెట్ ఎయిర్వేస్పై పలు సంస్థలు ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. దేశీయంగా విమానయానంలో అతిపెద్ద వాటా కలిగిన ఇండిగో దివాలా దశకు చేరిన జెట్ ఎయిర్వేస్ను సొంతం చేసుకోవాలన్న ఆలోచనతో ఉంది. ఇందుకోసం ప్రైవేటు ఈక్విటీ సంస్థ టీపీజీ క్యాపిటల్తో కలసి దివాలా చట్టం (ఐబీసీ) కింద జెట్ఎయిర్వేస్కు బిడ్ వేయనున్నట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. అమెరికాకు చెందిన మరో ప్రైవేటు ఈక్విటీ సంస్థ అపోలో గ్లోబల్ మేనేజ్మెంట్ సైతం జెట్ కొనుగోలుకు ముందుకొస్తోంది ఆసక్తిగల ఇతర ఇన్వెస్టర్లతో కలసి జెట్ ఎయిర్వేస్కు బిడ్ వేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. సమస్యాత్మక కంపెనీల్లో పెట్టుబడులకు అపోలో గ్లోబల్ ప్రసిద్ధి చెందిన సంస్థ. ఇప్పటికే జెట్ ఎయిర్వేస్ ఉద్యోగుల కన్సార్షియంను సంప్రదించినట్టు తెలిసింది. ఈ సంస్థ నిర్వహణలో 280 బిలియన్ డాలర్ల ఆస్తులు ఉన్నాయి. ప్రాథమిక చర్చలు జరిగాయి... ‘‘ఇండిగో, టీపీజీ క్యాపిటల్ జెట్ ఎయిర్వేస్ పట్ల ఆసక్తిగా ఉన్నాయి. లీడ్ బ్యాంకర్ అయిన ఎస్బీఐతో ఇటీవలే ప్రాథమిక చర్చలు కూడా నిర్వహించాయి. ప్రస్తుతం కొనసాగుతున్న దివాలా ప్రక్రియ కింద ఈ రెండు సంస్థలు సంయుక్తంగా బిడ్ వేసే అవకాశాలను పరిశీలిస్తున్నాయి. జెట్ ఎయిర్వేస్కు చెందిన దేశీయ, అంతర్జాతీయ స్లాట్లపై ఇండిగో ఆసక్తిగా ఉంది. తద్వారా తన మార్కెట్ వాటాను కాపాడుకోవాలని భావిస్తోంది. జెట్ ప్రివిలేజ్ ప్రైవేటు లిమిటెడ్ (జేపీపీఎల్) పట్ల టీపీజీ క్యాపిటల్ ఎక్కువ ఆసక్తితో ఉంది. ఎందుకంటే జెట్ ఎయిర్వేస్తో పోలిస్తే జేపీపీఎల్ ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉండడమే కాకుండా, గతంలో లాభాలు కూడా చవిచూసింది.స్వతంత్ర సంస్థ అయిన జేపీపీఎల్ దివాలా చర్యల్లో భాగంగా లేకపోవడమే ఉన్న అడ్డంకి. ఈ బిడ్డింగ్ ప్రక్రియలో జేపీపీఎల్ను కూడా భాగం చేయవచ్చా అన్నదానిపై ఎస్బీఐ ఆధ్వర్యంలోని రుణదాతల కన్సార్షియం కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది’’ అని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. జేపీపీఎల్ అన్నది జెట్ ఎయిర్వేస్ సర్వీసుల్లో తరచుగా ప్రయాణించే వారి కోసం ఉద్దేశించిన లాయల్టీ ప్రోగ్రామ్. 2012లో జెట్ సొంత విభాగంగా ఏర్పాటవ్వగా, 2014లో స్వతంత్ర సంస్థగా మార్చారు. ఆ ఏడాది ఎతిహాద్ ఎయిర్వేస్ 150 మిలియన్ డాలర్లతో 50.1 శాతం వాటా తీసుకుంది. మిగిలిన వాటా జెట్ చేతుల్లో ఉంది. జేపీపీఎల్ విలువ రూ.7,300 కోట్లు ఉంటుందని ఆన్ పాయింట్ లాయల్టీ అనే సంస్థ అంచనా కట్టింది. ఇక, అపోలో గ్లోబల్ మేనేజ్మెంట్ సైతం జెట్ ఎయిర్వేస్ ఉద్యోగుల కన్సార్షియంతో ఇటీవలే సమావేశమైందని, వ్యాల్యూ ఇన్వెస్టర్లుగా జెట్ ఎయిర్వేస్లో మంచి అవకాశం కోసం చూస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. జెట్ రుణదాతల కన్సార్షియం ఈ నెల 16న తొలిసారి సమావేశమై చర్చలు కూడా నిర్వహించింది. ఈ వారాంతంలోపు జెట్ ఎయిర్వేస్కు సంబంధించి ఆసక్తి వ్యక్తీకరణలకు ఆహ్వానం పలకొచ్చని, బిడ్లు వేసేందుకు ఆగస్ట్ మొదటి వారం వరకు గడువు ఇవ్వొచ్చని భావిస్తున్నారు. -
జెట్ దివాలా పరిష్కారానికి 90 రోజుల గడువు
ముంబై: జెట్ ఎయిర్వేస్కు వ్యతిరేకంగా దివాలా పరిష్కారం కోసం ఎస్బీఐ ఆధ్వర్యంలోని బ్యాంకుల కూటమి దాఖలు చేసిన దరఖాస్తును జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) గురువారం నమోదు చేసుకుంది. గ్రాంట్ థార్న్టన్కు చెందిన ఆశిష్ చౌచారియాను పరిష్కార నిపుణుడిగా నియమించింది. ఈ అంశం జాతీయ ప్రాధాన్యం గలది కాబట్టి చట్ట ప్రకారం ఆరు నెలల గడువు ఉన్నప్పటికీ, మూడు నెలల వ్యవధిలోపు పరిష్కార ప్రక్రియ కనుగొనేందుకు ప్రయత్నించాలని పరిష్కార నిపుణుడిని ఎన్సీఎల్టీ బెంచ్ కోరింది. పిటిషన్లో ఎస్బీఐ జెట్ ఎయిర్వేస్ నుంచి రూ.967 కోట్లు తన వంతుగా వసూలు కావాల్సి ఉందని తెలిపింది. ఇందులో మూలధన అవసరాలకు రూ.505 కోట్లు, ఓవర్డ్రాఫ్ట్ సదుపాయం కింద రూ.462 కోట్లను జెట్ ఎయిర్వేస్కు అందించినట్టు పేర్కొంది. ఈ దరఖాస్తులో జోక్యం చేసుకునేందుకు తమను అనుమతించాలంటూ నెదర్లాండ్కు చెందిన లాజిస్టిక్స్ విక్రయదారులు దాఖలు చేసిన పిటిషన్ను బెంచ్ తిరస్కరించింది. ప్రతీ 15 రోజులకోసారి పరిష్కార పురోగతిపై నివేదికను సమర్పించాలని, తొలి నివేదిక జూలై 5న దాఖలు చేయాలని పరిష్కార నిపుణుడిని ఎన్సీఎల్టీ ఆదేశించింది. అదే రోజు ఈ పిటిషన్పై బెంచ్ తదుపరి విచారణ చేయనుంది. మొత్తం 26 బ్యాంకులకు జెట్ ఎయిర్వేస్ రూ.8,500 కోట్ల మేర బకాయిపడింది. వందలాది విక్రయదారులు, ఉద్యోగులకు రూ.13,000 కోట్లకు పైగా చెల్లింపులు చేయా ల్సి ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ 17 నుంచి ఈ సంస్థ కార్యకలాపాలు పూర్తిగా ఆగిపోవడం తెలిసిందే. -
జెట్ దివాలాపై నేటి నుంచి విచారణ
ముంబై: రుణ సంక్షోభంతో కుప్పకూలిన ప్రైవేట్ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ దివాలాకు సంబంధించిన పిటిషన్పై జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) గురువారం నుంచి విచారణ జరపనుంది. తాజాగా ఇందులో తమను కూడా పార్టీలుగా చేర్చాలని జెట్ ఎయిర్వేస్ పైలట్లు, ఇంజినీర్ల యూనియన్లతో పాటు నెదర్లాండ్స్కి చెందిన రెండు లాజిస్టిక్స్ వెండింగ్ సంస్థలు కూడా ఎన్సీఎల్టీని ఆశ్రయించాయి. తాము ఇంటర్వెన్షన్ పిటిషన్ వేసేందుకు అనుమతించాలని వెండార్లు కోరారు. జెట్ భారీగా బాకీ పడటంతో దానికి లీజుకిచ్చిన విమానాలను ఈ ఏడాది మార్చిలో అమ్స్టర్డామ్ ఎయిర్పోర్టులో ఈ రెండు సంస్థలు స్వా«ధీనం చేసుకున్నాయి. అయితే, ఈ సంస్థల పేర్లు ఇంకా వెల్లడి కాలేదు. ఏప్రిల్ 17 నుంచి జెట్ కార్యకలాపాలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దాదాపు రూ. 8,500 కోట్ల రుణాలు రాబట్టుకునేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సారథ్యంలోని 26 బ్యాంకుల కన్సార్షియం.. జెట్ ఎయిర్వేస్పై ఎన్సీఎల్టీని ఆశ్రయించాయి. జెట్ ఎయిర్వేస్ దాదాపు 23,000 ఉద్యోగులకు రూ. 3,000 కోట్లు జీతాలు, ఇతరత్రా విమానాల వెండార్లు, లెస్సర్లకు (లీజుకిచ్చిన సంస్థలు) రూ. 10,000 కోట్ల దాకా బాకీపడింది. మోసర్ బేయర్ ఆస్తుల విక్రయానికి ఆదేశం నిర్దిష్ట గడువులోగా రుణ పరిష్కార ప్రణాళికకు రుణ దాతల నుంచి ఆమోదం పొందడంలో విఫలమైనందున మోసర్ బేయర్ సోలార్ ఆస్తులు విక్రయించాలంటూ ఎన్సీఎల్టీ మరో కేసులో ఆదేశించింది. ఇందులో భాగంగా కంపెనీకి లిక్విడేటర్గా అరవింద్ గర్గ్ వ్యవహరిస్తారని సూచించింది. లిక్విడేషన్ ప్రక్రియ జరిగే సమయంలో కంపెనీ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగేలా గర్గ్ చూస్తారని పేర్కొంది. లిక్విడేషన్ ప్రకటన తేదీ నుంచి 75 రోజుల్లోగా ప్రాథమిక నివేదిక సమర్పించాలని లిక్విడేటర్కు ఎన్సీఎల్టీ సూచించింది. 2017 నవంబర్ 14న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పిటిషన్ను స్వీకరించడంతో మోసర్ బేయర్ సోలార్పై దివాలా చట్టం కింద చర్యల ప్రక్రియ ప్రారంభమైంది. సంస్థ లిక్విడేషన్ విలువ రూ. 72.42 కోట్లుగా ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. మోసర్ బేయర్ సోలార్ మాతృ సంస్థ మోసర్ బేయర్ ఇండియా కూడా లిక్విడేషన్ ప్రక్రియ ఎదుర్కొంటోంది. -
జెట్ దివాలాపై నేటి నుంచి విచారణ
ముంబై: రుణ సంక్షోభంతో కుప్పకూలిన ప్రైవేట్ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ దివాలాకు సంబంధించిన పిటిషన్పై జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) గురువారం నుంచి విచారణ జరపనుంది. తాజాగా ఇందులో తమను కూడా పార్టీలుగా చేర్చాలని జెట్ ఎయిర్వేస్ పైలట్లు, ఇంజినీర్ల యూనియన్లతో పాటు నెదర్లాండ్స్కి చెందిన రెండు లాజిస్టిక్స్ వెండింగ్ సంస్థలు కూడా ఎన్సీఎల్టీని ఆశ్రయించాయి. తాము ఇంటర్వెన్షన్ పిటిషన్ వేసేందుకు అనుమతించాలని వెండార్లు కోరారు. జెట్ భారీగా బాకీ పడటంతో దానికి లీజుకిచ్చిన విమానాలను ఈ ఏడాది మార్చిలో అమ్స్టర్డామ్ ఎయిర్పోర్టులో ఈ రెండు సంస్థలు స్వా«ధీనం చేసుకున్నాయి. అయితే, ఈ సంస్థల పేర్లు ఇంకా వెల్లడి కాలేదు. ఏప్రిల్ 17 నుంచి జెట్ కార్యకలాపాలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దాదాపు రూ. 8,500 కోట్ల రుణాలు రాబట్టుకునేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సారథ్యంలోని 26 బ్యాంకుల కన్సార్షియం.. జెట్ ఎయిర్వేస్పై ఎన్సీఎల్టీని ఆశ్రయించాయి. జెట్ ఎయిర్వేస్ దాదాపు 23,000 ఉద్యోగులకు రూ. 3,000 కోట్లు జీతాలు, ఇతరత్రా విమానాల వెండార్లు, లెస్సర్లకు (లీజుకిచ్చిన సంస్థలు) రూ. 10,000 కోట్ల దాకా బాకీపడింది. మోసర్ బేయర్ ఆస్తుల విక్రయానికి ఆదేశం నిర్దిష్ట గడువులోగా రుణ పరిష్కార ప్రణాళికకు రుణ దాతల నుంచి ఆమోదం పొందడంలో విఫలమైనందున మోసర్ బేయర్ సోలార్ ఆస్తులు విక్రయించాలంటూ ఎన్సీఎల్టీ మరో కేసులో ఆదేశించింది. ఇందులో భాగంగా కంపెనీకి లిక్విడేటర్గా అరవింద్ గర్గ్ వ్యవహరిస్తారని సూచించింది. లిక్విడేషన్ ప్రక్రియ జరిగే సమయంలో కంపెనీ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగేలా గర్గ్ చూస్తారని పేర్కొంది. లిక్విడేషన్ ప్రకటన తేదీ నుంచి 75 రోజుల్లోగా ప్రాథమిక నివేదిక సమర్పించాలని లిక్విడేటర్కు ఎన్సీఎల్టీ సూచించింది. 2017 నవంబర్ 14న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పిటిషన్ను స్వీకరించడంతో మోసర్ బేయర్ సోలార్పై దివాలా చట్టం కింద చర్యల ప్రక్రియ ప్రారంభమైంది. సంస్థ లిక్విడేషన్ విలువ రూ. 72.42 కోట్లుగా ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. మోసర్ బేయర్ సోలార్ మాతృ సంస్థ మోసర్ బేయర్ ఇండియా కూడా లిక్విడేషన్ ప్రక్రియ ఎదుర్కొంటోంది. -
ఎన్సీఎల్టీ ముంగిట జెట్
ముంబై: దాదాపు రూ.8,500 కోట్ల రుణ బకాయిలను రాబట్టుకునే దిశగా ప్రైవేట్ రంగ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్పై బ్యాంకులు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ను (ఎన్సీఎల్టీ) ఆశ్రయించాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సారథ్యంలోని 26 బ్యాంకులు మంగళవారం పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై విచారణను ట్రిబ్యునల్ బుధవారానికి వాయిదా వేసింది. రుణాలు, నష్టాల భారం పేరుకుపోవడంతో జెట్ ఎయిర్వేస్ ఏప్రిల్ 17న కార్యకలాపాలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. కొన్నాళ్లుగా కంపెనీని విక్రయించడానికి బ్యాంకులు ప్రయత్నిస్తున్నప్పటికీ... వివిధ కారణాల వల్ల సాధ్యపడటం లేదు. బ్యాంకులకు రూ. 8,500 కోట్లతో పాటు, వందల కొద్దీ వెండార్లకు (విమానాలు లీజుకిచ్చిన సంస్థలు మొదలైనవి) రూ.10,000 కోట్లను జెట్ చెల్లించాల్సి ఉంది. ఇక మార్చి నుంచి ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించడం లేదు. దీంతో 23,000 మంది పైచిలుకు ఉద్యోగులకు రూ.3,000 కోట్ల మేర జీతాల బకాయిలు చెల్లించాల్సి ఉంది. మంగళవారం జెట్ షేరు 41 శాతం క్షీణించి రూ. 40.45 వద్ద క్లోజయ్యింది. ఒక దశలో 53 శాతం క్షీణించి రూ.32.25 ఆల్టైం కనిష్ట స్థాయిని కూడా తాకింది. గడిచిన అయిదు ట్రేడింగ్ సెషన్లలో షేర్ల విలువ 73 శాతం పైగా హరించుకుపోయింది. -
జెట్ ఎగరడం ఇక కలే!
ముంబై: ప్రైవేటు రంగ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్లో మెజారిటీ వాటాలు విక్రయించటంపై బ్యాంకులు చేతులెత్తేశాయి. వాటాల విక్రయానికి బిడ్లను ఆహ్వానించి రెండు నెలల పాటు ఇన్వెస్టర్ కోసం అన్వేషించిన రుణదాతల (బ్యాంకులు) కమిటీ... ఫలితాన్ని మాత్రం రాబట్టలేకపోయింది. చివరకు బిడ్డింగ్లో మిగిలిన ఏకైక సంస్థకు జెట్ను విక్రయించడం ఇష్టం లేక, దివాలా చట్టం (ఐబీసీ) కింద రూ.8,000 కోట్ల రుణాల వసూలు కోసం ఎన్సీఎల్టీని ఆశ్రయించాలని ఏకగ్రీవంగా నిర్ణయించినట్టు అవి ప్రకటించాయి. ఎస్బీఐ ఆధ్వర్యంలో 26 సంస్థల రుణదాతల కమిటీ సోమవారం సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. ‘‘షరతులతో కూడిన ఒకే ఒక్క బిడ్ మాత్రమే రావడంతో ఉన్నత స్థాయి చర్చల అనంతరం జెట్ ఎయిర్వేస్కు దివాలా చట్టం కింద పరిష్కారం కోరాలని నిర్ణయించాం’’ అని ఎస్బీఐ ప్రకటనలో పేర్కొంది. ఆశావహ ఇన్వెస్టర్ ఈ డీల్కు కొన్ని రకాల సెబీ మినహాయింపులు కోరడంతో, ఐబీసీ కిందే మెరుగైన పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నట్టు తెలిపింది. 25 ఏళ్ల క్రితం మొదలై ఒక దశలో అతిపెద్ద ప్రైవేటు రంగ విమానయాన కంపెనీగా ఎదిగిన జెట్ కార్యకలాపాలు ఈ ఏడాది ఏప్రిల్ 17 నుంచి పూర్తిగా నిలిచిపోయాయి. కార్యకలాపాల నిర్వహణకు కనీస నగదు కూడా లేని పరిస్థితుల్లో, నిధుల సాయానికి బ్యాంకులు అంగీకరించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. బకాయిలు చెల్లించకపోవడంతో సంస్థ విమానాలను కూడా లీజుదారులు తీసుకెళ్లిపోయారు. 23,000 మంది ఉద్యోగులకు కష్టం! ఎతిహాద్–హిందుజా కూటమి ఆసక్తి వ్యక్తీకరించినప్పటికీ, నిర్మాణాత్మక ప్రతిపాదన ఏదీ సమర్పించలేదని, పైగా భారీ హెయిర్కట్ (రుణభారంలో నష్టపోయే మొత్తం) తీసుకోవాలని కోరడంతో బ్యాంకులు ఎన్సీఎల్టీ మార్గాన్ని ఎంచుకున్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మాజీ చైర్మన్ నరేష్ గోయల్కు వ్యతిరేకంగా లుక్ అవుట్ నోటీసులు జారీ చేయడం, దర్యాప్తు విభాగాలు మనీల్యాండరింగ్ ఆరోపణలపై విచారణ మొదలుపెట్టడం వంటి పరిణామాల నేపథ్యంలో బ్యాంకులు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అయితే, సంస్థ పునరుద్ధరణ దిశగా ఇన్ని రోజులు ఆశలతో ఉన్న వేల మంది ఉద్యోగుల భవిష్యత్తు బ్యాంకుల నిర్ణయం ఫలితంగా అంధకారంగా మారింది. ఇప్పటికే కొంత మంది ఉద్యోగులు సంస్థను వీడగా, ఇప్పటికీ చాలా మంది తిరిగి కార్యకలాపాలు మొదలవుతాయన్న ఆశతో ఉన్నారు. బ్యాంకుల చేతికి వెళ్లినా చీకటే జెట్ రుణాలను తిరిగి చెల్లించలేని పరిస్థితుల్లో ఉండటంతో చైర్మన్ నరేష్ గోయల్ను బలవంతంగా బయటకు పంపించిన బ్యాంకులు కంపెనీ నియంత్రణను మార్చి 25న తమ అధీనంలోకి తీసుకున్నాయి. రుణాన్ని ఈక్విటీగా మార్చుకున్నాయి. అయితే, రూ.1,500 కోట్ల మేర ఈక్విటీ మూలధనాన్ని అందిస్తామని హామీ ఇచ్చిన బ్యాంకులు ఆ తర్వాత ముఖం చాటేయడంతో పాటు సంస్థ కార్యకలాపాలు నిలిచిపోయేందుకు పరోక్షంగా కారణమయ్యాయి. సంస్థలో 24 శాతం వాటా కలిగిన అబుదాబీ సంస్థ ఎతిహాద్ సైతం మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాలేదు. అప్పుల భారమే ఎక్కువ జెట్ ఎయిర్వేస్కు రుణ భారం, ఇతర బాధ్యతలు కలిపి రూ.36,000 కోట్ల మేర ఉన్నాయి. సంస్థ చేతుల్లోని ఆస్తులు కేవలం హీత్రూ విమానాశ్రయంలో స్లాట్లు, జేపీ మైల్స్ అనే లాయల్టీ కార్యక్రమంలో మైనారిటీ వాటా మాత్రమే. దేశీయ విమానాశ్రయాల్లో జెట్కు ఉన్న స్లాట్లలో చాలా వాటిని ఇప్పటికే కేంద్రం ఇతర కంపెనీలకు కేటాయించేసింది. సంస్థ ఖాతాల్లో ఉన్న విమానాలు కేవలం 16. మిగిలిన 123 విమానాలు లీజుకు తీసుకున్నవి కాగా, అవి రిజిస్ట్రేషన్ కోల్పోయాయి. షేరు ఢమాల్... జెట్ ఎయిర్వేస్ షేరు సోమవారం భారీగా నష్టపోయింది. జూన్ 28 నుంచి జెట్ ఎయిర్వేస్ స్టాక్ ట్రేడింగ్పై ఆంక్షలు విధిస్తున్నట్టు, ట్రేడ్ టు ట్రేడ్ విభాగంలోకి మారుస్తున్నట్టు స్టాక్ ఎక్సే్ఛంజ్లు తీసుకున్న నిర్ణయంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. షేరు 18% నష్టపోయి ఎన్ఎస్ఈలో రూ.66.95 వద్ద క్లోజయింది. ఇంట్రాడేలో 19.56% పతనమైంది. -
నిజాం షుగర్స్ అమ్మకానికి పచ్చజెండా
సాక్షి, హైదరాబాద్: నష్టాలతో మూతపడిన నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్ను విక్రయించి.. బ్యాంకులు, ఇతర సంస్థలకు బకాయిలు చెల్లించాల్సిందిగా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎస్సీఎల్టీ) ఆదేశించింది. సుమారు 8 దశాబ్దాల చరిత్ర కలిగిన నిజాం షుగర్స్ పునరుద్ధరణ మార్గాలు మూసుకుపోవడంతో ఆస్తుల విక్రయం (లిక్విడేషన్) మినహా మరో మార్గం లేకుండా పోయిందని పేర్కొంది. ఇప్పటికే పరిశ్రమలో ఉత్పత్తి నిలిచిపోవడంతో వేతనాల కోసం ఉద్యోగులు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. ఈ నెల 3న తీర్పు వెలువరించిన ట్రిబ్యునల్ గురువారం లిక్విడేషన్కు ఆదేశిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ట్రిబ్యునల్ ఉత్తర్వులు అందిన తర్వాత.. తదుపరి కార్యాచరణపై స్పష్టత ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరాలని చక్కెర శాఖ అధికారులు నిర్ణయించారు. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలనలో 1937లో ఏర్పాటు చేసిన నిజాం చక్కెర కర్మాగారం (ఎన్ఎస్ఎల్) సుమారు రెండు దశాబ్దాలుగా నష్టాల బాటలో నడిచింది. నష్టాల నుంచి పరిశ్రమను గట్టెక్కించే నెపంతో 2002లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం డెల్టా పేపర్ మిల్స్కు 51శాతం వాటాను విక్రయించింది. నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్ (ఎన్డీఎస్ఎల్)గా పేరు మార్చుకున్న నిజాం చక్కెర కర్మాగారం.. నష్టాల నుంచి గట్టెక్కే పరిస్థితి లేకపోవడంతో 2015 డిసెంబర్లో పరిశ్రమను మూసివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. మరోవైపు పరిశ్రమ ఆస్తులను విక్రయించి అప్పులు చెల్లించేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఎన్డీఎస్ఎల్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో రైతుల భాగస్వామ్యంతో సహకార రంగంలో ఎన్డీఎస్ఎల్ను నడిపేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం 2015, ఏప్రిల్లో కార్యదర్శుల కమిటీని ఏర్పాటు చేసింది. ప్రైవేటు భాగస్వామ్య సంస్థకు చెందిన 51శాతాన్ని టేకోవర్ చేయడంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించి, 3 నెలల్లో నివేదిక ఇవ్వాల్సిందిగా కార్యదర్శుల కమిటీని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీఓఎంఎస్ 28ను విడుదల చేసింది. ట్రిబ్యునల్ను ఆశ్రయించిన ఎన్డీఎస్ఎల్... బ్యాంకర్ల వద్ద భారీగా అప్పులు పెరిగిపోవడంతో దివాలా పరిశ్రమగా గుర్తించాలని 2017లో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్, హైదరాబాద్ బెంచ్ను ఎన్డీఎస్ఎల్ ఆశ్రయించింది. అప్పులు తీర్చేందుకు కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిసొల్యూషనల్ ప్రాసెస్ (సీఐఆర్పీ)ని ప్రారంభించాలని కోరింది. ఈ నేపథ్యంలో రుణ దాతలతో (కమిటీ ఆఫ్ క్రెడిటర్స్) సంప్రదింపులు జరిపేందుకు ఆర్.రామకృష్ణ గుప్తా అనే నిపుణుడికి బాధ్యతలు అప్పగించింది. 2017, అక్టోబర్ మొదలుకుని 2018, సెప్టెంబర్ వరకు 11 పర్యాయాలు రుణదాతలతో సంప్రదింపులు జరిపినా.. పునరుద్ధరణ అంశం కొలిక్కి రాలేదు. సహకార రంగంలో పరిశ్రమను పునరుద్ధరించేందుకు ప్రత్యేక ప్రణాళికలతో రావాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ట్రిబ్యునల్ ఆదేశించింది. అయితే ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్ట్రప్టెన్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీసీ) నిబంధనల మేరకు 2018, సెప్టెంబర్ 19లోపు సమస్యను పరిష్కరించాల్సి ఉండగా.. 12 వారాల పాటు గడువు పొడిగించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కోరింది. మరోవైపు పరిశ్రమను కొనుగోలు చేసేందుకు కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన కొన్ని సంస్థలు ఆసక్తి చూపాయి. అయితే పరిశ్రమ ఆస్తులు, అప్పులను పరిశీలించిన సంస్థలు చివరి నిమిషంలో వెనుకడుగు వేశాయి. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం: భద్రు మాలోత్ నిజాం చక్కెర కర్మాగారం లిక్విడేషన్ అనుమతికి సంబంధించి ఎన్సీఎల్టీ ఉత్తర్వులు అధికారికంగా అందిన తర్వాత.. ప్రభుత్వం దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్తామని చక్కెర శాఖ కమిషనర్ భద్రు మాలోత్ ‘సాక్షి’కి వెల్లడించారు. రైతులు, ఉద్యోగులకు నష్టం జరగకుండా పరిశ్రమ పునరుద్ధరణ మార్గాలను అన్వేషిస్తామన్నారు. ఇదిలా ఉంటే ఎన్సీఎల్టీ ఉత్తర్వులపై సుప్రీంకోర్టు లేదా ఎన్సీఎల్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ను ప్రభుత్వం ఆశ్రయించే సూచనలు కనిపిస్తున్నాయి. లిక్విడేషన్కు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు.. అయితే వరుస ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం నుంచి గడువులోగా పునరుద్ధరణ ప్రణాళిక అందకపోవడంతో పరిశ్రమ అమ్మకానికి (లిక్విడేషన్) అనుమతిస్తూ ఎన్సీఎల్టీ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. 12 వారాల గడువును ఇవ్వాలనే రాష్ట్ర ప్రభుత్వ వినతిని ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. రామకృష్ణ గుప్తాకు లిక్విడేటర్గా బాధ్యతలు అప్పగించింది. లిక్విడేషన్ ప్రక్రియ ప్రారంభానికి ముందు.. పునరుద్ధరణకు సంబంధించి కొనుగోలుకు ఆసక్తి ఉన్న సంస్థలతో సంప్రదింపులు జరపడంతో పాటు, ప్రభుత్వ స్పందన కోసం కొంత కాలం వేచి చూసే యోచనలో లిక్విడేటర్ ఉన్నట్లు సమాచారం. వివిధ సంస్థలకు రూ.360 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉండగా.. ఆస్తులు కూడా అంతే మొత్తంలో ఉన్నట్లు సమాచారం. లిక్విడేషన్కు ఎన్సీఎల్టీ అనుమతి ఇవ్వడంతో సంస్థపై ఆధారపడిన సుమారు 250 మంది ఉద్యోగుల భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారింది. -
రవిప్రకాశ్కు చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: టీవీ9 టేకోవర్ విషయంలో సైఫ్ మారిషస్ కంపెనీ లిమిటెడ్–ఐ విజన్ మీడియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ల మధ్య తలెత్తిన వివాదం సమసిపోయింది. కోర్టు వెలుపల ఈ రెండు కంపెనీలు రాజీ చేసుకోవడంతో ఐ విజన్పై సైఫ్ మారిషస్ దాఖలు చేసిన పిటిషన్ ఉపసంహరణకు హైదరాబాద్లోని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ ) శుక్రవారం అనుమతిచ్చింది. ఈ పిటిషన్పై టీవీ9 మాజీ సీఈవో వి. రవిబాబు అలియాస్ రవిప్రకాశ్ చేసిన అభ్యంతరాలను ఎన్సీఎల్టీ తోసిపుచ్చింది. రవిప్రకాశ్ లేవనెత్తిన అభ్యంతరాలన్నీ అలందా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్కు అసోసియేటెడ్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ (ఏబీసీఎల్)కు సంబంధించిన అంతర్గత వివాదాలని గుర్తుచేసింది. ఏబీసీఎల్ టేకోవర్, ఆ కంపెనీ నుంచి రవిప్రకాశ్, ఇతరులు డైరెక్టర్లుగా తొలగింపు తదితర వివాదాలను ఈ వ్యాజ్యంలో లేవనెత్తడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ వివాదాలు సైఫ్ మారిషస్ పిటిషన్ ఉపసంహరణను తిరస్కరించడానికి ఎంతమాత్రం కారణాలు కాజాలవని పేర్కొంది. ఈ అంశాలన్నింటిపై రవిప్రకాశ్ ఇప్పటికే ఇదే ట్రిబ్యునల్లో మరో పిటిషన్ దాఖలు చేశారని తెలిపింది. ఆ పిటిషన్ విచారణపై జూన్ 12 వరకు స్టే విధిస్తూ ఢిల్లీలోని జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపింది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుం టూ ఐ విజన్ మీడియాపై దాఖలు చేసిన పిటిషన్ను ఉపసంహరించుకునేందుకు సైఫ్ మారిషస్ కు అనుమతినిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ట్రిబ్యునల్ సభ్యులు (జ్యూడీషియల్) కె.అనంత పద్మనాభస్వామి ఉత్తర్వులు జారీ చేశారు. ఇదీ సైఫ్–ఐ విజన్ మధ్య వివాదం... తమతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఐ విజన్ వాటాల బదలాయింపు చేయలేదని, అదే విధంగా ఎన్సీఎల్టీ ఆదేశాల మేరకు నడుచుకోలేదంటూ సైఫ్ మారిషస్ గత ఏడాది ఎన్సీఎల్టీలో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పెండింగ్లో ఉండగానే, ఈ రెండు కంపెనీల మధ్య ట్రిబ్యునల్ వెలుపల రాజీ కుదిరింది. దీంతో ఐ విజన్ మీడియాపై తాము దాఖలు చేసిన పిటిషన్ను ఉపసంహరించుకునేందుకు అనుమతి కోరింది. అయితే దీనిపై రాతపూర్వకంగా పిటిషన్ దాఖలు చేసుకోవాలని సైఫ్ మారిషస్కు ఎన్సీఎల్టీ స్పష్టం చేసింది. దీంతో సైఫ్ పిటిషన్ ఉపసంహరణ నిమిత్తం పిటిషన్ దాఖలు చేసింది. ఇదే సమయంలో రంగ ప్రవేశం చేసిన రవిప్రకాశ్ సైఫ్ మారిషస్ పిటిషన్ ఉపసంహరణకు అనుమతించవద్దంటూ అభ్యంతరాలు లేవనెత్తారు. టీవీ 9లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలన్నింటినీ అందులో ప్రస్తావించారు. రవిప్రకాశ్ జోక్యంపై అభ్యంతరాలు... రవిప్రకాశ్ దాఖలు లేవనెత్తిన ఈ అభ్యంతరాలపై అటు సైఫ్ మారిషస్, ఐ విజన్ మీడియా, ఇటు ఏబీసీఎల్లు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. అసలు తమ మధ్య లావాదేవీల్లో రవిప్రకాశ్కు ఏమాత్రం సంబంధం లేదని తెలిపాయి. సంబంధం లేని వ్యక్తి లేవనెత్తే అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాయి. అందరి వాదనలు విన్న ట్రిబ్యునల్ సభ్యులు అనంత పద్మనాభస్వామి సైఫ్ మారిషస్ పిటిషన్ ఉపసంహరణకు అనుమతిచ్చారు. చట్ట ప్రకారం పిటిషన్ను ఉపసంహరించుకునే హక్కు పిటిషనర్కు ఉందన్నారు. సైఫ్–ఐ విజన్లు రాజీకొచ్చిన నేపథ్యంలో ఈ పిటిషన్ను పెండింగ్లో ఉంచాల్సిన అవసరం లేదని ఆయన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే సంబంధం లేని వ్యక్తి లేవనెత్తిన అభ్యంతరాల ఆధారంగా పిటిషన్ను పెండింగ్లో ఉంచాల్సిన అవసరం లేదని వీఎల్ఎస్ వర్సెస్ సౌత్ ఎండ్ ఇన్ఫ్రా కేసులో ఎన్సీఎల్ఏటీ ఇచ్చిన తీర్పును ఉదహరించారు. -
‘పెన్నార్’ విలీనానికి ఎన్సీఎల్టీ ఆమోదం
హైదరాబాద్: పెన్నార్ ఇండస్ట్రీస్లో పెన్నార్అనుబంధ కంపెనీల విలీనానికి నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్(ఎన్సీఎల్టీ) ఆమోదం లభించింది. పెన్నార్ ఇంజినీర్డ్ బిల్డింగ్ సిస్టమ్స్(పెబ్స్), పెన్నార్ ఎన్విరో లిమిటెడ్లు పెన్నార్ ఇండస్ట్రీస్లో విలీనమవుతాయి. విలీన స్కీమ్ ప్రకారం, ప్రతి 13 పెబ్స్ షేర్లకు 23 పెన్నార్ ఇండస్ట్రీస్ షేర్లు లభిస్తాయి. అలాగే ప్రతి ఒక్క పెన్నార్ ఎన్విరో షేర్కు ఒక పెన్నార్ ఇండస్ట్రీస్ షేర్ లభిస్తుంది. విలీన స్కీమ్కు అప్పాయింటెడ్ డేట్ను గత ఏడాది ఏప్రిల్ 1గా ఎన్సీఎల్టీ ఆమోదించింది. వాటాదారులకు కొత్త షేర్లు రావడానికి 2–3 నెలల సమయం పడుతుందని అంచనా. విలీనం కారణంగా వ్యయాలు కలసివస్తాయని, నిధుల వినియోగం మెరుగుపడుతుందని కంపెనీ వైస్–ప్రెసిడెంట్ (కార్పొరేట్ స్ట్రాటజీ) కె.ఎమ్. సునీల్ పేర్కొన్నారు. త్వరలో రికార్డ్ డేట్ను ప్రకటిస్తామని వెల్లడించారు. అనుబంధ కంపెనీల విలీనానికి ఎన్సీఎల్టీ ఆమోదం లభించిన నేపథ్యంలో పెన్నార్ ఇండస్ట్రీస్ షేర్ 1.7 శాతం నష్టంతో రూ.31.35 వద్ద ముగిసింది. పెబ్స్ షేర్ 4.4 శాతం నష్టంతో రూ. 52.15వద్దకు చేరింది. -
ఎన్సీఎల్టీలో శివాజీకి ఎదురు దెబ్బ
-
ఎన్సీఎల్టీలో శివాజీకి చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్ : నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో సినీనటుడు, గరుడ పురాణం శివాజీకి చుక్కెదురు అయింది. ఇప్పటికే అలందా మీడియాకు అనుకూలంగా ఢిల్లీలోని ఎన్సీఎల్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఈ పిటిషన్పై ప్రస్తుతం ప్రొసీడింగ్స్ జరపలేమని తేల్చి చెప్పింది. కాగా టీవీ9 మాతృసంస్థ ఏబీసీఎల్లో జరిగిన మార్పులు, తనకు తెలియకుండా రవిప్రకాశ్ మోసపూరితంగా వ్యవహరించారని, ఏబీసీఎల్లో మార్పులపై స్టే విధించి యధాతథ స్థితిని కొనసాగించాలంటూ ఆయన ఎన్సీఎల్టీని ఆశ్రయించిన విషయం తెలిసిందే. మరోవైపు అలందా మీడియా ఒప్పందాలపై స్టే కోరుతూ రవిప్రకాశ్ కూడా వారం క్రితం ఎన్సీఎల్టీలో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన ట్రిబ్యునల్ ఎనిమిది మందికి నోటీసులు ఇచ్చింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ.. ఏబీసీఎల్ను టేకోవర్ చేసిన అలంద మీడియా నేషనల్ ఢిల్లీలోని కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్లో అప్పీల్ పిటిషన్ వేసింది. దీనిపై విచారణ జరిపిన ట్రిబ్యునల్ ...హైదరాబాద్ ఎన్సీటీఎల్లో జరిగే కేసు విచారణపై జూలై 9వ తేదీ వరకూ స్టే ఇచ్చింది. దీంతో స్టే కారణంగానే జూలై 12 వరకూ ఎలాంటి ప్రొసిడింగ్స్ జరగడానికి వీల్లేదని ఎన్సీఎల్టీ స్పష్టం చేస్తూ తదుపరి విచారణను జూలై 12వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసు విచారణకు రవిప్రకాశ్, శివాజీ గైర్హాజరు కాగా, వాళ్ల తరఫు న్యాయవాదులు హాజరు అయ్యారు. మరోవైపు ఎన్సీఎల్టీ వద్ద సైబర్ క్రైమ్, ఎస్వోటీ పోలీసులు కూడా మోహరించారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : ఎన్సీఎల్టీలో శివాజీకి ఎదురు దెబ్బ -
రవిప్రకాశ్ శివాజీ కుట్ర బట్టబయలు
సాక్షి, హైదరాబాద్ : టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్, సినీ నటుడు గరుడ పురాణం శివాజీల మధ్య జరిగిన కుట్ర బట్టబయలైంది. ప్రస్తుతం పరారీలో ఉన్న రవిప్రకాశ్ ఈ మెయిల్స్ను పోలీసులు తనిఖీలు చేయగా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇందుకు సంబంధించిన ఈ మెయిల్స్ బయటపడ్డాయి. టీవీ9 మాతృసంస్థ అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ (ఏబీసీఎల్) కొత్త యాజమాన్యానికి ఇబ్బందులు సృష్టించే ఉద్దేశంతో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)ని అడ్డుపెట్టుకుని పావులు కదిపారని తేటతెల్లమయ్యింది. రవిప్రకాశ్, శివాజీ మధ్య కుదిరింది పాత ఒప్పందం కాదని, ఎన్సీఎల్టీలో కేసు వేయడం కోసం కుట్ర చేసి, పాత తేదీతో నకిలీ షేర్లు కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులకు పక్కా సాక్ష్యాధారాలు లభించినట్లు తెలిసింది. ఈ కేసు మరో కొత్త మలుపు తిరగడంతో పాటు రవిప్రకాశ్ చుట్టూ మరింత ఉచ్చు బిగుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. చదవండి: (బెజవాడలో రవిప్రకాశ్, శివాజీ!) కుట్రకు సంబంధించిన పలువురు వక్తుల మధ్య బదిలీ అయిన పలు ఈ మెయిల్స్ను సైబర్ క్రైమ్ పోలీసు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆధారాలు దొరకకుండా సర్వర్ల నుంచి రవిప్రకాశ్, ఆయన అనుచరులు డిలీట్ చేసినప్పటికీ, సైబర్ క్రైమ్ పోలీసులు అత్యాధునిక పరిజ్ఞానం ఉపయోగించి వీటిని వెలికి తీశారు. రవిప్రకాశ్ నుంచి 40 వేల షేర్లను కొనుగోలు చేసేందుకు శివాజీ ఫిబ్రవరి 20, 2018న ఒప్పందం కుదుర్చుకున్నట్లు సృష్టించిన ఒప్పందపు డ్రాఫ్ట్... వాస్తవానికి ఏప్రిల్13, 2019న తయారు చేశారు. ఈ డ్రాఫ్ట్ను ఆ రోజు సాయంత్రం 5:46 గంటలకు టీవీ9 మాజీ సీఎఫ్వో మూర్తికి రవిప్రకాశ్ సన్నిహితుడు, న్యాయవాది శక్తి మెయిల్ చేశారు. ఈ మెయిల్ను రవిప్రకాశ్, ఎంవీకేఎన్ మూర్తి, రవిప్రకాశ్ సన్నిహితుడు హరిలకూ కాపీలు పంపించారు. ఫిబ్రవరి 20, 2018న కుదుర్చుకున్నట్లు పాత తేదీతో చేసుకోబోయే ఒప్పందం వివరాలు ఇందులో ఉన్నాయి. ఆ తర్వాత సాయంత్రం 6:45 గంటల నుంచి రాత్రి 9:39 గంటల మధ్య వీరందరి మధ్య మెయిల్స్ సర్క్యులేట్ అయినట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇక శివాజీ ఎన్సీఎల్టీలో దాఖలు చేయడానికి అవసరమైన పిటిషన్ను విజయవాడకు చెందిన ఓ అడ్వకేట్ రూపొందించారు. ఆ మరుసటి రోజున అంటే, ఏప్రిల్14, 2019న ఉదయం 5:38 గంటలకు ఆ పిటిషన్ కాపీని, అందులో చేయాల్సిన మార్పులను ఈ మెయిల్లో ప్రస్తావించడంతో పాటు, తగిన మార్పులు చేర్పులతో ఉదయం తొమ్మిది గంటల కల్లా, విజయవాడ అడ్వకేట్కు పంపించాల్సి ఉంటుందంటూ శక్తి ... రవిప్రకాశ్, ఆయన అనుచరులకు మెయిల్ పంపించారు. అదే రోజు ఈ పిటిషన్పై రవిప్రకాశ్ ఆయన అనుచరులు మెయిల్లో సంప్రదింపులు జరిపినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. వీటి ఆధారంగానే సెక్షన్ 41 సీఆర్పీసీ కింద పోలీసులు రవిప్రకాశ్కు నోటీసులు జారీ చేశారు. ఈ సెక్షన్ కింద అరెస్టయ్యే ప్రమాదాన్ని తప్పించుకోవడం కోసం.. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో రవిప్రకాశ్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ను కూడా న్యాయస్థానం తిరస్కరించింది. ఈ వ్యవహారం అంతా బట్టబయలు కావడంతో, ఎన్సీఎల్టీలో జరగబోయే విచారణ మీదే ఇప్పుడు ఆసక్తి నెలకొని ఉంది. మరోవైపు రవిప్రకాశ్ సన్నిహితుడు, న్యాయవాది శక్తి కూడా అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. -
ఆర్కాం దివాలా ప్రక్రియ షురూ
అప్పుల ఊబిలో కూరుకుపోయిన అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కాం) నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో దివాలా ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. అలాగే దివాలా ప్రక్రియనుంచి మినహాయింపు ఇవ్వాలన్న అభ్యర్థనను ఎన్సీఎల్టీ గురువారం అంగీకరించింది. దివాలా ప్రక్రియలో 357రోజుల (మే 30, 2018 నంచి ఏప్రిల్ 30 2019) కాలానికి మినహాయింపు ఇవ్వాలని ఆర్కామ్ కోరగా ట్రైబ్యునల్ ఇందుకు సమ్మతించింది. అనంతరం తదుపరి విచారణను మే30వ తేదీకి వాయిదా వేసింది. ఎస్బీఐతో పాటు వివిధ బ్యాంకులకు ఆర్కామ్ రూ.50వేల కోట్ల వరకు అప్పు ఉంది. ఆర్థిక ఇబ్బందులతో రుణాలు చెల్లించని పరిస్థితికి దిగజారింది. దీంతో దివాలా పెట్టేందుకు కంపెనీ ఎన్సీఎల్టీని ఆశ్రయించింది. గురువారం మరోసారి విచారణ జరిపిన ట్రైబ్యునల్ కంపెనీ దివాలా ప్రక్రియకు అనుమతి ఇస్తూ సంస్థ బోర్డును రద్దు చేసింది. కొత్త రిసొల్యూషన్ ప్రొఫెషనల్ను అపాయింట్ చేసింది. అంతేకాకుండా ఎస్బీఐ నేతృత్వంలోని 31 బ్యాంకు కన్సార్షియానికి క్రెడిటర్స్ కమిటీ ఏర్పాటుకు అనుమతిచ్చింది. ఇప్పటికే దాఖలైన దివాలా పిటిషన్ పైన నేషనల్ కంపెనీ లా అప్పెలట్ ట్రైబ్యునల్, సుప్రీం కోర్టు స్టే విధించాయి. ఈ నేపథ్యంలో ఈ 357 రోజుల కాలానికి మినహాయింపు ఇవ్వాలని ఆర్కాం కోరింది. ఇందుకు ట్రైబ్యునల్ ఒప్పుకుంది. ఈ కేసులో తదుపరి విచారణను మే 30 నాటికి వాయిదా వేసింది. అప్పటి లోగా కేసు పురోగతిపై నివేదిక ఇవ్వాలని రిసొల్యూషన్ ప్రొఫెషనల్కు ఆదేశాలు జారీ చేసింది. ఆర్థిక ఇబ్బందులు ఆర్కాం గత కొన్నేళ్లుగా ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతోంది. రెండేళ్ల క్రితం కార్యకలాపాలు నిలిపేసింది. దీంతో ఆర్.కామ్ స్పెక్ట్రంను జియోకు విక్రయించేందుకు సిద్ధపడింది. కానీ వివాదాల నేపథ్యంలో ప్రభుత్వం నుంచి అనుమతులు అందలేదు. -
కొనసాగుతున్న ‘ల్యాంకో’ దివాలా పరంపర
సాక్షి, హైదరాబాద్: ల్యాంకో గ్రూపు కంపెనీల దివాలా పరంపర కొనసాగుతోంది. తాజాగా మరో కంపెనీ దివాలా ప్రక్రియ జాబితాలో చేరింది. ల్యాంకో కొండపల్లి పవర్ లిమిటెడ్ దివాలాకు అనుమతినిస్తూ జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) హైదరాబాద్ ఉత్తర్వులు జారీ చేసింది. తీసుకున్న రుణాలు చెల్లించకపోవడంతో యాక్సిస్ బ్యాంకు దాఖలు చేసిన పిటిషన్పై ఎన్సీఎల్టీ సభ్యులు అనంతపద్మనాభస్వామి ఇటీవల ఈ ఉత్తర్వులు జారీ చేశారు. కోల్కతాకు చెందిన పంకజ్ దనుఖాను తాత్కాలిక దివాలా పరిష్కార నిపుణుడు (ఐఆర్పీ)గా నియమించారు. కృష్ణా జిల్లా కొండపల్లిలో గ్యాస్, నాఫ్తా ఆధారిత విద్యుత్ ఉత్పత్తి నిమిత్తం ల్యాంకో కొండపల్లి పవర్ లిమిటెడ్ను ఏర్పాటు చేసింది. కార్యకలాపాల నిమిత్తం వివిధ బ్యాంకుల నుంచి కంపెనీ పెద్దఎత్తున రుణాలు తీసుకుంది. ఈ విధంగా యాక్సిస్ బ్యాంకుకు 2018 ఆగస్ట్ 31 నాటికి రూ. 657.41 కోట్లు బకాయి పడింది. రుణాలు చెల్లించకపోవడంతో యాక్సిస్ బ్యాంకు ఎన్సీఎల్ టీని ఆశ్రయించి, ల్యాంకో కొండపల్లి దివాలాను ప్రారంభించాలని పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్పై ఎన్సీఎల్టీ సభ్యులు అనంతపద్మనాభస్వామి విచారణ జరిపారు. ల్యాంకో తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, అదుపులో లేని పరిస్థితుల వల్ల కంపెనీకి ఇబ్బందులు వచ్చాయన్నారు. గ్యాస్ సరఫరా ఆగిపోవడంతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయిందని, గ్యాస్ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదన్నారు. ఈ పరిస్థితుల్లో దివాలా ప్రక్రియ ప్రారంభించరాదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందన్నారు. తరువాత యాక్సిస్ బ్యాంకు వాదనలు వినిపిస్తూ, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ల్యాంకో కొండపల్లికి ఏ సంబంధం లేదని తెలిపింది. రుణం చెల్లించాలని ఎన్నిసార్లు కోరినా ల్యాంకో కొండపల్లి స్పందించలేదన్నారు. వాదనలు విన్న ట్రిబ్యునల్, ల్యాంకో కొండపల్లి దివాలా ప్రక్రియకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కంపెనీల ఆస్తుల క్రయ, విక్రయాలు, బదలాయింపులపై నిషేధం విధించింది. ఈ దివాలా ప్రక్రియకు పూర్తిగా సహకరించాలని కంపెనీ డైరెక్టర్లను ఆదేశించింది. -
షేర్ల తాకట్టులో టాప్ అనిల్ అంబానీ
ముంబై: అనిల్ అంబానీ తన గ్రూపులోని రెండు కంపెనీల్లో తనకున్న వాటాల్లో 95 శాతానికి పైగా వాటాల్ని తాకట్టు పెట్టేశారు. సుభాష్చంద్ర ఆధ్వర్యంలోని ఎస్సెల్ గ్రూపు ప్రమోటర్లు సైతం జీ ఎంటర్టైన్మెంట్, డిష్టీవీ కంపెనీల్లో 66.2 శాతం నుంచి 94.6 శాతం మధ్య వాటాలను లెండింగ్ సంస్థల వద్ద కుదువ పెట్టారు. మార్చి త్రైమాసికం నాటికి లిస్టెడ్ కంపెనీలకు సంబంధించిన ప్రమోటర్ల వాటాల తనఖా వివరాలను కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ ఓ నివేదిక రూపంలో విడుదల చేసింది. బీఎస్ఈలోని టాప్ 500 కంపెనీల డేటాను విశ్లేషించి ఈ నివేదిక రూపొందించింది. దీని ప్రకారం... ►డిసెంబర్ త్రైమాసికంతో పోలిస్తే మార్చి క్వార్టర్లో తనఖా వాటాల విలువ తగ్గింది. డిసెంబర్ నాటికి ప్రమోటర్ల తనఖా మొత్తంమీద 2.98శాతంగా ఉండగా, మార్చి త్రైమాసికం నాటికి 2.83 శాతానికి తగ్గింది. ►కుదువ పెట్టిన వాటాల విలువ రూ.1.95 లక్షల కోట్లు. బీఎస్ఈ 500 సూచీ మార్కెట్ క్యాప్లో ఇది 1.38 శాతానికి సమానం. ►రిలయన్స్ ఇన్ఫ్రాలో 98.3 శాతం, రిలయన్స్ క్యాపిటల్లో 96.9 శాతం మేర ప్రమోటర్ల వాటాలు తాకట్టు కిందకు వెళ్లాయి. డిసెంబర్ త్రైమాసికంతో పోలిస్తే మార్చి త్రైమాసికంలో ఈ రెండు కంపెనీల్లో తాకట్టు వాటాలు పతాక స్థాయికి చేరాయి. ►అనిల్ అంబానీకే చెందిన మరో కంపెనీ రిలయన్స్ కమ్యూనికేషన్స్లో తాకట్టు వాటాల పరిమాణం తగ్గింది. ►95 శాతానికి పైగా ప్రమోటర్ల వాటాలు తనఖాలో ఉన్న కంపెనీల్లో సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్, స్టెరిలైట్ టెక్నాలజీస్ కూడా ఉన్నాయి. ► మార్చి త్రైమాసికంలో ప్రమోటర్ల తనఖా వాటాలు అనూహ్యంగా పెరిగిన కంపెనీల్లో జేకే టైర్, డిష్టీవీ, వాటెక్ వాబాగ్ సైతం ఉన్నాయి. ► బీఎస్ఈ 500లో 116 కంపెనీల ప్రమోటర్లు తమ వాటాలను తాకట్టు పెట్టారు. -
జెట్కు ఐబీసీ వెలుపలే పరిష్కారం
న్యూఢిల్లీ: జెట్ ఎయిర్వేస్ బిడ్డింగ్ ప్రక్రియ సఫలం కాకపోతే, ఈ సమస్యను ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ)కు వెలుపలే పరిష్కరించుకోవాలన్న యోచనతో బ్యాంకులు ఉన్నాయి. జెట్కు రూ.8,500 కోట్లకు పైగా రుణాలు ఇచ్చి, వాటి వసూలు కోసం సంస్థను అధీనంలోకి తీసుకున్న ఎస్బీఐ ఆధ్వర్యంలోని బ్యాంకుల కమిటీ... సంస్థను విక్రయించేందుకు బిడ్లను ఆహ్వానించిన విషయం తెలిసిందే. సంస్థకు అత్యవసంగా అవసరమైన నిధులను సైతం సమకూర్చేందుకు బ్యాంకులు నిరాకరించడంతో మొత్తం కార్యకలాపాలను నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ బిడ్డింగ్ ప్రక్రియ విజయవంతం అవుతుందని బ్యాంకులు ఎంతో ఆశతో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఒకవేళ బిడ్డింగ్ ప్రక్రియ సఫలం కాకపోతే ప్లాన్ బి (ఐబీసీ వెలుపల పరిష్కారం) దిశగా పనిచేయనున్నట్టు పేర్కొన్నాయి. ఐబీసీ కింద అయితే పరిష్కారానికి ఎన్సీఎల్టీ ఆమోదం అవసరం. పైగా ఈ ప్రక్రియ మార్కెట్ స్పందనపై ఆధారపడి, సమయం తీసుకుంటుంది. జెట్కు ఉన్న విమానాలు, ఇతర ఆస్తులను విక్రయించడమే ప్లాన్ బిగా పేర్కొన్నాయి. ఎతిహాద్ ఎయిర్వేస్, టీపీజీ క్యాపిటల్, ఇండిగో పార్ట్నర్స్, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ జెట్ ఎయిర్వేస్లో వాటాల పట్ల ఆసక్తి ప్రదర్శించినట్టు సమాచారం. అయితే, బిడ్డర్ల సమాచారం మే 10న అధికారికంగా తెలియనుంది. జెట్ ఆగిపోవడం ఓ స్కామ్: ఆనంద్శర్మ జెట్ఎయిర్వేస్ కూలిపోవడం ఓ స్కామ్గా కనిపిస్తోందని కాంగ్రెస్ పార్టీ నేత ఆనంద్శర్మ ఆరోపించారు. ఎన్నికల ముందు ఇది చోటు చేసుకోవడంతో ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని, దీనిపై ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశించాలని కోరారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఇదో పెద్ద స్కామ్గా నాకు అనిపిస్తోంది. ఎన్నికల సమయంలో దీన్ని అమలు చేశారు. దీంతో ఎవరూ ప్రశ్నించరు’’ అని శర్మ అన్నారు. ఎయిర్లైన్స్కు కావాల్సిన అత్యవసర నిధులను అందించేందుకు రుణదాతల కమిటీ తిరస్కరించడంపై సందేహాలు వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణ పరిష్కారం కాదు: ఏఐ ఉద్యోగులు ప్రైవేటీకరణ సమస్యకు పరిష్కారం కాదని ఎయిర్ ఇండియా ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ప్రైవేటు రంగంలోని జెట్ ఎయిర్వేస్, కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ మూతపడిన ఘటనలు ఇందుకు ఉదాహరణలుగా పేర్కొంది. ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. కేంద్రం తన ప్రణాళికలపై తక్షణమే పునరాలోచన చేయాలని ఎయిర్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ (ఏసీఈయూ) సీనియర్ అధికారి పేర్కొన్నారు. జెట్ఎయిర్వేస్ 20,000 మంది ఉద్యోగులకు మద్దతుగా మాట్లాడుతూ... ప్రభుత్వ విధానాలు విమానయాన పరిశ్రమలో సంక్షోభానికి, ఉద్యోగాల నష్టానికి కారణమవుతున్న నేపథ్యంలో వీటిపై పునఃపరిశీలన అవసరమని సూచించారు. ‘‘మొదట కింగ్ఫిషర్, ఇప్పుడు జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ప్రైవేటీకరణ కార్యక్రమం వల్ల అర్థం చేసుకోవాల్సినది ఏమంటే... జాతీయీకరణను తొలగించడం ఒక్కటే లాభాలు, సామర్థ్యాన్ని తెచ్చిపెట్టలేవు’’అని ఆ అధికారి పేర్కొన్నారు. -
ఎస్సార్ స్టీల్ టేకోవర్కు షరతులతో కూడిన ఆమోదం
న్యూఢిల్లీ: ఎస్సార్ స్టీల్ టేకోవర్కు ఆర్సెలర్ మిట్టల్ కంపెనీకి ఎన్సీఎల్టీ షరతులతో కూడిన ఆమోదం తెలిపింది. దీంతో స్వదేశంలో ప్లాంట్ను ఏర్పాటు చేయాలన్న బిలియనీర్ లక్ష్మీ మిట్టల్ చిరకాల స్వప్నం సాకారం కానున్నది. దివాళా ప్రక్రియను ఎదుర్కొంటున్న ఎస్సార్ స్టీల్ టేకోవర్ కోసం ఆర్సెలర్ మిట్టల్, నిప్పన్ స్టీల్ అండ్ సుమిటొమో మెటల్ కార్ప్లు రూ.42,000 కోట్ల ఆఫర్ను ఇచ్చాయి. ఎస్సార్ స్టీల్ ప్రమోటర్ల అప్పీల్ నేపథ్యంలో తుది ఉత్తర్వులకు లోబడి ఆర్సెలర్, నిప్పన్ల రిజల్యూషన్ ప్లాన్కు ఆమోదం ఆధారపడి ఉంటుందని ఇద్దరు సభ్యుల ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణ ఈ నెల 27న జరగనున్నది. -
ఎస్సార్ స్టీల్పై ఆర్సెలర్ మిట్టల్కు లైన్క్లియర్?
న్యూఢిల్లీ: ఎట్టకేలకు ఎస్సార్ స్టీల్ కొనుగోలు చేసే విషయంలో ఆర్సెలర్ మిట్టల్కు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) పచ్చజెండా ఊపింది. 2017 నుంచి ఎస్సార్ స్టీల్ కొనుగోలు కోసం ఆర్సెలర్ మిట్టల్ చేస్తున్న ప్రయత్నాలకు ఫలితం దక్కింది. పెద్ద ఎత్తున రుణాలను తీర్చలేక దివాలా పరిష్కార ప్రక్రియకు కిందకు వెళ్లిన ఎస్సార్ స్టీల్ను రూ.42,000 కోట్లకు కొనుగోలు చేయడానికి ఆసక్తి వ్యక్తీకరిస్తూ ఆర్సెలర్ మిట్టల్ బిడ్ సమర్పించింది. దీనికి రుణదాతల కమిటీ సైతం ఆమోదం తెలిపింది. కొనుగోలు తర్వాత రూ.8,000 కోట్ల నిధులను ఈక్విటీ రూపంలో ఇచ్చేందుకు కూడా ఆర్సెలర్ మిట్టల్ అంగీకరించింది. అయితే, ఎస్సార్ స్టీల్ ప్రమోటర్లయిన రుయాలు మధ్యలో జోక్యం చేసుకుని ఆర్సెలర్ మిట్టల్ బిడ్ కంటే తాము ఎక్కువే చెల్లిస్తామంటూ ముందుకు రావడం, ఎన్సీఎల్టీని ఆశ్రయించడంతో అడ్డంకి ఏర్పడింది. అయితే, ఎట్టకేలకు ఆర్సెలర్ మిట్టల్ బిడ్కు ఎన్సీఎల్టీ ఆమోదం తెలిపినట్టు సమాచారం. -
అమరావతిలో ఎన్సీఎల్టీ బెంచ్!
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లోని అమరావతి, మధ్యప్రదేశ్లోని ఇండోర్లో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) బెంచ్లు ఏర్పాటు కానున్నాయి. ఇందుకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. కేసుల భారం ప్రత్యేకించి ఐబీసీ (ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ) 2016 కింద వివాదాలు పెరిగిపోతున్న నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నట్లు శుక్రవారం ఒక అధికారిక ప్రకటనలో కేంద్రం తెలిపింది. ఈ బెంచ్ల ఏర్పాటుతో కేసుల సత్వర పరిష్కారం జరుగుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ వివాదాలు అమరావతి బెంచ్ న్యాయపరిధిలోకి వస్తుండగా, మధ్యప్రదేశ్లోని దివాలా అంశాల న్యాయపరిధి ఇండోర్ బెంచ్ పరిధిలోకి వస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వివాదాలు హైదరాబాద్ ఎన్సీఎల్టీ బెంచ్ పరిధిలోకి వెళుతుండగా, మధ్యప్రదేశ్కు సంబంధించి దివాలా వివాదాలు అహ్మదాబాద్ బెంచ్ పరిధిలోకి వస్తున్నాయి. న్యూఢిల్లీలోని ప్రధాన బెంచ్ సహా దేశంలో ప్రస్తుతం 14 ఎన్సీఎల్టీ బెంచ్లు ఉన్నాయి. -
రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ దివాలా ప్రక్రియ ప్రారంభించండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్ దివాలా ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ నిర్మాణ కంపెనీ బీజీ షిర్కే కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్లోని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)ను ఆశ్రయించింది. 2018 నాటికి తమకు రూ.334.76 కోట్లు చెల్లించాల్సి ఉందని, అయితే ఈ డబ్బు చెల్లించే పరిస్థితుల్లో స్వగృహ కార్పొరేషన్ లేనందున ఆ సంస్థ దివాలా ప్రక్రియను ప్రారంభించాలని అభ్యర్థిస్తూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై ఎన్సీఎల్టీ సభ్యులు కె.అనంత పద్మనాభస్వామి విచారణ జరిపారు. షిర్కే కంపెనీ తరఫున న్యాయవాది డి.వి.సీతారామమూర్తి వాదనలు వినిపిస్తూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జవహర్నగర్లో రూ.786 కోట్లతో 6,216 ప్లాట్లతో 37 బ్లాకులు నిర్మించేందుకు తమ కంపెనీతో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ 2009లో ఒప్పందం చేసుకుందని తెలిపారు. కొంతకాలం బిల్లులు చెల్లించిన కార్పొరేషన్ ఆ తర్వాత బిల్లులు చెల్లించడం మానేసిందన్నారు. అనంతరం 37 బ్లాకులను 17 బ్లాకులకు పరిమితం చేసిందని వివరించారు. 2016లో ఈ ప్రాజెక్ట్ పూర్తయిందని, 2018 మార్చి 31 నాటికి తమకు రూ.334.76 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. నోటీసులు జారీ చేసినా స్పందించడం లేదని వివరించారు. స్వగృహ కార్పొరేషన్ తరఫు న్యాయవాది రవిప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. షిర్కే కంపెనీ ఫిబ్రవరి 22న రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ చైర్మన్కు లేఖ రాసిందన్నారు. చెల్లింపులకు సంబంధించి వివిధ శాఖలతో చర్చలు జరపాల్సిన అవసరం ఉందన్నారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అధికారుల సమావేశం జరగలేదని వివరించారు. ఈ సమస్యను పరిష్కరించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉందని, ఇందుకు కొంతసమయం పడుతుందని తెలిపారు. వాదనలు విన్న ట్రిబ్యునల్, అధికారులు సమావేశం నిర్వహించుకోవాలని, ఆ సమావేశం వివరాలను, అందులో తీసుకున్న నిర్ణయాలను తమ ముందుంచాలని స్పష్టంచేసింది. విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది. -
జెట్ ఎయిర్వేస్పై దివాలా పిటీషన్?
న్యూఢిల్లీ: జెట్ ఎయిర్వేస్పై దివాలా పిటీషన్ దాఖలు చేయాలని ఎస్బీఐ యోచిస్తోందని సమాచారం. నిర్వహణ కార్యకలాపాలకే నిధుల్లేక జెట్ ఎయిర్వేస్ అల్లాడుతున్న విషయం తెలిసిందే. రుణ పునర్వ్యవస్థీకరణకు, రుణాలను ఈక్విటీగా మార్చడానికి తదితర మరికొన్న ప్రతిపాదనలకు వాటాదారులు ఈ నెల 21న జరిగిన అసాధారణ సర్వసభ్య సమావేశం(ఈజీఎమ్)ఇటీవలే ఆమోదం తెలిపారు. మరోవైపు ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంక్ల కన్సార్షియమ్ జెట్ ఎయిర్వేస్కు రూ.500 కోట్ల మేర నిధులను కూడా మంజూరు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది(ఈ విషయమై తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది). ఈ నేపథ్యంలో జెట్ ఎయిర్వేస్పై నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్(ఎన్సీఎల్టీ)లో దివాలా పిటిషన్ విషయమై ఎస్బీఐ కసరత్తు చేస్తోందని తెలుస్తోంది. అయితే దీనిపై ఎస్బీఐ గానీ, జెట్ ఎయిర్వేస్ కానీ అధికారికంగా ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. కాగా ఈ నెల 21న జరిగిన ఈజీఎమ్లో వివిధ ప్రతిపాదనలపై ఓటింగ్కు ఇతిహాద్ కంపెనీ దూరంగా ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. జెట్ ఎయిర్వేస్లో ఇతిహాద్ ఎయిర్వేస్కు 24% వాటా ఉంది. ఎస్బీఐ, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్(ఎన్ఐఐఎఫ్)ల నుంచి మరిన్ని అదనపు నిధులు, ఈక్విటీ కేటాయింపు తదితర అంశాలపై మరింత స్పష్టత కోసం జెట్ ఎయిర్వేస్ వేచి చూస్తోందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. జెట్ ఎయిర్వేస్లో ఎస్బీఐ, ఎన్ఐఐఎఫ్లు 51% వాటా తీసుకోవాలని, దీని కోసం ఈ రెండు సంస్థలు రూ.2,200 కోట్లు పెట్టుబడులు పెట్టాలని ఇతిహాద్ కోరుకుంటోందని ఆ వర్గాలు వెల్లడించా యి. తాము ఇచ్చిన రుణాలను రాబట్టుకునేందుకు బ్యాంక్లు, ఆర్థిక సంస్థలు రుణాలిచ్చిన కంపెనీపై ఎన్సీఎల్టీలో దివాలా పిటిషన్ను దాఖలు చేస్తా యి. దీనికి ఎన్సీఎల్టీ ఆమోదం తెలిపితే సదరు సంస్థపై దివాలా ప్రక్రియ ప్రారంభమవుతుంది. -
ఆర్సెలర్ మిట్టల్ ప్రణాళికపై తేల్చండి
న్యూఢిల్లీ: ఎస్సార్ స్టీల్ విషయంలో ఆర్సెలర్ మిట్టల్ సమర్పించిన పరిష్కార ప్రణాళికపై ఈ నెల 11 లోపు తుది నిర్ణయం వెలువరించాలని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) అహ్మదాబాద్ బెంచ్ను అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) సోమవారం ఆదేశించింది. 11వతేదీ నాటికి ఎటువంటి ఆదేశాలు వెలువరించకపోతే, రికార్డులు తెప్పించుకుని తామే ఐబీసీ చట్టంలోని సెక్షన్ 31కింద ఆదేశాలు ఇవ్వాల్సి వస్తుందని జస్టిస్ ఎస్జే ముఖోపాధ్యాయ సారథ్యంలోని ఇద్దరు సభ్యుల బెంచ్ స్పష్టంచేసింది. తదుపరి విచారణను 12వ తేదీకి వాయిదా వేసింది. రుణ దాతలందరి వాదనలనూ పూర్తిగా వినే అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టంచేసింది. ఆపరేషనల్ క్రెడిటర్ల (సరఫరాదారులు, కాంట్రాక్టర్లు, కస్టమర్లు) వాదనలను మాత్రమే విని వీలైనంత తొందరగా ఆదేశాలివ్వాలని, మరో వంక ఎస్సార్ స్టీల్ ప్రమోటర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వారు పరిమిత వాదనలు వినిపించుకునే అవకాశం ఇవ్వాలని, మొత్తం మీద ఈ ప్రక్రియ ఐదు రోజుల్లో ముగించాలని ఆదేశించింది. ఎస్టార్ స్టీల్ కంపెనీ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు సుమారు రూ.51 వేల కోట్ల మేర బకాయిలుండగా, ఐబీసీ చట్టంలోని దివాలా ప్రక్రియ కింద కంపెనీని సొంతం చేసుకునేందుకు ఆర్సెలర్ మిట్టల్ కంపెనీ రూ.42,000 కోట్లతో బిడ్ వేసింది. ఆర్సెలర్ పరిష్కార ప్రణాళికకు రుణదాతల కమిటీ ఆమోదం కూడా తెలిపింది. అయితే, తాము రూ.54,389 కోట్ల మేర చెల్లిస్తామని ఎస్సార్ స్టీల్ ప్రమోటర్లు అడ్డుపుల్ల వేయడంతో ఈ ప్రక్రియలో జాప్యం నెలకొంది. ఎన్సీఎల్టీలో ప్రశాంత్ రుయా పిటిషన్ ఇప్పటికే ఆలస్యమైన ఎస్సార్ స్టీల్ దివాలా పరిష్కార ప్రక్రియను మరింత జాప్యం చేసే దిశగా ఎస్సార్ గ్రూపు డైరెక్టర్ ప్రశాంత్ రుయా ఎన్సీఎల్టీని ఆశ్రయించారు. ఆర్సెలర్ మిట్టల్ బిడ్ను పక్కన పెట్టాలంటూ అప్లికేషన్ వేశారు. ఎస్సార్ స్టీల్ మాజీ డైరెక్టర్ దిలీప్ ఊమెన్, ప్రాజెక్ట్ డైరెక్టర్ కుమార్ భట్నాగర్, ప్రశాంత్ రుయా కలసి ఈ పిటిషన్ వేశారు. రుచి సోయా కేసులో సుప్రీంకోర్టు తీర్పును ఉదహరిస్తూ... ఎస్సార్ స్టీల్ విషయంలో ఎస్సార్ గ్రూపు ప్రమోటర్లు వేసిన పిటిషన్ను ఎన్సీఎల్టీ అహ్మదాబాద్ బెంచ్ గత నెల 29న కొట్టివేసింది. ఈ నేపథ్యంలో వీరు మళ్లీ ఎన్సీఎల్టీ తలుపుతట్టడం గమనార్హం. ఆర్కామ్ ‘దివాలా పిటిషన్’పై ఎరిక్సన్ అభ్యంతరం రిలయన్స్ కమ్యూనికేషన్స్ దివాలా పిటిషన్పై ఎరిక్సన్ తన అభ్యంతరాన్ని ఫిబ్రవరి 8 నాటికి తెలియజేసేందుకు ఎన్సీఎల్ఏటీ అనుమతించింది. ఎన్సీఎల్ఏటీ లేదా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చేంత వరకు ఆర్కామ్ ఆస్తులను విక్రయిచేందుకు, మూడో పక్షానికి లేదా మరొకరికి హక్కులు కట్టబెట్టడానికి అనుమతి లేదని స్పష్టం చేసింది. విచారణను ఈ నెల 12కి వాయిదా వేసింది. టీడీశాట్లో ఆర్కామ్కు స్వల్ప ఊరట టెలికం వివాదాల పరిష్కార మండలి (టీడీశాట్)లో రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్)కు ఊరట లభించింది. ఆర్కామ్కు కేటాయించిన అదనపు స్ప్రెక్ట్రమ్కుగాను రూ.2,000 కోట్లను వసూలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టివేసింది. ఆర్కామ్కు రూ.2,000 కోట్లను తిరిగిచ్చేయాలని టెలికం శాఖను ఆదేశించింది. -
ఆర్కాం సంచలన నిర్ణయం : షేర్లు ఢమాల్
సాక్షి, ముంబై : అప్పుల సంక్షోభంలో చిక్కుకున్న రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్కామ్) సంచలన నిర్ణయం తీసుకుంది. దివాళా పిటిషన్ దాఖలు చేయాలని అనూహ్యంగా నిర్ణయించింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ద్వారా ఫాస్ట్ ట్రాక్ తీర్మానం కోరనున్నామని కంపెనీ రెగ్యులేటరీ సమాచారంలో తెలియజేసింది. దీంతో సోమవారం నాటి మార్కెట్లో అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్(అడాగ్) కంపెనీ షేర్లకు భారీ షాక్ తగిలింది. ఇన్వెస్టర్ల అమ్మకాలతో అన్ని షేర్లు భారీగా నష్టపోతున్నాయి. సుమారు రూ.40వేల కోట్ల మేర రుణ పరిష్కారాలకు సంబంధించిన అంశంలో 40 రుణదాత సంస్థల నుంచి సంపూర్ణ అనుమతి లభించకపోవడంతో ఆర్కామ్ తాజా నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గత 18నెలలుగా ఆస్తుల విక్రయం ద్వారా రుణ చెల్లింపులకు ప్రయత్నించినప్పటికీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో రుణ పరిష్కార అంశం ముందుకు సాగలేదని ఆర్కామ్ తెలిపింది. దీంతో జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ)ను ఆశ్రయించనున్నట్లు పేర్కొంది. దీంతో అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇతర గ్రూపు కంపెనీల షేర్లు కూడా పడిపోయాయి. ఇన్వెస్టర్లలో నెలకొన్న ఆందోళన కారణంగా నెలకొన్న అమ్మకాలతో ముఖ్యంగా ఆర్కామ్ షేరు 48 శాతం పతనమైంది. ఒక దశలో54.3 శాతం కుప్పకూలి, 5.30 రూపాయల వద్ద రికార్డు కనిష్టానికి చేరింది. దీంతోపాటు అడాగ్ గ్రూప్లోని రిలయన్స్ కేపిటల్ (12.5శాతం), రిలయన్స్ పవర్ (13శాతం), రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్, రిలయన్స్ నిప్పన్ లైఫ్, రిలయన్స్ నావల్ తదితర కౌంటర్లు భారీ నష్టాలు మూటగట్టుకున్నాయి. -
ఎన్సీఎల్టీలో రుయాలకు చుక్కెదురు
న్యూఢిల్లీ: ఎస్సార్ స్టీల్ రుణ బకాయిలను తీర్చివేస్తామంటూ రుయా కుటుంబం దాఖలు చేసిన పిటిషన్ను జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) అహ్మదాబాద్ బెంచ్ తిరస్కరించింది. ఎస్సార్ స్టీల్ ప్రమోటర్ల ప్రణాళికను ఆమోదించొద్దన్న రుణదాతల అభ్యర్థన చట్టవిరుద్ధం కాదని ఎన్సీఎల్టీ స్పష్టం చేసింది. దీంతో ఎస్సార్ స్టీల్ను కాపాడుకోవాలన్న రుయాల ప్రయత్నాలకు చుక్కెదురు అయింది. అదే సమయంలో ఎస్సార్ స్టీల్ను విక్రయించడం ద్వారా రుణ బకాయిలను తీర్చుకోవాలన్న రుణదాతల ప్రయత్నాలకు ఊతం లభించింది. ఎస్సార్ స్టీల్ కొనుగోలుకు ఆర్సెలర్ మిట్టల్ వేసిన రూ.42,000 కోట్ల బిడ్ను రుణదాతల కమిటీ ఇప్పటికే ఆమోదించడం తెలిసిందే. బ్యాంకులకు రూ.50,800 కోట్ల మేర బకాయిలను కంపెనీ చెల్లించాల్సి ఉండటంతో, వీటిని రాబట్టుకునేందుకు దివాలా పరిష్కార చట్టం కింద చర్యలు చేపట్టింది. రూ.54,389 కోట్లను చెల్లించేందుకు తాము ఆఫర్ ఇచ్చామని, రుణదాతలకు ఇదే అత్యధిక చెల్లింపు ప్రతిపాదన అని ఎస్సార్ స్టీల్ ప్రమోటర్లు ఎన్సీఎల్టీకి తెలిపారు. ‘‘ఐబీసీలో ఇటీవలే ప్రవేశపెట్టిన సెక్షన్ 12ఏ కింద మా ప్రతిపాదన సమర్పించాం. అలాగే, ఇటీవలి సుప్రీంకోర్టు తీర్పు సైతం ఈ సెక్షన్ వర్తిస్తుందని స్పష్టం చేస్తోంది’’ అని ఎస్సార్ స్టీల్ కంపెనీ ప్రతినిధి తెలిపారు. ఎన్సీఎల్టీ పూర్తి తీర్పు కాపీ అందిన తర్వాత తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మరోవైపు ఎన్సీఎల్టీ తీర్పు ఐబీసీ సమగ్రతను కాపాడేలా ఉందని, నిబంధనల ఆధారంగా చట్టం పనిచేస్తుందని భరోసా ఇచ్చినట్టయిందని ఆర్సెలర్ మిట్టల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎస్సార్ స్టీల్ ఇండియా, భారత్కు కూడా ఇది సానుకూల పరిణామమని, ఈ కేసులో సత్వర పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేసింది. -
రీడ్ అండ్ టేలర్ లిక్విడేషన్ నిలిపివేత
ముంబై: ఖరీదైన సూట్లు, జాకెట్లు విక్రయించే రీడ్ అండ్ టేలర్ కంపెనీ లిక్విడేషన్ను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) నిలిపేసింది. రీడ్ అండ్ టేలర్ ఇండియా కంపెనీని నిర్వహిస్తామని, దానిని తమకు అప్పగించాలని ఉద్యోగుల సంఘం చేసిన అభ్యర్థనను ఎన్సీఎల్టీ ముంబై ధర్మాసనం మన్నించింది. దీనికి సంబంధించిన తదుపరి విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది. ఈ కంపెనీ బకాయిలు రూ.4,100 కోట్ల మేర ఉన్నాయని, కానీ కంపెనీ విలువ ప్రస్తుతం రూ.300 కోట్లు మాత్రమేనని, లిక్విడేషన్ చేపడితే రుణ దాతలకేమీ రాదని, ఉద్యోగులు ఉపాధి కోల్పోతారని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ కంపెనీ ఉత్పత్తుల నాణ్యత, అధిక ధరలను దృష్టిలో పెట్టుకొని ఉద్యోగుల సంఘానికి ఒక అవకాశం ఇవ్వాలని నిర్ణయించామని పేర్కొంది. కంపెనీలో మొత్తం 1,200 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. మైసూర్లో ప్లాంట్ ఉంది. ఈ కంపెనీ ఉచ్ఛ స్థితిలో ఉన్నప్పుడు జేమ్స్బాండ్ పాత్రధారి పియర్స్ బ్రాస్నన్, అమితాబ్ బచ్చన్లు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించారు. ఎడెల్వీస్ వ్యాజ్యంతో ఎన్సీఎల్టీకి కస్లివాల్ కుటుంబానికి చెందిన ఎస్ .కుమార్ గ్రూప్ రీడ్ అండ్ టేలర్ ఇండియా కంపెనీని నిర్వహిస్తోంది. ఈ కంపెనీ ఖరీదైన సూట్లు, జాకెట్లు, ట్రౌజర్లు, షర్ట్లు, టి–షర్ట్లను విక్రయిస్తోంది. ఈ కంపెనీ బ్యాంక్లకు, ఇతర ఆర్థిక సంస్థలకు రూ.4,100 కోట్ల మేర బకాయిలు పడటంతో వీటి వసూళ్లకు గాను ఈ కంపెనీకి వ్యతిరేకంగా ఎడెల్వీజ్ ఏఆర్సీ ఎన్సీఎల్టీలో ఒక కేసు వేసింది. ఎనిమిది కంపెనీలు రిజల్యూషన్ ప్రణాళికలను సమర్పించినప్పటికీ, అవేవీ సంతృప్తికరంగా లేకపోవడంతో రుణదాతల కమిటీ లిక్విడేషన్కు సిఫార్సు చేసింది. ఫైన్క్వెస్ట్కే అధిక భారం... రీడ్ అండ్ టేలర్ కంపెనీ నుంచి ఫైన్క్వెస్ట్ ఫైనాన్షియల్ సొల్యూషన్ కంపెనీకి అధికంగా రూ.800 కోట్ల మేర రావలసి ఉంది. యూనియన్ బ్యాంక్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐఎల్అండ్ఎఫ్ఎస్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐడీబీఐ బ్యాంక్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్ తదితర సంస్థలకు ఈ సంస్థ భారీగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. -
రూ. 80 వేల కోట్ల రికవరీ..
న్యూఢిల్లీ: బ్యాంకుల రుణ బకాయిల వసూళ్లలో ఎన్సీఎల్టీ (నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్) పాత్ర కీలకమవుతోందని ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ పేర్కొన్నారు. బ్యాంకర్ల రూ.80 వేల రికవరీకి ఎన్సీఎల్టీ దోహదపడిందని అన్నారు. మార్చి చివరినాటికి మరో రూ.70 వేల కోట్ల రికవరీ జరుగుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అత్యంత విశ్వసనీయత కలిగిన వేదికగా ఎన్సీఎల్టీ అవతరించిందని జైట్లీ ప్రశంసించారు. ‘‘దివాలా కోడ్ – రెండేళ్లు’ అన్న అంశంపై జైట్లీ ఒక ట్వీట్ చేశారు. ఈ ట్వీట్లో ఆయన పేర్కొన్న అంశాల్లో ముఖ్యమైనవి చూస్తే... ► వాణిజ్యానికి సంబంధించి దివాలా సమస్యలను పరిష్కరించలేని క్లిష్ట పరిస్థితులను కాంగ్రెస్ వదిలిపెట్టి వెళ్లింది. అయితే ఈ విషయంలో ఎన్డీఏ ప్రభుత్వం వేగంగా స్పందించింది. మొండి బకాయిల సమస్య పరిష్కారానికి పలు చర్యలు తీసుకుంది. దివాలా చట్టానికి పదునుపెట్టింది. ► 2016 చివర్లో ఎన్సీఎల్టీ కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ కేసులను విచారించడం ప్రారంభించింది. ఇప్పటికి 1,322 కేసుల విచారణను (అడ్మిట్) చేపట్టింది. అడ్మిషన్కు ముందే 4,452 కేసులను పరిష్కరించింది. తద్వారా రూ.2.02 లక్షల కోట్లు పరిష్కారమయినట్లు ఎన్సీఎల్టీ డేటా చెబుతోంది. విచారణా ప్రక్రియ ద్వారా 66 కేసులను పరిష్కరించింది. తద్వారా రూ.80 వేల కోట్ల రికవరీ జరిగింది. 260 కేసుల విషయంలో దివాలా చర్యలకు ఆదేశాలు ఇచ్చింది. ► భూషణ్ పవర్ అండ్ స్టీల్, ఎస్సార్ స్టీల్ ఇండియా వంటి 12 బడా కేసులు విచారణ ప్రక్రియ చివరిదశలో ఉంది. వీటిలో కొన్ని కేసుల పరిష్కారం ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికల్లా మరో రూ.70,000 కోట్లు సమకూరుతాయని భావిస్తున్నాం. ఆయా కేసుల పరిష్కారంలో ఎటువంటి రాజకీయ లేదా ప్రభుత్వ ఒత్తిళ్లు లేవు. ► ఎన్పీఏ అకౌంట్లు తగ్గుతుండడం హర్షణీయం. రుణాల మంజూరు, చెల్లింపుల వ్యవస్థల్లో మార్పులను ఈ పరిణామం సూచిస్తోంది. దివాలా చట్టం– రుణదాత, గ్రహీత మధ్య సంబంధాల్లో కూడా సానుకూల మర్పును సృష్టించింది. ► ఖాయిలా పరిశ్రమల కోసం కాంగ్రెస్ ప్రభుత్వ 1980లో ఖాయిలా పరిశ్రమ కంపెనీల చట్టం తీసుకువచ్చింది. ఇది తీవ్ర వైఫల్యం చెందింది. ఈ చట్టం పలు ఖాయిలా పరిశ్రమలకు రుణదాతల నుంచి రక్షణ కల్పించింది. బ్యాంకింగ్ రుణ బకాయిల వసూళ్లకు డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఏర్పాటయినా, అది అంత ఫలితమివ్వలేదు. ► 2008–2014 మధ్య బ్యాంకుల విచక్షణారహితంగా రుణాలను మంజూరుచేశాయి.వాటిలో ఎక్కువ మొండిబకాయిలుగా మారాయని ఆర్బీఐ రుణ నాణ్యతా సమీక్షలు పేర్కొంటున్నాయి. ► ఆయా అంశాలే ఎన్డీఏ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు కారణమయ్యింది. 2016 మేలో పార్లమెంటు రెండు సభలూ ఐబీసీ (ఇన్సాల్వెన్సీ, బ్యాంక్రప్ట్సీ కోడ్)కి ఆమోదముద్ర వేశాయి. నేను చూసినంతవరకూ పార్లమెంటు ఆమోదించిన సత్వర చర్యల, అత్యంత ప్రయోజనకరమైన ఆర్థిక చట్టం ఇది. -
తాజా మొండి బకాయిలు తగ్గాయ్: ఎస్బీఐ
హైదరాబాద్: తాజా మొండి బకాయిలు తగ్గాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రిటైల్ అండ్ డిజిటల్ బ్యాంకింగ్ విభాగ మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ గుప్తా తెలిపారు. భారీ మొండి బకాయిల ఖాతాలకు సంబంధించి పరిష్కారం కోసం ఎన్సీఎల్టీలో ప్రయత్నాలు చేస్తున్నామని, భవిష్యత్తులో మొండి బకాయిలు తగ్గుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎస్బీఐ హైదరాబాద్ మెయిన్ బ్రాంచ్ 150వ వార్షికోత్సవం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో మొండి బకాయిలు పెరగవు... ఎన్సీఎల్టీకి నివేదించిన భారీ మొండి బకాయిల్లో కొన్ని కేసులు పరిష్కారమయ్యాయని, మరి కొన్ని కేసుల్లో పరిష్కారం తుది దశలో ఉందని ప్రవీణ్ కుమార్ గుప్తా వివరించారు. మొత్తం మీద రానున్న రెండు నెలల్లో ఈ బకాయిల సమస్య ఒక కొలిక్కి రాగలదన్నారు. తాజా మొండి బకాయిలు తగ్గాయంటూ... భవిష్యత్తులో మొండి బకాయిలు పెరిగే సమస్యే లేదని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మహారాష్ట్ర, కర్నాటకల్లో మాత్రమే వ్యవసాయ రంగ రుణాల్లో మొండి బకాయిలు పెరిగాయని, దేశవ్యాప్తంగా ఈ ధోరణి లేదని గుప్తా స్పష్టంచేశారు. పాత డెబిట్ కార్డ్ల స్థానంలో మరింత సురక్షితమైన ఫీచర్లున్న కొత్త డెబిట్ కార్డ్ల జారీ కొనసాగుతోందన్నారు. పాత డెబిట్ కార్డులను మార్చుకోవడానికి ఈ నెల 31 గడువు తేదీ అని, ఇప్పటికే చాలా వరకూ కొత్త కార్డ్లను జారీ చేశామని వివరించారు. -
సత్యం బాటలో ఐఎల్ఎఫ్ఎస్!
ముంబై/న్యూఢిల్లీ: దశాబ్దం కిందటి సత్యం కంప్యూటర్స్ ఉదంతం తరహాలోనే తాజాగా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ను కేంద్ర ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుంది. ప్రస్తుత బోర్డును రద్దు చేసింది. ప్రముఖ బ్యాంకరు ఉదయ్ కొటక్ సారథ్యంలో ఆరుగురు సభ్యులతో కొత్త బోర్డును నియమించింది. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ సంక్షోభం దేశీ మార్కెట్లలో ప్రకంపలను సృష్టిస్తున్న నేపథ్యంలో స్వయంగా రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకుంది. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్, దాని అనుబంధ సంస్థల యాజమాన్య అధికారాలు తమకు అప్పగించాలని, బోర్డును మార్చాలని కోరుతూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో (ఎన్సీఎల్టీ) కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ (ఎంసీఏ) సోమవారం పిటిషన్ వేసింది. ఇందుకు అనుమతులిస్తూ ఎన్సీఎల్టీ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 31కి వాయిదా వేసింది. కేంద్రం లేవనెత్తిన అంశాలపై అక్టోబర్ 15లోగా వివరణనివ్వాలంటూ ఐఎల్ అండ్ ఎఫ్ఎస్కు నోటీసులు ఇచ్చింది. ‘ప్రభుత్వ వాదనలు విన్న తర్వాత.. కంపెనీల చట్టంలోని సెక్షన్ 241 (2), 242లను ప్రయోగించడానికి, ఐఎల్అండ్ఎఫ్ఎస్ కార్యకలాపాలు.. ప్రజా ప్రయోజనాలకు భంగం కలిగించేలా ఉన్నాయని ప్రకటించడానికి తగిన ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని భావిస్తున్నాం‘ అని ఎన్సీఎల్టీ బెంచ్ పేర్కొంది. ఈ సెక్షన్ ప్రకారం.. ఏదైనా కంపెనీ వ్యవహారాలు ప్రజా ప్రయోజనాలకు భంగం కలిగించే విధంగా ఉన్న పక్షంలో ఆ సంస్థ వ్యవహారాలను టేకోవర్ చేసేందుకు ప్రభుత్వం ఎన్సీఎల్టీని ఆశ్రయించవచ్చు. ట్రిబ్యునల్ కూడా తగు ఆదేశాలివ్వవచ్చు. సత్యం కంప్యూటర్స్ కుంభకోణం తర్వాత కేంద్రం స్వయంగా ఒక కంపెనీ బోర్డును తన నియంత్రణలోకి తీసుకోవడం ఇదే తొలిసారి. కుంభకోణం దరిమిలా 2009లో సత్యం బోర్డును అప్పటి ప్రభుత్వం రద్దు చేయడం, ఆ తర్వాత కంపెనీ.. మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చేతికి చేరడం తెలిసిందే. ఎకానమీకి ముప్పు.. కంపెనీ ఆర్థిక స్థిరత్వంపైన, క్యాపిటల్ మార్కెట్లపైన ప్రతికూల ప్రభావం పడుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత బోర్డును, యాజమాన్యాన్ని కొనసాగించడం వల్ల కంపెనీతో పాటు, సంస్థలో సభ్యులకూ ఇబ్బందేనని, ప్రజా ప్రయోజనాలు కూడా దెబ్బతినే అవకాశం ఉందని ఎన్సీఎల్టీ ముందు ఎంసీఏ తమ వాదనలు వినిపించింది. గతంలో తీసుకున్న రుణాలను సరిగ్గా ఉపయోగించుకోవడంలో విఫలం కావడం వల్లే దాదాపు రూ. 1.15 లక్షల కోట్ల అసెట్స్ ఉన్నప్పటికీ.. ఐఎల్అండ్ఎఫ్ఎస్ ప్రస్తుతం రూ. 91,000 కోట్ల మేర రుణాలకు వడ్డీలు కూడా కట్టలేని స్థితిలో ఉందని ఆక్షేపించింది. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ డైరెక్టర్లు తమ బాధ్యతలను నిర్వర్తించడంలో పూర్తిగా విఫలమయ్యారని, కంపెనీ గానీ దివాలా తీస్తే అనేక మ్యూచువల్ ఫండ్స్ పతనమవుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాక ఐఎల్అండ్ఎఫ్ఎస్ వంటి భారీ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థ (ఎన్బీఎఫ్సీ) మూతబడితే... ఆర్థిక మార్కెట్లలో నిధుల కొరత ఏర్పడుతుందని పేర్కొంది. ఈ వ్యవహారం మొత్తం దేశ ఎకానమీపై ప్రతికూల ప్రభావం చూపుతున్నందున పరిస్థితి చక్కదిద్దేందుకు తాము జోక్యం చేసుకోవాల్సి వస్తోందని కేంద్రం పేర్కొంది. గతంలో సత్యం కంప్యూటర్స్ ఉదంతంలోనూ కేంద్ర ప్రభుత్వం టేకోవర్ చేసిన సంగతిని నివేదించింది. ఇప్పటికే కంపెనీ వ్యవహారాలపై సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐవో) విచారణకు ఆదేశించినట్లు తెలిపింది. ఐఎల్అండ్ఎఫ్ఎస్ మరిన్ని రుణాలు డిఫాల్ట్ కాకుండా చూసేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. విశ్వాస పునరుద్ధరణ ముఖ్యం .. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్కు తగినన్ని నిధుల లభ్యత ఉండేలా చూసేందుకు, మరిన్ని డిఫాల్టుల సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇన్ఫ్రా ప్రాజెక్టులు ఎటువంటి అడ్డంకులు లేకుండా పూర్తయ్యేలా చూస్తామని పేర్కొంది. క్యాపిటల్, ఫైనాన్షియల్ మార్కెట్ల స్థిరత్వం కోసం ఐఎల్ అండ్ ఎఫ్ఎస్పై విశ్వాసాన్ని పునరుద్ధరించడం కీలకమని తెలిపింది. సంస్థను గట్టెక్కించేందుకు అసెట్స్ విక్రయం, కొన్ని రుణాల పునర్వ్యవస్థీకరణ, ఇన్వెస్టర్లు.. ఆర్థిక సంస్థలు కొత్తగా మరిన్ని నిధులు సమకూర్చడం తదితర చర్యలు తీసుకోవాలని తెలిపింది. మరిన్ని దివాలా ఉదంతాలను నివారించడానికి ఇవి అత్యవసరమని పేర్కొంది. ఆరుగురు సభ్యులతో కొత్త బోర్డు ఏర్పాటు ఆరుగురు సభ్యుల కొత్త బోర్డుకు నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా కొటక్ మహీంద్రా బ్యాంక్ ఎండీ ఉదయ్ కొటక్ నియమితులయ్యారు. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మాజీ చైర్మన్ జీఎన్ బాజ్పాయ్, ఐసీఐసీఐ బ్యాంక్ చైర్మన్ జీసీ చతుర్వేది, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వినీత్ నయ్యర్, ఐఏఎస్ అధికారిణి మాలినీ శంకర్, సీనియర్ ఆడిటర్ నందకిశోర్లు ఇందులో సభ్యులుగా ఉంటారు. అక్టోబర్ 8న ఈ బోర్డు తొలిసారిగా సమావేశం కానుంది. అక్టోబర్ 31 నాటికల్లా తమ పరిశీలనలు, మార్గదర్శ ప్రణాళికపై నివేదికను ఇవ్వాల్సి ఉంటుంది. కాంగ్రెస్ అవాస్తవాలు ప్రచారం చేస్తోంది: జైట్లీ జాతి విధ్వంసానికి కంకణం కట్టుకున్న కాంగ్రెస్.. ఐఎల్ఎఫ్ఎస్పై తప్పుడు ప్రచారం చేస్తోందని జైట్లీ దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ లాంటి విపరీత ఆలోచనా విధానాలున్నవారే ఐఎల్ఎఫ్ఎస్లో ఆర్థిక సంస్థల పెట్టుబడులను కుంభకోణంగా వర్ణిస్తారని ఎద్దేవా చేశారు. ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను చేపట్టిన ఐఎల్ ఎఫ్ఎస్కు తోడ్పాటునివ్వాలంటూ కేంద్రానికి లేఖ రాసిన కేవీ థామస్ వంటి సీనియర్ కాంగ్రెస్ నాయకుల నుంచి కాసిన్ని వివరాలు తెలుసుకోవాలంటూ రాహుల్ గాంధీకి హితవు పలికారు. తన ఫేవరెట్ కంపెనీ ఐఎల్ఎఫ్ఎస్ దివాలా తియ్యకుండా చూసేందుకు, మోసగాళ్లను కాపాడేందుకు ఎల్ఐసీ డబ్బును ప్రధాని మోదీ దుర్వినియోగం చేస్తున్నారంటూ రాహుల్ గాంధీ చేసిన ట్వీట్పై జైట్లీ ఈ మేరకు స్పందించారు. ‘50.5% వాటాలతో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 30.5% వాటాతో యూటీఐ.. 1987లో ఐఎల్ఎఫ్ఎస్ ఏర్పాటు కుంభకోణమా? 2005లో ఎల్ఐసీ 15%, 2006లో మరో 11.10% వాటాలు కొనడం కూడా కుంభకోణమేనా? 2010లో ఎల్ఐసీ మరో 19.34 లక్షల షేర్లు కొనుగోలు చేసింది. ఈ పెట్టుబడులన్నీ కుంభకోణమే అంటారా‘ అని జైట్లీ ప్రశ్నించారు. -
ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ : సత్యం లాంటి ఆపరేషన్
సాక్షి, ముంబై: ప్రముఖ ఇన్ఫ్రా కంపెనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (ఐఎల్ అండ్ ఎఫ్ఎస్)కు కేంద్ర ప్రభుత్వం సత్యం లాంటి ఆపరేషన్ చేపట్టింది. డిఫాల్టర్గా నమోదైన ఈ సంస్థ బోర్డును కేంద్రం రద్దు చేసింది. మేనేజ్మెంట్ను తన స్వాధీనం చేసుకుంది. ఈ మేరకు నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్(ఎన్సీఎల్టీ) ముంబై బ్రాంచ్ ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది. ప్రస్తుత బోర్డు స్థానంలో తాత్కాలికంగా మరో బోర్డును కేంద్రం ప్రతిపాదించింది. దీనికి నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా కొటక్ మహింద్రా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ ఉదయ్ కొటక్ నియమితులయ్యారు. ముంబై బెంచ్ జడ్జీలు ఎంకే శ్రావత్, రవికుమార్ దురైసమీ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ప్రభుత్వ పిటిషన్ను సమర్దిస్తున్నామని ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ప్రకటించింది. తాజా పరిణామంతో ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ సంస్థ మరో సత్యం ఉదంతం కానుందనే అంచనాలు భారీగా నెలకొన్నాయి. కాగా ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన విషయం తెలిసిందే. ఈ గ్రూప్ మొత్తం బకాయిలు రూ. 90వేల కోట్లు ఉండగా, వీటిలో బ్యాంకులు రుణాలు రూ. 57వేల కోట్ల దాకా ఉన్నాయి. అయితే కంపెనీ పునర్ వ్యవస్థీకరిస్తే తాము రుణాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని వివిధ ఆర్థిక సంస్థలు పేర్కొనడంతో కంపెనీ మేనేజ్మెంట్ను మార్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించి ఈ నిర్ణయం తీసుకుంది. నిపుణులు కూడా ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ సమస్య పరిష్కారానికి సత్యం తరహా పరిష్కారం మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు తమ రుణాలను తీర్చే ప్రణాళికలో ఉన్నట్టు సంస్థ ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ గ్రూపు వైస్ చైర్మన్, ఎండీ హరి శంకర్ శనివారం ప్రకటించారు. ఆర్థిక సంక్షోభంలో ఐఎల్ అండ్ ఎఫ్ఎస్.. తక్షణ మూలధన అవసరాలు తీర్చుకునేందుకు రైట్స్ ఇష్యూ ద్వారా రూ.4,500 కోట్లు సేకరించే ప్రతిపాదనకు సంస్థ మాజీ బోర్డు శనివారం ఆమోదం తెలిపింది. అలాగే తమకు ద్రవ్య మద్దతు ఇవ్వాల్సిందిగా సంస్థ ప్రధాన ప్రమోటర్లు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ, 25.34 శాతం వాటా), ఎస్బీఐను కోరారు. ఈ నేపథ్యంలో సోమవారం ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ షేర్లు 17శాతం పుంజుకున్నాయి. -
మరో ల్యాంకో గ్రూపు కంపెనీపై ఎన్సీఎల్టీలో దివాలా పిటిషన్...
సాక్షి, హైదరాబాద్: ల్యాంకో గ్రూపునకు చెందిన మరో కంపెనీ దివాలా కోసం జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) హైదరాబాద్ బెంచ్లో పిటిషన్ దాఖలైంది. తమకు చెల్లించాల్సిన రుణ బకాయి రూ.786.74 కోట్లను చెల్లించడంలో ల్యాంకో విదర్భ థర్మల్ పవర్ లిమిటెడ్ విఫలమైందని, అందువల్ల ఆ కంపెనీ దివాలా ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై విచారణ జరిపిన ఎన్సీఎల్టీ హైదరాబాద్ బెంచ్ ల్యాంకో విదర్భ థర్మల్ పవర్ లిమిటెడ్కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 5వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు ఎన్సీఎల్టీ సభ్యులు రాతకొండ మురళీ ఉత్తర్వులు జారీ చేశారు. అంతకు ముందు పంజాబ్ నేషనల్ బ్యాంక్ తరఫు న్యాయవాది రాజశేఖర్ రావు సల్వాజీ వాదనలు వినిపిస్తూ, మహారాష్ట్ర, వార్ధా జిల్లా, మాండవలో 1320 మెగావాట్ల బొగ్గు ఆధారిత విద్యుత్ ప్రాజెక్టు కోసం ల్యాంకో విదర్భ థర్మల్ పవర లిమిటెడ్ 2010లో పలు బ్యాంకుల కన్సార్టియం నుంచి మొదట రూ.5549 కోట్ల రుణం తీసుకుందని, ఇందులో పీఎన్బీ వాటా రూ.750 కోట్లని తెలిపారు. ప్రాజెక్టు వ్యయం పెరగడంతో కన్సార్టియం నుంచి ల్యాంకో విదర్భ అదనపు రుణం తీసుకుందని, దీంతో మొత్తం రుణం రూ.9613 కోట్లకు చేరిందన్నారు. అదనపు రుణంతో పీఎన్బీ నుంచి తీసుకున్న అప్పు రూ.1340 కోట్లకు చేరిందని వివరించారు. ఈ రుణానికి ల్యాంకో యజమానులైన ఎల్.మధుసూధన్రావు, ఎల్.రామలక్ష్మమ్మలు వ్యక్తిగత పూచీకత్తులు సమర్పించారని, అలాగే మహరాష్ట్రలో ఉన్న పలు ఆస్తులను తాకట్టు పెట్టారని తెలిపారు. తీసుకున్న రుణాన్ని చెల్లించడంలో ల్యాంకో విదర్భ విలఫమైందని, పలు నోటీసులు పంపినా స్పందించడం లేదన్నారు. కన్సార్టియంకు రూ.4784.77 కోట్లు బకాయి ఉండగా, పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ. 786.74 కోట్ల చెల్లించాల్సి ఉందన్నారు. 2017 నాటికి పూచీకత్తుగా ఉంచిన భూమి, భవనాలు, ప్లాంట్, యంత్రాల విలువ రూ.4083.71 కోట్లుగా విలువ కట్టడం జరిగిందన్నారు. నోటీసులకు స్పందన లేకపోవడంతో ఇక చేసేదేమీ లేక ల్యాంకో విదర్భ థర్మల్ పవర్ లిమిటెడ్ దివాలా ప్రక్రియ నిమిత్తం ఈ పిటిషన్ దాఖలు చేయాల్సి వచ్చిందని రాజశేఖరరావు వివరించారు. తమ బకాయిని రాబట్టుకునేందుకు ల్యాంకో విదర్భ దివాలా ప్రక్రియను ప్రారంభించాలని, ఇందుకోసం దివాలా పరిష్కార నిపుణుడిగా హర్యానాకు చెందిన విజయకుమార్ గార్గ్ను నియమించాలని ఆయన ట్రిబ్యునల్ను కోరారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ట్రిబ్యునల్ సభ్యులు మురళీ ల్యాంకో విదర్భకు నోటీసులు జారీ చేశారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ విచారణను అక్టోబర్ 5కి వాయిదా వేశారు. ల్యాంకో గ్రూపునకు చెందిన కంపెనీల్లో ల్యాంకో ఇన్ఫ్రా, ల్యాంకో బబంధ్, ల్యాంకో తీస్తా హైడ్రో, ల్యాంకో అమర్కంఠక్, ల్యాంకో సోలార్, ల్యాంకో థర్మల్, ల్యాంకో హిల్స్ కంపెనీలు దివాలా చర్యలను ఎదుర్కొంటున్నారు. ఈ ఏడు కంపెనీల్లో ల్యాంక్ ఇన్ఫ్రా మూసివేతకు ఎన్సీఎల్టీ ఆదేశాలిచ్చింది. అలాగే ల్యాంకో తీస్తా హైడ్రో, ల్యాంకో బబంధ్ల దివాలా పరిష్కార ప్రక్రియకు ట్రిబ్యునల్ అనుమతినిచ్చింది. మిగిలిన నాలుగు కంపెనీలపై ఎన్సీఎల్టీలో విచారణ కొనసాగుతోంది. ఈ ఏడు కంపెనీలు కూడా ఆయా బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకుని ఎగవేసినవే కావడం విశేషం. -
సింగ్ బ్రదర్స్ వివాదం న్యూ ట్విస్ట్
సాక్షి, ముంబై: వ్యాపారాన్ని భారీ నష్టాన్ని కలిగిస్తున్నారంటూ సోదరుడిపై ఎన్సీఎల్టీకి ఫిర్యాదు చేసిన శివిందర్ సింగ్ యూ టర్న్ తీసుకున్నారు. సోదరుడు మల్వీందర్ సింగ్పై తన ఫిర్యాదును వెనక్కి తీసుకుంటున్నట్టు తెలిపారు. కుటుంబ పెద్దలు, ఇతర సభ్యుల జోక్యంతో తన సోదరుడు మల్వీందర్పై దాఖలు చేసిన కేసుని ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు గురువారం కోర్టును ఆశ్రయించారు. శుక్రవారం నాడు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) న్యూఢిల్లీ బెంచ్ ముందుకు ఈ కేసు శుక్రవారం విచారణకు రానున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. అన్నపై కేసును వెనక్కి తీసుకుంటున్నట్టు శివిందర్ ప్రకటించారు. అంతేకాదు ఒకవేళ కుటుంబ సభ్యుల మధ్యవర్తిత్వం విఫలమైతే తిరిగి కోర్టును ఆశ్రయించే అవకాశాన్ని కల్పించాల్సిందిగా శివిందర్, అతని భార్య అదితి ఎస్.సింగ్ న్యాయస్థానాన్ని కోరారు. ముఖ్యంగా సింగ్ బ్రదర్స్ తల్లి నిమ్మీ సింగ్ గత కొన్ని రోజులుగా నిద్రాహారాలు మాని, కొడుకులిద్దరితోనూ, వరుసగా సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. కాగా ఔషధసంస్థ ర్యాన్బాక్సీ మాజీ ప్రమోటర్లయిన సింగ్ సోదరుల మధ్య విభేదాలు ఇటీవల భగ్గుమన్నాయి. కుటుంబ వ్యాపారాల్లో అవకతవకలకు పాల్పడు తున్నారంటూ అన్న మల్వీందర్ సింగ్పై సోదరుడు శివీందర్ సింగ్ కోర్టుకెళ్లారు. ఆర్హెచ్సీ హోల్డింగ్, రెలిగేర్, ఫోర్టిస్ సంస్థల నిర్వహణలో అవకతవకలు, అణిచివేత ధోరణులపై మల్వీందర్తో పాటు రెలిగేర్ మాజీ చీఫ్ సునీల్ గోద్వానీలపై శివీందర్ సెప్టెంబర్ 4న ఎన్సీఎల్టీలో కేసు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. -
సింగ్ బ్రదర్స్ మధ్య ముసలం
న్యూఢిల్లీ: రాన్బాక్సీ కుటుంబ వివాదం మరో కీలక మలుపు తిరిగింది. గత కొన్నినెలలుగా సింగ్బ్రదర్స్ మధ్య నెలకొన్న అసంతృప్తి ఇపుడిక కోర్టుకెక్కింది. ఫోర్టిస్ హెల్త్కేర్ ప్రమోటర్, సింగ్ బ్రదర్స్లో ఒకరైన శివిందర్ సింగ్, సోదరుడు మల్వీందర్పై పోరుకు సై అన్నాడు. సోదరుడు, మాజీ రాన్బాక్సీ ప్రమోటర్, స్థాపకుడు మల్వీందర్, రెలిగేర్ మాజీ చీఫ్ సునీల్ గోధ్వానీలను తమ వ్యాపార భాగస్వామిగా తప్పిస్తున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఫిర్యాదు నమోదు చేశారు. ఈ మేరకు శివిందర్ మూడు పేజీల ప్రకటనను విడుదల చేశారు. తన అన్నయ్య మల్వీందర్, గోదాని సంయుక్తంగా తీసుకుంటున్న నిర్ణయాలు, చర్యలతో తమ సంస్థల ప్రయోజనాలతోపాటు, వాటాదారుల ప్రయోజనాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆయన ఆరోపించారు. చాలాకాలంగా ఈ విషయం వ్యక్తిగతంగా తనను బాధిస్తున్నప్పటికీ కుటుంబగౌరవం, ప్రతిష్ట కోసం మౌన ప్రేక్షకుడిలాగా ఉండిపోయానన్నారు. కానీ ఇప్పటికే చాలా ఆలస్యమైందన్న భావనతో ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. ఇకనుంచి తాను స్వత్రంత్రంగా వ్యాపారాన్ని కొనసాగించనున్నట్టు ప్రకటించారు. ఆర్హెచ్సీ హోల్డింగ్, రిలిగేర్, ఫోర్టిస్ పతనం, అక్రమాల నేపథ్యంలో కేసును దాఖలు చేసినట్టు తెలిపారు. అయితే ఈ పరిణామంపై స్పందించేందుకు మాల్వీందర్ సింగ్ నిరాకరించారు. -
మెగా మెర్జర్ పూర్తి : ఎయిర్టెల్ ఔట్
సాక్షి,ముంబై: దేశీయ అతిపెద్ద టెలికాం సంస్థ భారతి ఎయిర్టెల్కు మరో భారీ షాక్ తగిలింది. ఆదిత్య బిర్లా గ్రూప్ ఐడియా సెల్యులార్, వొడాఫోన్ ఇండియా విలీనం తరువాత నెం.1 స్థానం నుంచి ఎయిర్టెల్ కిందికి పడిపోయింది. వోడాఫోన్, ఐడియా మెగా మెర్జర్లో కీలకమైన ఆఖరి అంకమైన ఎన్సీఎల్టీ ఆమోదం కూడా లభించడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఈ భారీ మెర్జర్ తరువాత ఆవిష్కరించిన కొత్త సంస్థ వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ ఈ స్థానంలోకి దూసుకు వచ్చింది. 32.2శాతం వాటా, 408 మిలియన్ల వినియోగదారులతో అగ్రగామి సంస్థగా నిలిచింది. దీంతో 15ఏళ్లపాటు ధరిస్తూ వస్తున్న మార్కెట్ లీడర్ కిరీటాన్ని, నెం.1 స్థానాన్ని ఎయిర్టెల్ కోల్పోయింది. కొత్త ఛైర్మన్ , కొత్త బోర్డు ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార్ మంగళం బిర్లా ఈ విలీన సంస్థకు ఛైర్మన్గా ఉంటారు. అలాగే 12 మంది డైరెక్టర్లతో (6 స్వతంత్ర డైరెక్టర్లు సహా) కొత్త బోర్డు ఏర్పాటు. అలాగే సీఈవోగా బాలేష్ శర్మ నియామకం. ఈ మేరకు ఇరు సంస్థలు శుక్రవారం ఒక అధికారిక ప్రకటన విడుదల చేశాయి. దీంతో దేశవ్యాప్తంగా 15,000 దుకాణాలను, 1.7 మిలియన్ల రిటైల్ టచ్ పాయింట్లు వొడాఫోన్ ఐడియా సొంతం. దేశంలో అతిపెద్ద సస్థగా అవతరించి చరిత్ర సృష్టించామని చైర్మన్ కుమార మంగళం వ్యాఖ్యానించారు. పరిణామం చెందుతున్న డిజిటల్, కనెక్టివిటీ అవసరాలను నెరవేర్చడానికి కొత్త ఉత్పాదనలు, సేవలతో తమ రిటైల్, వాణిజ్య కస్టమర్లకు అద్భుతమైన అనుభవాన్ని అందించనున్నామని కొత్త సంస్థ సీఈవో బాలేష్ శర్మ చెప్పారు. భారతదేశం అంతటా తొమ్మిది సర్కిళ్లలో కొత్త సంస్థ మొదటి స్థానంలో ఉందని వెల్లడించారు. అలాగే ఐడియా సెల్యులార్ మేనేజింగ్ డైరెక్టర్ పదవినుంచి హిమాంశు కపానియా నేడు(ఆగస్టు 31, 2018) వైదొలగనున్నారు. కానీ కొత్త కంపెనీలో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉంటారు. మరోవైపు రెండవ అతిపెద్ద సంస్థగా ఉన్న వొడాఫోన్ జూలైలో రికార్డు స్థాయిలో ఏకంగా 6 లక్షలకు పైగా కొత్త కస్టమర్లను ఖాతాదారులుగా చేర్చుకుంది. ప్రత్యర్థి కంపెనీలతో పోలిస్తే ఇదే అత్యధికం. మార్కెట్ లీడర్ భారతీ ఎయిర్టెల్ 3.13 లక్షల మందిని ఖాతాదారులుగా చేర్చుకుంది. జూలైలో వొడాఫోన్ ఇండియా 609,054 మందిని ఖాతాదారులుగా చేర్చుకోగా, భారతీ ఎయిర్టెల్ 313,284 మందిని చేర్చుకున్నట్టు సెల్యూలార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) వెల్లడించింది. కొత్త వినియోగదారుల చేరికతో వోడాఫోన్ మొత్తం సబ్స్క్రైబర్ల సంఖ్య 1004.08 మిలియన్లకు చేరుకుందని తెలిపింది. అయితే ఐడియా సెల్యులార్ వినియోగదారుల బేస్ కేవలం 5,489 మాత్రమే పెరిగింది. -
చిక్కుల్లో ల్యాంకో బబంధ్ పవర్...
సాక్షి, హైదరాబాద్: ల్యాంకో గ్రూపునకు చెందిన మరో కంపెనీ చిక్కుల్లో పడింది. ల్యాంకో బబంధ్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ దివాలా ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ ఐసీఐసీఐ బ్యాంకు దాఖలు చేసిన పిటిషన్పై హైదరాబాద్లోని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) సానుకూలంగా స్పందించింది. ఐసీఐసీఐ బ్యాంకు నుంచి తీసుకున్న రూ.1428 కోట్లను తిరిగి చెల్లించడంలో విఫలమైనందున ల్యాంకో బబంధ్ కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియకు (సీఐఆర్పీ) అనుమతినిచ్చింది. ఇందులో భాగంగా తాత్కాలిక దివాలా పరిష్కార ప్రక్రియ నిపుణుడిగా (ఐఆర్పీ) ముంబాయికి చెందిన యు.బాలకృష్ణ భట్ను నియమించింది. ల్యాంకో బబంధ్ ఆస్తుల క్రయ, విక్రయాలపై నిషేధం (మారటోరియం) విధించింది కూడా. ఇప్పటికే ఏవైనా ఆస్తులను తాకట్టుపెట్టి ఉంటే వాటిని విక్రయించడం గానీ, తాకట్టు పెట్టుకున్న వారు ఆ ఆస్తులను సర్ఫేసీ చట్టం కింద అమ్మడం గానీ చేయరాదని స్పష్టంచేసింది. దివాలా ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఈ మారటోరియం కొనసాగుతుందని స్పష్టం చేసింది. దివాలా పరిష్కార ప్రక్రియకు సంబంధించిన వివరాలతో పత్రికా ప్రకటన జారీ చేయాలని ఐసీఐసీఐ బ్యాంక్ను ఆదేశించింది. ఈ మేరకు ఎన్సీఎల్టీ జుడీషియల్ సభ్యులు బిక్కి రవీంద్రబాబు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
సైరస్ మిస్త్రీకి స్వల్ప ఊరట
న్యూఢిల్లీ: కార్పొరేట్ దిగ్గజం టాటా సన్స్, మిస్త్రీ వివాదంలో సైరస్ మిస్త్రీకి పాక్షిక ఉపశమనం లభించింది. టాటా సన్స్ సంస్థలో ఆయన వాటాలను విక్రయాలకు నేషనల్ కంపెనీ లా అప్పెలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీఏటీ) అడ్డకట్ట వేసింది. తన వాటాలను విక్రయించాల్సింది టాటాసన్స్ ఒత్తిడి తేలేదని కోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ ఎస్జే ముఖోపాధ్యాయ నేతృత్వంలోని ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ శుక్రవారం ఈ ఆదేశాలు జారీ చేసింది. అనంతరం తుది విచారణను సెప్టెంబర్ 24కు వాయిదా వేసింది. టాటా సన్స్ను ప్రైవేటు కంపెనీగా మార్పు అంశంపై ఈ కేసులో తుది వాదనల తరువాత నిర్ణయిస్తామని తెలిపింది. టాటా సన్స్ ఛైర్మన్ పదవి నుంచి తొలగింపునకు వ్యతిరేకంగా మిస్త్రీ దాఖలు చేసిన ఎన్సీఎల్టీఏటీ స్వీకరించింది. ఛైర్మన్ గా సైరస్ మిస్త్రీ తొలగింపు సరైనదేనని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్ ఇటీవల తీర్పు ఇచ్చింది. ఎన్ సీఎల్ టీలో న్యాయమూర్తులు ప్రకాశ్ కుమార్, సేనపతిల బెంచ్ తీర్పును సైరస్ సవాల్ చేశారు. టాటా సన్స్ గత 101 సంవత్సరాలుగా 1917 నుంచీ టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా ఉందని టాటాసన్స్ న్యాయవాది వాదించారు. కాగా గత ఏడాది టాటా సన్స్ ఛైర్మన్ పదవినుంచి ఉద్వాసనకు గురైన అనంతరం టాటా గ్రూప్లో మెజారిటీ స్టాక్ హోల్డర్స్ మిస్త్రీ కుటుంబం షాపూర్జీ, పల్లోంజి గ్రూప్ వాటా కొనుగోలు దారుల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. -
టాటాపై వార్.. మిస్త్రీకి షాక్!
ముంబై: ‘టాటా సన్స్’, దాని అధిపతి రతన్ టాటాలకు వ్యతిరేకంగా ఒంటరి పోరాటం చేసిన సైరస్ పల్లోంజి మిస్త్రీకి ఎన్సీఎల్టీ ముందు ఓటమి ఎదురైంది. కార్పొరేట్ గవర్నెన్స్కు సంబంధించిన ఈ కేసులో టాటాల మాటే చెల్లుబాటైంది. టాటా సన్స్ (టాటా గ్రూపు) చైర్మన్గా 2016 అక్టోబర్లో తనను తప్పించడాన్ని సవాల్ చేస్తూ మిస్త్రీ దాఖలు చేసిన పిటిషన్ను జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) సోమవారం కొట్టివేసింది. ముంబైలోని ఎన్సీఎల్టీ స్పెషల్ బెంచ్ టాటా గ్రూపు వాదనలకే ఓటేసింది. ‘‘ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ను తొలగించే అధికారం టాటా సన్స్ బోర్డు డైరెక్టర్లకు ఉంటుంది. బోర్డులో అత్యధికులు మిస్త్రీపై నమ్మకం కోల్పోవడంతోనే ఆయన్ను తొలగించారు. అంతేకానీ, రతన్టాటాకో, సూనవాలాకో అసౌకర్యం కలిగించినందుకు కాదు. టాటా సంస్థలకు సంబంధించిన కీలక సమచారాన్ని మిస్త్రీ ఆదాయపన్ను విభాగానికి పంపించారు. సమాచారాన్ని ప్రెస్కు లీక్ చేశారు. ఆ తర్వాత కంపెనీ, బోర్డు సభ్యులకు వ్యతిరేకంగా ప్రజల ముందుకు వచ్చారు. అందుకే బోర్డు ఆయన్ను డైరెక్టర్గా తొలగించింది’’ అని బెంచ్ తన తీర్పులో వివరించింది. మిస్త్రీ వాదనలు తిరస్కరణ ‘‘రతన్టాటా, సూనవాలా జోక్యం చేసుకున్నారని లేదా వారి ప్రవర్తన కంపెనీ ప్రయోజనాల పట్ల పక్షపాతంగా ఉందన్న వాదనల్లో వాస్తవం లేదని గుర్తించాం. ఈ నేపథ్యంలో మిస్త్రీ తొలగింపుపై కంపెనీల చట్టంలోని సెక్షన్ 241 కింద చర్యలకు అవకాశం లేదు’’ అని ఎన్సీఎల్టీ బెంచ్ తన తీర్పులో స్పష్టం చేసింది. టాటా సన్స్ బోర్డు, రతన్టాటా తప్పుడు విధానాలు, మైనారిటీ షేర్హోల్డర్లను అణచివేస్తున్నారంటూ సైరస్ మిస్త్రీ తన పిటిషన్లో పేర్కొన్న ఆరోపణలను ఎన్సీఎల్టీ తిరస్కరించింది. ఎయిర్ఏషియా, నానోకు సంబంధించిన వ్యవహారాలు, కార్పొరేట్ పరిపాలన ఉల్లంఘనల విషయంలోనూ మిస్త్రీ ఆరోపణలను తోసిపుచ్చింది. మిస్త్రీ ఆరోపణలకు ఏ మాత్రం యోగ్యత లేదని ఎన్సీఎల్టీ స్పష్టం చేస్తూ, కంపెనీల చట్టం 2013కు అనుగుణంగానే టాటా సన్స్ బోర్డు వ్యవహరించిందని తేల్చి చెప్పింది. ఇవీ... కేసు పూర్వాపరాలు ♦ 2012లో టాటా సన్స్కు ఆరో చైర్మన్గా వచ్చిన సైరస్ మిస్త్రీని అనూహ్యంగా ఆ పదవి నుంచి తప్పిస్తూ బోర్డు 2016 అక్టోబర్ 24న నిర్ణయాన్ని ప్రకటించింది. ♦ 016 డిసెంబర్ 20న మిస్త్రీ తన కుటుంబ కంపెనీలైన సైరస్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేటు లిమిటెడ్, స్టెర్లింగ్ ఇన్వెస్ట్మెంట్ కార్ప్ తరఫున టాటా సన్స్, రతన్ టాటా, ఇతర బోర్డు సభ్యులకు వ్యతిరేకంగా ఎన్సీఎల్టీలో పిటిషన్లు వేశారు. ♦ చైర్మన్గా తన తొలగింపు కంపెనీల చట్ట ప్రకారం లేదని, టాటా సన్స్లో పాలన దుర్వినియోగం జరుగుతోందని మిస్త్రీ ప్రధానంగా వాదించారు. రతన్ టాటాతోపాటు మరో టాటా ట్రస్ట్రీ అయిన సూనవాలా గ్రూపు వ్యవహారాల్లో తరచుగా జోక్యం చేసుకుంటూ షాడో డైరెక్టర్లుగా వ్యవహరించారని ఆరోపించారు. ♦ 2017 ఫిబ్రవరి 6న టాటా సన్స్ బోర్డు డైరెక్టర్గానూ మిస్త్రీ తొలగింపునకు గురయ్యారు. ♦ మిస్త్రీ వాదనల్లో వాస్తవం లేదని, ఆయన తొలగింపు చట్ట ప్రకారమే జరిగిందని తాజాగా ఎన్సీఎల్టీ స్పష్టం చేసింది. ♦ టాటా సన్స్లో షాపూర్జీ పల్లోంజీ మిస్త్రీ కుటుంబానికి 18.34 శాతం వాటా ఉంది. పోరు బాటే: మిస్త్రీ ఎన్సీఎల్టీ తీర్పు నిరాశపరిచిందని, అంతేకానీ ఆశ్చర్యపరచలేదని మిస్త్రీ కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. ‘‘ఉత్తమ పాలన కోసం, టాటా సన్స్లో మెజారిటీ పేరిట జరుగుతున్న ఉద్దేశపూర్వక దౌర్జన్య పాలన నుంచి మైనారిటీ వాటాదారుల ప్రయోజనాల్ని రక్షించడానికి పోరాటం కొనసాగుతుంది’’ అని పేర్కొంది. ఈ ప్రయాణంలో ఎంత కష్టమైనా ఇబ్బంది లేదని, టాటా గ్రూపును వినాశకారుల నుంచి రక్షించడమే తమ బాధ్యతని మిస్త్రీ పేర్కొన్నారు. స్వాగతించిన రతన్ టాటా ఎన్సీఎల్టీ తీర్పును టాటా గ్రూపు గౌరవ చైర్మన్ రతన్టాటా స్వాగతించారు. 2016 అక్టోబర్లో టాటా సన్స్ తీసుకున్న నిర్ణయం న్యాయసమ్మతమేనని ఎన్సీఎల్టీ స్పష్టం చేసిందన్నారు. మన న్యాయవ్యవస్థలోని బలాన్ని, సూత్రాలను ఈ తీర్పు ప్రతిఫలించిందని, దేశం పట్ల మనం గర్వపడేలా చేసిందని వ్యాఖ్యానించారు. టాటా గ్రూపు చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ స్పందిస్తూ... టాటా సన్స్, దాని పరిధిలోని ఆపరేటింగ్ కంపెనీలు పారదర్శకంగా, వాటాదారుల ఉత్తమ ప్రయోజనాల కోణంలో వ్యవహరించాయని ఎన్సీఎల్టీ తీర్పు ధ్రువీకరించిందన్నారు. బోర్డు రూమ్ యుద్ధాలు.. న్యూఢిల్లీ: టాటా గ్రూప్, సైరస్ మిస్త్రీల మధ్య వివాదంతో కంపెనీలపై ఆధిపత్యం కోసం బోర్డు రూమ్ వేదికగా జరిగే వ్యూహాలు, యుద్ధాలు మరోసారి తెరపైకి వచ్చాయి. టాటా గ్రూప్ అధినేత రతన్ టాటా కూడా స్వయంగా ఇలాంటివి ఎదుర్కొన్నారు. 1990లలో గ్రూప్ పగ్గాలు చేతికొచ్చినప్పుడు అప్పటికే స్థిరపడిపోయిన దిగ్గజాలు రూసీ మోదీ, దర్బారీ సేఠ్, అజిత్ కేర్కర్, ఏహెచ్ టొబాకోవాలా వంటి హేమా హేమీలను రతన్ టాటా ఎదుర్కొని నిలవాల్సి వచ్చింది. రిలయన్స్ నుంచి ఇన్ఫోసిస్ దాకా పలు దిగ్గజ సంస్థల్లోనూ ఇలాంటి బోర్డు రూమ్ యుద్ధాలు చోటుచేసుకున్నాయి. అంబానీ వర్సెస్ అంబానీ.. రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీ మరణానంతరం 2002లో ఆయన ఇద్దరు కుమారులు ముకేశ్, అనిల్ మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. గ్రూప్ యాజమాన్య అం శంపై విభేదాలు ఉన్న మాట వాస్తవమేనంటూ పెద్ద కుమారుడు ముకేశ్ 2004 నవంబర్లో ఒక టీవీ చానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అంగీకరించడం వీటికి ఊతమిచ్చింది. ఆ తర్వాత మీడియా మాధ్యమంగా ఇరు వర్గాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల యుద్ధం జరిగింది. చివరికి 2005 జూన్లో గ్రూప్ అసెట్స్ విభజన ద్వారా సోదరులిద్దరూ సెటిల్మెంట్ చేసుకున్నారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు వర్సెస్ బోర్డు దేశీ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ గతేడాది వివాదాల్లో చిక్కుకుంది. కార్పొరేట్ గవర్నెన్స్ లోపించిందంటూ సంస్థ సహ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి, నీలేకని, క్రిస్ గోపాలకృష్ణన్లు ఆందోళన వ్యక్తం చేయడంతో బోర్డుకు, వ్యవస్థాపకులకు మధ్య వార్ మొదలైంది. మాజీ ఉద్యోగులు రాజీవ్ బన్సల్, డేవిడ్ కెనెడీలకు భారీ వీడ్కోలు ప్యాకేజీనివ్వడం, అప్పటి సీఈవో విశాల్ సిక్కాకు భారీగా జీతభత్యాలు పెంచడం, పనయా సంస్థ కొనుగోలుపై వ్యవస్థాపకులు ప్రశ్నలు లేవనెత్తారు. చివరికి సిక్కా గతేడాది ఆగస్టులో రాజీనామా చేశారు. యస్ బ్యాంక్: కపూర్ వర్సెస్ కపూర్ 2008 ముంబై టెర్రరిస్టు దాడుల్లో బ్యాంకు సహ వ్యవస్థాపకుడు అశోక్ కపూర్ మరణించారు. ఆ తర్వాత కంపెనీ బోర్డులో డైరెక్టర్ నియామకం విషయంలో అశోక్ కపూర్ కుటుంబం, మరో సహ వ్యవస్థాపకుడు రాణా కపూర్ కుటుంబాల మధ్య వివాదం తలెత్తింది. అశోక్ సతీమణి మధు కపూర్.. తమ కుమార్తె షగున్ కపూర్ గోగియాను డైరెక్టర్గా నియమించాలనుకున్నారు. కానీ యస్ బ్యాంక్ బోర్డు దీన్ని తిరస్కరించింది. సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత 2015 జూన్లో మధు కపూర్ కుటుంబానికి అనుకూలంగా కోర్టు తీర్పునిచ్చింది. -
రతన్ టాటాకు ఊరట
ముంబై : టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీ తొలగింపు వ్యవహారంలో రతన్ టాటాకు ఊరట లభించింది. తనను చైర్మన్ పదవి నుంచి అర్ధంతరంగా తొలగించారంటూ మిస్త్రీ టాటా గ్రూప్పై న్యాయ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆయన నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్(ఎన్సీఎల్టీ)ని ఆశ్రయించారు. తన కుటుంబానికి టాటా గ్రూప్లో 18.4 శాతం వాటాలున్నట్టు ఆయన పేర్కొన్నారు. రతన్ టాటా, టాటా సన్స్ బోర్డ్ మైనార్టీ షేర్ హోల్డర్స్ హక్కులను కాలరాస్తున్నారంటూ ఆయన మరో అంశాన్ని కూడా తన పిటిషన్లో పొందుపర్చాడు. దీనిపై విచారణ చేపట్టిన ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ మిస్త్రీ అభ్యర్థనను తొసిపుచ్చుతు సోమవారం తీర్పు వెలువరించింది. అలాగే రతన్ టాటాకు ఈ వ్యవహారంలో క్లీన్ చీట్నిచ్చింది. ఎగ్జిక్యూటివ్ చైర్మన్ను తొలగించడానికి బోర్డ్ ఆఫ్ డైరక్టర్స్కు తగిన అధికారాలు ఉన్నాయని ట్రిబ్యూనల్ తెలిపింది. బోర్డ్ మెంబర్స్ మిస్త్రీపై నమ్మకం కొల్పోవడం వల్లే పదవి నుంచి తొలగించారని ట్రిబ్యూనల్ తన తీర్పులో పేర్కొంది. మిస్త్రీ లెవనెత్తిన వాదనలో చెప్పుకోదగ్గ అంశాలు లేవని వెల్లడించిది. ప్రస్తుత కాలంలో యాజమాన్యాలు, వాటా దారులకు జవాబుదారీ తనంగా ఉండాలని ట్రిబ్యూనల్ అభిప్రాయపడింది. 2016 అక్టోబర్లో టాటా సన్స్ బోర్డ్ మెంబర్స్ మిస్త్రీని చైర్మన్ బాధ్యతల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వారి నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆయన 2016 డిసెంబర్లో ఎన్సీఎల్టీలో పిటిషన్ దాఖలు చేశారు. -
ఎన్సీఎల్టీ కేసుల నుంచి రూ. 3,000 కోట్ల రికవరీ
కోల్కతా: జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)కి సిఫార్సు చేసిన పలు మొండి ఖాతా కేసుల నుంచి దాదాపు రూ. 3,000 కోట్లు రికవర్ కాగలవని ఆశిస్తున్నట్లు ప్రభుత్వ రంగ యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) ఎండీ పవన్ బజాజ్ తెలిపారు. ఇప్పటిదాకా 40 కేసులను ఎన్సీఎల్టీకి సిఫార్సు చేశామని, దాదాపు రూ. 580 కోట్లు రికవర్ అయ్యిందని బ్యాంక్ వార్షిక సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన వివరించారు. ప్రస్తుతం ఎన్సీఎల్టీ వద్ద ఉన్న కేసులన్నీ.. సెటిల్మెంట్ తుదిదశలో ఉన్నాయని బజాజ్ చెప్పారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి యూబీఐ స్థూల నిరర్ధక ఆస్తుల (జీఎన్పీఏ) పరిమాణం 24 శాతంగా ఉందని తెలిపారు. కరెంటు అకౌంటు, సేవింగ్స్ అకౌంటు నిష్పత్తి అధికంగానే ఉన్న నేపథ్యంలో ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తగినంత స్థాయిలో లిక్విడిటీ ఉందని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో యూబీఐ రూ. 220 కోట్ల నికర నష్టం నమోదు చేసిందని, వచ్చే ఏడాది మార్చి ఆఖరు నాటికి మళ్లీ లాభాల్లోకి మళ్లగలదని ఆయన వివరించారు. రూ.1,500 కోట్లు సమీకరిస్తాం న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.1,500 కోట్ల నిధులు సమీకరించనున్నది. ఒకటి లేదా అంతకు మించిన విడతల్లో ఈక్విటీ షేర్ల జారీ ద్వారా ఈ పెట్టుబడులు సమీకరిస్తామని యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. శుక్రవారం జరిగిన వార్షిక సాధారణ సమావేశంలో వాటాదారులు ఈ మేరకు తమ ఆమోదాన్ని తెలిపారని బ్యాంక్ పేర్కొంది. ప్రభుత్వం ఇచ్చే నిధులకు ఇది అదనమని వివరించింది. ఈ పెట్టుబడుల వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్ 0.3 శాతం నష్టంతో రూ.11.05 వద్ద ముగిసింది. -
ఎస్సార్ స్టీల్కు రూ.37 వేల కోట్ల ఆఫర్
న్యూఢిల్లీ: ఎస్సార్ స్టీల్కు రెండో దశ బిడ్డింగ్లో రూ.37,000 కోట్ల కంటే ఎక్కువే ఆఫర్ చేసినట్టు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్కు (ఎన్సీఎల్టీ) రష్యాకు చెందిన న్యుమెటల్ తెలియజేసింది. మరోవంక మొదటి దశలో బిడ్డింగ్ వేసిన ఏకైక కంపెనీ ఆర్సెలర్ మిట్టల్... రెండో దశ బిడ్డింగ్ను వ్యతిరేకించడంతో పాటు మొదటి దశ బిడ్లనే పరిశీలించాలని కోరింది. దీంతో ఎన్సీఎల్టీ ముందు న్యుమెటల్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి హాజరై రెండో దశ బిడ్డింగ్ వల్ల రుణదాతలకు అదనపు విలువ సమకూరుతుందని చెప్పారు. ఎస్సార్ స్టీల్ బ్యాంకులకు రూ.49 వేల కోట్లు బకాయి పడడంతో కంపెనీని వేలం వేస్తున్న విషయం తెలిసిందే. ఎస్సార్ స్టీల్ వేలం వ్యవహారాలు చూస్తున్న పరిష్కార నిపుణుడు రెండో దశ బిడ్డింగ్ను తెరవాలని, తాము రూ.37,000 కోట్ల కంటే ఎక్కువే ఆఫర్ చేశామని రోహత్గి తెలిపారు. రెండో దశలో అటు ఆర్సెలర్ మిట్టల్తో పాటు, న్యుమెటల్ బిడ్ను దాఖలు చేసింది. న్యుమెటల్లో రుయాలకు చెందిన ఆరోరా ట్రస్ట్కు 25 శాతం వాటా ఉంది. మరోవైపు రుణాలను ఎగవేసిన ఉత్తమ్ గాల్వాలో ఆర్సెలర్ మిట్టల్కు వాటా ఉండటం ప్రతికూలంగా మారింది. అయితే, తాము అనర్హతను తొలగించుకునేందుకు ఉత్తమ్గాల్వా బకాయిలను తీర్చేసేందుకు రూ.7,000 కోట్లను ఎస్క్రో ఖాతాలో జము చేసినట్టు ఆర్సెలర్ మిట్టల్ తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి తెలిపారు. దీంతో విచారణను ఎన్సీఎల్టీ బెంచ్ ఈ నెల 22కు వాయిదా వేసింది. -
ఎన్సీఎల్టీ సభ్యుడిగా రాతకొండ మురళి
సాక్షి, హైదరాబాద్: జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) హైదరాబాద్ సభ్యుడిగా రాతకొండ మురళి నియమితులయ్యారు. అంతకుముందు ఆయన ఎన్సీఎల్టీ, బెంగళూరు సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. మురళిని హైదరాబాద్కు బదిలీ చేసి, ఇక్కడ ఎన్సీఎల్టీ సభ్యుడిగా ఉన్న విత్తనాల రాజేశ్వరరావును బెంగళూరుకు బదిలీ చేస్తూ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం ఉదయం హైదరాబాద్ ఎన్సీఎల్టీ సభ్యుడిగా మురళి బాధ్యతలు చేపట్టనున్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలోని బిసెంట్ థియోసాఫికల్ కాలేజీలో మురళి బీఏ పూర్తి చేశారు. ఆయన తాత, తండ్రి కూడా న్యాయవాదులే. ఎస్వీ యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ డిగ్రీ పొందిన మురళి.. చిత్తూరు జిల్లా కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 1987లో జ్యుడీషియల్ సర్వీసులోకి ప్రవేశించారు. వివిధ హోదాల్లో ఉభయ రాష్ట్రాల్లో పనిచేశారు. 2015లో కర్నూలు జిల్లా జడ్జిగా పదవీ విరమణ చేశారు. -
‘ఈస్ట్కోస్ట్’ దివాలా ప్రక్రియ
సాక్షి, హైదరాబాద్ : పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలకు దాదాపు రూ.2,323 కోట్ల రుణాలను చెల్లించడంలో విఫలమైనందుకు ఈస్ట్కోస్ట్ ఎనర్జీ లిమిటెడ్ దివాలా ప్రక్రియకు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ), హైదరాబాద్ అనుమతినిచ్చింది. దివాలా పరిష్కారదారు (ఐఆర్పీ)గా దేవేంద్రప్రసాద్ను నియమించింది. ఆస్తుల విక్రయం, బదలాయింపు, తాకట్టు చేయరాదని సంస్థను ఆదేశించింది. ‘‘దివాలా ప్రక్రియ ప్రారంభమైనట్టు బహిరంగ ప్రకటన ఇవ్వండి. ఇన్సాల్వెన్సీ, బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐ) సైట్లో ఉంచడంతో పాటు మీడియా ద్వారా బహిరంగ ప్రకటనలివ్వండి. రుణదాతలతో కమిటీ వేసి కంపెనీ ఆర్థిక స్థితిగతులను తెలుసుకోండి’’అని ఐఆర్పీని ఆదేశించింది. ఆయనకు సహకరించాలని ఈస్ట్కోస్ట్ ప్రమోటర్లు, అధికారులను ఆదేశించింది. ఎన్సీఎల్టీ సభ్యుడు బిక్కి రవీంద్రబాబు మూడు రోజుల క్రితం ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం కాకరపల్లిలో 1,320 మెగావాట్ల బొగ్గు ఆధారిత విద్యుత్కేంద్రం ఏర్పాటుకు ఎస్బీఐ, పీఎఫ్సీల నుంచి ఈస్ట్కోస్ట్ ఎనర్జీ భారీగా రుణం తీసుకుంది. ఎస్బీఐకి రూ.952 కోట్లు, పీఎఫ్సీకి గత డిసెంబర్ 31 నాటికి రూ.1,371 కోట్ల బకాయి ఉంది. ఏళ్లు గడుస్తున్నా రుణం ఇంకా పూర్తిగా చెల్లించలేదని ఎస్బీఐ తరఫు న్యాయవాది వి.కె.సాజిత్ చెప్పారు. బకాయిల చెల్లింపునకు సిద్ధంగా ఉన్నామని, కొంత గడువు కావాలని ఈస్ట్కోస్ట్ తరఫు న్యాయవాదులు కోరగా ట్రిబ్యునల్ సభ్యుడు తోసిపుచ్చారు. -
అటెన్షన్ ఐడియా యూజర్స్..
సాక్షి, న్యూఢిల్లీ: టెలికాం రంగంలో వొడాఫోన్ -ఐడియా మెగా విలీనానికి మరో కీలక ముందడుగు పడింది. తాజాగా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆమోదం తెలిపిందని ఐడియా సెల్యులార్ శుక్రవారం తెలిపింది. ఇక ఫైనల్గా రెండు కంపెనీలకు టెలికామ్ విభాగం నుంచి తుది ఆమోదం రావాల్సి ఉంది. దీంతో ఈ డీల్ అమల్లోకి వస్తుంది. టెలికాం రంగలోకి దూసుకొచ్చిన రిలయన్స్జియో పోటీని తట్టుకునే వ్యూహంలో భాగంగా ఈ మెగాడీల్కు పునాది పడింది. గత ఏడాది మార్చిలో బ్రిటన్ టెలికం దిగ్గజం వొడాఫోన్ గ్రూపునకు చెందిన భారతీయ విభాగం..ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన ఐడియా సెల్యులార్తో విలీనం కాబోతున్నట్టు వెల్లడించాయి. 23 బిలియన్ డాలర్ల విలువైన, 35 శాతం మార్కెట్ వాటాతో ఈ అతిపెద్ద విలీనానికి ఇరు సంస్థలు అంగీకరించాయి. అటు అక్టోబర్లో ఐడియా వాటాదారులు వొడాఫోన్తో విలీనానికి ఆమోదం తెలిపారు. ఇప్పటికే మార్కెట్ రెగ్యులేటరీ సెబీ, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదం లభించిన సంగతి తెలిసిందే. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలి కమ్యూనికేషన్స్ (డాట్) ఇచ్చే తుది ఆమెదంతో ఏడాది జూన్ నాటికి ఈ పక్రియ పూర్తి చేయాలని రెండు కంపెనీలు యోచిస్తున్నాయి. ఈ ఉమ్మడి సంస్థలో బ్రిటిష్ కంపెనీ 45.1 శాతం వాటా, ఐడియా పేరెంట్ సంస్థ ఆదిత్య బిర్లా గ్రూపు 26 శాతం వాటా కలిగి ఉంటుంది. మిగిలిన 28.9 శాతం ఇతర వాటాదారుల సొంతం. ప్రస్తుతం భారతదేశంలో నంబర్ 2 , 3 స్థానాల్లో కొనసాగుతున్న వొడాఫోన్ ఇండియా, ఐడియాల జాయింట్ వెంచర్ సంస్థ ఆవిష్కారంతో ప్రపంచ రెండవ అతిపెద్ద టెలికాం భారతి ఎయిర్టెల్కు గట్టిపోటీగా నిలుస్తుందని అంచనా. -
ఎమార్ డీమెర్జర్కు ఎన్సీఎల్టీ ఓకే
న్యూఢిల్లీ: ఎమార్ ఎంజీఎఫ్ ల్యాండ్ కంపెనీ డీమెర్జర్కు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆమోదం తెలిపింది. దీంతో ఎమార్ ఎంజీఎఫ్ ల్యాండ్ జాయింట్ వెంచర్ ఇక ఎమార్ ప్రాపర్టీస్, ఎమార్ డెవలప్మెంట్లుగా విడిపోతుంది. ఈ జేవీకి చెందిన అన్ని రుణాలు, హక్కులు, అధికారాలు ఎంజీఎఫ్ డెవలప్మెంట్కు బదిలీ అవుతాయని ట్రిబ్యునల్ పేర్కొంది. ఈ జేవీకి సంబంధించి విచారణలో ఉన్న అన్ని అంశాల బాధ్యత కూడా ఎంజీఎఫ్ డెవలప్మెంట్ కంపెనీకే ఉంటుంది. ఎమార్ ఎంజీఎఫ్ ల్యాండ్కు చెందిన ప్రతి 416 షేర్లకు ఎంజీఎఫ్ డెవలప్మెంట్స్ కంపెనీ ఒక్కోటి రూ.10 విలువైన 9 ఈక్విటీ షేర్లను జారీ చేస్తుందని పేర్కొంది. ఎమార్ ఎంజీఎఫ్ ల్యాండ్కు చెందిన రూ.713 కోట్ల డిబెంచర్లతో సహా ప్రస్తుత, భవిష్యత్తు రుణాలు కూడా ఎమ్జీఎఫ్ డెవలప్మెంట్కు బదిలీ అవుతాయని ఎన్సీఎల్టీ తెలిపింది. -
ఎన్సీఎల్టీ ముందుకు మరో 24 కేసులు
న్యూఢిల్లీ: ఆర్బీఐ రెండో జాబితాలోని 28 భారీ రుణ ఎగవేతదారులకు గాను 24 కేసులను దివాలా చర్యల కింద జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ)కు నివేదించాలని బ్యాంకులు నిర్ణయించాయి. ఈ 28 ఎన్పీఏ కేసులను పరిష్కరించుకోవాలని లేదా డిసెంబర్ 31 నాటికి ఎన్సీఎల్టీకి నివేదించాలని ఆర్బీఐ గడువు ఇచ్చింది. దేశ బ్యాంకింగ్ వ్యవస్థలోని మొత్తం మొండి బకాయిల్లో ఈ 28 ఖాతాదారులు ఎగవేసిన మొత్తం రూ.4 లక్షల కోట్లుగా ఉంది. వీటిలో అన్రక్ అల్యూమినియం, జయస్వాల్ నెకో, సోమా ఎంటర్ ప్రైజెస్, జైప్రకాశ్ అసోసియేట్స్ మినహా మిగిలిన కేసులన్నీ ఎన్సీఎల్టీ ముందుకు వెళ్లనున్నాయని ఓ బ్యాంకు అధికారి తెలిపారు. దివాలా చర్యలు ఎదుర్కోబోయే వాటిలో ఐవీఆర్సీఎల్, ఉత్తమ్ గాల్వా స్టీల్, విసా స్టీల్, ఎస్సార్ ప్రాజెక్టŠస్, నాగార్జున ఆయిల్, రుచి సోయా, ఉత్తమ్ గాల్వా మెటాలిక్ తదితర కేసులు ఉన్నాయి. -
నగరంలో ఎన్సీఎల్ఏటీ బెంచ్
సాక్షి, హైదరాబాద్: ‘‘దక్షిణ రాష్ట్రాలతో హైదరాబాద్కు మంచి అనుసంధానముంది. కాబట్టి ఇక్కడ నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) బెంచ్ అవసరం ఎంతైనా ఉంది’’ అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు కేంద్రానికి వినతిపత్రం సమర్పించాలని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) న్యాయవా దుల సంఘానికి ఆయన సూచించారు. ఎన్సీఎల్టీ సీనియర్ న్యాయవాది ఎస్.రవి అధ్యక్షుడిగా ఇటీవల న్యాయవాదుల సంఘం ఆవిర్భవించింది. ఈ సంద ర్భంగా ఎన్సీఎల్టీలో గురు వారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జస్టిస్ రమణ ముఖ్య అతిథిగా ప్రసంగించారు. కార్యక్రమం లో ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి, ఎస్సీ ఎల్టీ జ్యుడీషియల్ సభ్యులు వి.రాజేశ్వర రావు, సాంకేతిక సభ్యులు రవికుమార్ దురై స్వామి, ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ధనంజయ, కార్యదర్శి బాచిన హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఎన్సీఎల్ఏటీ ఏర్పాటుతో హైకోర్టు, ఇతర కోర్టులపై కేసుల భారం కాస్త తగ్గిందని ఈ సందర్భంగా జస్టిస్ రమణ అన్నారు. ‘‘ఎన్సీ ఎల్టీ, ఎన్సీఎల్ఏటీ సభ్యుల నియామకాల్లో సుప్రీంకోర్టు ఆషామాషీగా వ్యవహరిం చలేదు. పలు అంశాల్లో వారి నైపుణ్యాలను నిశి తంగా పరిశీలించాకే నియమించాం’’ అని వివరించారు. అధ్యయనమే శ్రీరామరక్ష ఉభయ రాష్ట్రాల్లో దాదాపు లక్ష కంపెనీలు న్నాయని, న్యాయవాది లేకుండా ఏ కంపెనీ ప్రారంభమయ్యే అవకాశమే లేదని జస్టిస్ రమణ అన్నారు. ఈ అవకాశాన్ని యువ న్యాయవాదులు అందిపుచ్చుకోవాలని సూచిం చారు. కొత్త చట్టాలను నిరంతరం అధ్యయనం చేస్తేనే న్యాయవాదికి మనుగడ ఉంటుందని హితవు పలికారు. ‘‘కొత్త తరహా వివాదాలు తలెత్తుతున్నాయి. ఈ సవాళ్లను సమర్థంగా ఎదుర్కొన్నప్పుడే లాయర్లకు పేరు, డబ్బు వస్తాయి. దేశంలో 14 చోట్ల ఎన్సీఎల్టీ లున్నాయి గానీ హైదరాబాద్ ఎన్సీఎల్టీలోని మౌలిక సదుపాయాలు మరెక్కడా లేవు. ఇందు కు సంబంధిత అధికారులకు అభినందనలు. ఇటీవల నేను, మరికొందరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులం జపాన్, కొరియా సందర్శిం చాం. మన రాజ్యాంగం ఎంత గొప్పదో, మన న్యాయవ్యవస్థ ఎంత స్వతంత్రంగా పని చేస్తుందో వారికి వివరిం చాం. విని అక్కడి అధికారు లు ఆశ్చర్యపోయారు. అయితే మన దేశంలో కేసుల పరిష్కారంలో జరుగుతున్న జాప్యంపై వారు అసంతృప్తే వెలి బుచ్చారు’’ అని వివరిం చారు. ‘‘యువ న్యాయవా దులు, కొత్తగా వృత్తిలోకి వస్తున్న వారు సీనియర్ లాయర్ల కు గౌరవమివ్వడం లేదని నా దృష్టికి వచ్చింది. ఇది ఎంతమాత్రమూ మంచి పద్ధతి కాదు’’ అని జస్టిస్ రమణ అన్నారు. పెద్దలను గౌరవించడం మన సంస్కారమని మరవొద్దని హితవు పలికారు. న్యాయవాదుల సంఘం ప్రధాన కార్యదర్శి నూనేపల్లి హరినాథ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం కొత్త కార్యవ ర్గాన్ని సీనియర్ న్యా యవాది ఎస్.రవి సభకు పరిచయం చేశారు. చివర్లో సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్రెడ్డి వందన సమర్పణ చేశారు. కాసేపు తెలుగులో ప్రసంగం కార్యక్రమంలో కాసేపు తెలుగులో ప్రసంగించడం ద్వారా తన భాషాభిమానాన్ని జస్టిస్ రమణ మరో సారి చాటుకున్నారు. న్యాయవాదులకు సంబం ధించి రావిశాస్త్రి చెప్పిన కథను వినిపించి నవ్వులు పూయిం చారు. -
ప్రభుత్వం చేతికి యూనిటెక్ పగ్గాలు
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో ఇరుక్కుపోయిన రియల్టీ దిగ్గజం యూనిటెక్కి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) గట్టి షాకిచ్చింది. నిధుల స్వాహా, నిర్వహణ లోపాల అభియోగాలపై యూనిటెక్ బోర్డులోని మొత్తం ఎనిమిది మంది డైరెక్టర్లను సస్పెండ్ చేసింది. రోజువారీ కార్యకలాపాల నిర్వహణ కోసం కొత్తగా పది మంది డైరెక్టర్లను నామినేట్ చేయాలని ఆదేశించింది. వారి పేర్లను తదుపరి విచారణ తేదీ అయిన డిసెంబర్ 20లోగా అందించాలని కేంద్రానికి సూచన చేసింది. తాజా ఆదేశాలపై సమాధానం ఇవ్వాలని జస్టిస్ ఎం.ఎం.కుమార్ సారథ్యంలోని ద్విసభ్య బెంచ్ అటు యూనిటెక్కు కూడా నోటీసులు జారీ చేసింది. తొలగించిన ఎనిమిది మంది డైరెక్టర్లు తమ వ్యక్తిగత, కంపెనీ ఆస్తులను విక్రయించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. కేంద్రం తరఫున వాదనలు వినిపించిన అడిషనల్ సొలిసిటర్ జనరల్ సంజయ్ జైన్ ఈ విషయాలు వెల్లడించారు. నిర్వహణ లోపాలు, మేనేజ్మెంట్ నిధు లు స్వాహా చేసిన ఆరోపణల నేపథ్యంలో కంపెనీ యాజమాన్య బాధ్యతలను తమ చేతికి అప్పగించాలంటూ కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ(ఎంసీఏ) పిటిషన్ వేసిన దరిమిలా ట్రిబ్యునల్ ఈ ఆదేశాలిచ్చింది. కంపెనీని మూసివేయడానికి తగిన కారణాలున్నా.. 19,000 పైచిలుకు గృహాల కొనుగోలుదారులు, చిన్న డిపాజిటర్ల ప్రయోజనాలను పరిరక్షించాలనే ఉద్దేశంతో యాజమాన్య బాధ్యత లు చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఎంసీఏ వాదనలు వినిపించింది. యూనిటెక్ డైరెక్టర్ల జాబితాలో చైర్మన్ రమేష్ చంద్ర, ఎండీలు అజయ్ చంద్ర, సంజయ్ చంద్ర తదితరులు ఉన్నారు. యూనిటెక్ రుణభారం రూ.6,000 కోట్లకు పైగా పేరుకుపోయింది. సుమారు 70 ప్రాజెక్టుల్లో దాదాపు 16,000 ఇళ్లను కొనుగోలుదారులకు అందించాల్సి ఉంది. ఇన్వెస్టర్ల నుంచి నిధులు సమీకరించినప్పటికీ... ప్రాజెక్టును ప్రారంభించడం లేదన్న ఆరోపణలపై యూనిటెక్ ఎండీ సంజయ్ చంద్ర, ఆయన సోదరుడు అజయ్ చంద్రలను ఆర్థిక నేరాల విభాగం ఈ ఏడాది ఏప్రిల్లో అరెస్ట్ చేసింది. సంజయ్ చంద్ర, అజయ్ చంద్రలను బెయిల్ కోసం డిసెంబర్లోగా రూ.750 కోట్లు డిపాజిట్ చేయాలంటూ అక్టోబర్ 30న సుప్రీం కోర్టు యూనిటెక్ని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలకిది విరుద్ధం: యూనిటెక్ ఉదయం పూట వాదనల్లో పాల్గొనని యూనిటెక్.. మధ్యాహ్నం ఎన్సీఎల్టీ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ట్రిబ్యునల్ను ఆశ్రయించింది. సుప్రీం కోర్టులో తమ కేసు విచారణ జరుగుతోందని నివేదించింది. ఇతరత్రా న్యాయస్థానాలేవీ కంపెనీపై బలవంతంగా ఎటువంటి చర్యలకు ఆదేశాలు ఇవ్వరాదంటూ సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతిని తెలియజేసింది. ఈ నేపథ్యంలో తాజా ఆదేశాలను పక్కనపెట్టాలని కోరింది. తాజా ఉత్తర్వుల వల్ల తాము సుప్రీం కోర్టుకు రూ. 750 కోట్లు డిపాజిట్ చేయలేని పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొంది. అయితే, మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేయడానికి ఎన్సీఎల్టీ నిరాకరించింది. సుప్రీం ఆదేశాలను పాటించడాన్ని బట్టి తాజా ఉత్తర్వుల అమలు ఉంటుందని స్పష్టం చేసింది. శుక్రవారం బీఎస్ ఈలో యూనిటెక్ షేర్ 20% లాభపడి రూ.7.29 దగ్గర ముగిసింది. అప్పట్లో సత్యం.. ఇప్పుడు యూనిటెక్.. ప్రభుత్వం స్వయంగా ప్రైవేట్ కంపెనీ యాజమాన్య బాధ్యతలను టేకోవర్ చేయడంపై దృష్టి పెట్టడం అరుదైన సందర్భం. సత్యం కంప్యూటర్స్ ఉదంతం తర్వాత ప్రభుత్వం మళ్లీ ఇలాం టి విషయంలో జోక్యం చేసుకోవడం ఇదే ప్రథమం. కంపెనీల చట్టం 2013లోని సెక్షన్ 241 కింద ఎంసీఏ పిటిషన్ దాఖలు చేసింది. సెక్షన్ 241 (2) ప్రకారం.. ఏదైనా కంపెనీ వ్యవహారా లు ప్రజా ప్రయోజనాలకు భంగం కలిగించేవిగా ఉన్నాయని భావించిన పక్షంలో సదరు సంస్థ యాజమాన్య బాధ్యతలు తనకు దఖలుపడేలా ఆదేశాలివ్వాలంటూ.. కేంద్ర ప్రభుత్వం ఎన్సీఎల్టీని తనంతట తానే స్వయంగా ఆశ్రయించవచ్చు. -
మెక్డొనాల్డ్స్కు షోకాజ్ నోటీసు
సాక్షి, న్యూఢిల్లీ : మెక్డొనాల్డ్స్ ఫ్రాంచైజ్ ఒప్పందం రద్దుపై విక్రమ్ బక్షి చేసిన పిటిషన్ను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) మంగళవారం కొట్టివేసింది. ఈ సమయంలోనే బక్షి నమోదుచేసిన ధిక్కార ఫిర్యాదులపై స్పందించాలని ఆదేశిస్తూ మెక్డొనాల్డ్స్ కార్పొరేషన్కు షోకాజు నోటీసు జారీచేసింది. మెక్డొనాల్డ్స్కు వ్యతిరేకంగా బక్షి, రెండు ధిక్కార ఫిర్యాదులను ఎన్సీఎల్టీ వద్ద నమోదుచేశారు. ఉత్తర, తూర్పు భారతంలో విక్రమ్ బక్షీతో కలిసి మెక్డొనాల్డ్ 166 ఔట్లెట్లను నిర్వహిస్తున్నది తెలిసిందే. ఈ జాయంట్ వెంచర్ విషయంలోనే వివాదం తలెత్తింది. దీంతో మెక్డొనాల్డ్స్ ఇండియా, విక్రమ్ బక్షికి చెందిన కన్నాట్ ప్లాజాతో ఉన్న ఫ్రాంఛైజీ ఒప్పందాలను రద్దు చేసుకున్నట్లు ప్రకటించింది. ఈ విషయంలో బక్షి ఎన్సీఎల్టీని ఆశ్రయించారు. తమ 50:50 జాయింట్ వెంచర్ వ్యవహారాల్లో మెక్డొనాల్డ్స్ జోక్యం చేసుకుంటుందంటూ మరో ఫిర్యాదును కూడా బక్షి నమోదుచేశారు. ఈ వివాదం నేపథ్యంలో దేశ రాజధానిలో జూన్లో 43 మెక్డొనాల్డ్స్ మూతపడ్డాయి. -
రెండవ జాబితా: 40 కంపెనీలకు షాక్!
న్యూఢిల్లీ: భారీ రుణ ఎగవేతదారులకు షాకిచ్చే దిశగా కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేగంగా కదులుతోంది. కార్పొరేట్ల నుంచి మొండిబకాయిలను రాబట్టుకునే ప్రక్రియలో భాగంగా ఆర్బీఐ మరో జాబితాను సిద్ధం చేసింది. దాదాపు 30-40 కంపెనీలతో కూడిన రెండవ జాబితాను త్వరలోనే విడుదల చేయనుంది. ఇందులో భాగంగా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో కేసు దాఖలు చేయనుంది. ఎకానమిక్స్ టైమ్స్ నివేదిక ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఈ సెప్టెంబర్ లో ఈ రెండవ జాబితాను బహిర్గతం చేయనుందని తెలుస్తోంది. వీటిలో ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, పవర్ సెక్టార్ కంపెనీలు ఉండనున్నాయి. ఉత్తమ్ గాల్వా, వీడియోకాన్, విసా స్టీల్, కాస్టెక్స్ టెక్నాలజీస్ , జెఎస్పీఎల్ తదితర కంపెనీలు ఇందులో ఉండనున్నాయి. కాగా ఈ వార్తలపై స్పందించడానికి ఉత్తం గాల్వా, వీడియో కాన్ కంపెనీ ప్రతినిధులు నిరాకరించారని ఎకానమిక్స్ టైమ్స్ రిపోర్ట్ చేసింది. ఈ అంచనాలపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. -
డర్డీ డజన్కు తోడుగా మరిన్ని కంపెనీలు!!
♦ త్వరలో ఎన్సీఎల్టీ ముందుకు రెండో లిస్టు ♦ జాబితాలో వీడియోకాన్, జేపీ వెంచర్స్ తదితర సంస్థలు!! ముంబై: మొండి బాకీలు పేరుకుపోయిన మరిన్ని కంపెనీల కేసులు త్వరలో దివాలా కోర్టు ముందుకు చేరనున్నాయి. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ముందుకు బ్యాంకులు పంపతగిన కంపెనీల రెండో జాబితాను రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) త్వరలోనే సిద్ధం చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే తొలి జాబితాలోని డర్టీ డజన్ కంపెనీలపై చర్యలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా రాబోయే కొత్త లిస్టులో వీడియోకాన్ ఇండస్ట్రీస్ (స్థూల రుణభారం రూ. 47,554 కోట్లు), జైప్రకాశ్ పవర్ వెంచర్స్ (రూ. 21,098 కోట్లు), అబాన్ ఆఫ్షోర్ (రూ. 12,030 కోట్లు), పుంజ్ లాయిడ్ (రూ. 6,126 కోట్లు), శ్రీ రేణుక షుగర్స్ (రూ. 6,012 కోట్లు), జిందాల్ స్టెయిన్లెస్ (రూ. 3,367 కోట్లు) తదితర సంస్థలు ఉండగలవని తెలుస్తోంది. ఎన్సీఎల్టీకి నివేదించతగిన మరిన్ని కంపెనీల జాబితాను ఆర్బీఐ అంతర్గత సలహా కమిటీ .. బ్యాంకులకు పంపనున్నట్లు సమాచారం. కొత్తగా అమల్లోకి వచ్చిన దివాలా చట్టం ప్రకారం.. మొండి బాకీ ఖాతాలను ఎన్సీఎల్టీకి నివేదించేలా బ్యాంకులను ఆదేశించేలా ఆర్బీఐకి అధికారాలు లభించిన సంగతి తెలిసిందే. -
‘జ్యోతి స్ట్రక్చర్స్’పై దివాలా చర్యలు ప్రారంభం
డర్టీ డజన్లో ఇది మొదటిది ముంబై: మొండిబకాయిలకు సంబంధించి డర్టీ డజన్ సంస్థలపై దివాలా చర్యల దిశలో తొలి అడుగు పడింది. తొలిగా జ్యోతి స్ట్రక్చర్స్పై చట్టపరమైన చర్యలకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆమోదముద్ర వేసింది. దీంతో దివాలా చట్టం (ఐబీసీ) కింద ఎన్సీఎల్టీలో విచారణను ఎదుర్కొనబోయే 12 కేసుల్లో జ్యోతి స్ట్రక్చర్స్దే తొలి కేసు కానుంది. కంపెనీకి రుణాలిచ్చిన బ్యాంకుల తరఫున లీడ్ బ్యాంకరుగా ఎస్బీఐ ఈ పిటీషన్ దాఖలు చేసింది. ఎన్సీఎల్టీ ఫైలింగ్స్ ప్రకారం కంపెనీ మొత్తం రుణభారం రూ.7,000 కోట్లుగా ఉంది. ఐబీసీ చర్యలను కంపెనీ వ్యతిరేకించనందున విచారణకు బ్యాంకర్ల దరఖాస్తును ఆమోదించినట్లు ఎన్సీఎల్టీ ప్రిసైడింగ్ సభ్యుడు బీఎస్వీ ప్రకాశ్ కుమార్ మంగళవారం తెలిపారు. అలాగే ఎస్బీఐ విజ్ఞప్తి మేరకు తాత్కాలికంగా జ్యోతి స్ట్రక్చర్స్ నిర్వహణకు బీడీవో ఇండియా కన్సల్టింగ్ సంస్థ నియామకాన్ని ట్రిబ్యునల్ ఆమోదించింది. తమ కార్యకలాపాలను కొనుగోలు చేయడానికి ఓ సంస్థ ఆసక్తిగా ఉందంటూ ఎన్సీఎల్టీకి జ్యోతి స్ట్రక్చర్స్ గత గురువారం నివేదించింది. దాదాపు రూ.2.5 లక్షల కోట్ల రుణభారం పేరుకుపోయిన 12 కంపెనీల గురించి ఎన్సీఎల్టీని ఆశ్రయించాలంటూ బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించిన సంగతి తెలిసిందే. -
బ్యాంకుల నెత్తిన మరో పిడుగు
♦ భారీ ఎన్పీఏలకు 50 శాతం కేటాయింపులు ♦ నష్టాలుగా భావించి పక్కన పెట్టాలని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలు ♦ పరిష్కారం రాకపోతే 100% కేటాయించాల్సిందే ♦ దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.50,000 కోట్ల భారం ముంబై: ఆర్బీఐ బ్యాంకులకు షాకిచ్చింది. దివాలా చర్యలు చేపట్టనున్న భారీ రుణ ఎగవేతల కేసు(ఎన్పీఏలు)ల్లో 50 శాతం మేర నష్టాలుగా భావించి వాటికి నిధుల కేటాయింపులు (ప్రొవిజనింగ్) చేయాలని బ్యాంకుల చీఫ్లను శుక్రవారం రాత్రి ఆదేశించినట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆర్బీఐ గోప్యంగా జారీ చేసిన ఈ ఆదేశాల గురించి బ్యాంకింగ్ వర్గాలు వెల్లడించాయి. దీని వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేటాయింపుల రూపేణా బ్యాంకులు తమ ఆదాయాల్లోంచి రూ.50,000 కోట్లను పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ) కింద 12 భారీ రుణ ఎగవేత కేసులపై చర్యలు చేపట్టాలని ఆర్బీఐ ఇటీవల బ్యాంకులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ విధంగా ఇన్సాల్వెన్సీ చర్యలు చేపట్టబోయే కేసులకు సంబంధించిన రుణాల్లో 50 శాతాన్ని నష్టాలుగా ప్రకటించి నిధులు కేటాయింపులు చేయాలని బ్యాంకులను ఆర్బీఐ తాజాగా కోరడం గమనార్హం. అంతేకాదు, అంతిమంగా రుణదాతలు, రుణగ్రహీతలు ఓ పరిష్కారానికి రాలేకపోతే... ఆస్తుల లిక్విడేషన్కు ఎన్సీఎల్టీ ఆదేశిస్తే బ్యాంకులు ఆయా కేసుల్లో 100 శాతం కేటాయింపులు చేయాల్సిందేనని వాణిజ్య బ్యాంకుల సీఈవోలకు పంపిన లేఖలో ఆర్బీఐ స్పష్టం చేసింది. అయితే, ఈ కేటాయింపులకు మూడు త్రైమాసికాలు సమయం (2018 మార్చి వరకు) ఇవ్వడం కొంచెం ఊరటగా ఓ బ్యాంకర్ పేర్కొన్నారు. నిజానికి ఈ ఆదేశాలు బ్యాంకులు ఊహించనివే. ఐబీసీ కింద చర్యలు చేపట్టే చాలా కేసుల్లో నిర్ణీత సమయంలోగా పరిష్కారం లభించకపోవచ్చని బ్యాంకులు ఆందోళన చెందుతున్నాయి. మరోవైపు నిర్ణీత సమయంలో పరిష్కారం కాకపోతే నూరు శాతం కేటాయింపులు చేయాలని ఆర్బీఐ ఆదేశించడంతో... వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ రెట్టింపు స్థాయిలో నిధుల కేటాయింపులు చేయాల్సి ఉంటుందని బ్యాంకింగ్ వర్గాలు భావిస్తున్నాయి. కేటాయింపులు ఏ మేరకు...? ఆర్బీఐ ఇన్సాల్వెన్సీ చర్యలకు ఆదేశించిన కేసుల్లో భూషణ్ స్టీల్ (రూ.44,478 కోట్లు), ఎస్సార్ స్టీల్ (రూ.37,284 కోట్లు), భూషణ్ పవర్ అండ్ స్టీల్ (రూ.37,248 కోట్లు), అలోక్ ఇండస్ట్రీస్ (రూ.22,075 కోట్లు), ఆమ్టెక్ ఆటో (రూ.14,074 కోట్లు), మోనెత్ ఇస్పాత్ (రూ.12,115 కోట్లు), ల్యాంకో ఇన్ఫ్రా (రూ.44,364 కోట్లు), ఎలక్ట్రో స్టీల్ స్టీల్స్ (రూ.10,273 కోట్లు), ఎరా ఇన్ఫ్రా (రూ.10,065 కోట్లు), జైపీ ఇన్ఫ్రాటెక్ (రూ.9,635 కోట్లు), ఏబీజీ షిప్ యార్డ్ (రూ.6,953 కోట్లు), జ్యోతి స్ట్రక్చర్స్ (రూ.5,165 కోట్లు) ఉన్న విషయం తెలిసిందే. కేవలం ఈ 12 సంస్థలు ఎగ్గొట్టిన మొత్తం రుణాలే రూ.2.4 లక్షల కోట్లుగా ఉన్నాయి. బ్యాంకుల మొత్తం మొండి బాకాయిల్లో ఇవి 25 శాతం. ప్రస్తుతం ఈ ఎన్పీఏ ఖాతాలకు కేటాయింపులు 30–40 శాతం స్థాయిలో ఉన్నట్టు బ్యాంకర్లు తెలిపారు. ఆర్బీఐ ఆదేశాల వల్ల ఈ ఆర్థిక సంవత్సరం(2017–18) చివరికి మరో రూ.30,000–50,000 కోట్లు కేటాయించాల్సి ఉంటుందని పేర్కొన్నాయి. జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ముందుకు వెళ్లే ఇతర కేసులకూ కేటాయింపులు చేయాల్సి ఉంటుందని ఓ బ్యాంకర్ తెలిపారు. ఆర్బీఐ తాజా ఆదేశాల నేపథ్యంలో బ్యాంకులు మొండి బకాయిల కేసులను ఎస్సీఎల్టీకి నివేదించే విషయంలో చాలా జాగ్రత్తగా మసలుకోవాల్సి ఉంటుందని ఓ బ్యాంకు అధికారి పేర్కొన్నారు. ఇందుకు అధిక కేటాయింపులు చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. 2017 మార్చి నాటికి లిస్టెడ్ వాణిజ్య బ్యాంకులు ఎన్పీఏల కోసం చేసిన కేటాయింపులు రూ.1.95 లక్షల కోట్లుగా ఉన్నాయి. ప్రైవేటు బ్యాంకుల అవినీతిపై సీవీసీ దర్యాప్తు న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకు ఉద్యోగులపై వచ్చే అవినీతి ఆరోపణలపై కేంద్ర నిఘా సంస్థ (సీవీసీ) ఇక నుంచి దర్యాప్తు చేపడుతుంది. ఈ మేరకు తమకు అనుమతులు లభించినట్టు సీవీసీ కమిషనర్ టీఎం భాసిన్ మీడియాకు తెలిపారు. అవినీతి నిరోధక చట్టం – 1988 కింద ప్రైవేటు బ్యాంకుల చైర్మన్లు, ఎండీలు, ఇతర అధికారులు సైతం ప్రజా సేవకుల కిందకే వస్తారంటూ సుప్రీంకోర్టు గతేడాది తీర్పు ఇవ్వడంతో తాజా మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వ బ్యాంకైనా, ప్రైవేటు బ్యాంకైనా ప్రజలకు సంబంధించిన విధుల్లోనే ఉన్నారని సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా స్పష్టం చేసింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వరంగ సంస్థల (ప్రభుత్వ రంగ బ్యాంకులు) ఉద్యోగుల అవినీతి కేసులను విచారించే అధికారం సీవీసీకి ఉంది. ఇకపై ప్రైవేటు రంగ బ్యాంకులు, వాటి యాజమాన్యాలపై వచ్చే అవినీతి ఆరోపణలపైనా దర్యాప్తు చేయనున్నట్టు భాసిన్ తెలిపారు. ఈ మేరకు ఆర్బీఐ, కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగాలు నిబంధనల్లో మార్పులు చేసినట్టు చెప్పారు. ఎన్పీఏల కోసం 25శాతం అదనపు కేటాయింపులు: క్రిసిల్ ముంబై: ఎన్పీఏల పరిష్కారానికి ఆర్బీఐ కఠిన చర్యలు చేపడుతున్న నేపథ్యంలో బ్యాంకులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 25 శాతం అదనపు కేటాయింపులు చేయాల్సి ఉంటుందని రేటింగ్ సంస్థ క్రిసిల్ పేర్కొంది. ఎన్పీఏ కేసుల్లో బ్యాంకులు 60 శాతం వరకు హేర్కట్ (రుణంలో నిర్ణీత మేర నష్టం)ను ఎదుర్కోవాల్సి వస్తుందని తాజాగా విడుదల చేసిన నివేదికలో తెలిపింది. టాప్ 50 ఎన్పీఏ కేసుల్లో 60 శాతం హేర్కట్ అవసరమవుతుందని తాము అంచనా వేస్తున్నట్టు తెలిపింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు అదనంగా 25 శాతం కేటాయింపులు చేయాల్సి ఉంటుందని క్రిసిల్ సీనియర్ డైరెక్టర్ కృష్ణన్ సీతారామన్ తెలిపారు. భారీ హేర్కట్ నేపథ్యంలో ఎన్పీఏలకు కేటా యింపులకు గాను బ్యాంకులకు ఆరు నుంచి ఎనిమిది క్వార్టర్ల సమయం ఇస్తే వాటికి ఉపశమనంగా ఉంటుందని సీతారామన్ అన్నారు. -
టాటా సన్స్పై మిస్త్రీ పిటీషన్ కొట్టివేత
ముంబై: టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీకి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో చుక్కెదురైంది. టాటా సన్స్లో అవకతవకలు, మైనారిటీ షేర్హోల్డర్ల గొంతు నొక్కేస్తున్నారన్న ఆరోపణలపై పిటీషన్ వేయడానికి వీలుగా.. అర్హత నిబంధనలు సడలించాలంటూ మిస్త్రీ కుటుంబానికి చెందిన సంస్థలు చేసిన విజ్ఞప్తిని ఎన్సీఎల్టీ బెంచ్ తోసిపుచ్చింది. కంపెనీల చట్టం నిబంధనల నుంచి మినహాయింపునిచ్చే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. వివరాల్లోకి వెడితే.. టాటా సన్స్ నుంచి మిస్త్రీ ఉద్వాసనను సవాల్ చేస్తూ షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ సంస్థలు రెండు .. ఎన్సీఎల్టీని ఆశ్రయించాయి. టాటా సన్స్లో నిర్వహణ లోపాలున్నాయని, మైనారిటీ షేర్హోల్డర్ల గొంతు నొక్కేస్తున్నారని ఆరోపించాయి. ఇలాంటి పిటీషన్ దాఖలు చేసేందుకు సంబంధించి పిటీషనర్కు ఇష్యూడ్ షేర్ క్యాపిటల్లో కనీసం పదో వంతు లేదా మైనారిటీ షేర్హోల్డర్లలో కనీసం పదో వంతు వాటాలు ఉండాలన్న నిబంధన నుంచి మినహాయింపునివ్వాలంటూ కోరాయి. కానీ, ప్రిఫరెన్స్ క్యాపిటల్ కూడా కలిపితే.. మొత్తం ఇష్యూడ్ షేర్ క్యాపిటల్లో పిటీషనర్ సంస్థలకు కేవలం 2.17% వాటా మాత్రమే ఉంటుందని టాటా సన్స్ వాదించింది. ఈ నేపథ్యంలో అర్హత ప్రమాణాలు కోణంలో పిటీషన్ సాధ్యపడదని ఎన్సీఎల్టీ బెంచ్ స్పష్టం చేసింది. మరోవైపు ఎన్సీఎల్టీ ఉత్తర్వులు.. తమ వాదనకు బలం చేకూర్చాయని టాటా సన్స్ పేర్కొంది. -
మిస్త్రీకి మరో భారీ షాక్!
ముంబై: టాటా సన్స్ ఛైర్మన్గా ఉద్వాసన గురయ్యి, న్యాయపోరాటం చేస్తున్న సైరస్మిస్త్రీకి భారీ షాక్ తగిలింది. టాటాసన్స్కు వ్యతిరేకంగా మిస్త్రీ దాఖలు చేసిన పిటీషన్ను తోసిపుచ్చిన నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ) నిర్వహించగలిగింది కాదని (నాన్ మెయింటన్బుల్) చెప్పింది. టాటా సన్స్పై సైరస్ మిస్త్రీ కుటుంబ సంస్థలు దాఖలు చేసిన ధిక్కార పిటిషన్ను నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ) తిరస్కరించింది. టాటా గ్రూప్ మైనారిటీ వాటాదారుల హక్కులను కాలరాస్తోదంటూ మిస్త్రీ సంస్థలు - సైరస్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, స్టెర్లింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రధాన పిటిషన్ లో చేసిన ఆరోపణలను తోసిపుచ్చింది. కంపెనీల చట్టం ప్రకారం ఈ కంపెనీలు పిటిషన దాఖలు చేసే అవకాశం లేదని స్పష్టం చేసింది. చట్ట ప్రకారం ఎన్సీఎల్టీలో పిటిషన్ దాఖలు చేసేందుకు కనీసం 10శాతం వాటాను కలిగి ఉండాలని చెప్పింది. కాగా మిస్త్రీ కుటుంబ కంపెనీలు టాటా సన్స్లో 2.17శాతం (ఈక్విటీ + ప్రాధాన్య వాటాలను) శాతం వాటాను కలిగి ఉన్నాయి. అయితే దీనిపై మిస్త్రీ తరపు న్యాయవాది సుందరం స్పందించారు. కంపెనీలో వాటాను కలిగి వుండకపోవడం అనేది తమ కేసుకు బలహీనత కాబోదని వాదించారు. దీనిపై మంగళవారం వాదనలు జరగనున్నాయని చెప్పారు. కాగా టాటా గ్రూప్ చైర్మన్ బాధ్యతల నుంచి గత ఏడాది అక్టోబర్ 24న మిస్త్రీకి హఠాత్తుగా ఉద్వాసన పలికింది. అనంతరం మిస్త్రీకి టాటాకుచెందిన ఆయన ఆరు కంపెనీల బోర్డులకూ రాజీనామా చేశారు. అయితే టాటా సన్స్, ఆ కంపెనీ తాత్కాలిక చైర్మన్ రతన్ టాటాపై ఎన్సీఎల్టీలో పిటిషన్ దాఖలు చేశారు. కార్పొరేట్ నియమనిబంధనలను నీరుగారుస్తున్నారని ఆరోపించారు. మరోవైపు టీసీఎస్ ఛైర్మన్ గా ఉన్న చంద్రశేఖరన్ కు టాటా సన్స్ గా నియమించిన సంగతి తెలిసిందే. -
మిస్త్రీకి చుక్కెదురు..!
ధిక్కరణ పిటిషన్లను కొట్టేసిన కంపెనీ లా ట్రిబ్యునల్ ముంబై: జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ)లో సైరస్ మిస్త్రీకి చుక్కెదురైంది. తనను టాటా సన్స్ బోర్డు నుంచి డైరెక్టర్గా తొలగించేందుకు చర్యలు చేపట్టడం ద్వారా టాటాసన్స్, ఆ సంస్థ డైరెక్టర్లు ఎన్సీఎల్టీ ఆదేశాలను ఉల్లంఘించారంటూ... వారికి వ్యతిరేకంగా మిస్త్రీ కుటుంబ కంపెనీలు దాఖలు చేసిన ధిక్కరణ పిటిషన్లను ఎన్సీఎల్టీ బుధవారం రద్దు చేసింది. టాటా సన్స్ చర్య కోర్టు ధిక్కారం కిందకు రాదని డివిజన్ బెంచ్ పేర్కొంది. అయితే, మిస్త్రీని డైరెక్టర్గా తొలగించేందుకు ఫిబ్రవరి 6న టాటా సన్స్ సమావేశం ఏర్పాటు చేయడంపై అఫిడవిట్ను మూడు రోజుల్లోగా దాఖలు చేసేందుకు అవకాశం ఇవ్వటం కొద్దిగా ఊరట. ఇదే అంశంపై 3 రోజుల్లోగా స్పందించాలని టాటా సన్స్ను కూడా బెంచ్ కోరింది. మిస్త్రీని టాటా గ్రూపు చైర్మన్గా తప్పించడాన్ని సవాల్ చేస్తూ మిస్త్రీ కుటుంబ కంపెనీలు లోగడ దాఖలు చేసిన పిటిషన్లపై ట్రిబ్యునల్ ఈ నెల 31, ఫిబ్రవరి 1న విచారించనుంది. అవే రోజుల్లో ఈ అంశంపైనా విచారణ జరుపుతామని ట్రిబ్యునల్ తాజాగా స్పష్టం చేసింది. ఫిబ్రవరి 6న గానీ ఆ తర్వాతగానీ ఏ అంశంపైనా టాటా సన్స్ ఈజీఎం నిర్వహించకుండా ఇంజెక్షన్ ఆదేశాలు ఇవ్వాలని సైరస్ మిస్త్రీ కుటుంబానికి చెందిన సైరస్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్, స్టెర్లింగ్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ తమ పిటిషన్లలో ఎన్సీఎల్టీని కోరాయి. -
రతన్ టాటాపై కోర్టు ధిక్కార పిటిషన్
• టాటా సన్స్పై మిస్త్రీ న్యాయ పోరాటం • బోర్డ్ నుంచి తొలగింపు ప్రయత్నం జరుగుతోందని విమర్శ ముంబై: టాటా గ్రూప్ చీఫ్ రతన్ టాటాసహా హోల్డింగ్ కంపెనీ– టాటా సన్స్ డైరెక్టర్లపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో సైరెస్ మిస్త్రీ నేతృత్వంలోని రెండు ఇన్వెస్ట్మెంట్ సంస్థలు తాజాగా ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశాయి. బోర్డ్ నుంచి మిస్త్రీని తప్పించడానికి చర్యలు ప్రారంభిస్తూ, ట్రిబ్యునల్ గత ఉత్తర్వుల ఉల్లంఘనలకు టాటా సన్స్ పాల్పడుతోందన్నది బుధవారం దాఖలు చేసిన ఈ పిటిషన్ ప్రధాన ఆరోపణ. ఫిబ్రవరి 6వ తేదీన టాటా సన్స్ ఈజీఎం జరగనుందని, ఈ సమావేశాన్ని నిలుపుచేయడంతోపాటు, ఆ తేదీసహా మరే రోజునా... గతంలో ట్రిబునల్ ఇచ్చిన రూలింగ్ను ఉల్లంఘిస్తూ చర్యలు తీసుకోకుండా ఇంజెక్షన్ ఉత్తర్వులు ఇవ్వాలని ఈ పిటిషన్లో సైరస్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్, స్టెర్లింగ్ ఇన్వెస్ట్మెంట్స్లో కోరాయి. జైలుశిక్ష.. జరిమానా విధించండి... టాటా బోర్డ్ నుంచి డైరెక్టర్గా మిస్త్రీని తొలగించడానికి సంబంధించి జనవరి 3న టాటా సన్స్ ఒక ప్రత్యేక నోటీసు జారీ చేసిందని పిటిషన్ పేర్కొంది. డిసెంబర్ 22న ఎన్సీఎల్టీ జారీ చేసిన ఉత్తర్వును పూర్తిస్థాయిలో ఉల్లంఘించడం కిందకే వస్తుందని పిటిషన్ వివరించింది. ఈ ఉల్లంఘనలకు గాను టాటాసహా సర్ రతన్ టాటా ట్రస్ట్, సర్ దొరాబ్జి ట్రస్ట్ డైరెక్టర్లకు ఆరు నెలల వరకూ వర్తించే విధంగా సాధారణ జైలు శిక్ష లేదా రూ.2,000 జరిమానా లేదా రెండు శిక్షలూ విధించాలని పిటిషన్ ట్రిబునల్ను ఆశ్రయించింది. మిస్త్రీ పిటిషన్లో ఉన్న డైరెక్టర్లలో ఎన్ఏ సూనావాలా, ఆర్కే కృష్ణకుమార్, ఆర్ వెంకటరమణలు ఉన్నారు. ఇంతక్రితం తాము దాఖలు చేసిన పిటిషన్పై ట్రిబ్యునల్ ఉత్తర్వులు జారీ చేస్తూ... ఈ అంశాన్ని పరిష్కారించేంతవరకూ దీనిపై ఎటువంటి చర్యలు లేదా ప్రక్రియ చేపట్టకూడదని ఆదేశించిందని దిక్కార పిటిషన్ పేర్కొంది. టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ– టాటాసన్స్ డైరెక్టర్గా మిస్త్రీని తొలగించడానికి ఫిబ్రవరి 6వ తేదీన షేర్హోల్డర్ల సమావేశం నిర్వహించడానికి రంగం సిద్ధం అయిన నేపథ్యంలో మిస్త్రీ ఈ పిటిషన్ దాఖలు చేశారు. టాటా గ్రూప్ చైర్మన్ బాధ్యతల నుంచి అక్టోబర్ 24న మిస్త్రీకి హఠాత్తుగా ఉద్వాసన పలికిన సంగతి తెలిసిందే. తరువాత ఆయన ఆరు కంపెనీల బోర్డులకూ రాజీనామా చేశారు. అయితే టాటా సన్స్, ఆ కంపెనీ తాత్కాలిక చైర్మన్ రతన్ టాటాపై ఎన్సీఎల్టీలో పిటిషన్ దాఖలు చేశారు. కార్పొరేట్ నియమనిబంధనలను నీరుగారుస్తున్నారని ఆరోపించారు.