1670 టీబీ కేసులు నమోదు | 1670 tb cases filed | Sakshi
Sakshi News home page

1670 టీబీ కేసులు నమోదు

Published Wed, Jul 27 2016 11:05 PM | Last Updated on Mon, Sep 4 2017 6:35 AM

జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌ వరకు 1,670 క్షయ వ్యాధి(టీబీ) కేసులు నమోదయ్యాయని జిల్లా క్షయ నివారణాధికారి ధవళ భాస్కరరావు తెలిపారు.

పొందూరు: జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌ వరకు 1,670 క్షయ వ్యాధి(టీబీ) కేసులు నమోదయ్యాయని జిల్లా క్షయ నివారణాధికారి ధవళ భాస్కరరావు తెలిపారు. బుధవారం పొందూరు ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ పొందూరు పరిధిలో 230 కేసులు నమోదయ్యాయని చెప్పారు. క్షయ రోగులకు డాట్‌ ప్రొవైడర్‌ ద్వారా సేవలను అందిస్తున్నామని తెలిపారు. మొండి క్షయ బాధితులు 26 మంది ఉన్నారని పేర్కొన్నారు. ఆయనతో పాటు ఎస్‌ఏ సురేష్‌ కుమార్‌ ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement