14 పైసలు ఎగిసిన రూపాయి | Rupee settles 14 paise higher against US dollar | Sakshi
Sakshi News home page

14 పైసలు ఎగిసిన రూపాయి

Published Fri, May 29 2020 2:40 PM | Last Updated on Fri, May 29 2020 2:48 PM

Rupee settles 14 paise higher against US dollar - Sakshi

సాక్షి, ముంబై : దేశీయ కరెన్సీ రూపాయి పాజిటివ్‌గా ముగిసింది. గురువారం నాటి నష్టాలతో పోలిస్తే  నేడు (శుక్రవారం)  డాలరు మారకంలో 14 పైసలు ఎగిసి 75.62 వద్ద ముగిసింది.  ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 75.71 వద్ద ప్రారంభమై అనంతరం పుంజుకుంది.

విదేశీ నిధుల ప్రవాహం, అమెరికా కరెన్సీ డాలరు బలహీనత పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచిందని ఎనలిస్టులు చెప్పారు.  జనవరి-మార్చి త్రైమాసికంలో దేశ స్థూల జాతీయోత్పత్తి  గణాంకాల కోసం ఫారెక్స్ వ్యాపారులు, పెట్టుబడిదారులు ఎదురుచూస్తున్నారన్నారు. మరోవైపు దేశీయ స్టాక్‌మార్కెట్లు ఆరంభం నష్టాలనుంచి కోలుకున్నాయి. ఆరంభంలోనే 300 పాయింట్లకు పైగా నష్టపోయిన సూచీలు మిడ్‌ సెషన్‌ నుంచి క్రమంగా పుంజుకున్నా లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. అయినప్పటికీ సెన్సెక్స్ 32200 స్థాయికి ఎగువన, నిఫ్టీ 95 వందల పాయింట్ల ఎగువకు చేరడం విశేషం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement