breaking news
case
-
సీఐ నాగరాజు మామూలోడు కాదు.. 200 కోట్ల ఆస్తులు సంపాదించాడు
-
పెద్దల ఆదేశాలతో.. సిట్ ప్రశ్నలకు నాగరాజు మౌనం
-
నా ముందే నా కొడుకుని కొట్టారు.. విజయలక్ష్మి కంప్లైంట్ తో కొత్త ట్విస్ట్..
-
అరెస్ట్ డ్రామా... CI నాగరాజుకి జనసేన MLA సీటు కారుమూరి సంచలన వ్యాఖ్యలు
-
పేరు చెప్పొద్దు.. ఎమ్మెల్యే టికెట్ ఇస్తాం..! సీఐ నాగరాజు కు బిగ్ ఆఫర్..
-
సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో సాక్ష్యాలు ఎలా మాయం చేసారంటే...
-
ఈ కేసులో ఆఖరిగా వచ్చే తీర్పు ఇదే.. వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్
-
ఎంపీకి, CI నాగరాజు మధ్య భారీ డీల్? బయటకి వస్తున్న సంచలన నిజాలు
-
శవం మీద పేలాలు వేరుకునే వాడివి.. నీది ఒక బ్రతుకేనా...
-
కూటమి సీక్రెట్ ప్లాన్..! సాయి కృష్ణ కేసు వెనుక ఎంపీ, పోలీస్ మధ్య భారీ డీల్
-
పక్క ప్లాన్ చేసి చంపేశారు ... దీనివెనుక చాలా పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు..
-
సిగ్గులేదా..? కులం పేరు చెప్పి ఆడుకున్నప్పుడు.. నీ బ్రతుకంతా భజన చేయడమే..!
-
పవన్ టార్గెట్ ఎవరు..? సీఐ నాగరాజును ఎందుకు విచారించట్లేదు..?
-
సాయి కృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్.. ఆధారాలు మాయం..?
-
సాయి కృష్ణ కేసులో సిట్ ఏర్పాటు.. CI నాగరాజు అరెస్ట్..?
-
లాకప్ డెత్ కేసులో రోజుకో మలుపు.. మలయాళం సినిమాను మించిన క్రైమ్ థ్రిల్లర్
-
సాయి కృష్ణ కేసు వెనుక ఉన్న బడా బాబులను కాపాడటం కోసం ఈ కేసుకు "మేకప్" వేస్తున్నారు
-
సాయి కృష్ణ ను ఎందుకు.. ఎవరు చంపారంటే? వెంకట్ రెడ్డి సంచలన నిజాలు
-
సాయి కృష్ణ కేసులో సిట్ ఏర్పాటు
సాక్షి, విశాఖ: రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన సాయి కృష్ణ కేసులో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సిట్ చీఫ్గా ఐజీ రవి ప్రకాష్ ఉండగా.. సభ్యులుగా పశ్చిమగోదావరి ఎస్పీ అద్నాన్ నయీం షమీ, అల్లూరు సీతారామరాజు ఎస్పీ అమిత్ బార్డర్, బాపట్ల అడిషనల్ SP ఎల్ సుధాకర్ని నియమించింది. విజయవాడకు చెందిన గాదె సాయికృష్ణ మే 9న అదృశ్యమైన సంగతి తెలిసిందే. ఆయనను పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని, హింసించి చంపేశారని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.కాగా సాయికృష్ణ మిస్సింగ్ కేసు వ్యవహారం పూటకో మలుపు తిరుగుతోంది. దర్యాప్తులో భాగంగా కృష్ణలంక స్వర్గపురి శ్మశాన వాటికకు వెళ్లిన అధికారులు.. అక్కడ పని చేసే బాషా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. సాయికృష్ణను లాకప్డెత్ చేసిన అనంతరం ఇక్కడే ఖననం/అంత్యక్రియలు చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.గాదె సాయికృష్ణ కేసు దర్యాప్తు నేపథ్యంలో పోలీసులు చేపట్టిన తనిఖీలు శనివారం విజయవాడ కృష్ణలంక స్వర్గపురి శ్మశాన వాటికలోని అనుమానాస్పద వ్యవహారాలను బయటకు తెచ్చాయి. అనాధ మృతదేహాల నిర్వహణలో నిబంధనలు పాటించలేదన్న ఆరోపణలతో ఎలక్ట్రికల్ ఫర్నెస్ ఆపరేటర్ బాషాను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.కృష్ణలంక స్వర్గపురిలో సాయంత్రం 6 గంటల తర్వాత దహనాలు నిర్వహించకూడదన్న నిబంధన అమల్లో ఉంది. అయితే మే నెల 23వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో రెండు అనాధ మృతదేహాలను అక్కడికి తీసుకువచ్చినట్లు తేలింది. అప్పటికే సమయం ముగిసిందని దహనానికి అవకాశం లేదని ఇంచార్జి బాషా చెప్పినప్పటికీ, పరిస్థితుల నేపథ్యంలో పోలీసుల సూచనలతో మృతదేహాలను తాత్కాలికంగా అక్కడే నిల్వచేసినట్లు సమాచారం. అనంతరం 24వ తేదీ ఉదయం దహన కార్యక్రమం నిర్వహించారు.ఈ వ్యవహారం.. గాదె సాయికృష్ణ కేసుతో అనుసంధానంగా బయటపడినట్లు తెలుస్తోంది. అనాథ మృతదేహాల దహనానికి సంబంధించిన ప్రొసీజర్ను పూర్తిగా పాటించారా లేదా? రికార్డులు సక్రమంగా నిర్వహించారా అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. దహనాలు, ఖననాల ముందు తప్పనిసరిగా నిర్వహించాల్సిన రికార్డులు, కృష్ణలంక పోలీసులు ఇచ్చిన అనుమతులు సరైన విధంగా ఉన్నాయా? అసలు ఆ అనుమతులు ఎవరు ఇచ్చారు? అనే విషయాల్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. -
సాయి కృష్ణ కేసులో బిగ్ రివీల్.. బైక్ పై తీసుకెళ్లి దహనం చేసిన చోటు ఇదేనా..
-
గుంటూరులో వైఎస్సార్సీపీ భారీ ర్యాలీ
సాక్షి, గుంటూరు: నగరంలో వైఎస్సార్సీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. సాయికృష్ణ, క్రాంతికుమార్ మరణాలపై సీబిఐ విచారణ జరపాలని డిమాండ్ వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. కొరిటపాడు లైబ్రరీ సెంటర్ నుండి లాడ్జి సెంటర్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు.ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ‘‘క్రాంతికుమార్ మరణ వాంగ్మూలం ఇచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు. సాయికృష్ణ పోలీసు దెబ్బలకు తట్టుకోలేక చనిపోయారు. రక్షించాల్సిన పోలీసులే హతమార్చుతున్నారు. చంద్రబాబు.. సాయికృష్ణ కుటుంబానికి అండగా ఉంటాడట. 49 రోజుల క్రితం సంఘటన జరిగితే ఇప్పటిదాకా ఎందుకు పట్టించుకోలేదు?. హెబియస్ కార్పస్ పిటిషన్ వేయటం, వైఎస్ జగన్ వారి ఇంటికి వెళ్లేదాకా ప్రభుత్వం పట్టించుకోదా?’’ అంటూ ఆయన ప్రశ్నించారు.‘‘పోలీసులు నమోదు చేసున కేసు కోర్టులో నిలబడదు. లోపభూయిష్టమైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గత నెల 28న విజయలక్ష్మి ఒక ఫిర్యాదు చేశారు. అదే ఫస్ట్ ఇన్ఫర్మేషన్. కానీ దాన్ని కాదని మొన్న హడావుడిగా ఎఫ్ఐఆర్ ఎలా నమోదు చేస్తారు?. సీఐ నాగరాజును బలి చేయటానికి హడావుడిగా కేసు నమోదు చేశారు. జడా శ్రవణ్ కుమార్ చాలా స్పష్టంగా సాయికృష్ణ కేసు వివరించారు. సాయికృష్ణ హత్య సీపీ, డీజీపీకి తెలియకుండానే జరిగిందా?..క్రాంతికుమార్ ఆత్మహత్య కేసు కూడా నిలపడకుండా చేస్తున్నారు. ఈ రెండు కేసుల్లో పెద్దపెద్ద వారి ప్రమేయం ఉంది. 29న కోర్టులో సాయికృష్ణను హాజరు పరుస్తారా?. కనీసం బూడిద కూడా దొరక్కుండా చేశారు. నేరాంగీకారం జరిగితే తప్ప ఇది మర్డర్ కేసుగా నిలబడదు. కాపులను చంపి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారా?. కాపులను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?’’ అంటూ అంబటి రాంబాబు నిలదీశారు.‘‘పోలీసు స్టేషన్కు వెళ్లాలంటేనే జనం భయపడే పరిస్థితి ఏర్పడింది. సాయికృష్ణ వ్యవహారం వెనుక ఉన్న బడా బాబులు బయటకు రావాలి. సీఐ నాగరాజు పాత్ర ఒక్కటే సాయికృష్ణ కేసులో లేదు. సీబిఐ విచారణలో మాత్రమే వాస్తవాలు బయటకు వస్తాయి. రాజమండ్రి ఎస్పీ విచారణలో వాస్తవాలు వెల్లడవ్వవు’’ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు. -
ఐదేళ్లు లివిన్, ఇపుడు రేప్ అంటే? కేసు కొట్టేసిన హైకోర్టు
పరస్పర అంగీకారంతో కూడిన సుదీర్ఘ సంబంధాలపై అలహాబాద్ హైకోర్టు (Allahabad High Court) కీలకమైన తీర్పు నిచ్చింది. కేవలం పెళ్లి చేసుకుంటాననే వాగ్దానాన్ని నెరవేర్చలేదనే కారణంతో ఇద్దరు వయోజనుల మధ్య ఉన్న దీర్ఘకాలిక శారీరక సంబంధాన్ని అత్యాచారం (Rape)గా పరిగణించ లేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఓ యువకుడిపై నమోదైన రేప్ కేసును న్యాయస్థానం పూర్తిగా కొట్టేసింది సంజయ్ సరోజ్ అలియాస్ సంజయ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ను అనుమతిస్తూ జస్టిస్ వివేక్ కుమార్ సింగ్ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం ఈ ఉత్తర్వును జారీ చేసింది.కేసు నేపథ్యంపోటీ పరీక్షల ప్రిపరేషన్ కోసం 2014లో ప్రయాగ్రాజ్ వచ్చింది బాధిత యువతి. ఈ క్రమంలో దూరపు బంధువు, నిందిత యువకుడు చదువు, వసతి విషయంలో ఆమెకు సహాయం చేశాడు. ఈ క్రమంలో వారిద్దరూ దగ్గరయ్యారు. 2019 దాకా దాదాపు ఐదేళ్ల పాటు సహజీవనం చేశారు. తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. అతను ముఖం చాటేశాడు. దీంతో పెళ్లి చేసుకుంటానని నమ్మించి, తనతో శారీరక సంబంధం పెట్టుకుని, ఇపుడు పెళ్లి మాట ఎత్తితే కొట్టి, బెదిరంపులకు పాల్పడుతున్నాడంటూ 2019లో ప్రయాగ్రాజ్లోని కల్నల్గంజ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసింది. తన అశ్లీల వీడియో తీసి బ్లాక్మెయిల్ కూడా చేస్తున్నాడని కూడా పేర్కొంది. 2020లో పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేయగా, 2021లో మేజిస్ట్రేట్ దీనిని పరిగణనలోకి తీసుకున్నారు. దీనిపై నిందితుడు హైకోర్టును ఆశ్రయించి, తనపై ఉన్న క్రిమినల్ విచారణను కొట్టివేయాలని కోరాడు. కేసును, ఇరుపక్షాల వాదనలను విశ్లేషించిన అనంతరం, వారి సంబంధం చాలా సంవత్సరాలు, పరస్పర అంగీకారంతోనే సాగిందని జస్టిస్ వివేక్ కుమార్ సింగ్ నేతృత్వంలోని ఏకసభ్య బెంచ్ నిర్ధారించింది.ఐదేళ్ల సుదీర్ఘ సంబంధాల తర్వాత , ప్రతిసారీ కేవలం పెళ్లి వాగ్దానం వల్లే ఆమె శారీరక సంబంధానికి అంగీకరించిందంటే విశ్వసించలేమని కోర్టు పేర్కొంది. వైద్య పరీక్షల్లో ఆమెపై ఎలాంటి గాయాలు ఉన్నట్లు తేలలేదనీ, ఇరువురి సమ్మతితోనే ఈ బంధం కొనసాగిందని కోర్టు అభిప్రాయపడింది. దీర్ఘకాలిక సంబంధాల్లో తేడాలొచ్చినపుడు, లేదా విఫలమై నప్పుడు దానిని అత్యాచారంగా పరిగణించడం, చట్టాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుందని హైకోర్టు హెచ్చరించింది. ఇదీ చదవండి: బీమా లేకుండానే చీప్గా కాంటాక్ట్ లెన్స్ : అమెరికన్ మహిళ సంబరంఫిర్యాదుదారు తన పూర్తి అంగీకారంతో నిందితుడితో శారీరక సంబంధాలు ఏర్పరచు కున్నప్పుడు ఇది కేవలం పరస్పర అంగీకారంతో కూడిన సంబంధం దెబ్బతినడం మాత్రమే కానీ, అత్యాచారం కిందికి రాదని అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కారణంగా, నిందితుడిపై క్రిమినల్ విచారణను కొనసాగించడం సమంజసం కాదని పేర్కొంటూ, అతనిపై ఉన్న అన్ని చట్టపరమైన విచారణలను హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు 34 పేజీల సుదీర్ఘమైన తీర్పును వెలువరించింది. అంతేకాదు ట్రయల్ కోర్టులోని కేసు ప్రొసీడింగ్స్ మొత్తాన్ని హైకోర్టు రద్దు చేసింది.ఇదీ చదవండి: ముస్లిం, హిందూ జంట ప్రేమ పెళ్లి, ఆ తర్వాతి కథ తెలిస్తే! -
‘సాయికృష్ణ కేసు.. పెద్ద తలకాయలను బయటపెడతా’
సాక్షి, విజయవాడ: ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని ప్రముఖ న్యాయవాది, జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు జడ శ్రవణ్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సాయికృష్ణ మృతిపై హైకోర్టులో ప్రజా ప్రయోజనం వాజ్యం వేస్తానని తెలిపారు. ఇది లాకప్ డెత్ కాదని.. ప్రీ ప్లాన్ మర్డర్ అన్న శ్రవణ్.. ల్యాండ్ సెటిల్మెంట్ కారణంగానే ఈ హత్య జరిగిందని.. ఈ కేసులో ఉన్న పెద్ద తలకాయలను బయట పెడతానన్నారు.‘‘సాయికృష్ణను ఈ నెల 8న మార్కాపురం నుంచి కృష్ణలంక తీసుకొచ్చారు. ఒకరోజు మాత్రమే కృష్ణలంక పీఎస్లో ఉంచారు. 9వ తేదీ ఉదయం సాయికృష్ణను టాస్క్ఫోర్స్ ఆఫీస్ తీసుకెళ్లారు. కృష్ణలంక పీఎస్, టాస్క్ఫోర్స్ ఆఫీసుల్లో సీసీ ఫుటేజ్లను జాగ్రత్త పరచాలి. సీసీ ఫుటేజ్ మాత్రమే నిందితులను పట్టించే ప్రాథమిక సమాచారం. టాస్క్ ఫోర్స్ ఆఫీస్ నుంచి ఓ ప్రైవేట్ హోటల్కు తీసుకెళ్లారు. ప్రైవేట్ హోటల్ రూమ్ 302లో సాయికృష్ణను చిత్రహింసకు గురిచేశారు. సాయికృష్ణను పగలంతా టాస్క్ఫోర్స్ పోలీసులు, రాత్రి సీఐ నాగరాజు హింసించారు..సాయికృష్ణను ఎందుకు హింసించారో.. ఏమి చెప్పమని కొట్టారో తెలియాలి.. సీఐ నాగరాజు పేరుమీదే హోటల్ రూమ్ బుక్ అయ్యింది. హోటల్ ఎంట్రీలో కూడా సీఐ నాగరాజు పేరుంది. సాయికృష్ణను విపరీతంగా కొట్టడంతో దవడ పగిలిపోయింది. 14వ తేదీన ప్రజా వైద్యశాలకు తీసుకొచ్చారు. సాయికృష్ణ చనిపోతాడని డాక్టర్లు చికిత్స చేయడానికి నిరాకరించారు. సాయికృష్ణను మణిపాల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. సాయికృష్ణకు సివిల్ సర్జన్ డాక్టర్ వేణుగోపాల్ ట్రీట్మెంట్ చేశారు. మణిపాల్ ఆసుపత్రిలో కూడా చేతులెత్తేయడంతో మళ్లీ హోటల్కు తీసుకెళ్లారు. ఆర్ఎంపీతో సాయికృష్ణకు వైద్యం చేయించారు. హోటల్లో సీసీ ఫుటేజ్ను తప్పకుండా జాగ్రత్తపరచాల్సి ఉంది’’ అని జడ శ్రవణ్ పేర్కొన్నారు. -
‘ఫిర్యాదు చేసినప్పుడే సీపీ, డీజీపీ ఎందుకు స్పందించలేదు?’
సాక్షి, కాకినాడ జిల్లా: వైఎస్సార్సీపీతో పాటు ప్రశ్నించిన వారిని టార్గెట్ చేయడమే మీ పనా? అంటూ కూటమి సర్కార్పై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలీసుల భాష సంస్కార హీనంగా ఉందన్నారు. రాజకీయ నాయకుల చెప్పుచేతల్లోకి వెళ్ళిపోయామని పోలీస్ అధికారులే చెబుతున్న పరిస్ధితి నెలకొందని ఆయన ధ్వజమెత్తారు.‘‘సాయికృష్ణ తల్లిదండ్రులు సీపీకి ఫిర్యాదు చేసినప్పుడు ఎందుకు స్పందించలేదు?. సాయికృష్ణ లాకప్ డెత్పై సీఎం, హోం మంత్రి ఎందుకు స్పందించలేదు?. వైఎస్ జగన్ బాధిత కుటుంబం దగ్గరకు వెళ్తే తెల్లారేలోపు ఎఫ్ఐఆర్ వేశారు. మేకప్ కోసం మాజీ మంత్రి అమర్నాథ్కు నోటీసు ఇచ్చిన హోంమంత్రి.. సాయికృష్ణ లాకప్ డెత్ మీద డీజీపీ,సీపీకి ఎందుకు నోటీసు ఇవ్వలేదు’’ అంటూ కన్నబాబు ప్రశ్నించారు.‘‘ఆక్వా రంగంలో ఒక మాఫియా తయారైంది. ఫీడ్, సీడ్, ఎగుమతుల్లో మాఫియా. రైతు పరిస్ధితి చాలా దయనీయంగా ఉంది. వైఎస్ జగన్ రైతులను అన్ని విధాలుగా ఆదుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం.. అన్నదాత సుఖీభవ మొదటి సంవత్సరం ఎగొట్టింది. రెండో ఏడాది 7 లక్షల మందికి కోత విధించారు. ఒక్క కౌలు రైతుకు కూడా పెట్టుబడి సాయం అందలేదు. మోంథా తుపాను బాధితులకు ఇవాళ్టీకి సాయం అందించలేదు...రైతులకు సున్నా వడ్డీ ఏదీ?. 393 మంది రైతులు ఒక ఏడాదిలో చనిపోయారని ప్రభుత్వం చెబుతోంది. ఉచిత పంటల బీమా పథకం ఎత్తేశారు. పొగాకు రైతులు ఇవాళ ఒంగోలులో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేస్తున్నారు. రైతులకు కార్డు ఇచ్చి.. యూరియా, ఎరువులకు కోత పెట్టారు. కౌలు రైతులు, గిరిజన రైతులు, దేవాదాయ శాఖ రైతులకు కార్డులు లేవు. వైఎస్ జగన్ తీసుకు వచ్చిన కౌలు గుర్తింపు కార్డులను చంద్రబాబు తుంగలోకి తొక్కేశారు. ఎరువులు కావాలంటే.. రూ.15-20 వేలు పెట్టి రైతులు స్మార్ట్ ఫోన్ కొనాలి. రైతును రోడ్డున పడేశారు. ఎరువు కావాలన్న.. విత్తనం కావాలన్న ఎవర్నికలవాలో తెలియదు. రైతులకు ఏం కావాలో తెలుసుకోకుండా.. మేకప్లపై డిస్కషన్లు పెడుతున్నారు’’ అంటూ కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
సాయి కృష్ణ కేసుపై ACP ఫస్ట్ రియాక్షన్
-
చనిపోయింది ఒకరు కాదు.. ఇద్దరు.. సాయికృష్ణ తల్లితో విచారణ బృందం..
-
సాయి కృష్ణ ఇంటికి ACP.. జగన్ దెబ్బకు దిగొచ్చిన పోలీసులు
-
సాయికృష్ణ కేసు వెనుక.. జనం తిరగబడితే తట్టుకోలేరు.. చివరికి జరిగేది ఇదే..
-
సాయికృష్ణ కేసులో కీలక పరిణామం.. సీఐ నాగరాజుపై మర్డర్ కేసు..!
-
ఇక నా కొడుకు లేడయ్యా... సాయి కృష్ణ తల్లిని ఓదార్చిన YS జగన్
-
వైఎస్ జగన్ రాకతో CI నాగరాజుపై కేసు నమోదు
-
రాజకీయాల కోసం కాదు ఆ తల్లి కన్నీరుని చూసి గుండెమండి.. అంబటి రాంబాబు ఎమోషనల్
-
నేరంలో CI, ACP, DGPకి కూడా భాగం ఉంది..
-
సీబీఐ దర్యాప్తు జరగాల్సిందే... గిగ్ వర్కర్ సాయికృష్ణ లాకప్డెత్ ఘటనలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్
-
మనిషిని చంపే హక్కు నీకెవడిచ్చాడు? సాయి కృష్ణ కేసులో మొదటి ముద్దాయి చంద్రబాబు..!
-
పోలీసుల గుట్టు రట్టు.. సాయికృష్ణ కేసులో సంచలన నిజాలు
-
సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో బాసు, బిగ్ బాసే సూత్రధారులు
-
ఆ నేతలో టెన్షన్.. తెరపైకి జనసేన బ్రోకరిజం.. 50 లక్షలు - కోటి
-
రెండు రోజులు సాయి కృష్ణ శవాన్ని స్టేషన్ లో పెట్టి ఏం చేశారో చెప్పమంటారా
-
నిద్ర లేచిన కూటమి ప్రభుత్వం.. సాయి కృష్ణ కేసులో CI సస్పెండ్
-
సాయి కృష్ణ మృతి వెనుక కీలక నేత ?
-
కోర్టుకు సాయి కృష్ణ వస్తాడా.. లేక పోలీసులు బూడిదను తెస్తారా...?
-
కుక్కలకు ఇంచార్జ్ పదవులు ఇస్తారా..? లైవ్ లో పవన్ కళ్యాణ్ ను కడిగి పడేసిన సాయి కృష్ణ మేనమామ..
-
సాయికృష్ణ కేసులో పోలీసుల తీరుపై హైకోర్టు సీరియస్
-
కేసులతో నన్ను భయపెట్టాలని చూస్తున్నారా?
సాక్షి,విజయవాడ: ఉర్సా భూముల వ్యవహారంలో కేశినేని సోదరుల మధ్య మాటలు మంటలు కొనసాగుతున్నాయి. 14 నెలల క్రితం వైజాగ్ ఉర్సా భూముల కుంభకోణంపై కేశినేని చిన్ని సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. నాటి ఫిర్యాదుపై ఇప్పుడు కేశినేని చిన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుతో పోలీసులు కేశినేని నానిపై కేసు నమోదు చేశారు. ఆ కేసుపై కేశినేని నాని సోసల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఫ్రస్టేషన్తోనే తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని మాజీ ఎంపీ కేశినేని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ఆ పోస్టులో ఎంపీ కేశినేని చిన్నిపై విమర్శలు గుప్పించారు. దొంగ కంపెనీకి వేల కోట్ల విలువైన భూముల్ని కట్టబెడుతున్నారు. ప్రశ్నించినందుకు నాపై 14 నెలల తర్వాత కేసు పెట్టారు. తాను లేఖ రాసినందుకే దొంగ కంపెనీకి భూములు కేటాయించలేదని అన్నారు. డీల్ అడ్డం తిరగడంతో కేసులతో భయపెట్టాలని చూస్తున్నారు. మీ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తిలేదని కేశినేని నాని స్పష్టం చేశారు. ఉర్సా భూముల కుంభకోణంవైజాగ్లో డేటా సెంటర్ ప్రాజెక్టు ముసుగులో 60 ఎకరాల అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని కొట్టేసేందుకు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తన బినామీతో కలిపి కుట్ర పన్నారని కేశినేని నాని గతేడాది ఏప్రిల్ నెలలో సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. అందులో 60 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేసేందుకు కేశినేని చిన్ని, తన స్నేహితులు, బినామీలతో కలిసి కొన్ని వారాల క్రితమే ‘ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్’ను ఏర్పాటు చేశారు. ఉర్సా డైరెక్టర్లలో ఒకరైన సతీష్ అబ్బూరి, కేశినేని చిన్ని క్లాస్మేట్స్ అని ‘ట్వంటీఫస్ట్ సెంచురీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ప్రాపర్టీ స్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో ప్రజల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసగించిన వ్యాపార భాగస్వాములు కూడా వీరే. ఆ అక్రమ సంస్థ ఉర్సాకు భూకేటాయింపులను తక్షణమే రద్దు చేసి.. ఆ కంపెనీ యాజమాన్యం, మూలాలు, రాజకీయ సంబంధాలపై సమగ్ర విచారణ జరిపించాలి’ అని చంద్రబాబుకు కేశినేని నాని బహిరంగ లేఖ రాశారు. -
కేశినేని బ్రదర్స్ వార్లో కీలక పరిణామం
బెజవాడ రాజకీయాల్లో కేశినేని సోదరుల మధ్య వివాదం మరో మలుపు తిరిగింది. ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అవినీతి బాగోతాన్ని బయటపెడుతూ మాజీ ఎంపీ కేశినేని నాని(శ్రీనివాస్) సోషల్మీడియాలో వరుస పోస్టులు చేస్తున్నది తెలిసిందే. తాజాగా ఈడీకి సైతం ఆయన ఫిర్యాదు చేయగా.. ఇప్పుడు ఆయనపైనే కేసు నమోదవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: కేశినేని బ్రదర్స్ మధ్య వివాదం మరింత ముదిరింది. తనపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న సోదరుడి వ్యవహారంపై అధికార పార్టీ ఎంపీ కేశినేని చిన్ని పోలీసులను ఆశ్రయించారు. సోషల్ మీడియా వేదికగా తనపై అసత్య, అనుచిత ప్రచారం జరుగుతోందని, పరువు నష్టం కలిగించేలా పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా మాజీ ఎంపీ కేశినేని నానిపై పటమట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. ఈ వ్యవహారం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే చిన్ని అధికార కూటమికి చెందిన ఎంపీ కాగా, నాని ఇటీవల కాలంగా ప్రభుత్వ విధానాలు, స్థానిక రాజకీయ పరిణామాలపై విమర్శనాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈడీకి ఫిర్యాదు చేసిన కొద్దిరోజుల్లోనే నానిపై కేసు నమోదవడం రాజకీయ వర్గాల్లో అనుమానాలకు తావిస్తోంది.నాని అనుచరులు మాత్రం ఇది రాజకీయ ఒత్తిడిలో భాగంగా జరిగిన చర్య అని ఆరోపిస్తున్నారు. సోషల్ మీడియా పోస్టులపై కేసులు పెట్టడం ఏంటని నిలదీస్తున్నారు. అవినీతి ఆరోపణలపై సమాధానం చెప్పాల్సింది పోయి.. ప్రశ్నించిన వారిపైనే కేసులు పెట్టడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని వాదిస్తున్నారు. మరోవైపు ఎంపీ చిన్ని వర్గం మాత్రం సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలు, అసత్య ప్రచారాన్ని సహించబోమని చెబుతోంది. -
ఒకే ఒక్క తప్పుతో అథఃపాతాళానికి..
సాక్షి, బెంగళూరు: చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి అనే యువకుని హత్య శాండల్వుడ్లో ఎంతటి ప్రకంపనలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. రాష్ట్రమే కాదు, దేశమంతటా వార్తలకెక్కింది. చాలెజింగ్ స్టార్గా లక్షలాది అభిమానుల గుండెల్లో నిలిచిపోయిన నటుడు దర్శన్ ఈ హత్య కేసులో జైలు పాలయి గురువారంతో రెండేళ్లు పూర్తి అయింది. ఆయన కెరీర్ అగమ్యగోచరమైంది.2024, జూన్ 11న మైసూరులోని ఒక హోటల్లో ఉండగా దర్శన్ను, ఆయన సన్నిహితులను పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఈ కేసులో అనేకానేక మలుపులు తీసుకుంటూ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మధ్యలోనే ఒక్కసారి బెయిల్ మీద బయటకు వచ్చిన దర్శన్ ఆ తర్వాత సుప్రీంకోర్టు బెయిల్ను రద్దు చేయడంతో మళ్లీ బెంగళూరు పరప్పన సెంట్రల్ జైలులో ఊచలు లెక్కబెడుతున్నాడు. అన్నీ మిస్.. మిస్ బెయిలు మధ్యలో దర్శన్ తన ప్రతిష్టాత్మక ‘ది డెవిల్’ సినిమా షూటింగ్ పూర్తి చేసినప్పటికీ ఆ సినిమా విడుదల సమయంలో కటకటాల్లోనే ఉండాల్సి వచ్చింది. అంతేకాకుండా ఈ ఏడాది తన 49వ పుట్టినరోజు, 23వ పెళ్లి రోజును కూడా అభిమానులు, కుటుంబ సభ్యులతో జరుపుకోలేకపోయారు.దర్శన్ జీవితంలో చీకటిదినం 2024, జూన్ 9 నటుడు దర్శన్ పాలిట ఒక చీకటి రోజు.. బెంగళూరు సుమ్మనహళ్లి రాజకాలువలో రేణుకాస్వామి శవం లభ్యం అయింది. ఈ కేసులో దర్శన్ పేరు వినిపించడంతో పోలీసులు జూన్ 11న అరెస్టు చేశారు. జూన్ 7న కిడ్నాప్ అయిన రేణుకాస్వామి రెండు రోజుల తర్వాత రాజకాలువలో శవమై కనిపించాడు. దర్శన్ స్నేహితురాలు, నటి పవిత్ర గౌడకు రేణుకాస్వామి అసభ్యంగా సందేశాలు పంపించాడనే కారణంతో దర్శన్ అనుచరులు చిత్రదుర్గ నుంచి అతన్ని బెంగళూరుకు కిడ్నాప్ చేసి తీసుకొచ్చి హత్య చేశారన్నది అభియోగం. తరచూ మలుపులు ఈ కేసు నిరంతరం మలుపులు తిరుగుతూనే ఉంది. బెంగళూరు జైలులో దర్శన్కు రాచ మర్యాదలు కల్పిస్తున్నారని కొన్నాళ్లు బళ్లారి జైలుకు తరలించారు. కొన్ని నెలల తర్వాత వైద్య సేవల కారణంతో బెయిల్ పొందారు. దర్శన్ బెయిల్ను రద్దు చేయాలని పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా బెయిలు రద్దయింది. గత ఏడాది ఆగస్టు నుంచి మళ్లీ దర్శన్ జైలు పక్షి అయ్యారు. బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన దర్శన్కు తీవ్ర నిరాశే మిగిలింది. దర్శన్, పవిత్రతో పాటు 7 మంది నిందితులు కారాగారంలోనే ఉండగా, అభిమానులు విచారంలో మునిగారు. -
10 ఏళ్ల తర్వాత సంచలన తీర్పు.. ఓడిన అభ్యర్థే అసలు విజేత!
సాక్షి, చైన్నె : రాధాపురం ఎన్నికల కేసులో హైకోర్టు పదేళ్లకు సంచలన తీర్పు వెలువరించింది. 2016 నాటి అన్నాడీఎంకే అభ్యర్థి ఇన్బదురై విజయం చెల్లదని బుధవారం ప్రకటించింది. రీకౌంటింగ్ అనంతరం అక్కడ డీఎంకే అభ్యర్థి అప్పావు విజయం సాధించినట్టు తీర్పు వెలువరించారు. వివరాలు.. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో రాధాపురం నియోజకవర్గంలో అన్నాడీఎంకే తరఫున ఇన్బ బదురై, డీఎంకే తరఫున అప్పావు పోటీ చేశారు. అప్పట్లో కేవలం 104 ఓట్ల స్వల్ప తేడాతో ఇన్బబదురై గెలిచినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే, పోస్టల్ బ్యాలెట్ ఓట్లను పూర్తిగా లెక్కించకుండానే ఫలితాన్ని ఏకపక్షంగా ప్రకటించారని ఆరోపిస్తూ అప్పావు చైన్నె హైకోర్టును ఆశ్రయించారు. సాధారణంగా ఇలాంటి ఎన్నికల పిటిషన్లపై 6 నెలల్లోపు తీర్పు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ, ఈ కేసులో సుదీర్ఘ కాలయాపన జరిగింది. ఎట్టకేలకు వివాదాస్పద పోస్టల్ ఓట్లను తిరిగి లెక్కించగా.. అప్పావు ఆధిక్యం సాధించినట్లు తేలింది. దీంతో హైకోర్టు ఇన్బదురై విజయాన్ని తాజాగా రద్దు చేస్తూ, అప్పావును విజేతగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది.మాజీ ఎమ్మెల్యే హోదా, జీతభత్యాలు రద్దుపదవీకాలం (2016–2021) ముగిసిపోయిన తర్వా త ఈ తీర్పు వచ్చినప్పటికీ, ఇన్బదురైకు షాక్ తప్ప లేదు. 2016 నుండి 2021 వరకు ఐదేళ్ల పాటు ఎమ్మెల్యేగా ఇన్బదురై పొందిన జీతం, రోజువారీ భత్యా లు, ఇతర ప్రభుత్వ ఆర్థిక సదుపాయాలను తిరిగి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది. అలాగే ఒకసారి ఎమ్మెల్యేగా ఉన్నా జీవితాంతం వచ్చే మాజీ ఎమ్మెల్యే పెన్షన్, ఉచిత వైద్య బీమా సదుపాయాలు పూర్తిగా రద్దవుతాయి. 2016–2021 కాలంలో రాధాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రభుత్వ, అసెంబ్లీ రికార్డుల్లో ఎక్కడెక్కడైతే అన్బదురై పేరు ఉందో.. వాటన్నింటినీ తొలగించి ‘అప్పావు’ పేరు పొందు పరిచే విధంగా హైకోర్టు ఆదేశించింది. ఇదిలా ఉండగా ఇన్బదురై ప్రస్తుతం అన్నాడీఎంకే రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.ఆలస్యమైనా న్యాయం గెలిచిందితీర్పు రావడంలో చాలా కాలయాపన జరిగినప్పటికీ, చివరికి న్యాయమే గెలిచిందని మాజీ స్పీకర్ అప్పావు సంతోషం వ్యక్తం చేశారు. నాటి ఎన్నికల్లో జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకే 135 సీట్లతో అధికారాన్ని దక్కించుకోగా, డీఎంకే ఈ ఒక్క స్థానాన్ని కోల్పోవడంతో అప్పట్లో 89 స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చిందన్నారు. -
తృణముల్ కాంగ్రెస్కు మరో షాక్.. అభిషేక్ బెనర్జీకి నోటీసులు
కోల్కతా: తృణముల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీకీ మరో ఎదురుదెబ్బ తగిలింది. టీఎంసీ కార్యకర్తలను పరామర్శించడానికి వెళ్లి దాడికి గురైన ఘటన గడిచి 24 గంటలు గడవకముందే ఇప్పుడు మరో కేసులో ఇరుకున్నారు. నకీలీ సంతకాల విచారణలో విచారణకు రావాలని సీఐడీ నోటీసులు జారీ చేసింది.పశ్చిమ బెంగాల్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (CID), తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీకి (శనివారం) సమన్లు జారీ చేసింది. 'నకిలీ సంతకాల' వివాదానికి సంబంధించిన విచారణలో భాగంగా సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు కోల్కతాలోని భవానీ భవన్ సిఐడి ప్రధాన కార్యాలయానికి విచారణకు హాజరు కావాలని అభిషేక్ బెనర్జీకి ఆదేశాలు జారీ చేసింది. కేసు వివరాలు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా శోభన్దేబ్ చటోపాధ్యాయను ఎన్నుకుంటూ సుమారు 70 మంది టీఎంసీ ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన మద్దతు లేఖను అభిషేక్ బెనర్జిీ మే 19న అసెంబ్లీ సెక్రటేరియట్కు సమర్పించారు. అయితే, ఈ లేఖలోని కొన్ని సంతకాలు అసెంబ్లీ రికార్డులతో సరిపోలలేదు. ముఖ్యంగా టీఎంసీ ఎమ్మెల్యే నైనా బెనర్జీ సంతకం ఫోర్జరీ అయిందనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై అసెంబ్లీ సెక్రటేరియట్ కోల్కతాలోని హరే స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.ఈ కేసు విచారణను సిఐడి (CID) స్వీకరించి, ఇప్పటికే పలువురు టీఎంసీ ఎమ్మెల్యేలను విచారించింది. అదే సమయంలో అభిషేక్ బెనర్జీ ఐదుగురు సీఐడీ అధికారుల బృందం ముఖర్జీ రోడ్డులోని అభిషేక్ బెనర్జీ నివాసానికి వెళ్లారు. ఆయన అక్కడ లేకపోవడంతో వెనుతిరిగారు. ఈ నేపథ్యంలోనే తృణముల్ కార్యకర్తలను పరామర్శించడానికి అభిషేక్ వచ్చిన సమయంలో ఆయనను స్వయంగా కలిసి నోటీసులు అందజేశారు.అభిషేక్ స్పందన అయితే నోటీసులు అందుకున్న అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ.. "నేను ఇంకా నోటీసు లోపల ఏముందో పూర్తిగా చూడలేదు. నా న్యాయవాదులతో మాట్లాడి తగిన విధంగా స్పందిస్తాను. విచారణకు ఖచ్చితంగా సహకరిస్తాను, అవసరమైతే అధికారుల ముందుకు హాజరవుతాను. అని అన్నారు. -
కేసు క్లోజర్ రిపోర్టు ఇచ్చాక.. తదుపరి దర్యాప్తునకు కోర్టు అనుమతి తప్పనిసరి!
సాక్షి, న్యూఢిల్లీ: ఏదైనా ఒక కేసులో ఆధా రాలు లేవంటూ పోలీసులు క్లోజర్ రిపోర్టు ఇచ్చిన తర్వాత, అదే కేసుపై తదుపరి దర్యా ప్తు చేపట్టాలంటే మేజిస్ట్రేట్ నుంచి ముందుగా అనుమతి తీసుకోవడం తప్పనిసరి అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. మూసేసిన కేసులో మేజి స్ట్రేట్ నుంచి ఎక్స్ప్రెస్ పర్మిషన్ తీసుకో కుండా తదుపరి దర్యాప్తు కొనసాగించడం చెల్లదని స్పష్టం చేసింది. క్రిమినల్ కేసుల్లో పోలీసులకు గల దర్యాప్తు అధికా రాల విషయంలో ఈ తీర్పును అత్యంత కీలకమైందిగా భావిస్తున్నారు. గురువారం ఈ మేరకు జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ కోటీశ్వర్ సింగ్ల ధర్మాసనం కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనబెట్టింది. పిటిషనర్ పళనిస్వామి వీరరాజాకు ఊరట కల్పించింది. సీఆర్పీసీ సెక్షన్ 173(8) ప్రకారం తదుపరి దర్యా ప్తునకు మెజిస్ట్రేట్ అనుమతి అవసరంలేదని కర్ణాటక హైకోర్టు తప్పుగా అర్థం చేసుకుందని పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది వి.మోహన ధర్మాసనం దృష్టికి తెచ్చారు. చట్టంలో నేరుగా పేర్కొనకపోయినా, కోర్టు అనుమతితోనే తదుపరి దర్యాప్తు జరగాలనే నిబంధన ఉన్న విషయం తెలుసుకోవాలన విజ్ఞప్తి చేశారు. దీనిపై ధర్మాసనం ఏకీభవించింది. ‘చట్టంలో ఎక్స్ప్రెస్ పర్మిషన్ అవసరమని లేకపోయినా, న్యాయ పరిణామ క్రమంలో సంబంధిత మేజిస్ట్రేట్ నుంచి అనుమతి కోరడం ఒక అవసరంగా రూపుదిద్దు కుంది’అంటూ స్పష్టం చేసింది. ‘రామ చౌదరి వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్, (2013) 5 ఎస్సీసీ 762, వినయ్ త్యాగి వర్సెస్ ఇర్షాద్ (2013) 5 ఎస్సీసీ 762, పీతాంబరన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ(2023), ఎస్సీసీ 402, రాబర్ట్ లాల్చుంగ్నుంగా చోంగ్తూ వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్ (2025) కేసులను ధర్మాసనం గుర్తుచేసింది. ‘కోర్టు అనుమతి కోరడం, సప్లిమెంటరీ రిపోర్టు దాఖలు చేయడం అనే అవసరాన్ని సెక్షన్ 173(8) నిబంధనల్లో చదువు కోవాలి. ఇది తప్పనిసరి’అంటూ వినయ్ త్యాగి కేసులోని తీర్పును ధర్మాసనం ఉటంకించింది. ‘ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తిని మళ్లీ దర్యాప్తు పేరుతో వేధించకుండా ఈ తీర్పు అడ్డుకుంటుంది. కేసుపై కోర్టు పర్యవేక్షణ కూడా ఉంటుంది. ఇది పౌరులకు రక్షణ వంటిది’అని ధర్మాసనం వివరించింది. ఒకసారి కేసు మూసేశాక, మేజిస్ట్రేట్కు తెలియకుండా పోలీసులు మళ్లీ దర్యాప్తు చేయలేరని స్పష్టంగా ప్రకటించింది. -
అప్పులుంటే.. చంపేస్తావా!
తెలిసీ తెలియని వయస్సులో ఈ చేతులే కదా మాకు గోరు ముద్దలు తినిపించాయి.. ఈ చేతులే కదా మమ్మల్ని ఆడించాయి.. ఈ చేతులే కదా మాకు నడక నేర్పించాయి.. అలాంటి ఈ చేతులతోనే మమ్మల్ని కాటికి సాగనంపుతున్నావా నాన్న అంటూ ఆ చిన్నారుల మూగరోదన ఆ తండ్రికి వినిపించలేదు.. అల్లారు ముద్దుగా పెంచి.. అడిగినవన్నీ అరచేతిలో పెట్టి.. మమ్మల్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దాల్సిన నువ్వే.. ఏమాత్రం కనికరం లేకుండా.. కాళ్లు, చేతులు కట్టేసి.. కాటికి సాగే నంపే తరుణంలో నీ గుండె ఎంత బండలా మారింది నాన్నా.. అన్న ఆ పసిహృదయాల మౌనవేదన ఆ తండ్రికి కనిపించలేదు. ..కేవలం తాను చేసిన అప్పులకు తన భార్యాపిల్లలు ఎక్కడ బలవుతారో అన్న చిన్న కారణంతో.. ఎన్నో విజయాలు అందుకొని.. నిండు నూరేళ్లు జీవించాల్సిన మూడు నిండు ప్రాణాలను బలితీసుకున్నాడు ఓ తండ్రి. ఇంటి నిర్మాణం, వ్యవసాయంలో నష్టాలు.. వెరసీ అప్పులపాలైన ఓ కౌలు రైతు.. తన కుటుంబాన్ని తానే చిదిమేసుకు న్న విషాదకర సంఘటన తీవ్రంగా కలచివేసింది. వనపర్తి: జీవనోపాధి కోసం మామిడితోటలు లీజుకు తీసుకుని మామిడి పండ్లు విక్రయిస్తూ.. మిగతా సమయంలో తోటల సంరక్షణ చేసుకుంటూ జీవించే ఓ కుటుంబం సరైన లాభాలు లేక.. చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక.. అప్పులు ఇచ్చిన వారి ఒత్తిళ్లు తట్టుకోలేక ఓ కుటుంబ పెద్ద తన భార్య, ఇద్దరు పిల్లలను నీటిలో సంపులో పడేసి ప్రాణాలు తీసి.. తానూ ఉరేసుకున్న ఉదంతం ఉమ్మడి పాలమూరు జిలాల్లో తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని డోకూరు గ్రామానికి చెందిన నర్సింహులు(40) నాలుగేళ్ల క్రితం ఖిల్లాఘనపురం మండలం సల్కెలాపురం శివారులో సుమారు 50 ఎకరాల మామిడి తోటను లీజు తీసుకుని కుటుంబ సభ్యులతో కలిసి అక్కడే ఉంటూ జీవనం సాగిస్తున్నాడు.ఈ క్రమంలో తోటల లీజు, ఇతర అవసరాల కోసం గద్వాలలో కొందరితో అప్పు చేశాడు. డోకూరులోని తన సొంత ఇంటిపై ఓ ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో రూ.లక్షల్లో అప్పు చేశాడు. ఇటీవల ఈఎంఐలు సక్రమంగా చెల్లించడం లేదని ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులు ఇంటి గోడలపై ఈ ఇంటిని అప్పుకింద జప్తు చేయనున్నట్లు రాయడంతో గ్రామంలో తోటివారు, బంధువులు, సన్నిహితుల ఎదుట అవమానంగా భావించాడు. ఐపీ పెట్టే ప్రయత్నం చేశాడు. తన వద్ద ఉన్న వాహనాలు, వస్తువులను అమ్మేసి అప్పులు తీర్చే ప్రయత్నం చేశాడు. అయినా.. వడ్డీలు వసూలు చేసేవారు, ఈఎంఐలు చెల్లించాల్సిన ఫైనాన్స్ కంపెనీల నుంచి ఒత్తిడి తగ్గలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన కుటుంబ సభ్యులతో సహా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే భార్య ఎల్లమ్మ(36), కుమారుడు నిహాల్(15), కూతురు సాహితీశ్రీ(13)ల కాళ్లు, చేతులు కట్టేసి తోటలోని సంపులోకి తోసి తాను నివాసం ఉండే కంటైనర్కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పరిశీలించిన డీఎస్పీ గిరిబాబు విషయం తెలుసుకున్న వనపర్తి డీఎస్పీ గిరిబాబు ఖిల్లాఘనపురం మండలం సల్కెలాపురం గ్రామ శివారులోని మామిడి తోటకు వెళ్లి ఘటనా స్థలా న్ని పరిశీలించారు. మృతదేహాలను మహబూబ్నగర్ ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించి ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.గొల్లుమన్న కుటుంబం.. తల్లిదండ్రుల చాటున నిండునూరేళ్లు జీవించాల్సిన చిన్నారులు.. ఊహించని విధంగా కన్న తండ్రే.. కాలయముడై కాళ్లు చేతులు కట్టేసి నీటి సంపులోకి తోసి ప్రాణాలు తీయడం కలకలం రేపింది. తోటలో ఆడుతూ... పాడుతూ.. సరదాగా తిరిగే చిన్నారులు విగత జీవులుగా పడి ఉండటాన్ని చూసి మామిడి తోట చుట్టుపక్కల రైతులు, కుటుంబ సభ్యులు గొల్లుమన్నారు. మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం నర్సింహులు స్వగ్రామం డోకూరుకు తీసుకెళ్లారు. -
‘దీదీ కాపాడు’ అని మొరపెట్టుకున్న కొన్ని క్షణాల్లోనే
వరకట్నరక్కసి కోరలు సరికొత్తగా విస్తరిస్తున్న చాయలు ఇటవలికాలంలో బాగా కనిపిస్తున్నాయి. ముఖ్యం రాజధాని నగరం ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో నిన్న గాక మొన్న ట్విషా శర్మ, దీపికా నాగర్ అనుమానాస్పద మరణం ఘటనలు కలకలంరేపాయి. కట్నం కోసమే తమ బిడ్డల్ని పొట్టనపెట్టుకున్నారని అమ్మాయి తల్లిదండ్రులు ఆరోపణల పర్వం కొనసాగుతుండగానే ఢిల్లీలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. నన్ను బతికించండి అని మొరపెట్టుకున్న నిమిషాల వ్యవధిలోనే ఒక మహిళ అనుమానాస్పద స్థితిలో శవమై తేలడం ఉద్రిక్తతను రాజేసింది.వీణా కుమారి (28) 2022లో రాజు సింగ్తో వివాహమైంది. వీరికి ఆరు నెలల కుమారుడు ఉన్నాడు. వివాహం జరిగిన కొద్దిరోజులకే వారు ఉత్తరప్రదేశ్లోని సంభాల్ నుండి ఢిల్లీలోని ఇందర్పురికి మకాం మారారు. మృతురాలి సోదరుడు తెలిపిన వివరాల ప్రకారం పెళ్లి జరిగినప్పటి నుండి కట్నం విషయంలో వీణను భర్త రాజు వేధిస్తూ ఉండేవారు. నీకంటే మంచి అమ్మాయిని పెళ్లి చేసుకునేవాడినంటూ నిత్యం పోరు పెట్టేవాడు. మరోవైపు ఇటీవలే పెళ్లి చేసుకున్న మరిది రాజ్కుమార్ తన భార్య తెచ్చిన కట్నంతో (46 ఇంచుల టీవీ, బైక్) వీణ తెచ్చిన కట్నాన్ని (32 ఇంచుల టీవీ) పోల్చుతూ వేధించేవాడు. ఇద్దరూ కలిసి వీణను మానసికంగా, శారీరకంగాహింసించేవారు. ఎంతలా అంటే ఒకసారి కొట్టిన దెబ్బలకు వీణ కర్ణభేరి పగిలిపోయింది.దీంతో పాటు ఇటీవల రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్, అదనపు ట్నం వేధింపులు మరింత పెరిగాయి. అయితే కుటుంబం పరువు పోతుందనే భయంతోనే ఇంతవరకు పోలీసులకు ఫిర్యాదు చేయకుండా సోదరి వీణ ఆపిందని ఆయన పేర్కొన్నారు. ఇంతలోనే అన్యాయం జరిగిపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. 7 నిమిషాల్లో అంతారాత్రి పదిగంటలకు వీణ తన సోదరి రీనాకి ఫోన్ చేసింది. ఏడుస్తూ.. "దీదీ నన్ను కాపాడు. వీళ్లు నన్ను బాగా కొడుతున్నారు. నన్ను బతకనివ్వరు. చంపేస్తారు" అని చెప్పింది. అంతేకాదు తను చనిపోయాక తన 6 నెలల కొడుకును జాగ్రత్తగా చూసు కోమని వేడుకుంది. అంతలోనే కాల్ కట్ అయింది. ఆందోళన చెందిన రీనా తిరిగి ఫోన్ చేసినా ఎవరూ ఎత్తలేదు. వెంటనే ఆమె వీణ ఇంటికి బయలుదేరింది. బచా లో దీదీ అని ప్రాధేయపడిన కేవలం 7 నిమిషాలకే, వీణ బావ రీనాకు ఫోన్ చేసి, "వదిన మేడ పైనుంచి కింద పడిపోయింది" అని చెప్పాడు. రీనా అక్కడికి చేరేలోపే వీణ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.దీంతో అదనపు కట్నం కోసం ఆమె అత్తవారింటి వారే భవనం పైనుంచి తోసి చంపేశారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణ కొనసాగుతోందని పశ్చిమ ఢిల్లీ డీసిపీ శరద్ భాస్కర్ వెల్లడించారు.అత్తవారింటి వాదనవీణ మామ జైపాల్ ఈ ఆరోపణలను పూర్తిగా తిరస్కరించారు. దంపతుల మధ్య చిన్నచిన్న గొడవలు సహజమేనని, తాము ఒక్క స్పూన్ కూడా కట్నం అడగలేదని చెప్పారు. ఆమె భవనం పైనుంచి ప్రమాదవశాత్తూ కింద పడిపోయిందని భర్త రాజు సింగ్ వాదిస్తున్నాడు.ఇదీ చదవండి: వర్క్ ఫ్రం హోం కాదు.. వర్క్ ఫ్రం బీచ్, అదీ గోవాలో -
నటి ట్విషా శర్మ కేసులో మరో ట్విస్ట్
-
రూ.75 లక్షల కిరీటం.. రూ.35 లక్షలకు..! దేవస్థానం అధ్యక్షుడిపై కేసు నమోదు
-
సరదా తీర్చిన ట్వీట్.. తారల మెడకు ఉచ్చు?
ఒకప్పుడు సరదాగా చేసిన పని.. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో పెద్ద రాజకీయ బాంబులా పేలింది. ఐదేళ్ల కిందటి ఎన్నికల హింస తెర మీదకు రావడంతో ఇద్దరు సినీ తారలు చిక్కుల్లో పడ్డారు. వాళ్ల మీద ఫిర్యాదు నమోదు కావడం, పైగా టీఎంసీతో దగ్గరి సంబంధాలు ఉండడంతో సువేందు అధికారి సర్కార్ చర్యలు తీసుకోవడం దాదాపుగా ఖాయంగానే కనిపిస్తోందనే చర్చ ఊపందుకుంది.2021లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే ఫలితాల తర్వాత చెలరేగిన హింస మాత్రం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఆనాడు కౌంటింగ్ జరుగుతున్న టైంలో నటుడు పరంబ్రతా ఛటర్జీ బెంగాలీలో ఒక పోస్టు చేశారు. ఫలితాల ట్రెండ్ ఆధారంగా ఆయన చేసిన ట్వీట్ ‘ఈరోజు ప్రత్యర్థులను చితక్కొట్టే రోజు’ అనే అర్థం వచ్చేలా ఉంది. దానికి నటి స్వస్తికా ముఖర్జీ ‘హహహ’ అంటూ లాఫింగ్ రియాక్షన్తో స్పందించారు.అయితే.. ఆ తర్వాత కొన్నిగంటలకే బెంగాల్ అంతటా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఎంత మంది చనిపోయారు, ఎన్ని కేసులు నమోదయ్యాయి అనే లెక్కలపై ఇప్పటికీ స్పష్టత లేదు. కనీసం 11 మంది చనిపోయినట్లు అప్పటి దీదీ సర్కార్ కేంద్ర హోంశాఖకు పంపిన నివేదికల్లో ఉంది. అయితే తర్వాత వెలువడిన వివిధ నివేదికలు, దర్యాప్తుల ప్రకారం మొత్తం మరణాల సంఖ్య ఇంకా ఎక్కువే ఉంది. “కాల్ ఫర్ జస్టిస్” అనే పౌర సంఘం నివేదిక ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 15 వేల హింసాత్మక ఘటనలు జరిగాయని, 25 మంది మరణించారని, సుమారు 7 వేల మంది మహిళలు వేధింపులకు గురయ్యారని పేర్కొంది.హత్యలు, దాడులు, అత్యాచారాలు, అగ్నిప్రమాదాలు, ఆస్తుల ధ్వంసం వంటి కేసులపై తర్వాత సీబీఐ దర్యాప్తు చేపట్టింది. ఒక్క దశలోనే 31 కేసులు నమోదు చేసినట్టు సమాచారం. తాజాగా వెలువడిన నివేదికల ప్రకారం.. పాత కేసులను మళ్లీ తెరపైకి తీసుకొచ్చి వందల సంఖ్యలో కొత్త దర్యాప్తులు కూడా ప్రారంభించారు. అయితే.. ఐదేళ్ల కిందట బెంగాల్ హింసపై దర్యాప్తు చేపట్టాలని సువేందు అధికారి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ అంశం మళ్లీ చర్చకు రావడంతో.. ఇప్పుడు ఇద్దరు ప్రముఖ నటుల పేర్లు కూడా వివాదంలో వినిపిస్తున్నాయి.బెంగాలీ తారలు చేసిన ట్వీట్ హింసను ప్రేరేపించేలా ఉందని ఆరోపిస్తూ కోల్కతాలోని గరియాహట్ పీఎస్లో ఫిర్యాదు నమోదైంది. ఫిర్యాదు చేసిన జోయ్దీప్ సేన్ అనే వ్యక్తి ఆరోపణ ఏమిటంటే.. 2021 మే 2న ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో పరంబ్రతా ఛటర్జీ బెంగాలీలో ఒక పోస్టు చేశారు. దానికి స్వస్తికా ముఖర్జీ నవ్వు గుర్తులతో స్పందించారు. అప్పటికే రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో ప్రముఖులైన వీరి వ్యాఖ్యలు హింసను ప్రేరేపించేలా పనిచేశాయి. ముఖ్యంగా బీజేపీ కార్యకర్తలపై దాడులు, హత్యలు, మహిళలపై దాడులు జరిగిన ఘటనలకు ఇలాంటి పోస్టులు మానసిక ప్రోత్సాహం ఇచ్చాయి. అంతేకాదు.. ఆ ట్వీట్ చేసిన గంటలోపే బీజేపీ కార్యకర్త అభిజిత్ సర్కార్ హత్య జరిగిందని, తర్వాత రాష్ట్రవ్యాప్తంగా హింస మరింత పెరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు.. ఆ ఎన్నికల హింసను విచారణ జరిపేందుకు సువేందు సర్కార్ ఓ కమిటీ కూడా వేశారు. ఈ కమిటీ కూడా వీళ్ల అంశాన్ని పరిశీలించే అవకాశమూ కనిపిస్తోంది. పరంబ్రతా ఛటర్జీ, స్వస్తికా ముఖర్జీ.. ప్రముఖ బెంగాలీ యాక్టర్లు. పరంబత్రాది సినీ నేపథ్యం ఉన్న కుటుంబం. ప్రముఖ దర్శకుడు రుత్విక్ ఘటక్కు బంధువు. రచయిత్రి మహాశ్వేతా దేవి కుటుంబానికి చెందినవారు. నటుడిగానే కాకుండా దర్శకుడు, నిర్మాతగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. బెంగాలీతో పాటు హిందీ చిత్రాలు, వెబ్ సిరీస్ల్లోనూ నటించారు. అందులో కహానీ, బైషే శ్రాబోన్, పారి, బుల్బుల్, అరణ్యక్లో నటనకు మంచి గుర్తింపు దక్కింది. ఇక.. స్వస్తిక ముఖర్జీ ప్రముఖ బెంగాలీ నటుడు సంతూ ముఖర్జీ కుమార్తె. బుల్లితెరతో కెరీర్ ప్రారంభించి బెంగాలీ స్టార్గా ఎదిగారు. బెంగాలీతో పాటు హిందీలోనూ నటించారు. పాతాళ్ లోక్, దిల్ బేచారా, ఖాలా, మస్తాన్, శ్రీమతి వాటిల్లో ప్రముఖమైనవి.పరంబత్రా, స్వస్తికా ఇద్దరూ ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. కానీ రాజకీయ, సామాజిక అంశాలపై బహిరంగంగా అభిప్రాయాలు చెప్పడం వల్ల తరచూ వార్తల్లో ఉంటుంటారు. బెంగాల్లో లౌకికవాదం, స్వేచ్ఛ, సామాజిక అంశాలపై తమ అభిప్రాయాలు సోషల్ మీడియాలో వెల్లడిస్తూ ఉంటారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు, బీజేపీపై విమర్శలు చేస్తూ పలుమార్లు వార్తల్లో నిలిచారు. అందుకే ఈ ఇద్దరికీ మమతా బెనర్జీ పార్టీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే చెబుతుంటారు. -
అత్తాపూర్ కిడ్నాప్ కేసు.. గంటల్లోనే ఛేదించిన పోలీసులు
సాక్షి, హైదరాబాద్: అత్తాపూర్ కిడ్నాప్ కేసును గంటల వ్యవధిలోనే పోలీసులు చేధించారు. మలక్పేటలోని ఓ ఇంట్లో ఆ యువతి సేఫ్గా ఉన్నట్లు గుర్తించారు. యువతి ఫోన్ నంబర్ ఆధారంగా ట్రేస్ చేసి గుర్తించినట్లు పేర్కొన్నారు. కాగా నిన్న అత్తాపూర్లో అర్ధరాత్రి యువతిని కిడ్నాప్ చేశారు. మహేంద్రా థార్లో వచ్చిన నలుగురు యువతిని బలవంతంగా ఎక్కించుకుని వెళ్లిపోయారు..వారి నుంచి తప్పించుకునేందుకు మొదట యువతి ఆస్పత్రిలోకి పరిగెత్తినప్పటీకీ యువకులు ఆమెను బెదిరించి కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు.ఇది గమనించిన స్థానికులు వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు కారును వెంబడించే ప్రయత్నం చేశారు. అత్తాపూర్ నుంచి ఆరాంఘర్ చౌరస్తా వరకు పోలీసులు కారును చేజ్ చేశారు. కానీ పోలీసుల కళ్లుగప్పి కిడ్నాపర్లు పారిపోయారు.ఈ నేపథ్యంలోనే ఆమె ఫోన్ నెంబర్ ఆధారంగా ట్రేస్ చేసినట్లు పేర్కొన్నారు. యువతి క్షేమంగా ఉండడంతో ఆమె కుటుంబసభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. -
బండి భగీరథ్తో పార్టీకి సంబంధం లేదు:కిషన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: బండి భగీరథ్ అంశమై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. బండి భగీరథ్ ఇదివరకే సరెండర్ అయ్యారని ఆ విషయంతో పార్టీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర పోలీసులు అంశంలో కేంద్రానికి ఎటువంటి సంబంధం ఉండదని తెలిపారు. ఈ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతుందని తెలిపారు. పెట్రోల్ పై ట్సాక్స్ తగ్గించాలని కేంద్ర కోరినా రాష్ట్రం ఏమాత్రం తగ్గించడం లేదన్నారు.అయితే కేంద్రమంత్రి బండిసంజయ్ కుమారుడు బండి భగీరథ్ నిన్న (శనివారం) పోలీసుల ఎదుట లొంగిపోయారు. అనంతరం మేడ్చల్ మేజిస్ట్రేట్ ఎదుట ఆయనను హాజరుపరచగా న్యాయమూర్తి అతనికి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో భగీరథ్ ను చర్లపల్లి జైలుకు తరలించారు.కాగా ఈ విషయంపై స్పందించిన బండి సంజయ్.. తన కుమారుడు ఎటువంటి తప్పు చేయలేదని చెబుతున్నాడని అందుకే పోలీసుల ఎదుట లొంగిపోయారన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవించాల్సిందేనని తెలిపారు -
ఉన్నావ్ కేసు.. కుల్దీప్ సెంగర్కు బిగ్ షాక్
సాక్షి, న్యూఢిల్లీ: ఉన్నావ్ అత్యాచార కేసులో కుల్దీప్ సింగ్ సెంగర్కు బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీ హైకోర్టు సెంగర్ జీవితఖైదు శిక్షను సస్పెండ్ చేయడాన్ని సుప్రీం కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఈ క్రమంలో శుక్రవారం ఆ ఆదేశాలను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో సెంగర్ మళ్లీ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన శిక్ష సస్పెన్షన్(బెయిల్)ను రద్దు చేయడంతో పాటు.. ఢిల్లీ హైకోర్టుకు సుప్రీం కోర్టు ఇవాళ కీలక ఆదేశాలు జారీ చేసింది. కేసు మెరిట్ లోతుల్లోకి తాము వెళ్లదల్చుకోలేదని.. అయితే సెంగర్ దాఖలు చేసిన అప్పీల్పై విచారణ జరిపి రెండు నెలల్లో విచారణ పూర్తి చేసి తీర్పు ఇవ్వాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.2017లో వెలుగు చూసిన ఉన్నావో అత్యాచార కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ సమయంలో మైనర్గా ఉన్న బాధితురాలిపై అత్యాచారం జరపడంతో పాటు అక్రమ రవాణాకు ప్రయత్నించారని కుల్దీప్ సింగ్ సెంగర్పై ఆరోపణలు వచ్చాయి. దర్యాప్తు సమయంలో.. ఆ కుటుంబానికి బెదిరింపులు, అనుమానాస్పద స్థితిలో యాక్సిడెంట్ జరగడం.. బాధితురాలు ఆ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడడం.. బంధువులు చనిపోవడం.. ఈ కేసును మరింత సంక్లిష్టంగా మార్చాయి. దీంతో కేసు సీబీఐ చేతికి వెళ్లింది.అదే సమయంలో ఆ అభియోగాల నేపథ్యంలో బీజేపీ ఆయన్ని సస్పెండ్ చేసింది. అటుపై ఈ కేసులో సుదీర్ఘ విచారణ అనంతరం ఆయనకు జీవిత ఖైదు విధించింది ట్రయల్ కోర్టు. అయితే ఢిల్లీ హైకోర్టు ఆ శిక్షను సస్పెండ్ చేయడంతో బాధితురాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ తన తల్లి, హక్కుల సంఘం కార్యకర్తలతో కలిసి రాజధాని రోడ్లపై నిరసనకు దిగింది. ఆ సమయంలో అధికారులు వాళ్లను ఈడ్చుకెళ్లిన తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ వెంటనే బాధితురాలు న్యాయం కోసం ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కలిశారు. ఈలోపు.. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన శిక్ష సస్పెన్షన్పై సీబీఐ స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP) వేసింది.సెంగర్కి శిక్ష సస్పెన్షన్ ఇవ్వడం నేరం తీవ్రతను తగ్గించేలా ఉందని.బాధితురాలికి గతంలో బెదిరింపులు, ప్రమాదాలు జరిగిన నేపథ్యంలో బెయిల్ అనర్హమని సీబీఐ వాదించింది. ఈ వాదనతో ఏకీభవించిన సుప్రీం కోర్టు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను రద్దు చేసింది. ఇప్పుడు సెంగర్ తాత్కాలిక ఉపశమనం సుప్రీం కోర్టు రద్దు చేయడంతో.. ఆయన భవిష్యత్తు ఇప్పుడు హైకోర్టు ఇవ్వబోయే తీర్పుపైనే ఆధారపడి ఉంది. -
బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్ట్
-
PMJ జ్యువెలరీ దోపిడీ కేసు.. AI ని యూజ్ చేసి..
-
ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన ఘరానా దొంగలు
సాక్షి, కరీంనగర్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్ జ్యువెలరీ షాపు కేసును ఎట్టకేలకు పోలీసులు చేధించారు. నిందితులందరినీ కరీంనగర్ సీపీ గౌస్ ఆలం మీడియా ముందుకు ప్రవేశపెట్టారు. చోరి నిందితులను బిహార్, బెంగాల్లో అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.ఈ సందర్భంగా కరీంనగర్ సీపీ మీడియాతో మాట్లాడారు. "నిందితులు ఆరు రాష్ట్రాల్లో చోరీలు చేశారు. బంగారం వ్యాపారస్థునితో పాటు మరో నలుగురు నిందితులను అరెస్టు చేశాం. మెుత్తం ఈ నెట్వర్క్లో 17 మంది ఉన్నట్లు గుర్తి్ంచాం. చోరిలో 12 మంది నిందితులు పాల్గొన్నారు. పట్టుబడిన నిందితులపై 48 కేసులు ఉన్నాయి. దొంగలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చోరీ చేసేందుకు ప్లాన్ వేశారు. దొంగతనంలో మెుత్తం 13 మంది దొంగలు పాల్గొనగా వారిలో ముగ్గురిని అరెస్టు చేశాం అన్నారు.ఈ దోపిడీ సుభోద్ సింగ్ అనే వ్యక్తి మార్గదర్శకంలోనే జరిగింది. 12 రోజుల పాటు ఆపరేషన్ చేపట్టి దొంగలను పట్టుకున్నాం. దొంగలంతా రెండు నెలల క్రితమే రాష్ట్రానికి వచ్చారని పక్కా ప్లాన్ ప్రకారమే దోపిడీ చేశారని కరీంనగర్ సీపీ పేర్కొన్నారు. కాగా ఈ దొంగల ముఠా కరీంనగర్లోని పీఎంజే జ్యువెలరీ షాపులో పట్టపగలే తుపాకీలతో కాల్పులు జరిపి బంగారం ఎత్తుకెళ్లిన సంగతి తెలిసిందే. ఈ దోపిడీ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. -
రామోజీ తప్పులు మరణంతో సరా?
ఊరందరికి నీతులు చెప్పే ఈనాడు మీడియా తన గ్రూపు సంస్థల విషయానికి వచ్చేసరికి కళ్లు మూసేసుకుంటుంది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ డిపాజిట్ల సేకరణకు సంబంధించి తాజాగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలే ఇందుకు ఉదాహరణ. ఈనాడు గ్రూపు సంస్థలు మీడియా బలంతో తెలుగు రాష్ట్రాల్లో దశాబ్దాలుగా పెత్తనం చెలాయిస్తున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలాగూ వారి ఇంటి మనిషే. తెలంగాణలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ కూడా గురువు బాటలోనే నడుస్తూ ఈనాడు గ్రూపునకు వంత పాడుతున్నారన్న విమర్శ ఉంది. ఆర్బీఐ చట్టం ప్రకారం... అవిభాజ్య హిందూ కుటుంబం తరఫున ప్రజల నుంచి డిపాజిట్ల వసూలు చేస్తే సేకరించిన మొత్తానికి రెట్టింపు జరిమానా, జైలు శిక్షకు గురి అవుతారు. అయినా మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థ ప్రజల నుంచి రూ.2600 కోట్ల డిపాజిట్లు వసూలు చేసిందన్నది ఆరోపణ. రెండు దశాబ్దాల క్రితం కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ ఈ విషయమై కోర్టుకెక్కారు. ఇప్పటికీ ఒక కొలిక్కి రాకపోవడం వ్యవస్థల్లోని లోపం. ఈ వివాదం మొదలయ్యాక రామోజీరావు టీవీ ఛానళ్ల విక్రయం ద్వారా వచ్చిన మొత్తాన్ని డిపాజిటర్లకు తిరిగి చెల్లించినట్లుగా చెబుతారు కానీ... అందులో మతలబులు ఉన్నాయన్నది ఉండవల్లి వాదన. అందుకే ఆయన అప్పట్లో డిపాజిటర్ల జాబితా కోరారు.ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. తెలంగాణ హైకోర్టు మార్గదర్శి ఫైనాన్షియర్స్పై ఉన్న కేసును కొట్టి వేస్తే ఆ విషయం వ్యాజ్యం వేసిన ఉండవల్లికి కొన్ని నెలలపాటు తెలియకపోవడం. సమాచారం తెలుసుకున్న ఉండవల్లి సుప్రీంకోర్టు ఆశ్రయించడం, న్యాయస్థానం ఆదేశించడంతో కేసు మళ్లీ తెలంగాణ హైకోర్టుకు వచ్చింది. అయితే అప్పటికి సంస్థ అధినేత రామోజీ రావు మరణించినందున, రెండు రాష్ట్ర ప్రభుత్వాల అఫిడవిట్లను పరిగణనలోకి తీసుకుని హైకోర్టు కేసును కొట్టివేసింది. దీనిపై ఉండవల్లి మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గత టర్మ్లో ఏపీలో ఉన్న వైఎస్ జగన్ ప్రభుత్వం డిపాజిట్ల సేకరణలో జరిగిన తప్పులను ఎత్తిచూపి అఫిడవిట్ దాఖలు చేసింది. కాని ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు సర్కార్ మరో వైఖరి తీసుకుంది. రామోజీరావు మరణించారు కనుక ఆ కేసును ఎత్తివేయాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు, మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థ కోర్టును కోరాయి. చట్టం ప్రకారం ఇది చెల్లుతుందా అన్న చర్చ జరుగుతోంది. నేరం జరిగిన తర్వాత సంబంధిత సంస్థ యజమాని మరణిస్తే, ఆ కంపెనీ బాధ్యత తీరిపోతుందా అన్నదే ప్రశ్న. ఈ నేపథ్యంలోనే మార్గదర్శి కేసు ఇక్కడితో ముగించాలంటే ఆస్తులు అటాచ్ చేసి బాధితులకు పంచుతామని తాజాగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సంస్థ కార్యకలాపాలు కొనసాగుతున్నందున క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఆగిపోవని అభిప్రాయపడింది. మార్గదర్శి ఫైనాన్షియర్ తరపున ప్రముఖ లాయర్ ముకుల్ రోహత్గి వాదిస్తూ రామోజీరావు మరణించినందున కేసు ముగించాలని కోరగా, ఉండవల్లి అరుణకుమార్ తరపు న్యాయవాది కె.పరమేశ్వర్ అభ్యంతరం తెలిపి వ్యక్తి మరణించినా జరిగిన నేరానికి జరిమానా చెల్లించాల్సిందేనని వాదించారు. అత్యున్నత కోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు, మార్గదర్శి ఫైనాన్షియర్స్కు నోటీసులు జారీ చేసింది. అక్రమంగా రూ.2600 కోట్ల డిపాజిట్లు సేకరించారని ఆ డబ్బును ఇతర కంపెనీలకు మళ్లించారన్నది ప్రధాన ఆరోపణగా. అంతిమంగా ఈ కేసులో ఎలాంటి తీర్పు వస్తుందో చెప్పలేం. కాకపోతే నిత్యం వైఎస్సార్ కాంగ్రెస్పై, ఆ పార్టీ నేతలపైన విషం చిమ్ముతూ వార్తలు ప్రచారం చేసే ఈనాడు గ్రూపు మీడియా తన వరకు వచ్చేసరికి ఎలా వ్యవహరిస్తోందని చెప్పడానికి ఈ ఉదంతం ఉదాహరణ అవుతుంది. ఈ మధ్య టీటీడీ లడ్డూ వివాదంలో రిటైర్డ్ ఐఎఎస్ అధికారి దినేష్ కుమార్ ఇచ్చిన నివేదికపై విశ్లేషణలు ఇస్తూ వైసీపీ నేతలపై దారుణమైన కథనాలను రాసింది. ఇదొక్కటే కాదు. అనేక అంశాలలో వైసీపీ తన రాజకీయ ప్రత్యర్థి అన్నట్టుగా ఇష్టారీతిలో స్టోరీలు ఇస్తుంటుంది. గతంలో వైవి సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్గా ఉండగా లడ్డూ తయారీలో వాడే నెయ్యి నాణ్యతపై కమిటీ వేసి పరిశీలన చేయాలని ఆదేశించినా, ఆ తర్వాత దానిని ఫాలో అప్ చేయలేదన్నద ఆరోపణట. అలా చేయలేదు కనుక ఆయనను కూడా దోషిగా చూపాల్సిందేనని ఎల్లో మీడియా వాదన. ఆయనను వదలి వేస్తారా అంటూ రాజకీయ నేతల కన్నా ఎక్కువగా వాపోతూ కథనాలు ఇచ్చింది. అలాగే నెయ్యి కొనుగోలు కమిటీలో ప్రస్తుత మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గత టర్మ్లో సభ్యులుగా ఉన్నారు.వారి గురించి మాట మాత్రం రాయకుండా ఈ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్న మాజీ ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డిలు బాధ్యులని దినేష్ కుమార్ నివేదికలో ఉందట. దాని ఆధారంగా వారిపై చర్యలు తీసుకోవాలి అన్నట్లుగా ఈ మీడియా ప్రచారం చేసింది. నిత్యం ఎప్పుడో వైసీపీ హయాంలో ఆ తప్పు జరిగింది, ఈ తప్పు జరిగింది! ఇప్పటికీ వైసీపీ అనుకూల అధికారులు ఆయా సంస్థలలో పనిచేస్తున్నారంటూ పిచ్చి వార్తలు రాసే ఈనాడు మీడియా కు సుప్రీంకోర్టులో మార్గదర్శి డిపాజిట్ల కేసులో మాత్రం ఎందుకు కిక్కురుమనలేకపోయింది? వైసీపీ ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకరరావు సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై చెప్పిన అభిప్రాయం ఆసక్తికరంగా ఉంది. 'తన దగ్గర లైసెన్స్ లేని తుపాకి ఉందని, కాని ఎప్పుడూ ఎవరిని కాల్చలేదని, కేసు రాగానే తిరిగి ఇచ్చేశానని చెబితే చెల్లుతుందా?" అని ఆయన ప్రశ్నించారు. మరో వాదన కూడా వస్తోంది. రామోజీరావు ఈ కేసులో తప్పు చేసినట్లు మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థ ఒప్పుకున్నట్లేనా అన్నది ప్రశ్న. తప్పు చేసినా ఆయన మరణించారు కనుక కేసు ఎత్తివేయాలని కోర్టులో వాదిస్తున్నారా? అన్న చర్చ నడుస్తోంది. తమకు గిట్టనివారిపై ఉన్నవి,లేనివి రాసి నిత్యం బదనాం చేసే పనిలో ఉండే ఈనాడు ఈ కేసులో లాజిక్కు ఏమిటో వివరించి ఉంటే బాగుండేది కదా! పలుకుబడి కలిగిన తమకు ఆర్బీఐ నిబంధనలు వర్తించవని రాసి ఉండాల్సింది కదా! చెప్పేటందుకే నీతులు అన్నట్లుగా వ్యవహరిస్తే ఇలాగే ఉంటుంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
బండి భగీరథ్ కేసుపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రియాక్షన్
-
కరీంనగర్ PMJ జ్యువెలరీ కేసులో పురోగతి
-
అషురెడ్డికి హైకోర్టు బిగ్ షాక్.. ఏ క్షణమైనా అరెస్ట్
-
యూట్యూబ్లో చూసి ప్లాన్.. భార్యకు పాలకోవా తినిపించి..
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ప్రొద్దుటూరులో వివాహిత పద్మజ అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. కేసు వివరాలను ఏఎస్పీ విభుకృష్ణ మీడియాకు వెల్లడించారు. భర్త కిరణ్కుమార్.. పాలకోవలో విషం కలిపి హత్య చేసినట్లు పోలీసులు నిర్థారించారు. కిరణ్కుమార్ను అరెస్టు చేసిన పోలీసులు.. మీడియా ఎదుట హాజరుపరిచారు.భర్త కిరణ్.. భార్య హత్యకు యూట్యూబ్లో శోధించి ప్లాన్ వేశాడు. హైదరాబాద్ నుంచి ప్రొద్దుటూరుకు కొరియర్ ద్వారా విషం తెప్పించిన భర్త.. పాలకోవాలో విషం కలిపి భార్యకు తినిపించడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. భార్య చనిపోయిందో లేదో అనుమానంతో భర్త కిరణ్.. ఆమె ముఖంపై దిండుతో నొక్కినట్లు ఏఎస్పీ వెల్లడించారు. భార్య లావుగా ఉండటం, తనను నిత్యం అనుమానిస్తోందన్న కారణంతోనే కిరణ్ హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. -
మామ వేధింపులు తట్టుకోలేక కోడలు..!
బెంగళూరు: భర్త ఇంట్లో అదనపు కట్న వేధింపులను తట్టుకోలేక వివాహిత తన మూడు నెలల పసికందును ఉయ్యాలలో ఉంచి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద సంఘటన బెంగళూరు హుళిమావు ఠాణా పరిధిలో జరిగింది. వందన (23) ఫ్యాన్కు ఉరి వేసుకుని చనిపోయింది. వివరాలు.. మూడేళ్ల క్రితం విక్రమశేషతో ఆమెకు పెద్దలు ఘనంగా పెళ్లి చేశారు. రూ. 4 లక్షల విలువగల బైకు, బంగారు అభరణాలు కట్నంగా ఇచ్చారు. వీరికి 3 నెలల పసిబిడ్డ ఉంది. భర్తతో పాటు మామ, ఆమెను అధిక కట్నం తేవాలంటూ రోజూ వేధించేవారు. వందన తల్లిదండ్రులకు చెప్పుకుని బాధపడేది. పెద్దలు అనేక సార్లు రాజీ పంచాయతీలు చేసినా భర్తలో మార్పు రాలేదు. గదిలో ఆమె శవమై తేలింది. విక్రంశేషు కుటుంబీకులే వందనాను కొట్టి చంపేసినట్లు మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. భర్తతో మామ శ్రీనివాస్, మరిది వినిష్లపై హులిమావు పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. పసికందు తల్లి కోసం ఏడుస్తుంటే చూపరుల కళ్లు చెమర్చాయి. -
పెళ్లయి ఇద్దరు పిల్లలున్నా అనేక మందితో రేణుక ఎఫైర్.. సీతారాం కేసులో విస్తుపోయే నిజాలు
-
తేనె పూసిన ఎల్లో కత్తులు
-
నీతి కబుర్లు చెప్పే అధికారులు.. హనీ ట్రాప్ పై నోరు మెదపడం లేదు
-
కడపలో కిలాడీ లేడి.. వలపు వల విసిరింది.. 82 లక్షలు కొట్టేసింది
-
సెటిల్ చేసుకుందాం రా! సోషల్ మీడియాలో వైరల్ అయిన అషురెడ్డి ఆడియో
-
వైఎస్సార్సీపీ నేత పూడి శ్రీహరి కేసు విచారణ వాయిదా
ఢిల్లీ: సుప్రీంకోర్టులో వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి.. సోషల్ మీడియా పోస్టు కేసు విచారణ వాయిదా పడింది. మంగళవారం విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. ఈ కేసుపై రేపు(బుధవారం) హైకోర్టులో విచారణలో అన్ని పక్షాల వాదనలను పరిగణలోకి తీసుకోవాలని ‘సుప్రీం’ కోరింది. అలాగే రేపటి హైకోర్టు విచారణ నేపథ్యంలో మధ్యంతర ఉపశమన చర్యలకు నిరాకరించింది. సోషల్ మీడియా పోస్టు కేసులో హైకోర్టు మద్యంతర ఉత్తరులను సుప్రీంకోర్టులో శ్రీహరి సవాల్ చేశారు. ఈ కేసు తదుపరి విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. కేసు వివరాల్లోకి వెళితే సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అభ్యంతరకర యానిమేషన్ చిత్రాలు, అనుచిత వ్యాఖ్యలు పోస్ట్ చేశారనే అభియోగంపై వైఎస్సార్సీపీ నేత పూడి శ్రీహరి అనే వ్యక్తిని కుప్పం పోలీసులు అరెస్ట్ చేశారు. చంద్రబాబు కత్తి పట్టుకున్నట్లుగా ఉన్న యానిమేషన్ వీడియోలను వైరల్ చేశారని టీడీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదుతో, ఏప్రిల్ 1న తాడేపల్లిలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని ల్యాప్టాప్, ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా అరెస్ట్ చేశారంటూ శ్రీహరి తరపున హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైంది. తొలుత ట్రయల్ కోర్టు రిమాండ్ను తిరస్కరించినప్పటికీ, పోలీసులు హైకోర్టును ఆశ్రయించగా ఆ ఉత్తర్వులపై స్టే లభించింది.ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరగా, తనపై రాజకీయ కక్షసాధింపు జరుగుతోందని శ్రీహరి పిటిషన్లో పేర్కొన్నారు. అయితే, ఈ అంశంపై ఇప్పటికే హైకోర్టులో విచారణ పెండింగ్లో ఉన్నందున, తాము ప్రస్తుతానికి జోక్యం చేసుకోలేమని, నిందితులకు ఎలాంటి మధ్యంతర రక్షణ కల్పించలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. తదుపరి విచారణను వెకేషన్ బెంచ్కు వాయిదా వేస్తూ, హైకోర్టు నిర్ణయానికే ప్రాధాన్యతనిచ్చింది. -
హనీ ట్రాప్ కేసులో నలుగురు పోస్ట్ ఊస్ట్
-
ఆ వీడియోలతో బెదిరించి కోట్లు.. TDP నేతల గలీజ్ దందాలో పోలీసులపై యాక్షన్
-
హనీట్రాప్ కేసులో TDP కీలక నేత సస్పెండ్
-
చేతికి మట్టి అంటకుండా.. మటాష్.. పెద్ద దస్తగిరి హత్యలో భారీ కుట్ర!
-
దస్తగిరి హత్య కేసు.. FIR కాపీలో ఏముంది? ఇదీ అసలు నిజం
-
హోం స్టేలో యుఎస్ యువతిపై అత్యాచారం
బెంగళూరు: కర్ణాటకలో దారుణం జరిగింది. హోం స్టేలో నివాసం ముంటున్న ఓ యుఎస్ మహిళ అత్యాచారానికి గురైంది. మూడురోజులుగా తనను లైంగిక వేదింపులకు గురి చేస్తున్నట్లు మహిళ పేర్కొంది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు.వివరాల్లోకి వెళితే కొడుగులోని ఓ హోమో స్టేలో ఒక అమెరికన్ మహిళ తాత్కాలిక నివాసం ఉంటుంది. అయితే ఆమెపై గత మూడురోజులు అందులో పనిచేసే వ్యక్తి అత్యాచారం చేసినట్లు యువతి పేర్కొంది. ఆ సమయంలో ఆమె ఎవరిని సంప్రదించకుండా వైపై సేవలు నిలిపివేసినట్లు పేర్కొంది. దీంతో తను మైసూరు వెళుతున్నానని చెప్పి అక్కడి నుండి తప్పించుకున్నానని కంప్లేంట్లో తెలిపింది. అనంతరం అక్కడి నుండి యుఎస్ ఎంబసీని సంప్రదించగా వారు మైసూరు పోలీసులకు వివరాలు తెలియజేశారు.దీంతో వివరాలు తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. హోం స్టే నిర్వాహకుడితో పాటు అందులో పని చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు కొడగు ఎస్పీ తెలిపారు. నిందుతుడు జార్ఖండ్కు చెందిన వృజేశ్ కుమార్గా గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ కేసుపై లోతైన విచారణ జరుపుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
హత్య వెనుక కనిపించని కుట్ర.. సినిమాను తలిపించే ట్విస్ట్
-
దస్తగిరి కేసులో హైటెక్ కుట్ర..!
సాక్షి, అమరావతి: కడపలోని రిమ్స్ ఆవరణలో జరిగిన హత్య కేసులో హైటెక్ కుట్రలు చోటు చేసుకుంటున్నాయి. పోలీసు శాఖలోనే ఉన్నత స్థాయి అధికారుల మెప్పు కోసం కొందరు పోలీసులు వైఎస్సార్సీపీ నాయకులను టార్గెట్ చేస్తూ అడుగులు వేస్తున్నారు. వ్యక్తిగత గొడవల నేపథ్యంతో పాటు గంజాయి మత్తులో చేసిన హత్య విషయంలోనూ ఏదో ఒక రకంగా ఇరికించాలనే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి.అన్ని రకాలుగా దస్తగిరి హత్య విషయంలో హైటెక్ కుట్రను మరిపిస్తున్నారు. రిమ్స్ ఆవరణలో ఉన్న దస్తగిరిని మట్టుబెట్టిన కేసులో దర్యాప్తు పక్కదారి పడుతుందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. పచ్చ పత్రికలు, మీడియాకు లీకులిస్తూ అందుకు అనుగుణంగా ఇన్వెస్టిగేషన్ను ముందుకు తీసుకెళ్తూ వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది.రిమాండ్ రిపోర్ట్లో వైఎస్సార్సీపీ నేతల ప్రస్తావనకడపలో ఈ నెల 6వ తేదీన జరిగిన దస్తగిరి హత్య కేసులో పోలీసులు పక్షపాతంగా వెళ్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఆది నుంచి కూడా ఎవరికీ తెలియకుండా నిందితుల వివరాలు బయటపడకుండా పోలీసులు అనుసరిస్తున్న వైఖరిపై చర్చ సాగుతోంది. దస్తగిరి హత్య కేసులో అన్ని విధాలుగా విచారణ చేస్తున్నామంటూనే పోలీసులు వైఎస్సార్సీపీ నేతల పేర్లు నిందితుల ద్వారా తెప్పించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే మొదటి నుంచి కూడా దస్తగిరితో పాటు మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, ఇతర నేతలందరూ కలిసిమెలసి ఉంటున్నారు. రిమాండ్ రిపోర్ట్లో వారు చెప్పినట్లు కాల్ రికార్డులు ఉన్నాయని కేసులో 13వ నిందితుడుగా నిత్యానందరెడ్డిని చేర్చారు. ముందుగా గంజాయి బ్యాచ్తో పాటు వ్యక్తిగత కారణాలతో హత్య జరిగిందని సోషల్ మీడియాతో పాటు ఇతర ప్రచార మాధ్యమాలు ఘోషించాయి. తరువాత క్రమంలో రాజకీయ ఒత్తిడులో లేక ఇతర కారణాలేవో తెలియదు కానీ దర్యాప్తులో పోలీసులు రూటు మార్చడంపై విమర్శలు వస్తున్నాయి.మాజీ సీఎం జగన్ వస్తారని..ఈ నెల మొదటి వారంలో హత్యకు గురైన దస్తగిరి కుటుంబాన్ని పరామర్శించడానికి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వస్తారని సోషల్ మీడియాలో ప్రచా రం జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అ య్యారు. దీంతో కేసులో వేగంపెంచారు. దస్తగిరి హత్య విషయంలో ఎక్కడ ప్రభుత్వాన్ని నేతలు, పోలీసులను టార్గెట్ చేస్తారన్న ఆలోచనతో ఆగమేఘాల మీద విచారణ సాగిస్తున్నారు. అయితే ఇందులో ఫోన్ కాల్ రికార్డులు ఇతర వ్యవహారాల పరిస్థితులను చూపిస్తూ వైఎస్సార్సీపీపై నెపం నెట్టేందుకు సిద్ధమయ్యారు. డొల్లతనం బయటపడకుండా దర్యాప్తు డైవర్ట్ఈ నెల 6వ తేదీన అలంఖాన్పల్లెలో గొడవ జరిగిన తరువాత రిమ్స్ ఆవరణలో దస్తగిరిని కొంత మంది విచక్షణారహితంగా కత్తులతో పొడిచి హతమార్చిన ఘటన సంచలనం రేకెత్తించింది. అయితే అంతకు ముందు దాడులు జరిగిన నేపథ్యంలో నాకు రక్షణ కలి్పంచాలని దస్తగిరి పోలీసులకు మొరపెట్టుకున్నా ఎవరూ స్పందించలేదని సర్వత్రా చర్చ సాగుతోంది. అలంఖాన్పల్లె నుంచి రిమ్స్కు పోయేలోపే తనకు ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పుకున్నా పోలీసులు పట్టించుకోలేదు.ఈ నేపథ్యంలో రిమ్స్కు వెళ్తున్న దస్తగిరిపై దాడులు జరగడం చనిపోవడం కనిపించింది. ఈ నేపథ్యంలో దస్తగిరిని పొట్టన పెట్టుకున్న నిందితుల వివరాలు తేల్చాల్సిన పోలీసులు రాజకీయ డ్రామాలకు తెరతీయడంపై విమర్శలు చెలరేగుతున్నాయి. అసలు ఏం జరుగుతోందో తెలియదు కానీ పోలీసులు డైవర్షన్ డ్రామాలతో హత్య కేసు దర్యాప్తులో అలా పక్కదారి వెళ్తుంది. ఏది ఏమైనా వైఎస్ఆర్సీపీ కీలక నేత, మాజీ డిప్యూటీ మేజర్ నిత్యానందరెడ్డి టార్గెట్గా కేసు విచారణ జరుగుతున్నదని జగమెరిగిన సత్యం.వైఎస్సార్ కడప జిల్లాలో జరిగిన దస్తగిరి హత్య కేసుకు సంబంధించి మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి చుట్టూ పోలీసులు వలపన్నుతున్నారు. ఆది నుంచి నిందితులతో పాటు చనిపోయిన వ్యక్తి అందరూ కలిసిమెలసి తిరుగుతున్నారు. అయితే అనేక కారణాలు వ్యక్తిగత పరిస్థితులు ఇతర కారణాలు ఏవైనా దస్తగిరి హత్య నేపథ్యంలో వైఎస్సార్సీపీ నేతలను ఇరికించే ప్రయత్నం సాగుతోందని పార్టీ నాయకులు తీవ్రంగా స్పందిస్తున్నారు. అయితే వ్యక్తిగత పరిచయాలు గతంలో.. దిగిన ఫొటోలు.. ఇతర కాల్ డేటా ఆధారం చేసుకుని మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డిని కేసులో ఇరికించే ప్రక్రియ షురూ అయింది. పోలీసులు అధికార పార్టీ, పోలీసు ఉన్నతాధికారుల మెప్పు కోసం మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి లక్ష్యంగా ముందుకు వెళ్లడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.నిత్యానందరెడ్డి ఇంటిని చుట్టుముట్టిన పోలీసులుకడప: కడప నగర శివార్లలోని మాజీ డిప్యూటి మేయర్ బండి నిత్యానందరెడ్డి అక్రమ అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఏడు వాహనాల్లో స్పెషల్ పోలీసులు ఇంటిపై దాడి చేసి సోదాలు చేసినట్లు తెలిసింది. వాహనాల్లో పోలీసులు ఒక్కసారిగా వచ్చి ఇంటిమీద దాడి చేయడంతో కుటుంబసభ్యులు భయాందోళనకు గురైనట్లు తెలిసింది. పోలీసులు స్థలాలకు సంబంధించిన డాక్యుమెంట్స్కోసం ఇళ్లంతా శోధించి కొన్ని పత్రాలు, ఒక ల్యాప్ట్యాప్ తీసుకెళ్లారు. ఆర్థరాత్రి వరకు పోలీసులు అక్కడే తిష్ట వేశారు. -
కుటుంబ గౌరవాన్ని కాపాడేందుకు గరళం తాగిన శివుడు జగన్
-
సింగర్ మంగ్లీ కేసులో రిమాండ్ కు మధు
-
TCS లైంగిక వేధింపుల కేసులో మరో ట్విస్ట్.. నిదాఖాన్ HR కాదు..
-
రాహుల్ గాంధీకి ఎదురుదెబ్బ
సాక్షి, లక్నో: లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ద్వంద్వ పౌరసత్వం (Dual Citizenship) రాహుల్ గాంధీకి ఎదురుదెబ్బఆరోపణపై విచారణ జరపాలని అలహాబాద్ హైకోర్టులోని లక్నో బెంచ్ శుక్రవారం ఆదేశించింది. ఈ విచారణను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వమే స్వయంగా నిర్వహించాలని లేదా ఈ విషయాన్ని ఒక కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించి జరిపించాలని ఆదేశించింది.రాహుల్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్న తన అభ్యర్థనను లక్నోలోని ప్రత్యేక ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు జనవరి 28న తిరస్కరించగా, ఆ ఉత్తర్వును సవాలు చేస్తూ బీజేపీ కార్యకర్త ఎస్. విఘ్నేష్ శిశిర్ దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు ఈ ఉత్తర్వులను జారీ చేసింది. కర్ణాటక నివాసి అయిన పిటిషనర్, భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), అధికార రహస్యాల చట్టం, విదేశీయుల చట్టం, పాస్పోర్ట్ చట్టంలోని నిబంధనల కింద ఆరోపణలు చేస్తూ, ఎఫ్ఐఆర్ నమోదు చేసి, సమగ్ర దర్యాప్తు జరపాలని కోరారు.ఇదీ చదవండి: ఇన్స్టా లవ్ : 40 ఏళ్ల విడోతో 21 ఏళ్ల యువకుడి పెళ్లిఈ ఫిర్యాదును మొదట రాయ్బరేలీలోని ప్రత్యేక ఎంపీ/ఎమ్మెల్యే కోర్టులో దాఖలు చేశారు. 2025 డిసెంబర్ 17న, హైకోర్టు ఈ కేసును లక్నోకు బదిలీ చేసింది. పౌరసత్వానికి సంబంధించిన అంశాలపై నిర్ణయం తీసుకునే అధికారం తమకు లేదని దిగువ కోర్టు పేర్కొంది. లక్నో కోర్టు తన అభ్యర్థనను కొట్టివేసిన తర్వాత పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించారు. ఇదీ చదవండి: టీసీఎస్ కేసు : మతమార్పిడి ఆరోపణల్లో సంచలన సాక్ష్యంఇదీ చదవండి: నో ఇంజెక్షన్, రోజుకో పిల్ : యూఏఈ సంచలనం -
200 కోట్ల స్కామ్.. మంగ్లీ కేసులో మరో ట్విస్ట్..
-
నేను ఏ తప్పు చేయలేదు.. చేయను కూడా..: సింగర్ మంగ్లీ
టాలీవుడ్ సింగర్ మంగ్లీ మరోసారి తన ఆవేదన వ్యక్తం చేశారు. నాపై ఇప్పటికీ బురద జల్లడం ఆగడం లేదన్నారు. మైక్రో ఫైనాన్స్ బాధితులకు న్యాయం జరిగే వరకు పోలీసులకు సహకరిస్తానని అన్నారు. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. మంగ్లీ ఎలాంటి తప్పు చేయలేదని.. భవిష్యత్తులో చేయదు కూడా అని వెల్లడించారు.మధునాయక్ను మా కమ్యూనిటీ ప్రోగ్రామ్లో భాగంగా నన్ను, నా తమ్ముడిని కలిసిన మాట వాస్తవమేనని.. కానీ అతని వ్యాపారాల గురించి తనకు తెలియదన్నారు. ఈ కేసు విషయం నా దృష్టికి వచ్చిన వెంటనే అడ్వకేట్ సుబ్బారావుతో పాటు రమావత్ మధుపై పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపింది. తప్పు చేసిన రమావత్ మధు అండ్ గ్యాంగ్పై తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేసింది. ఈ కేసులో మోసగాళ్లను, బాధితులను అంశాలను పక్కనపెట్టి.. నాపై నా కుటుంబంపై కొందరు వ్యక్తులు కావాలనే ఈ వివాదంలోకి నన్ను లాగుతున్నారని మంగ్లీ తన బాధను వ్యక్తం చేసింది.మైక్రో ఫైనాన్స్ అనే పదమే నాకు ఇంతకు ముందెప్పుడూ తెలియదని మంగ్లీ తెలిపింది. అలాంటిది నేను ఇంత పెద్ద కుట్ర చేశానని అభియోగం రావడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసిందని వెల్లడించింది. నేను కూడా మైక్రో ఫైనాన్స్ బాధితురాలినేనని.. వాళ్లు అమాయకులు డబ్బులు పోగొట్టుకుంటే.. నేను నా పేరు పోగొట్టుకుంటున్నానని మంగ్లీ ఆవేదన వ్యక్తం చేసింది. -
డాక్యుమెంట్స్ లో ఏముంది..? నిందితులు దేనికోసం వెతికారు..?
-
మంగ్లీ కేసు రోజుకో ట్విస్టు
-
'నా వల్ల కావడం లేదు.. నా తప్పుంటే జైలుకైనా వెళ్తా'.. సింగర్ మంగ్లీ ఆవేదన
తనపై వస్తున్న ఆరోపణలపై టాలీవుడ్ సింగర్ మంగ్లీ మరోసారి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే తనకు ఎలాంటి వ్యాపారాలు లేవు.. పాటే నా ప్రాణమని చెప్పిన మంగ్లీ మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఈ వివాదంపై సీపీ సజ్జనార్ను కలిపి ఫిర్యాదు చేసిన మంగ్లీ.. తన లాయర్తో డీజీపీని కలిశారు. ఈ సందర్భంగా ఆమె మీడియా మాట్లాడారు. ఈ వివాదంతో 30 రోజులుగా నా ప్రోగ్రామ్స్ అన్నీ వదులుకోవాల్సి వచ్చిందని తెలిపింది. దయచేసి చెబుతున్నా.. నా తప్పు ఉంటే ఎలాంటి శిక్షకైనా నేను సిద్ధమని ప్రకటించింది. సోషల్ మీడియాలో వచ్చే వాటిని ఎవరు నమ్మకండని విజ్ఞప్తి చేసింది. సోషల్మీడియాలో పెట్టే పోస్టులు చూస్తుంటే చాలా బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. నా పేరు చెప్పి డబ్బులు వసూలు చేసిన వారందరిపైనా కేసులు పెట్టానని మంగ్లీ తెలిపింది. డీజీపీని కలిసి ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు.మంగ్లీ మాట్లాడుతూ..'నాకు పాటల ప్రపంచ తప్ప మరేది తెలియదు. సోషల్ మీడియాలో వచ్చే వాటిని నమ్మకండి. కొందరి కామెంట్లు చూసి లోలోపల కుమిలిపోతున్నా. ఇక నా వల్ల కావటం లేదు. నేను తప్పు చేస్తే, విచారణకు సిద్ధం. ఆరోపణలు నిజమైతే జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమే. బాధితుడి ఆవేదన చూస్తుంటే నాకూ బాధగా ఉంది. నేను కూడా పేదరికం నుంచే వచ్చా. ఆ బాధేంటో నాకు తెలుసు. నాపై కోపం ఉంటే వచ్చి మాట్లాడండి. ప్రజలకు నన్ను దూరం చేస్తున్నారు. తెలిసి, తెలియక తప్పు మాట్లాడితే క్షమించండి. సంబంధం లేని విషయాల్లో నా ఫొటోలు దయచేసి వాడకండి. బాధితులకు నేను అండగా ఉంటా. నా దుష్ప్రచారం చేసిన వారిని కూడా కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరుతున్నా. మధు నాయక్, హిమకాంత్ రెడ్డి, రమావత్ మధు, సిద్ధు, సుబ్బారావులపై డీజీపీకి ఫిర్యాదు చేశా' అని అన్నారు. అసలేం జరిగిందంటే..సింగర్ మంగ్లీ మైక్రో ఫైనాన్స్ పేరిట రూ.10 కోట్ల మోసానికి పాల్పడ్డారని సుబ్బారావు అనే న్యాయవాది ఆరోపించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మంగ్లీతో పాటు మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత మంగ్లీ కూడా పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. అసత్య ప్రచారం చేస్తోన్న సుబ్బారావుపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది. -
నేచురల్ డెత్ కాదు.. బాత్ రూమ్ లో వేసి నరికారు.. YS వివేకా కేసులో సంచలన విషయాలు
-
రూ.90 లక్షలు ఇస్తేనే ఫస్ట్నైట్ : తీవ్ర ఘర్షణ, కట్ చేస్తే!
ఆగ్రాలో జరిగిన ఒక వింత సంఘటన పెళ్లి చేసుకున్న మొదటి రోజే ఆ కొత్త పెళ్లికొడుకు ఆశలను అడియాశలు చేసింది. పెళ్లిలో మూడు ముళ్ల ముచ్చటను పూర్తి చేసుకొని ఫస్ట్నైట్ ముచ్చట కోసం ఎదురు చూస్తున్న వరుడుకి భారీ షాక్ తగిలింది. చివరికి ఇది ఘర్షణకు, ఆ తరువాత పోలీస్ కేసు వరకు దారి తీసింది. విషయం ఏమిటంటే..ఒకటీ రెండూ కాదు ఏకంగా రూ. 90 లక్షల డిమాండ్ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో జగదీష్పురా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. తొలి రాత్రే వధువు తన భర్తను రూ. 90 లక్షలు డిమాండ్ చేసిన ఘటన వైరల్గా మారింది. ఆగ్రాలోని జగదీష్పురా ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి (ఒక డాక్టర్ తమ్ముడు), హత్రాస్కు చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. పెళ్లి వేడుకలు ఘనంగా ముగిసాయి. సాంప్రదాయం ప్రకారం దంపతులు శోభనం గదిలోకి వెళ్లారు. ఈ వేడకలో భాగంగా వధువు కొంగున ఎంతో కొంత బంగారం మూట గట్టడం ఆనవాయితీ. కానీ ఈ వధువు తనకు ఏకంగా రూ. 90 లక్షల నగదు కావాలని డిమాండ్ చేసింది. అది ఇస్తేనే శారీరక సంబంధానికి అంగీకరిస్తానని భర్తతో చెప్పింది. దీంతో షాకైన భర్తఅందుకు నిరాకరించడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.పెళ్లికొడుకు కుటుంబ సభ్యులు ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు, కానీ వధువు తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి రప్పించింది. దీంతో వారొచ్చి నానా హంగామా సృష్టించడంతో వివాదం మరింత ముదిరింది. తీవ్ర ఘర్షణకు దారి తీసింది. వరుడి ఇంటిపై దాడి చేసిన వస్తువులను ధ్వంసం చేశారు.అక్కడితో ఆగలేదు... పెళ్లికొడుకు కుటుంబాన్ని లోపల ఉంచి బయట నుంచి తాళం వేశారు.ఇంట్లో ఉన్న పీఎన్జీ (PNG) గ్యాస్ పైప్లైన్ను పగులగొట్టి, గ్యాస్ లీక్ చేసి ఇంటికి నిప్పు పెట్టాలని చూశారని ఆపోపణలు. మొత్తానికి పొరుగువారి సహాయంతో వరుడి కుటుంబం ప్రాణాలతో బయటపడింది. దీంతో నిందితులు, వధువు అక్కడినుంచి పారిపోయారు. పోతూ పోతూ, వధువు తనతో పాటు అత్తగారి నగలను, విలువైన వస్తువులను తీసుకుని ఉడాయించింది.ఈ ఘటనపై వరుడి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వధువు, ఆమె కుటుంబ సభ్యులపై తీవ్ర ఆరోపణలు చేసింది. అసలు ఆమె ఉద్దేశం పెళ్లి కాదని, కేవలం డబ్బు సంపాదించడమేనని ఆమె లక్ష్యమని బాధితులు తమ ఫిర్యాదులో తెలిపారు. ఈ విషయాన్నివధువు స్వయంగా ఒప్పుకుందని కూడా వారు పేర్కొన్నార. అలాగే గ్యాస్ పేల్చి, అందరినీ చంపేయాలని చూశారని బాధితులు ఆరోపించారు. తొలుత పోలీసులు స్పందించకపోవడంతో, వరుడి కుటుంబం కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాల మేరకు జగదీష్పురా పోలీసులు వధువు, ఆమె తండ్రి , ఇతరులపై కేసు నమోదు చేశారు.ఎట్టకేలకు కేసు నమోదు చేసిన పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. ఈ పెళ్లి కుదిర్చిన మధ్యవర్తి కోసం కూడా గాలిస్తున్నారు. ఇది అసలైన మోసమా లేక వరకట్న వేధింపుల కేసు నుంచి తప్పించుకోవడానికి ముందుగా ప్లాన్ చేసిన గొడవా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆ రోజు ఏంజరిగిందంటే.. విజయ రెడ్డి కేసులో ఊహించని ట్విస్ట్..
-
10 లక్షలు డిమాండ్.. మంగ్లీ కేసులో మరో మలుపు
-
ఘజియాబాద్ చిన్నారి ఉదంతం.. సుప్రీంకోర్టు కంటతడి
ఘజియాబాద్: ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో నాలుగేళ్ల చిన్నారిపై జరిగిన అమానుష ఘటన నాగరిక సమాజాన్ని తలదించుకునేలా చేసింది. ఒకవైపు కామాంధుడి పాశవిక చర్య, మరోవైపు పోలీసుల ఉదాసీనత, ఆపై ఆసుపత్రుల అమానవత్వం.. మొత్తంగా ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. ఈ ఉదంతంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్రస్థాయిలో మండిపడింది.మార్చి 16న జరిగిన ఈ దారుణ ఘటనలో చిన్నారి ప్రైవేట్ భాగాల్లో వస్తువులు జొప్పించి, హింసించినట్లు పోస్ట్మార్టం నివేదికలు చెబుతున్నాయి. అయితే ఈ ఉదంతంలో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినా, అందులో కనీసం ‘పోక్సో’ సెక్షన్లను చేర్చకపోవడంపై సుప్రీంకోర్టు అనుమానం వ్యక్తం చేసింది. మరోవైపు రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న చిన్నారిని చూసి కూడా.. ఖజన్ సింగ్ మాన్వీ హెల్త్ కేర్, సెయింట్ జోసెఫ్ ఆస్పత్రులు చేర్చుకోకపోవడంతో సకాలంలో వైద్యం అందక ఆ చిన్నారి కన్నుమూసింది. ప్రాణాలు కాపాడాల్సిన వైద్య వ్యవస్థే మృత్యువుకు దారి చూపడం అమానవీయమని సుప్రీం కోర్టు మండిపడింది. ఈ నిర్లక్ష్యానికి బాధ్యులైన ఆసుపత్రులకు కోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది.న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మాల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం పంచోలిలతో కూడిన ధర్మాసనం ఈ కేసును సీరియస్గా తీసుకుంది. ఏప్రిల్ 13న ఘజియాబాద్ పోలీస్ కమిషనర్, నంద్గ్రామ్ ఎస్హెచ్ఓ స్వయంగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ కేసు దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) లేదా కేంద్ర సంస్థకు అప్పగించాలని సుప్రీం కోర్టు నిర్ణయించింది.‘న్యాయం అంటే కేవలం తీర్పు చెప్పడమే కాదు.. బాధ్యతను గుర్తు చేయడం కూడా’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.ఇది కూడా చదవండి: స్టూడెంట్ డెత్ మిస్టరీ: పార్టీ చేసుకుందామని పిలిచి.. -
అక్క మృతి.. చెల్లెలిపై కేసు: 13 ఏళ్ల తర్వాత..
ముంబై: ఒక బిడ్డ దూరమైందన్న శోకం ఒకవైపు.. మరో బిడ్డ జైలు పాలవుతుందన్న భయం మరోవైపు.. ఆ రాత్రి ముంబై హైవేపై జరిగిన ప్రమాదం ఆ కుటుంబానికి 13 ఏళ్ల పాటు నరకాన్ని చూపింది. అయితే ఈ కేసులో చిక్కుముడి ఎట్టకేలకు వీడింది. పోలీసుల రికార్డుల్లో నేరస్తురాలిగా ముద్రపడిన సోదరిని ఆమె సోదరుడే కాపాడాడు.2012, అక్టోబర్ 14న వెస్టర్న్ ఎక్స్ప్రెస్ హైవేపై జరిగిన ఆ ఘోర ప్రమాదం ఖురానా కుటుంబంలో తీరని ఆవేదనను నింపింది. ఆస్పత్రిలో అక్క గుంజన్ ప్రాణాలు వదలగా, నాడు కారు నడిపిన చెల్లెలు పారుల్ ఖురానా నిర్లక్ష్యమే ఈ మృతికి కారణమని పోలీసులు కేసు నమోదు చేశారు. సొంత అక్క మరణానికి కారణమయ్యానన్న అపరాధభావం ఒకవైపు, పోలీసుల విచారణ మరోవైపు పారుల్ను కుంగదీశాయి. న్యాయం కోసం ఆమె చేసిన పోరాటం ఒక ఏడాది కాదు, రెండేళ్లు కాదు.. ఏకంగా 13 ఏళ్ల పాటు సాగింది.ఈ కేసులో అత్యంత కీలక మలుపు వారి సోదరుడి వాంగ్మూలం. పోలీసులు చెబుతున్నట్లు పారుల్ కారు నడపలేదని, ప్రమాద సమయంలో స్టీరింగ్ గుంజన్ చేతిలోనే ఉందని అతను కోర్టులో వెల్లడించాడు. వెనుక నుంచి వేగంగా వచ్చిన ‘బెస్ట్’ బస్సు ఢీకొట్టడం వల్లే కారు నియంత్రణ కోల్పోయిందని సాక్ష్యం ఇచ్చాడు. ‘చనిపోయిన ఒక సోదరిని కాదని, తప్పు చేసిన మరో సోదరిని కాపాడటానికి ఏ తమ్ముడూ అబద్ధం చెప్పడు’ అని మేజిస్ట్రేట్ ఏ.ఎం. ముజావర్ చేసిన వ్యాఖ్యలు ఈ కేసులో మానవీయ కోణాన్ని ఆవిష్కరించాయి.పోలీసుల దర్యాప్తులోని వైఫల్యాలను కోర్టు తీవ్రంగా పరిగణించింది. కారు నేరుగా వెళ్లి స్తంభాన్ని ఢీకొట్టిందని పోలీసులు వాదించగా, కారు వెనుక భాగం ధ్వంసమైన ఫోటోలు అసలు నిజాన్ని బయటపెట్టాయి. బస్సు ఢీకొట్టిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నా, ఆ కోణంలో కనీసం విచారణ చేయకపోవడం దర్యాప్తు అధికారి నిర్లక్ష్యమేనని కోర్టు తేల్చి చెప్పింది. చివరకు వాస్తవాలను, ఫోటో సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకున్న బోరివలి కోర్టు, పారుల్ను నిర్దోషిగా ప్రకటిస్తూ 13 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. -
గిరిజన బాలిక కేసులో నిందితుడిని తప్పించే యత్నం
-
చదువు చెప్తానని.. నమ్మిన బాలికపై అత్యాచారం
-
దగ్గుబాటి కుటుంబ కేసు.. ఆ విషయంలో జాగ్రత్త..!
దగ్గుబాటి కుటుంబానికి సంబంధించిన కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది. దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత కేసు విచారణ ఏప్రిల్ 10కి కోర్టు వాయిదా వేశారని దగ్గుబాటి కుటుంబం లీగల్ టీమ్ తెలిపింది. గతంలో మాదిరిగానే రాబోయే విచారణకు దగ్గుబాటి కుటుంబ సభ్యులు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టంగా చేసిందని వెల్లడించింది.అయితే విచారణ సమయంలో నాన్-బెయిలబుల్ వారెంట్ (NBW) జారీ చేయలేదని లీగల్ టీమ్ పేర్కొంది. దీనికి విరుద్ధంగా ప్రత్యర్థులు,కొన్ని వర్గాలు చేసే ప్రచారం పూర్తిగా అసత్యం, తప్పుదోవ పట్టించేవని తెలియజేసింది. ఈ కేసుకు సంబంధించి మీడియా సంస్థలు ఏవైనా వార్తలు ప్రచురించే ముందు కోర్టు ఆదేశాలను పరిశీలించడం, దగ్గుబాటి కుటుంబం న్యాయ సలహాదారుని సంప్రదించి ప్రచురించాలని లీగల్ టీమ్ విజ్ఞప్తి చేసింది.అసలు కేసు ఏంటంటే..?గతంలో సినీ హీరో దగ్గుబాటి వెంకటేష్ కుటుంబ సభ్యులపై ఫిలింనగర్ పోలీస్స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. ఫిలింనగర్ రోడ్డునెంబర్–1లో ఉన్న దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత వ్యవహారంలో బాధితుడు నందకుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోర్టు ఆదేశాలతో పోలీసులు నిర్మాత దగ్గుబాటి సురేష్బాబు (ఏ1), దగ్గుబాటి వెంకటేష్ (ఏ2), దగ్గుబాటి రానా (ఏ3), దగ్గుబాటి అభిరామ్ (ఏ4)లపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.2022 నవంబర్లో దక్కన్ కిచెన్ హోటల్ను జీహెచ్ఎంసీ టౌన్ప్లానింగ్ అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేశారు. నందకుమార్కు చెందిన దక్కన్ కిచెన్ హోటల్ అంశంలో దగ్గుబాటి కుటుంబంతో స్థల వివాదం ఉంది. నందకుమార్ సిటీ సివిల్ కోర్టులో కేసు కూడా వేశారు. ఈ అంశంలో స్టేటస్ కో కొనసాగించాలని.. ఆ స్థలంలో ఎలాంటి చర్యలకు దిగవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.అయితే న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలు బేఖాతరు చేస్తూ గతేడాది జవనరిలో దగ్గుబాటి కుటుంబం హోటల్ను పూర్తిగా నేలమట్టం చేసింది. దీంతో మరోసారి బాధితుడు నందకుమార్ దగ్గుబాటి కుటుంబ సభ్యులపై కోర్టు ఆదేశాల ఉల్లంఘన కేసు నమోదు చేయాలని కోరుతూ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన నాంపల్లి న్యాయస్థానం ఈ ఘటనలో కేసు నమోదు చేసి విచారణ చేయాలంటూ ఫిలింనగర్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. -
అందుకే లాగిపెట్టి చెంప చెల్లు మని.. వైఎస్ సునీతపై KS ప్రసాద్ షాకింగ్ నిజాలు
-
నాపై మూడేళ్లుగా సీఐ అత్యాచారం
యశవంతపుర(కర్ణాటక): మహిళలను వేధించిన వ్యవహారంలో దక్షిణ కన్నడ జిల్లా మూడబిదిరె సీఐ పీజీ సందేశ్ వివాదం కొనసాగుతూనే ఉంది. వేధింపుల కేసులో ఆయనను సస్పెండ్ చేస్తే సరిపోదు, కేసు కూడా పెట్టాలి అని బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దక్షిణకన్నడ జిల్లా బెళ్తంగడి తాలూకా వేణూరు పోలీసులు సందేశ్పై అత్యాచారం కేసు నమోదు చేశారు. 2020 నుంచి 2023 మధ్య మూడేళ్లపాటు తన ఇంటికి సందేశ్ తరచూ వస్తూ లైంగిక దాడి చేసేవాడని మహిళ ఫిర్యాదులో ఆరోపించడం సంచలనం కలిగిస్తోంది. ఇది జిల్లా పోలీసులకు కూడా తలనొప్పిగా మారింది. 2020లో సందేశ్ బెళ్తంగడి సర్కిల్లోని వేణూరు పోలీసుస్టేషన్ సీఐగా పని చేసేవారు. ఘటన అక్కడే జరగడంతో కేసును అక్కడే నమోదు చేసుకున్నారు. సందేశ్పై ఇద్దరు మహిళలు చేసిన లైంగిక వేధింపుల అరోపణలు అవాస్తవమని పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. కానీ అంతలోనే రేప్ కేసు పెట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రానురాను ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందోనన్న కుతూహలం వ్యక్తమవుతోంది. అలాగే సీఐని అరెస్టు చేస్తారా అనేది మిస్టరీగా మారింది. -
ఇదిగో దస్తగిరి స్టేట్మెంట్.. ఈ ఒక్క దానికి సమాధానం చెప్పండి చాలు
-
ముప్పిడి అవినాశ్రెడ్డికి సుప్రీంకోర్టు బెయిల్
సాక్షి, న్యూఢిల్లీ: అన్యాయంగా ఇరికించిన మద్యం అక్రమ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముప్పిడి అవినాశ్రెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనకు సర్వోన్నత న్యాయస్థానం రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద ఉన్న విశేషాధికారాలను ఉపయోగించి ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను రెగ్యులర్ బెయిల్ పిటిషన్గా పరిగణిస్తూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని జస్టిస్ జోయ్ మాల్యబాల్చి, జస్టిస్ విపుల్ ఎం. పంచోలి త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం బెయిల్ ఉత్తర్వులు జారీ చేసింది. అంతకిందట ఇరు పక్షాల వాదనలు విన్న సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం పిటిషన్ కొట్టివేతకు దర్యాప్తు సంస్థలు చేసిన అభ్యర్థనలపై కీలక వ్యాఖ్యలు చేసింది. ‘నిందితుడు కోర్టు ఆదేశాలను గౌరవించి లొంగిపోయాడు. విచారణకు సహకరించాడు. పోలీసుల కస్టడీ ముగిసిన తర్వాత నిందితుడిని జ్యుడీషియల్ కస్టడీలో ఇంకా ఎందుకు ఉంచాలి?’ అని ప్రశ్నించింది. దర్యాప్తు కొలిక్కి రావడానికి కనీసం మరో పది రోజుల సమయం కావాలన్న ఏపీ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా విజ్ఞప్తిని ధర్మాసనం తిరస్కరించింది. కింది కోర్టు విధించే షరతులు, పూచీకత్తుకు లోబడి అవినాశ్రెడ్డిని జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. ఈ కేసులోని ప్రత్యేక పరిస్థితుల ఆధారంగా మాత్రమే ఈ బెయిల్ మంజూరు చేస్తున్నామని ధర్మాసనం తీర్పులో స్పష్టం చేసింది. ఈ కేసులో హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో అవినాశ్రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.అవినాశ్రెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దవే వాదనల్లో ముఖ్యాంశాలు.. » ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఆదేశాల మేరకే నిందితుడు విదేశాల నుంచి తిరిగి వచ్చి ఫిబ్రవరి 26న దర్యాప్తు అధికారుల ముందు లొంగిపోయారు. » ఇప్పటికే మూడు రోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. కస్టోడియల్ విచారణ పూర్తయినందున ఆయన ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. » ఇదే అక్రమ కేసులో ఆయన సోదరుడితో పాటు పలువురు సహ నిందితులకు ఇప్పటికే బెయిల్ మంజూరయ్యింది. » దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తున్నందున ఇప్పటికే దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను రెగ్యులర్ బెయిల్ పిటిషన్గా పరిగణించి ఊరట కల్పించాలి.ఆర్టికల్ 142 ఏమి చెబుతోందంటే.. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం, సుప్రీంకోర్టు తన ముందు పెండింగ్లో ఉన్న ఏ విషయంపైనైనా సంపూర్ణ న్యాయం చేయడానికి అవసరమైన ఆదేశాలు లేదా డిక్రీలను జారీ చేసే ప్రత్యేక అధికారాన్ని కలిగి ఉంటుంది. చట్టంలో నిర్దిష్ట నిబంధనలు లేనప్పుడు లేదా ఉన్న చట్టం పరిధి సరిగా వర్తించలేని పరిస్థితి ఉన్నప్పుడు అత్యున్నత న్యాయస్థానం ఈ అధికారాన్ని ఉపయోగించి న్యాయం చేకూర్చుతుంది. -
అవినాష్ రెడ్డికి పాదాభివందనం చేసినా తక్కువే
-
ఆల్గో ట్రేడింగ్ కేసులో సెటిల్మెంట్లు
న్యూఢిల్లీ: స్టాక్ బ్రోకర్ల కోసం ప్రవేశపెట్టిన పథకాన్ని 111 సంస్థలు వినియోగించుకున్నట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా వెల్లడించింది. కొన్ని ఆల్గోరిథమిక్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్తో చేతులు కలిపిన స్టాక్ బ్రోకర్లపై పెండింగ్లో ఉన్న ఎన్ఫోర్స్మెంట్ చర్యలను నిలువరించేందుకు వీలుగా సెటిల్మెంట్ పథకాన్ని సెబీ తీసుకువచ్చింది.దీంతో ఒక్కో సంస్థ రూ. లక్ష చొప్పున చెల్లించి కేసులు సెటిల్ చేసుకున్నట్లు సెబీ పేర్కొంది. శాట్ లేదా వివిధ కోర్టులలో నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై న్యాయపరమైన ప్రక్రియను ఎదుర్కోవలసి ఉన్న స్టాక్ బ్రోకర్ సంస్థలకు 2025 జూన్ 16 నుంచి సెపె్టంబర్ 16వరకూ సెబీ ఈ పథకాన్ని తీసుకువచ్చింది. అయితే పథకానికి చివర్లో భారీ స్పందన కనిపించడంతో 2025 అక్టోబర్వరకూ గడువును పొడిగించింది. -
వివేకా బాడీ ఇంట్లో నుంచి అంబులెన్స్ ఎక్కించే వరకు పక్కనే ఉన్న.. అసలు అక్కడ జరిగిందేంటంటే..!
-
సునీతతో డ్రామా.. ఇదొక 200 కోట్ల ప్రాజెక్ట్.. మాజీ SP సంచలన నిజాలు
-
పాల విషాదం.. ప్రజల్లో భయం.. బయటపడ్డ నిజం..
-
‘ట్రావెల్ విత్ జో’ కేసు.. 10 నెలలైనా వీడని ఉత్కంఠ
పాకిస్తాన్ గూఢచారులకు కీలక సమాచారం చేరవేస్తున్నారన్న ఆరోపణలతో గత ఏడాది అరెస్టయిన హర్యానాకు చెందిన ప్రముఖ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ జ్యోతి రాణి అలియాస్ జ్యోతి మల్హోత్రా ఉదంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గత ఏడాది మే నెలలో ‘అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్’ కింద ఆమెను అరెస్ట్ చేశారు. పది నెలలు గడుస్తున్నా విచారణ మాత్రం అడుగు ముందుకు పడలేదని ‘ది ప్రింట్’ తన కథనంలో పేర్కొంది. ఇప్పటివరకు కనీసం నేరారోపణలపై ప్రాథమిక విచారణ కూడా ప్రారంభం కాకపోవడం గమనార్హమని వ్యాఖ్యానించింది.అసలు కేసు ఏంటి?హిసార్కు చెందిన జ్యోతి మల్హోత్రా 'ట్రావెల్ విత్ జో' పేరుతో యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఉత్తరాది రాష్ట్రాల్లో జరిగిన సోదాల్లో భాగంగా ఆమెను హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్తో ఆమె నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని, దేశ భద్రతకు ముప్పు కలిగించేలా కీలక ప్రాంతాల వీడియోలను పంచుకున్నారని పోలీసులు ప్రధానంగా ఆరోపిస్తున్నారు.వివాదంలో 'పాండో డ్యామ్' వీడియోఈ కేసులో హిమాచల్ ప్రదేశ్లోని 'పాండో డ్యామ్'కు సంబంధించిన వీడియో అత్యంత కీలక సాక్ష్యంగా మారింది. ఈ డ్యామ్ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం ‘కేటగిరీ-బి’ కిందకు వచ్చే అత్యంత సున్నితమైన ప్రాంతమని, ఇక్కడ వీడియోలు తీయడం నిషిద్ధమని భక్రా బియాస్ మేనేజ్మెంట్ బోర్డ్ స్పష్టం చేసింది. అయితే ఈ డ్యామ్ నిషిద్ధ ప్రాంతం కాదని, దీనికి సంబంధించిన ఫోటోలు, వివరాలు ఇప్పటికే ప్రభుత్వ వెబ్సైట్లలో అందుబాటులో ఉన్నాయని జ్యోతి తరపు న్యాయవాది రవీందర్ సింగ్ ధుల్ వాదిస్తున్నారు.పాక్ హైకమిషన్ ఉద్యోగితో సంబంధాలు?జ్యోతి మల్హోత్రా 2023లో వీసా కోసం ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్కు వెళ్లినప్పుడు అక్కడ పనిచేసే ముహమ్మద్ ఎహసాన్-ఉర్-రహీమ్ అలియాస్ డానిష్తో పరిచయం ఏర్పడిందని పోలీసులు కోర్టుకు తెలిపారు. వీరిద్దరూ వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా టచ్లో ఉన్నారని, ఆమె పాకిస్తాన్ పర్యటనలో ఉన్నప్పుడు అక్కడి భద్రతా అధికారులతో రహస్య సమావేశాలు ఏర్పాటు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. సోషల్ మీడియా ఫాలోవర్స్ను పెంచుకోవాలనే ఆశతో, డబ్బు ఆశకు లోబడి ఆమె భారత దేశ భద్రతకు సంబంధించిన వివరాలను పంచుకున్నట్లు పోలీసులు కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు.బెయిల్ నిరాకరణ.. సుప్రీంకోర్టుకు లాయర్ఇటీవలే పంజాబ్, హర్యానా హైకోర్టు జ్యోతి బెయిల్ దరఖాస్తును తిరస్కరించింది. ఆమె దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని కోర్టు అభిప్రాయపడింది. అయితే, ఈ కేసులో ‘అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్’ ప్రయోగించే అధికారం జిల్లా పోలీసులకు లేదని, అది కేవలం కేంద్ర హోం శాఖకు మాత్రమే ఉంటుందని జ్యోతి తరపు న్యాయవాది వాదిస్తున్నారు. హైకోర్టు తీర్పును త్వరలోనే సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని ఆయన తెలిపారు.జ్యోతి తండ్రి ఆవేదన‘మా అమ్మాయి కేవలం టూరిస్టుగా అక్కడికి వెళ్లింది. సాధారణ పర్యాటకులు తీసినట్లే ఆమె కూడా వీడియోలు తీసింది. పాకిస్తాన్ కోణం ఉండటంతో ఎవరూ నిజం వినడానికి సిద్ధంగా లేరు’ అని జ్యోతి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. 2,500 పేజీల ఛార్జ్షీట్ ఫైల్ చేసినా, సప్లిమెంటరీ ఛార్జ్షీట్ పేరుతో పోలీసులు కాలయాపన చేస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం జ్యోతి మల్హోత్రా హిసార్ జైలులో ఉన్నారు. దేశ సార్వభౌమాధికారానికి ముప్పు తెచ్చే సెక్షన్ల కింద నమోదైన ఈ కేసులో విచారణ ఎప్పుడు మొదలవుతుందో వేచి చూడాలి.ఇది కూడా చదవండి: ఏ పనీ చేయకున్నా.. నీరసం వేధిస్తోందా? -
మరో మహిళతో భర్త సంబంధాన్ని పెళ్లి అనలేం: హైకోర్టు
శివాజీనగర(బెంగళూరు): ఓ మహిళ (66) తన భర్త (77) అక్రమంగా రెండవ పెళ్లి చేసుకున్నాడని దాఖలు చేసిన కేసును హెకోర్టు కొట్టివేసింది. భర్త పర స్త్రీతో సంబంధం కలిగి ఉండడం వివాహానికి సమానం కాదు, కాబట్టి కేసు చెల్లదని స్పష్టంచేసింది. న్యాయమూర్తి నటరాజ్ కేసును విచారించారు. వివాహం చేసుకున్నప్పుడు మాత్రమే కేసు వర్తిస్తుందన్నారు. తన భర్త మరో మహిళ (51)ను వివాహం చేసుకొన్నారు, ఆయన కుమారులు మద్దతుగా నిలిచారు అని మహిళ ఆరోపించారు. ఆ తరువాత మహిళ భర్త, కుమారులు, ఆ మహిళ కేసును రద్దు చేయాలని పిటిషన్ వేశారు. చివరకు కేసు వీగిపోయింది. -
కుమారుడు తప్పు చేస్తే తండ్రికి శిక్ష.. గల్ఫ్లో అంతే?
గల్ఫ్ దేశాల్లో చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న తప్పు చేసినా అక్కడ శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. ఇటీవల ఓ మైనర్ బాలుడు చేసిన తప్పుకు అతని తండ్రికి కోర్టు శిక్ష విధించింది. పిల్లాడి సంరక్షణ బాధ్యత తండ్రిదేనని తెలిపింది.అబుదాబీలో ఇటీవల ఓ మైనర్ బాలుడు ఒకరి ఇంట్లోకి అనుమతి లేకుండా వెళ్లాడు. అంతేకాకుండా అక్కడ ఉన్న మరో మైనర్ బాలుడి చిత్రాలను వీడియో తీసి అతనిని ఆట పట్టించడానికి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో తమ వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిందని సదరు కుటుంబం సదరు కుటుంబం ఈ విషయంపై కేసు నమోదు చేసింది. ఈ వివరాలను పరిశీలించిన అక్కడి న్యాయమూర్తి ఇది పిల్లాడి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమేనని తీర్పు ఇచ్చారు.అందుకు గాను సదరు కుటుంబానికి 50 వేల దిర్హామ్లు జరిమానా విధించారు. అయితే ఆ పిల్లాడు మైనర్ అని వాదించినప్పటికీ వారి సంరక్షణ బాధ్యత తల్లిదండ్రులేదనని వారి ఎటు వెళుతున్నది ఏం చేస్తున్నది కనిపెడుతూ ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. దీంతో చేసేదేం లేక ఆ ఫ్యామిలీ ఆ మెుత్తాన్ని చెల్లించడానికి అంగీకరించింది. -
పచ్చ మీడియా సైలెంట్.. బయటపడ్డ పెంచలయ్య సిఫార్స్ పత్రం
-
వైఎస్ వివేకా కేసులో సునీతకి సుప్రీం కోర్ట్ బిగ్ షాక్
-
పెంచలయ్య దొంగతనం చేసిన దేవుడి సొమ్ము ఎంత తెలుసా?
-
డేరా బాబా కేసు.. పంజాబ్ హైకోర్టు సంచలన తీర్పు
చండీగఢ్: డేరా సచ్ఛా సౌదా అధిపతి గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్కు న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. రెండు దశాబ్దాల క్రితం జరిగిన జర్నలిస్టు రామ్ చందర్ ఛత్రపతి హత్య కేసులో ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ పంజాబ్- హర్యానా హైకోర్టు శనివారం కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో గతంలో కింది కోర్టు విధించిన యావజ్జీవ కారాగార శిక్షను హైకోర్టు రద్దు చేసింది. రామ్ రహీమ్ తరపు న్యాయవాది జితేందర్ ఖురానా ఈ విషయాన్ని వెల్లడించారు. 2002లో హర్యానాకు చెందిన జర్నలిస్టు రామ్ చందర్ ఛత్రపతిపై కాల్పులు జరగడం, ఆపై చికిత్స పొందుతూ ఆయన మరణించడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. డేరా ఆశ్రమంలో జరిగే అకృత్యాలను వెలుగులోకి తెచ్చినందుకే ఆయనను హత్య చేశారనే ఆరోపణలు నాడు వినవచ్చాయి. ఈ కేసును సుదీర్ఘంగా విచారించిన సీబీఐ ప్రత్యేక కోర్టు, 2019లో గుర్మీత్ రామ్ రహీమ్ సహా మరో ముగ్గురిని దోషులుగా నిర్ధారిస్తూ, యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అయితే ఈ తీర్పును సవాలు చేస్తూ, డేరా బాబా హైకోర్టును ఆశ్రయించారు. శనివారం జరిగిన విచారణలో సాక్ష్యాధారాల లోపాన్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, ఆయనపై ఉన్న ఆరోపణలు నిరూపితం కాలేదని స్పష్టం చేస్తూ, కేసు నుంచి విముక్తి కల్పించింది.ఈ హత్య కేసులో నిర్దోషిగా విడుదలైనప్పటికీ, రామ్ రహీమ్ సింగ్ ప్రస్తుతానికి జైలులోనే కొనసాగనున్నారు. తన ఆశ్రమంలోని ఇద్దరు సాధ్వీలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో 2017లో ఆయనకు 20 ఏళ్ల కారాగార శిక్ష విధించారు. ప్రస్తుతం ఆయన హర్యానాలోని రోహ్తక్ జిల్లా సునారియా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. కాగా రామ్ రహీమ్ సింగ్కు హర్యానా ప్రభుత్వం పదే పదే పెరోల్ మంజూరు చేయడంపై గత కొంతకాలంగా తీవ్ర విమర్శలు వ్యుక్తమవుతున్నాయి. ఎన్నికల సమయంలోనే ఆయనకు పెరోల్ లభించడం వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని ప్రతిపక్షాలు, సిక్కు మత సంస్థలు ఆరోపించాయి. తాజా తీర్పుతో డేరా బాబా అనుచరులు హర్షం వ్యక్తం చేస్తుండగా జర్నలిస్టు ఛత్రపతి కుటుంబ సభ్యులు మాత్రం తీవ్ర నిరాశకు లోనయ్యారు. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ, సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో వారు ఉన్నట్లు సమాచారం. -
రఘురామకృష్ణరాజు కేసులో విచారణకు హాజరైన సునీల్ నాయక్
-
అసలు ఆధారాలే లేవు.. లిక్కర్ కథ ముగిసిందా ?
-
పాలసీ రూపకల్పనలో నేరపూరిత కుట్ర లేదు
సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పన, అమలులో అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆయన మంత్రివర్గ సహచరులు, తెలంగాణ అప్పటి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కుమార్తె కవితలతో సహా మొత్తం 23 మందికి ఢిల్లీ సీబీఐ కోర్టులో భారీ ఊరట లభించింది. వారందరినీ ఈ కేసు నుంచి తప్పిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. కేజ్రీవాల్ తదితరులపై మోపిన ఆరోపణలను నిరూపించేందుకు సీబీఐ తగిన ఆధారాలు చూపలేదని కోర్టు తేల్చి చెప్పింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పన, అమలులో ఎలాంటి నేరపూరిత కుట్ర లేదని స్పష్టం చేసింది. అంతా నిబంధనల ప్రకారమే జరిగిందని పేర్కొంది. కొందరు ప్రభుత్వ పెద్దలు, అధికారులు, ప్రైవేటు వ్యక్తులు, మద్యం వ్యాపారులు కలిపి తాము కోరుకున్న వ్యక్తులకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చేలా కుట్ర పన్నారన్న సీబీఐ ఆరోపణలను కోర్టు తోసిపుచ్చింది.నిందితుల మధ్య ముందస్తు ఒప్పందం, నేరపూరిత కుట్ర జరిగినట్లు రుజువు చేసే బలమైన ఆధారాలను ప్రాసిక్యూషన్ సమర్పించలేకపోయిందని కోర్టు పేర్కొంది. ఈ కేసు ప్రధానంగా దినేష్ అరోరా వంటి అప్రూవర్ల సాక్ష్యాలపై ఆధారపడి ఉందని, అయితే వారికి ఇతర స్వతంత్ర సాక్షుల మద్దతు లేదని, అందువల్ల వారి సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకోవడం సాధ్యం కాదని ఢిల్లీ సీబీఐ కోర్టు తేల్చి చెప్పింది. అదే రకంగా హోల్సేల్ లాభాల మార్జిన్ను 5% నుండి 12% కి పెంచడం అనేది విధానపరమైన నిర్ణయమే తప్ప, అది కేవలం ఒక వర్గానికి లాభం చేకూర్చడానికే చేశారన్న ఆరోపణలకు సైతం తగిన ఆధారాలను చూపలేకపోయిందని పేర్కొంది. ఈ కేసులో సీబీఐ చేసిన ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలు లేవంది.ప్రభుత్వ విధానం తప్పుగా ఉండటం నేరం కిందకు రాదని తేల్చి చెప్పింది. అంతేకాక ఈ మొత్తం వ్యవహారంలో క్విడ్ ప్రో కో జరిగిందన్న సీబీఐ వాదనను కోర్టు తోసిపుచ్చింది. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలకు నేరాన్ని ఆపాదించడానికి వీల్లేదంది. పాలసీలో మార్పుల కోసం కేజ్రీవాల్ నేరుగా నగదు డిమాండ్ చేసినట్లు లేదా కుట్రలో పాల్గొన్నట్లు సీబీఐ చూపిన ఆధారాలు ‘అనుమానాల‘ స్థాయిలోనే ఉన్నాయని, అవి అభియోగాలు నమోదు చేయడానికి సరిపోవని కోర్టు పేర్కొంది. మద్యం పాలసీని మనీష్ సిసోడియా మార్చారని చెప్పలేమని, ఫైళ్ల కదలికలు, నోటింగ్స్ అన్నీ అధికారిక నిబంధనల ప్రకారమే ఉన్నాయని కోర్టు పేర్కొంది.కల్వకుంట కవితను కీలక కుట్రదారుగా పేర్కొన్నప్పటికీ, ఆమె ద్వారా రూ.100 కోట్ల ముందస్తు నగదు బదిలీ జరిగిందన్న ఆరోపణలకు సంబంధించి సమర్పించిన ఆధారాలు ఎంత మాత్రం సరిపోవని, బలహీనంగా ఉన్నాయని కోర్టు భావించింది. విజయ్ నాయర్కు ప్రభుత్వంలో ఎలాంటి అధికారిక హోదా లేదని, పాలసీ రూపకల్పనలో ఇతను కీలక పాత్ర పోషించాడనడానికి తగిన ఆధారాలు లేవని ఢిల్లీ సీబీఐ కోర్టు పేర్కొంది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పన ఒక పద్ధతి ప్రకారం, వివిధ విభాగాల మధ్య చర్చల తర్వాత జరిగిందని తేల్చింది. లెఫ్టినెంట్ గవర్నర్ పర్యవేక్షణలోనే జరిగిందని కోర్టు అభిప్రాయపడింది. ఎన్నికల ఆరోపణలపై దర్యాప్తు సంస్థలు జోక్యం చేసుకోలేవు...ఎన్నికల రాజకీయ పార్టీలు ఖర్చు చేసే నిధుల విషయంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలను పరిశీలించే ప్రాథమిక అధికారం కేవలం కేంద్ర ఎన్నికల సంఘానికి ఉందని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల్లో పరిమితికి మించి ఖర్చు చేశారంటూ వచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి ’ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1951’ కింద ’ఎన్నికల పిటిషన్’ దాఖలు చేసుకోవడమే చట్టబద్ధమైన మార్గమని కోర్టు పేర్కొంది.అవినీతి నిరోధక చట్టం, మనీ లాండరింగ్ చట్టం వంటి కఠినమైన చట్టాలను, ఎన్నికల చట్టాల పరిధిలోకి వచ్చే అంశాలపై దర్యాప్తు చేయడానికి ప్రత్యామ్నాయంగా వాడకూడదని కోర్టు తేల్చి చెప్పింది. రాజకీయ ఆరోపణలను నేరాలుగా మార్చకూడదంది. ఒకవేళ దర్యాప్తు చేయాల్సి వస్తే.. అది ఎన్నికల చట్ట ఉల్లంఘనలకు సంబంధం లేకుండా, స్వతంత్రంగా రుజువయ్యే స్పష్టమైన నేరమై ఉండాలని తెలిపింది. ఎన్నికల వేళ వచ్చే ఆరోపణలపై దర్యాప్తు సంస్థలు జోక్యం చేసుకుంటే, అది రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తుందని, చట్ట పాలనను, ఎన్నికల ప్రక్రియ నిష్పాక్షికతను ప్రమాదంలోకి నెట్టేస్తుందని సీబీఐ కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.వ్యాపార అవకాశవాదం నేరం కిందకు రాదు...ప్రభుత్వం ఏదైనా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు, ప్రైవేటు సంస్థలు అందులోని సడలింపులను వాడుకుని లాభపడాలని చూడటం సహజమని కోర్టు పేర్కొంది. ఇలాంటి ‘వ్యాపార అవకాశవాదం’ ఎప్పుడూ నేరం కిందకు రాదని తెలిపింది. ఒకవేళ నేరంగా పరిగణించాలంటే, అందులో మోసం, ఫోర్జరీ, లంచం, క్విడ్ ప్రో కో, నిధుల దుర్వినియోగం, అధికార దుర్వినియోగం వంటి అంశాలు ఖచ్చితంగా ఉండాలని కోర్టు స్పష్టం చేసింది.2002 నాటి సుప్రీం కోర్టు తీర్పును ఉటంకించిన సీబీఐ కోర్టు, ప్రభుత్వం తీసుకునే ఆర్థిక నిర్ణయాల వల్ల ప్రైవేటు వ్యక్తులకు లాభం చేకూరినా, అందులో దురుద్దేశం, చట్ట ఉల్లంఘన లేకుంటే వాటిని నేరంగా పరిగణించలేమని కోర్టు వివరించింది. ప్రభుత్వానికి ఆర్థిక నష్టం వాటిల్లినంత మాత్రాన లేదా ఒక ప్రైవేట్ వ్యక్తి లాభపడినంత మాత్రాన దానిని నేరంగా పరిగణించలేమంది. అక్కడ అవినీతి, అక్రమ సంపాదన జరిగినట్లు ఆధారాలు ఉంటేనే అది నేరపూరిత చర్య అవుతుందని తెలిపింది.విధానాల రూపకల్పన, అమలు బాధ్యత పాలకులదే...ప్రజా విధానాలను రూపొందించడం, మార్చడం లేదా పాతవాటి స్థానంలో కొత్తవి తీసుకురావడం అనేది పూర్తిగా శాసన కార్యనిర్వాహక వ్యవస్థల రాజ్యాంగబద్ధమైన హక్కు అని తెలిపింది. ప్రజల ద్వారా ఎన్నుకోబడిన వారు కాబట్టి, సామాజిక అవసరాలను గుర్తించే అధికారం శాసనకర్తలకు ఉంటుందని తెలిపింది. న్యాయస్థానాలు సాధారణంగా ప్రభుత్వ విధాన నిర్ణయాలలో జోక్యం చేసుకోవని గుర్తు చేసింది. ఒక కొత్త చట్టం లేదా విధానం వచ్చేటప్పుడు ప్రభుత్వం ఈ క్రింది అంశాలను పరిశీలిస్తుంది. ప్రస్తుత సమాజంలో ఉన్న పరిస్థితులను విశ్లేషించడం, వ్యవస్థలో ఉన్న లోపాలను గుర్తించడం, పాత విధానం వల్ల కలిగే లాభ నష్టాలను బేరీజు వేయడం, ఆ విధానం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావాన్ని చర్చించడం వంటి ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో భాగం.నిర్ణయాలను నేరపూరిత చర్యలుగా చూడకూడదు...ప్రభుత్వం పాత విధానంలోని లోపాలను సవరించి కొత్త విధానాన్ని తెచ్చినప్పుడు, దాన్ని కేవలం ‘కుట్ర‘ లేదా ‘నేరపూరిత దురుద్దేశం‘తో చూడకూడదని సీబీఐ కోర్టు తెలిపింది. పాత విధానంలోని లోపాల వల్ల లాభపడిన వ్యక్తులు, కొత్త విధానంలోని మార్పులను అడ్డుకోవడానికి ఫిర్యాదులు, ఆరోపణలు చేయవచ్చునంది. కేవలం ఫిర్యాదుల్లో రాసిన భాషను బట్టి లేదా ఊహించిన కుట్రలను బట్టి విధాన నిర్ణయాలను నేరాలుగా పరిగణించడానికి వీల్లేదంది. నిజాయితీగా తీసుకున్న విధాన నిర్ణయాలను నేరపూరిత చర్యలు చూడరాదంది. ఇలాంటి చర్యల వల్ల పాలకులు గానీ, ప్రభుత్వ అధికారులు గానీ కొత్త సంస్కరణలు తీసుకురావడానికి వెనకాడతారని తెలిపింది. పరిపాలనలో కొత్త ప్రయోగాలు చేయడానికి ఎవరూ ముందుకు రారని తేల్చి చెప్పింది. ప్రభుత్వాలు తమ విధులను సక్రమంగా నిర్వహించకుండా ఇలాంటి చర్యలు అడ్డుకుంటాయంది.ప్రభుత్వ నిర్ణయాలను దర్యాప్తు సంస్థలు విశ్లేషించజాలవు... సీబీఐ గానీ, ఇతర దర్యాప్తు సంస్థలకు గానీ ప్రభుత్వ నిర్ణయాలను విశ్లేషించే అధికారం లేదని తెలిపింది. ఒక నిర్ణయం వల్ల ఆర్థికంగా లాభం జరిగిందా లేదా నష్టం జరిగిందా అని లెక్కలు వేయడం వారి పని కాదంది. ఆ నిర్ణయం పరిపాలనాపరంగా సరైనదా కాదా అని వారు తీర్పు చెప్పలేరంది. ప్రభుత్వం ఒక పాలసీని ఎందుకు తెచ్చింది? అసలు ఆ పాలసీ అవసరమా? అని ప్రశ్నించే హక్కు కూడా వారికి లేదని తెలిపింది. దర్యాప్తు సంస్థల పని కేవలం చట్టం ప్రకారం నేరం జరిగిందా లేదా?‘ అని చూడటం మాత్రమేనంది. ప్రభుత్వ నిర్ణయాల్లో మంచి చెడులు చూడటం దర్యాప్తు సంస్థల పని కాదని తేల్చి చెప్పింది.ప్రైవేటు సంస్థకు లాభం కలిగినంత మాత్రాన అది నేరం అయిపోదు...ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక కొత్త విధానం వల్ల ఏదైనా ప్రైవేట్ సంస్థకు అనుకోకుండా లాభం చేకూరవచ్చునని, అంత మాత్రన అది నేరం అయిపోదని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ దర్యాప్తు సంస్థలు ప్రతి నిర్ణయాన్ని క్రిమినల్ కేసుగా మార్చడం మొదలుపెడితే, నిజాయితీగా పనిచేసే అధికారులు నిర్ణయాలు తీసుకోవడానికి భయపడతారంది. ఏ నిర్ణయం తీసుకుంటే ఏ కేసులో ఇరుక్కుంటామో అన్న భయంతో పాలన ఆగిపోతుందని తెలిపింది. రాజకీయ నాయకత్వం ఆదేశాల మేరకు, నిబంధనల ప్రకారం పనిచేసే అధికారులను వేధించడం వల్ల వ్యవస్థ కుప్పకూలుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.ప్రభుత్వ విధానాలపై క్రిమినల్ కేసులు పెట్టలేవు...ఒక అధికారి తీసుకున్న నిర్ణయంలో ఎటువంటి చెడు ఉద్దేశం లేనపపుడు అలాంటి వారిని శిక్షించడం తగదని తెలిపింది. అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలంటే, దర్యాప్తు సంస్థల అనవసరపు వేధింపుల నుండి వారికి రక్షణ ఉండాలని తెలిపింది. ప్రభుత్వం తీసుకొచ్చిన విధానం సరైందా కాదా అనేది అసెంబ్లీ లేదా పార్లమెంటులో చర్చించాలే తప్ప, దానికి బదులుగా క్రిమినల్ చట్టాన్ని ఉపయోగించి ఆ విధానాన్ని ప్రశ్నించడం రాజ్యాంగ విరుద్ధమంది. ప్రభుత్వం తీసుకొచ్చిన విధానం ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందనే అంశంపై దర్యాప్తు సంస్థలు క్రిమినల్ కేసులు పెట్టలేవంది. అభివృద్ది చెందుతున్న ఓ దేశానికి అధికారుల నిర్ణయాలలో స్థిరత్వం, నిశ్చయత చాలా ముఖ్యమంది. ఏళ్ళ క్రితం నిజాయితీతో తీసుకున్న నిర్ణయాలను ఇప్పుడు నేరాలుగా పరిగణించి విచారిస్తే, భవిష్యత్తులో ఏ అధికారి కూడా కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి సాహసించడని తేల్చి చెప్పింది. ఆర్థిక విధానాల విషయంలో కోర్టులు లేదా దర్యాప్తు సంస్థలు జోక్యం చేసుకోకూడదని, అవి ప్రభుత్వ ప్రత్యేక పరిధిలోకి వస్తాయంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఢిల్లీ సీబీఐ కోర్టు తన తీర్పులో ఉదహరించింది.ఎవరెవరిని ఈ కేసులోకి లాగవచ్చుననే కోణంలో సీబీఐ దర్యాప్తు సాగింది...ఈ కేసులో దర్యాప్తు జరిగిన తీరును మొదటి నుండి చివరి వరకు పరిశీలించిన తర్వాత, సీబీఐ దర్యాప్తులో తీవ్రమైన లోపాలు ఉన్నాయని కోర్టు తేల్చి చెప్పింది. దర్యాప్తు అనేది నిష్పక్షపాతంగా జరగాలని, కానీ ఇక్కడ దర్యాప్తు సంస్థ ఒక నిర్ణీత లక్ష్యంతో ముందే ఊహించుకున్న నేరారోపణలతో ముందుకు వెళ్లినట్లుగా కనిపిస్తోందని తెలిపింది. దర్యాప్తు సంస్థ తన దృష్టిని మధ్యలో మార్చుకుంటూ, ఎవరెవరిని ఈ కేసులోకి లాగవచ్చు అనే కోణంలో దర్యాప్తు సాగించిందని కోర్టు తెలిపింది. ప్రచార సంస్థలు , చిన్న వ్యాపారులు, అంగడియాలు (నగదు బదిలీ చేసేవారు), ఇంటి యజమానులు, హోటల్ నిర్వాహకులు, రాజకీయ కార్యకర్తలు, రాష్ట్ర స్థాయి నేతలు చివరకు జాతీయ నాయకత్వాన్ని ఈ కేసులో ఇరికించారంది.ఎక్కడో ఒకచోట ఏదో ఒకటి జరిగి ఉంటుందన్న ముందస్తు ఊహతో దర్యాప్తు సాగించిందని తెలిపింది. ఏ ఒక్క విభాగాన్ని వదలకుండా అందరినీ లాగాలన్న ఉద్దేశంతో ఈ దర్యాప్తు జరిగినట్లు కనిపిస్తోందని కోర్టు వ్యాఖ్యానించింది. ఒక విధాన నిర్ణయం తీసుకున్నప్పుడు లేదా దానిని అమలు చేసినప్పుడు అందులో నేరం ఉందని నిరూపించడానికి బలమైన సాక్ష్యం ఉండాలంది. కేవలం రాజకీయంగా, పరిపాలనాపరంగా ఎవరికైనా లాభం చేకూరిందని భావించి, అందరినీ నేరస్తులుగా చిత్రించడం తగదని కోర్టు తేల్చి చెప్పింది. ఒక వ్యవస్థీకృత నేరం జరుగుతున్నప్పుడు, ఆ నేరాన్ని నడుపుతున్న అసలు వ్యక్తులను వదిలేసి, వారిని రాజకీయ లేదా ఉన్నత స్థాయి అధికారులకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి ఉపయోగించుకోవడం సరైన దర్యాప్తు అనిపించుకోదని పేర్కొంది. -
ఆయేషా మీరా అస్థికల అప్పగింత
-
లిక్కర్ కేసులో క్లీన్ చిట్..: కవిత స్పందన ఇదే
సాక్షి హైదరాబాద్: లిక్కర్ కేసులో క్లీన్ చీట్ ఇవ్వడంపై మాజీ ఎమ్మెల్సీ కవిత హర్షం వ్యక్తం చేశారు. చివరకు సత్యమే గెలిచిందన్నారు. రాజకీయ వేధింపుల్లో భాగంగానే లిక్కర్ కేసులో తనను ఇరికించారని అయినా కడిగిన ముత్యంలా బయిటకు వచ్చానన్నారు. లిక్కర్ కేసు రాజకీయ కుట్రని దానిని ఎవ్వరూ నమ్మలేదని తెలిపారు.ఈ తీర్పుతో న్యాయవ్యవస్థపై తనకున్న నమ్మకం నిలిచిందన్నారు. తనను మూడేళ్ల పాటు నానా మాటలన్నారని ఐదు నెలలకు పైగా జైలులో పెట్టారని ఈ సందర్భంగా కవిత ఆవేదన వ్యక్తం చేశారు. కష్టకాలంలో తనకు అండగా ఉన్న అభిమానులకు శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఢిల్లీ లిక్కర్ కేసులో ఎటువంటి కుట్ర రౌస్ రెవెన్యూ కోర్టు స్పష్టం చేసింది. ఈకోసులో ఉన్న నిందితులు తప్పు చేశారని సాక్షాదారాలు లేవని తెలిపింది.ఏం జరిగింది?ఢిల్లీ లిక్కర్ కేసులో అవినీతి జరిగిందంటూ ఆ సమయంలో ఎమ్మెల్సీగా ఉన్న కవితను మార్చి 2024న అధికారులు అరెస్టు చేశారు. అనంతరం ఆమెను తీహార్ జైలుకు తరలించారు. దీంతో కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఆమెకు బెయిల్ మంజూరైంది. దీంతో ఐదు నెలల అనంతరం ఆమె జైలు నుంచి విడుదలైంది. కాగా తాజాగా ఈ కేసులో మాజీ ఎమ్మెల్సీ కవితతో పాటు మిగతా వారు ఎటువంటి నేరాలకు పాల్పడలేదని రౌస్ రెవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చింది. -
న్యాయం గెలిచింది.. కంటతడి పెట్టిన కేజ్రీవాల్
-
ల్యాబ్ రిపోర్టు లేకుండానే యాంటీడోట్?
-
బొగ్గుల శ్రీనివాస్ ది హత్యే.. చంపింది వాళ్లే.. ACP సంచలన ప్రెస్ మీట్
-
రచయిత బొగ్గుల శ్రీనివాస్ హత్య కేసు.. వీడిన మిస్టరీ
సాక్షి, ఖమ్మం జిల్లా: పాలేరు రిజర్వాయర్లో కారు ప్రమాదంలో మృతి చెందిన రచయిత బొగ్గుల శ్రీనివాస్ మృతి కేసును పోలీసులు ఛేదించారు. బొగ్గుల శ్రీనివాస్ది హత్యగా పోలీసులు తేల్చారు. ఈ కేసులో నలుగురు వ్యక్తులను కూసుమంచి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని పోలీసులు వెల్లడించారు.హత్య చేసిన అనంతరం కారు ప్రమాదంగా నిందితులు చిత్రీకరించే యత్నం చేశారు. మృతుడి శరీరంపై గాయాలు ఉండటం.. శ్రీనివాస్ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేసిన పోలీసులు హత్యగా తేల్చారు. ఈనెల 14న ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్లోకి కారు దూసుకెళ్లడంతో ఏపీకి చెందిన బొగ్గుల శ్రీనివాస్ మృతి చెందారు. రిజర్వాయర్లోకి కారు దూసుకెళ్లాక డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి బయటకు వచ్చి పారిపోయినట్లు స్థానికులు చెప్పడంతో ఆ దిశగా పోలీసులు విచారణ చేపట్టారు. ఆయన సోదరుల ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు పలు కీలక ఆధారాలు సేకరించారు.శ్రీనివాస్ ప్రయాణించిన కారు ఏపీలోని పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన వేణుమాధవ రెడ్డిదిగా గుర్తించారు. ఘటన జరిగినప్పటి నుంచి ఆయన ఆచూకీ లేకపోవడంతో ఆ దిశగా విచారణ చేపట్టారు. వేణుమాధవరెడ్డి, శ్రీనివాస్ మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నాయని గుర్తించారు. దర్యాప్తులో శ్రీనివాస్ది హత్యగా తేల్చారు. -
అయేషా మీరా కేసు క్లోజ్ చేసిన సీబీఐ
-
ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాదం కేసులో కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (టీజీ ఎఫ్ఎస్ఎల్) అగ్నిప్రమాదంలో కీలక మలుపు జరిగింది. అగ్ని ప్రమాదంలో 1100 ఫైల్స్ దగ్ధం అయినట్లు నాగపూర్ బృందం గుర్తించింది. 1100 కేసుల డేటా రికవరీ కోసం బృందం యత్నించింది. కేసుల డేటా రికవరీ కష్టం అని ప్రత్యేక బృందం తేల్చింది.ఈ నెల(ఫిబవరి) 7వ తేదీన జరిగిన ఎఫ్ఎస్ఎల్ భారీ అగ్ని ప్రమాద ఘటనలో పలు కీలక కేసుల ఫైళ్లు, కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఎఫ్ఎస్ఎల్ భవనం మొదటి అంతస్తులో జరిగిన ఈ ప్రమాదంలో దాదాపు 50 కంప్యూటర్లు, తీవ్రమైన నేరాల్లో పోలీసులు సేకరించిన సాంకేతిక ఆధారాలు, సీజ్ చేసిన హార్డ్డిస్కులు, కేసు రికార్డులు పూర్తిగా దగ్ధమయ్యాయి.ఇందులో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు, ఎమ్మెల్యేల కొనుగోలు కేసుతోపాటు ఇటీవల దర్యాప్తు కొనసాగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన శాస్త్రీయ ఆధారాలు సైతం కాలి బూడిదైనట్టు పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. రెండు అంతస్తులున్న ఈ భవనం మొదటి అంతస్తులోనే ఆధారాలను భద్రపర్చేగదితో పాటు, పలు కేసుల్లో ఆధారాల విశ్లేషణ తర్వాత నివేదికలను భద్రపరుస్తారు. రెండో అంతస్తులో ఫోరెన్సిక్ పరికరాలు, కెమికల్ ల్యాబ్ మెటీరియల్ ఉంటుంది. ఈ ల్యాబ్లోకి మంటలు వ్యాపించలేదు. అలాగే కింది అంతస్తులోకి మంటలు పోలేదు. ప్రమాదంలో కేవలం ఒకటో అంతస్తు పూర్తిగా దగ్ధమవడంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి.రాష్ట్రంలో జరిగే నేర పరిశోధనకు ఈ ప్రయోగశాల శాస్త్రీయ సహాయం అందిస్తుంటుంది. హత్యలు, దోపిడీలు, లైంగిక దాడులు, మోసాలు వంటి కేసులకు సంబంధించిన సాక్షాధారాలు ఇక్కడే నిక్షిప్తమై ఉంటాయి. ఎక్కడ నేరం జరిగినా ఘటనాస్థలంలో సేకరించిన నమూనాల పరీక్ష ఇక్కడే చేస్తారు. ఈ న్యాయ వైజ్ఞానిక శాస్త్ర ప్రయోగశాలలో వేలి ముద్రల పరిశీలన, రక్తం, వెంట్రుకలు, డీఎన్ఏ వంటి పరీక్షలు చేస్తారు. అలాగే తుపాకులు, బుల్లెట్ల పరిశీలన జరుపుతారు. వీటితోపాటుగా విషాలు, మత్తు పదార్థాల పరీక్షలు, సంతకాలు, నకిలీ పత్రాల పరిశీలన వంటివి చేస్తారు. అదేవిధంగా డ్రగ్స్, గంజాయి, హెరాయిన్ వంటి (నార్కోటిక్) పదార్ధాల పరిశీలన జరుపుతారు. -
మదనపల్లె బాలిక హత్య కేసు నిందితుడు మృతి
సాక్షి, అన్నమయ్య జిల్లా: మదనపల్లె బాలిక హత్య కేసు నిందితుడు మృతిచెందాడు. కురబలకోట మండలం కరసానివారిపల్లి చెరువులో మృతదేహం లభించింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి ముదివేలు పోలీసులు చేరుకున్నారు. ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లెలో అదృశ్యమైన ఏడేళ్ల చిన్నారి హత్యాచారానికి గురైన సంగతి తెలిసిందే. ఆమెపై నిందితుడు లైంగికదాడి చేసి, ఆపై హత్య చేశాడు. మదనపల్లె పట్టణంలో రెండో తరగతి చదువుతున్న ఏడేళ్ల చిన్నారి సోమవారం సాయంత్రం ఆడుకుంటూ అదృశ్యమైంది. తల్లిదండ్రులు, బంధువులు ఎంత గాలించినా జాడ కానరాలేదు. దీంతో ఒకటో పట్టణ పోలీస్స్టేషన్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.రాత్రంతా ఎంత వెతికినా చిన్నారి ఆచూకీ లభ్యం కాలేదు. కుటుంబీకులు అనుమానంతో బాలిక ఇంటికి సమీపంలోనే ఉండే కులవర్ధన్ అనే వ్యక్తిపై మంగళవారం ఉదయం పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు కులవర్ధన్ ఇంటికి చేరుకున్నారు. లోపల తలుపులు వేసుకుని కులవర్ధన్ ఎంతకీ తీయకపోవడంతో పోలీసులు గడియ పగలగొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ ఓ డ్రమ్ములో బాలిక మృతదేహం కనిపించింది. -
రచయిత బొగ్గుల శ్రీనివాస్ కేసు.. ఒంటిపై గాయాలు!
కూసుమంచి: ఏపీకి చెందిన ప్రముఖ రచయిత బొగ్గుల శ్రీనివాస్ మృతి కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచగా, పురోగతి సాధించినట్లు తెలిసింది. ఆయన ప్రయాణిస్తున్న కారు ఈనెల 14న ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్లో మునగగా మృతదేహాన్ని గుర్తించారు. అయితే, ఘటన జరిగాక కారు నడుపుతున్న వ్యక్తి ఒడ్డుకు చేరి అక్కడి నుంచి పారిపోయినట్లు స్థానికులు చెప్పడంతో కూసుమంచి పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గాలిస్తున్నారు.సదరు వ్యక్తి హైదరాబాద్లో పోలీసులకు లొంగిపోయే ప్రయత్నాల్లో ఉన్నాడని, అదే జరిగితే కేసులో చిక్కుముడి వీడుతుందని భావిస్తున్నారు. దీంతో పాటు కారు యజమానిని కూడా అదుపులోకి తీసుకుని విచారించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇక శ్రీనివాస్ మృతదేహానికి నేలకొండపల్లి ఆస్పత్రిలో పోస్టుమార్టం చేయించిన నివేదిక వచ్చినట్లు సమాచారం. శ్రీనివాస్ నీట మునగడంతో చనిపోలేదని, ఆయన ఒంటిపై గాయాలు ఉన్నట్లు పోస్టుమార్టం చేసిన వైద్యులు ధ్రువీకరించారని తెలిసింది.ఏదేమైనా మిస్టరీగా మారిన శ్రీనివాస్ మృతి కేసు మరో రెండు రోజుల్లో ఓ కొలిక్కి రానున్నట్లు తెలుస్తోంది. మృతుడు శ్రీనివాస్ సెల్టవర్ల వ్యాపారంలో ఉండగా, ఆ కోణంలోనూ పోలీసులు విచారణ చేపడుతున్నారు. దర్యాప్తు వేగవంతం చేశామని, ఇప్పటివరకు ఎవరినీ అదుపులోకి తీసుకోకపోగా.. త్వరలోనే కేసు ఛేదిస్తామని కూసుమంచి ఎస్సై నాగరాజు ‘సాక్షి’కి తెలిపారు. -
అంతా.. ఫిబ్రవరిలోనే
సాక్షి,సిటీబ్యూరో/మణికొండ: అప్పట్లో తెలుగునాట కలకలం సృష్టించిన సినీనటి ప్రత్యూష ఆత్మహత్య కేసులో సుప్రీం కోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడు సిద్ధార్థ రెడ్డికి హైకోర్టు విధించిన శిక్షను ఖరారు చేస్తూ తీర్పు చెప్పింది. 24 ఏళ్ల ఈ ఎపిసోడ్లో కీలక ఘట్టాలన్నీ ఫిబ్రవరిలోనే జరగడం యాదృచ్ఛికం. 2002లో.. నగరంలోని తార్నాకలో ఉండే ప్రత్యూషకు సహా విద్యార్థి, సిద్ధార్థరెడ్డితో పరిచయం ప్రేమకు దారి తీసింది. 1998లో ‘రాయుడు’ చిత్రంతో ప్రత్యూష సినీ రంగంలోకి అడుగుపెట్టింది. 2002 నాటికి ఆమె సుమారు 10 సినిమాల్లో నటించింది. ఈ క్రమంలో ప్రత్యూష, సిద్ధార్థరెడ్డిల పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ.. సిద్ధార్థ కుటుంబం వీరి వివాహానికి అంగీకరించలేదు. ఈ వివాదం నేపథ్యంలో 2002 ఫిబ్రవరి 23న పంజగుట్టలోని బ్యూటీపార్లర్లో ఉన్న ప్రత్యూషను సిద్ధార్థ తన కారులో ఎక్కించుకున్నాడు. అప్పటికే హైదర్గూడలో ‘ఆర్గానోఫాస్ఫేట్’ పురుగుల మందు ఖరీదు చేసి కూల్డ్రింక్లో కలిపి తెచ్చాడు. దీన్ని ఇద్దరూ కారులోనే తాగారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరుసటి రోజు ప్రత్యూష మరణించింది. 2004లో.. ఈ ఉదంతంపై పంజగుట్ట పోలీసులు సిద్ధార్థపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రత్యూష పోస్టుమార్టం నివేదికలోని అంశాలు, ఇతర పరిణామాల ఆధారంగా ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందని, సిద్ధార్థతో పాటు అందులో ప్రమేయం ఉన్న వాళ్లు హత్య చేసి కేసును తారుమారు చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. చివరకు ప్రత్యూషది ఆత్మహత్యగా తేలి్చన సీబీఐ.. అందుకు ప్రేరేపించిన సిద్ధార్థపై అభియోగపత్రం దాఖలు చేసింది. కేసును విచారించిన సెషన్స్ కోర్టు 2004 ఫిబ్రవరిలో నిందితుడికి శిక్ష విధించింది. 2026లో.. ఈ తీర్పును సిద్ధార్థ రెడ్డి హైకోర్టులో అప్పట్లో సవాల్ చేయడంతో సెషన్స్ కోర్టు విధించిన శిక్షను తగ్గిస్తూ, జరిమానాను పెంచుతూ 2011 డిసెంబర్లో తీర్పు ఇచ్చింది. సెషన్స్ కోర్టు విధించిన శిక్షను హైకోర్టు తగ్గించడాన్ని సరోజినీ దేవి, శిక్ష విధించడాన్ని సిద్ధార్థ సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మంగళవారం సుప్రీంకోర్టు తీర్పునిస్తూ అతడి పిటిషన్ను తోసిపుచి్చంది. నాలుగు వారాల్లోగా లొంగిపోవాలని సిద్ధార్థను ఆదేశించింది. ఇలా ఈ కేసులో 2002 ఫిబ్రవరి– 2026 ఫిబ్రవరి మధ్య 24 ఏళ్లలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. -
అబిడ్స్ SBI కాల్పుల కేసులో ట్విస్ట్
-
సాఫ్ట్ వేర్ విజయశాంతి రెడ్డి కేసులో న్యూ ట్విస్ట్..
-
మాజీ మంత్రి కాకాణిపై కేసు నమోదు
సాక్షి నెల్లూరు : కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలు కొనసాగిస్తుంది. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై మరో అక్రమ కేసు నమెదు చేసింది. ఇటీవల కోవూరు, గుమ్మళ్లదిబ్బలో ఓక మైనర్ బాలిక మృతి చెందింది. ఈ ఘటనపై వైఎస్సార్సీపీ శ్రేణులతో పాటు మాజీ మంత్రి వెంటనే స్పందించారు.బాధిత కుటుంబానికి అండగా నిలిచి ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించారు. దీంతో మంత్రిపై పోలీసులు అక్రమ కేసు నమోదు చేశారు. ఇటీవల వైఎస్సార్సీపీ నేతలపై పోలీసులు అక్రమ కేసుల నమోదు చేసి తీవ్ర వేదింపులకు గురిచేస్తున్నారు. -
అమ్మా.. ఎందుకిలా చేశావ్?
పచ్చని కాపురం ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ముత్యాల్లాంటి ఇద్దరు పిల్లలు, ఇద్దరు ముసిముసిమాటల మెరికలు. ఇంతలో ఏ కష్టం వచ్చిందో, తనకు ఎందుకు జీవితం నచ్చలేదో, అర్ధాంతరంగా మృత్యుడికి చేరాలనుకుంది.. తను దూరమైతే పిల్లలు ఒంటరవుతారన్న ఉద్దేశ్యంతో వారిని కూడా తన ఒడికి చేర్చుకుంది. అల్లారుముద్దుగా పెంచిన బిడ్డలకు ఉరితాడు బిగించింది. ఆమె రాసిన చివరి లేఖ కుటుంబ సభ్యులను శోకసంద్రంలో ముంచేసింది. తిరుపతి జిల్లా: ఇద్దరు పిల్లలతో ఒక తల్లి మరణించిన సంఘటన పుత్తూరు పట్టణంలో కలకలం రేపింది. పుత్తూరు పట్టణం కృష్ణానగర్ 3వ వీధిలో నివాసం ఉంటున్న శివకుమార్ (28), పద్మజ (27)లకు తేజశ్రీ (7), లాస్య (4) అనే ఇద్దరు పిల్లలు. అప్పుల బాధ తాళలేక పద్మజ తన పిల్లలు తేజశ్రీ, లాస్యలతో పాటు ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న వారందరూ కృష్ణానగర్కు పరుగులు తీశారు. విగతజీవులుగా పడివున్న తల్లి, కూతుళ్లను, కన్నీరుమున్నీరై విలపిస్తున్న పద్మజ తల్లిదండ్రులను చూసి చలించిపోయారు. ప్రేమించి పెళ్లిచేసుకుంది పద్మజ పుత్తూరు మండలం నేసనూరు గ్రామానికి చెందిన కన్న ప్పరెడ్డి – నాగభూషణం దంపతుల కుమార్తె. శివశంకర్ పుత్తూ రు మండలం పైడిపల్లి గ్రామానికి చెందినవాడు. ఇద్దరూ డిగ్రీ చదువుకునే రోజుల్లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఎనిమిదేళ్లుగా వీరి వివాహ జీవితం సాగుతోంది. శివశంకర్కు ఉద్యోగం లేకపోవడంతో ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఎందుకింత పనిచేసిందో? శ్రీసిటీకి ఉద్యోగానికి వెళ్లాను. మధ్యాహ్నం పిల్లలు చదివే స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది. పాఠశాల 2.30 కి వదిలేస్తారు తీసుకెళ్లండన్నారు. తెలిసిన వ్యక్తికి మా పిల్లల్ని తీసుకెళ్లాలని ఫోన్చేశా. వాళ్లు తీసుకొస్తుంటే నా భార్య ఎదురుగా వచ్చి పిల్లల్ని తీసుకెళ్లిందంట. సాయంత్రం నాకు ఫోన్చేసి ఎక్కడున్నావని అడిగింది. 6 గంటల కంతా ఇంటికి వచ్చేస్తానని చెప్పా. గ్రూపునకు డబ్బులు కట్టావా అని అడిగింది. నేను మేడమ్తో మాట్లాడా వచ్చి కడతానని చెప్పా. సాయంత్రం ఇంటికి వచ్చి చూస్తే తలుపువేసి ఉంది. ఎంతకూ తెరవకపోవడంతో మిద్దెపైకి వెళ్లి చూసా. అక్కడ లేకపోవడంతో ఇంటి కిటికీకొంత తీసి లోపలకు చూస్తే అమ్మాయి వేలాడుతూ కలిపించింది. వెంటనే ఇరుగుపొరుగు వారిని తీసుకువచ్చి తలుపు పగులకొడితే ముగ్గురూ వేలాడుతూ కనిపించారు. ఉద్యోగం లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. అప్పులు ఉన్నాయి. ఈనెల 2వ తేదీ నుంచి ఉద్యోగంలో చేరా. అప్పులు తీర్చేస్తానని కూడా చెప్పా. ఎందుకింత పనిచేసిందో తెలియడం లేదు. శివశంకర్, పద్మజ భర్తఆఖరి లేఖ పద్మజ తన బిడ్డలతో ఆత్మహత్య చేసుకునే మునుపు తన ఆఖరి లేఖను ఇలా రాసింది. ‘‘తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికీ నా జీవితం ఒక గుణపాఠం. ఒక అమ్మాయి తన భర్తకు ఎలాంటి లక్షణాలు ఉండకూడదు అని కోరుకుంటుందో, అలాంటివన్నీ నా భర్తలో ఉన్నాయి. ఇలాంటి జీవితాన్ని నేను కలలో కూడా ఊహించలేదు. శివశంకర్ నన్ను పెళ్లి చేసుకున్న పాపానికి నేను ఎంత కష్టపడాలో అంతా అనుభవించాను. నా కడుపున పుట్టిన పాపానికి నా పిల్లలు కూడా ఈ కష్టాలు అనుభవిస్తున్నారు. నిన్ను భరించే ఓపిక ఇక నాకు లేదు. ఊరంతా అప్పులే ఉన్నాయి. లోన్లు తీసేసి, నా దగ్గర డబ్బు లేదు అంటే నేను ఏం చేయాలి? నేను వాటిని తీర్చలేను. నువ్వు పనికి వెళ్లకపోయినా, ఎవరితో తిరిగినా అడిగే భార్య ఇక నీకు ఉండదు. హాయిగా ఉండు. నన్ను చేసుకుని నువ్వు కష్టపడుతున్నావు కదా, ఇక నేను ఉండను. హాయిగా బతుకు. భార్యను, పిల్లలను పోషించలేని వాడివి ఎందుకు పెళ్లి చేసుకోవాలి? ఎలాగో ఇంకో పెళ్లి చేసుకుంటావు కదా, ఈసారైనా జీవితంలో స్థిరపడ్డాక చేసుకో. అంతేగానీ నాలాగా ఇంకొక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయకు. ఇంకొక జన్మలో తల్లిదండ్రులు చూసిన సంబంధం చేసుకుని, పుట్టింటి వాళ్లతో కలిసి జీవించాలని దేవుడిని కోరుకుంటున్నాను..’’ ఒక్కసారి ‘‘పాప’’ అని పిలువు చాలు అన్నయ్యా ‘‘అన్నా.. ఇప్పటివరకు నీతో మాట్లాడలేదంటే నీ మీద ప్రేమ లేక కాదు, నిన్ను ఎదుర్కొనే ధైర్యం లేక. నీవు అడిగే ఏ ఒక్క ప్రశ్నకూ నా దగ్గర సమాధానం లేదు. ఎనిమిది సంవత్సరాలు అవుతోంది నీ నోటి నుండి ‘పాప’ అని విని. చివరి సారిగా నన్ను, నా పిల్లల్ని వచ్చి చూడు. ఇక చూడాలనుకున్నా మేము ఉండం. నీ నోటితో ఒక్కసారి ‘పాప’ అని పిలువు చాలు అన్నయ్యా. ప్లీజ్ అన్నా.. సారీ నాన్న, నన్ను క్షమించండి. – ఇట్లు, వి. పద్మ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం పద్మజ ఇంటి వద్ద లభించిన ఆధారాలతో ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణాలుగా తెలుస్తోంది. ఆర్థిక ఇబ్బందులేనా? వేరే ఏవైనా కారణాలు ఉన్నాయా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. మృతదేహాల పోస్టుమార్టం నివేదిక, విచారణలో కనుగొనే అంశాల ఆధారంగా ఆత్మహత్యకు కారణాలను వెల్లడిస్తాం. – జి.రవికుమార్, డీఎస్పీ -
యాటిట్యూడ్ స్టార్కు మరో షాక్.. కేసు నమోదు..!
బరాబర్ ప్రేమిస్తా మూవీ హీరో చంద్రహాస్పై మరో కేసు నమోదైంది. ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్లో బూతు సాంగ్ పాడారని ఒక కానిస్టేబుల్ ఫిర్యాదు చేశారు. అతని ప్రవర్తన, వాడిన పదజాలం అసభ్యకరంగా ఉన్నాయని.. ప్రజల మర్యాదని దెబ్బ తీశాడంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్పై కేసు నమోదైంది. కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.ఇప్పటికే చంద్రహాస్పై ప్రముఖ జర్నలిస్ట్ అశోక్ వేములపల్లి మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను బెదిరింపులకు గురి చేస్తున్నాడంటూ ఫిర్యాదులో ప్రస్తావించారు. దీనిపై ఇప్పటికే మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బరాబర్ ప్రేమిస్తా మూవీలోని ఓ సాంగ్ను పాడిన చంద్రహాస్.. అందులో తన సొంత పదజాలంతో పాడారు. బూతులు ఊపయోగిస్తూ పాడడంతో అది కాస్తా సోషల్ మీడియాలో వైరలైంది. దీంతో అతనిపై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. -
వివేకానంద రెడ్డి హత్య కేసుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
వివేకా హత్య కేసుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: సుప్రీంకోర్టులో వైయస్ వివేకానంద రెడ్డి హత్యకేసుపై విచారణ జరిగింది. ఒక అంశంపైనే దర్యాప్తు చేయాలన్న ట్రయల్ కోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో సునీత రెడ్డి సవాల్ చేశారు. ఈ కేసులో సిబిఐ దర్యాప్తు ఇప్పటికే పూర్తయిందని సీబీఐ తరుపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. ట్రయల్ కోర్టు ఆదేశాల మేరకు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నామని సీబీఐ పేర్కొంది.విచారణలో భాగంగా జస్టిస్ సుందరేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో మళ్లీ మినీ ట్రయల్ నిర్వహించలేమని.. ఇలా అయితే మూడు, నాలుగేళ్లు పడుతుందన్నారు. ఇది అంతులేకుండా ముందుకు వెళ్తుంది. ట్రయల్ కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు కొనసాగించొచ్చు. ఎవరిని విచారించాలన్న అంశంపై ఎలాంటి ఆదేశాలివ్వం అని జస్టిస్ సుందరేష్ స్పష్టం చేశారు.గత విచారణలో(జనవరి 20) కూడా.. వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సీబీఐ విచారణ కొసాగింపునకు ట్రయల్ కోర్టు పాక్షికంగా అనుమతివ్వడాన్ని సవాల్ చేస్తూ ఆయన కుమార్తె సునీత సుప్రీంను ఆశ్రయించగా.. ‘ఇంకెంతకాలం సీబీఐ దర్యాప్తు కొనసాగించాలి?. మళ్లీ మినీ ట్రయల్ కోరుకుంటున్నారా?. ఇలా అయితే సీబీఐ దర్యాప్తు పూర్తయ్యేందుకు పదేళ్లు పడుతుంది’’ అంటూ జస్టిస్ సుందరేశ్, జస్టిస్ కోటీశ్వర్ సింగ్ వ్యాఖ్యానించారు.ఈ సందర్భంగా.. సునీత పిటిషన్పై వైఖరి తెలియజేయాలని సీబీఐని కోరారు. అయితే.. తమ వైఖరి తెలియజేసేందుకు కొంత సమయం కావాలని సీబీఐ తరఫు న్యాయవాది కోరడంతో.. తదుపరి విచారణను నేటికి (ఫిబ్రవరి 5) వాయిదా వేసింది. ఇవాళ విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ట్రయల్ కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు కొనసాగించొచ్చని ఎవరిని.. విచారించాలన్న అంశంపై ఎలాంటి ఆదేశాలివ్వమని పేర్కొంది. -
చిక్కుల్లో దురంధర్ టీమ్.. కేసు నమోదు..!
రణ్వీర్ సింగ్ దురంధర్-2 మూవీ టీమ్కు ముంబయి పోలీసులు షాకిచ్చారు. అనుమతి లేకుండా డ్రోన్ ఎగరేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఉల్లంఘనలకు పాల్పడ్డారనే ఫిబ్రవరి 1న ఈ కేసు నమోదైంది. దక్షిణ ముంబయిలోని అత్యంత భద్రత కలిగిన ఫోర్ట్ ప్రాంతంలో అనుమతి తీసుకోకుండా డ్రోన్ ఎగరేయడంపై సినిమా లొకేషన్ మేనేజర్ రింకు రాజ్పాల్ వాల్మీకిపై కేసు నమోదు చేశారు.ఈనెల 1వ తేదీన షూటింగ్లో సంజయ్ దత్ కూడా పాల్గొన్నారు. ఈ షూటింగ్ షెడ్యూల్ సమయంలో అనధికార డ్రోన్ కార్యకలాపాలను పోలీసులు గమనించారు. ఆ తర్వాతే పోలీసులు జోక్యం చేసుకున్నారు. డ్రోన్ వాడకాన్ని గుర్తించిన పోలీసు అధికారులు లొకేషన్ మేనేజర్కు నోటీసులు జారీ చేశారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. ఈ సినిమా సెట్ డిజైన్లో భాగంగా జనవరి 30న చారిత్రాత్మక ఫోర్ట్ కాంప్లెక్స్లోని కొన్ని భాగాలను పాకిస్తాన్లోని ఒక శక్తివంతమైన పాత వీధిని పోలి ఉండేలా ఏర్పాటు చేశారు.ఎవరైనా సరే మూవీ చిత్రీకరణ కోసం వైమానిక పరికరాలను ఉపయోగించే ముందు అవసరమైన అన్ని అనుమతులు పొందాలి. కానీ చట్టపరమైన అనుమతులు తీసుకోవడంతో దురంధర్ టీమ్ సభ్యులు విఫలమయ్యారు. ప్రతిష్టాత్మక ఫోర్ట్ ప్రాంతంలో మానవరహిత వైమానిక వాహనాల వాడకం ప్రభుత్వ, ఆర్థిక సంస్థలకు దగ్గరగా ఉండటం వల్ల కచ్చితంగా నిబంధనలు పాటించాల్సిందే. ఈ ప్రాంతం నిత్యం పర్యవేక్షణలో ఉంటుంది. ముఖ్యంగా వైమానిక ప్రదేశాల నిబంధనల ఉల్లంఘనను చట్ట అమలు సంస్థలు తీవ్రంగా పరిగణిస్తాయి. నిషేధిత ప్రాంతాల్లో డ్రోన్లు, ఇతర రికార్డింగ్ పరికరాల వినియోగాన్ని నియంత్రించే నిబంధనలను కఠినంగా పాటించాల్సిన అవసరముందని పోలీసులు తెలిపారు. -
కాంతార ‘సీన్’ వివాదంలో కొత్త ట్విస్ట్
బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ చిక్కుల్లో ఇరుక్కున్నారు. కాంతార చిత్రంలోని ఓ దైవ సన్నివేశాన్ని ఇమిటేట్ చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీశారని ఆయనపై కేసు నమోదైంది. దీంతో ఈ కేసుపై ఏప్రిల్ 8న విచారణ జరగనుంది.అసలేం జరిగిందంటే 2025లో గోవాలో ఇంటర్నేషనల్ ఫిల్స్ ఫెస్టివల్ జరిగింది. కాంతార చిత్రంలో హిరో రిషబ్ పోషించిన పంజుర్లి, గులిగ అనే దైవంశకు చెందిన క్యారెక్టర్లను పోషించారు. అయితే ఈ కార్యక్రమంలో రణవీర్ సింగ్ ఆ క్యారెక్టర్లను కామెడీగా అనుకరించారు. దీంతో రణవీర్ సింగ్పై కన్నడీగులు ఆగ్రహాం వ్యక్తం చేశారు. దీంతో వెంటనే తన తప్పు తెలుసుకున్న రణవీర్ సింగ్ వారికి క్షమాపణ చెప్పారు. అనంతరం రిషబ్ షెట్టి చాలా బాగా ఆ పాత్రలను పోషించాడు అని చెప్పడం కోసమే అలా చేశానని వివరణ ఇచ్చారు.అయితే దైవాంశకు చెందిన పాత్రలను రణవీర్ సింగ్ కామెడీగా ఇమిటేట్ చేశారని ఆరోపిస్తూ గత డిసెంబర్లో ప్రశాంత్ మితల్ అనే న్యాయవాది బెంగళూరులోని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఆ దీనిపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో పోలీసులు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 196,299,302 ల ప్రకారం కేసు ఫైలు చేశారు. దీనిపై ఏప్రిల్ 8న విచారణ జరగనుంది.అయితే గతేడాది పాన్ ఇండియా చిత్రంగా విడుదలైన కాంతారా చాప్టర్-1 మూవీ బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించింది. రూ.800 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి రికార్డులు సృష్టించింది. 2022లో విడుదలైన కాంతారా చిత్రానికి ఇది ప్రీక్వెల్గా కాంతారా చాఫ్టర్-1 విడుదలైంది. -
కూటమి ఎమ్మెల్యే శ్రీధర్ బాధితురాలి కేసుపై పోలీసుల నిర్లక్ష్యం
సాక్షి, విజయవాడ: కూటమి ఎమ్మెల్యే శ్రీధర్ బాధితురాలి కేసుపై పోలీసుల నిర్లక్ష్యంగా వ్యవహరించారు. బాధితురాలు ఫిర్యాదు చేసినా.. కానీ పోలీసులు స్పందించలేదు. ఈనెల 26న డీజీపీకి బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై దళిత మహిళా ఉద్యోగి ఫిర్యాదు చేయగా.. ఆ మహిళ ఫిర్యాదుపై కనీసం ఎఫ్ ఐఆర్ కూడా పోలీసులు నమోదు చేయలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.నారావారిపల్లెలో సీఎం చంద్రబాబుకి ఫిర్యాదు చేసినట్టు ఆమె వెల్లడించారు. రైల్వే కోడూరు పోలీసులు, తిరుపతి ఎస్పీ ఫిర్యాదు తీసుకోలేదని బాధితురాల వాపోయింది. బాధితురాలు ఫిర్యాదును తీసుకోకుండా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒత్తిడి తీసుకువచ్చినట్లు సమాచారం. ఎమ్మెల్యేపై డీజీపీకి ఫిర్యాదు చేసినా చర్యల్లో తాత్సారం చేశారు. డీజీపీకి చేసిన ఫిర్యాదును బాధిత మహిళ విడుదల చేశారు.ఎమ్మెల్యే శ్రీధర్ శారీరక, మానసిక వేధింపులపై బాధితుల ఫిర్యాదు చేసింది. కొట్టి, తిట్టి తనను లైంగికంగా ఎమ్మెల్యే శ్రీధర్ లోబర్చుకున్నట్టు ఆమె ఫిర్యాదు చేశారు. ఐదు సార్లు తనకు అబార్షన్ చేయించినట్టు డీజీపీకి బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసినట్టు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ దారుణంపై సాక్షి కథనాలతో రాజకీయ ప్రకంపనలు రేపాయి. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కీచక పర్వంతో దూమారం రేగింది. మహిళను వేధించిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోని ప్రభుత్వం.. డైవర్షన్ కోసం కాలయాపన కమిటీని జనసేన తెరపైకి తీసుకొచ్చింది. ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీని ప్రకటించింది. దళిత మహిళను వేధించిన ఎమ్మెల్యేలకు చర్యలకు పూనుకోని ప్రభుత్వం.. ఉద్యోగిని మోసం చేసిన ఎమ్మెల్యేపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు. జనసేన దృష్టికి బాధిత మహిళ ముందే ఈ విషయాన్ని తీసుకెళ్లిన కానీ పట్టించుకోలేదు. -
బాబుకు బిగ్ షాక్.. మద్యం అక్రమ కేసులో ఆ ముగ్గురికి ఊరట
-
YS వివేకా కేసులో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో సునీతకు బిగ్ షాక్..
-
మేనకగాంధీపై సుప్రీం ఆగ్రహం
వీధికుక్కల కేసులో మాజీ కేంద్రమంత్రి మేనకాగాంధీపై సుప్రీంకోర్టు తీవ్రవ్యాఖ్యలు చేసింది. దేశ అత్యున్నత ధర్మాసనంపై ఇష్ఠారీతిన వ్యాఖ్యలు చేయడం సరికాదంది. ఇటీవల మేనకగాంధీ ఓ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ సుప్రీంకోర్టును విమర్శించిందని ఆగ్రహం వ్యక్తం చేసింది.వీధికుక్కల కేసును సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం మంగళవారం విచారించింది. మేనకాగాంధీ తరపు న్యాయవాది రాజు రామచంద్రన్ని కోర్టు ప్రశ్నిస్తూ" కొద్దిరోజుల క్రితం మీరు కోర్టులు ఉదాసీనంగా వ్యవహరించాలన్నారు. మీ క్లైంట్ ఎటువంటి వ్యాఖ్యలు చేస్తుందో మీరు గమనించారా? మీ క్లైంట్ తప్పు చేసింది. అయినా మేము ఏ తనపై ఎటువంచి చర్యలు తీసుకోలేదు. ఇది మా గొప్పతనం కాదా? ఆమె పాడ్కాస్ట్లో మాట్లాడిన మాటలు మీరు చూశారా? ఆమె బాడీలాంగ్వేజ్ ఏంటి? అని ప్రశ్నించింది. " మీరేమో కోర్టులకు ఉదాసీనత ఉండాలంటారు మరోవైపు మీక్లైంట్ ఇష్ఠారీతిన వ్యాఖ్యలు చేస్తుంటారు అని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.మీ క్లైంట్( మేనకాగాంధీ) ప్రస్తుతం జంతువుల హక్కుల కార్యకర్తగా ఉంది, ఆమె గతంలో కేంద్రమంత్రిగా పనిచేసింది. అయితే జంతువుల రక్షణకోసం ఇప్పటి వరకూ తను చేసిన పనులు ఏంటి? వాటి కోసం బడ్జెట్లో ఏమైనా ప్రత్యేక నిధులు కేటాయించేలా ప్రభుత్వాన్ని ఒప్పించిందా? లేదా వాటికోసం మూగజీవాల ఏదైనా కొత్త పథకాలు వచ్చేలా చేసిందా అని కోర్టు ప్రశ్నించింది.కుక్కకాటు వేస్తే వాటికి ఆహారం వేసిన వారిని బాధ్యులు చేయాలని గతంలో కోర్టు చేసిన వ్యాఖ్యలు సరదాకు చేసిన కావని సీరియస్గా మాట్లాడినవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కాగా వీధికుక్కలను నియంత్రించలేకపోతే అవి కరిస్తే పెద్దమెుత్తంలో పరిహారం చెల్లించేలా ప్రభుత్వాల్ని ఆదేశిస్తామని ఇదివరకే కోర్టు హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
మద్యం అక్రమ కేసులో మోహిత్ రెడ్డికి భారీ ఊరట
-
మమతకు సుప్రీంలో చుక్కెదురు
సుప్రీంకోర్టులో మమతా బెనర్జీకీ చుక్కెదురైంది. ఈడీ అధిాకారులపై నమోదైన మూడు ఎఫ్ఐఆర్లపై కోర్టు స్టే విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈడీ విచారణలో తన పరిధిని అతిక్రమించిందని రాష్ట్ర పోలీసులు అధికారులపై కేసులు నమోదు చేశారు. కాగా తాజాగా సుప్రీంకోర్టు దానిపై స్టే విధించింది.దానితోపాటు ఐప్యాక్ ఆపీసులో సీసీ కెమెరాల, పుటెజ్ను భద్రపరచాలని , ఫైల్ చోరీ కేసులో సాక్షాలకు రక్షణ కల్పించాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా ఐప్యాక్ కార్యాలయం, డైరెక్టర్ ప్రాంగణంలో సోదాలు జరిపే సమయంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నుంచి ఆటంకాలు ఎదురయ్యాయని ఈడీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈడీ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. "అధికారుల ఫోన్లు, కీలక డాక్యమెంట్లను మమతా బెనర్జీతో పాటు ఇతర అధికారులు లాక్కున్నారు. అనంతరం బెంగాల్ పోలీసులు సీసీటీవీ పుటేజ్ను ధ్వంసం చేశారు. మమతా బెనర్జీ ఐ-ప్యాక్ కార్యాలయానికి రావాల్సిన అవసరం ఏంటి" అని తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు.దీనిని విచారించిన సుప్రీంకోర్టు ఈడీ దర్యాప్తును అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది చాలా తీవ్రమైన అంశమని రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని బెంగాల్ సీఎం మమతతో పాటు పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
సీబీఐ ఆఫీస్ లో హీరో విజయ్
-
కరూర్ తొక్కిసలాట వెనుక కుట్రకోణం
-
బాలికపై సామూహిక అత్యాచారం : యూట్యూబర్ అరెస్ట్, పరారీలో ఎస్ఐ
లక్నో : ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో మరో దారుణ ఘటన కలకలం రేపింది. 14 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి, కదులుతున్న కారులో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో ఒక పోలీసు అధికారి ఒక యూట్యూబర్ ఉండటం మరింత ఆందోళన రేపింది.బాధిత బాలిక పోలీసులకు అందించిన సమాచారం ప్రకారం కాన్పూర్లోని సచెండి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 14 ఏళ్ల బాలికను బలవంతంగా ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఆరోపణలకు సంబంధించి యూట్యూబర్ శివబరన్ అరెస్ట్ చేశారు. సబ్-ఇన్స్పెక్టర్ అమిత్ కుమార్ మౌర్య పరారీలో ఉన్నాడు.ఏం జరిగిందంటే..7వ తరగతి చదువు మానేసిన మైనర్ బాలిక సోమవారం రాత్రి సుమారు 10 గంటలకు తన ఇంటి నుండి బయటకు వెళ్ళగా, మహీంద్రా స్కార్పియోలో వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమెను కిడ్నాప్ చేశారు.అనంతరం సచెండిలోని రైల్వే ట్రాక్ సమీపంలో ఉన్న ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ వాహనంలోనే దాదాపు రెండు గంటల పాటు ఆమెపై లైంగిక దాడి జరిగింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను ఇంటి బయట వదిలి వెళ్లారు. బాధితురాలి సోదరుడు అర్ధరాత్రి సమయంలోఆమెను గమనించి 112కు డయల్ చేసి పోలీసులు ఫిర్యాదు చేశాడు. అయితే ఎలాంటి తక్షణ చర్యలు తీసుకోలేదు.నిందితులలో ఒకరు పోలీసని చెప్పడంతో తమ ఫిర్యాదును పట్టించుకోలేదని బాలిక సోదరుడు ఆరోపించాడు. ఉన్నతాధికారులను ఆశ్రయించిన తర్వాతే కేసు నమోదు చేశారని, అంతేకాకుండా ఫిర్యాదులో నిందితుల పేర్లను మొదటగా చేర్చలేదని పేర్కొన్నాడు.బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించామని, నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (వెస్ట్) దినేష్ త్రిపాఠి తెలిపారు. జర్నలిస్టును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని, పోలీసు కానిస్టేబుల్ను గుర్తించి విచారణ పూర్తయిన తర్వాత అతడిని కూడా అరెస్టు చేస్తామని డీసీపీ తెలిపారు. కిడ్నాప్, సామూహిక అత్యాచారానికి సంబంధించిన సెక్షన్లతో పాటు లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద కేసు నమోదు చేశామని, విచారణ పూర్తి పారదర్శకంగా జరుగుతోందని చెప్పారు.పరారీలో ఉన్న SIని పట్టుకోవడానికి నాలుగు బృందాలను ఏర్పాటు చేశామని మరో పోలీసు అధికారి రఘుబీర్ లాల్ విలేకరులకు తెలిపారు. -
50 వేలు సుపారీ ఇచ్చి ప్రియుడితో కలిసి..
విశాఖపట్నం: ప్రియుడి మోజులో పడి, సుపారీ ఇచ్చి మరీ భర్తను అంతమొందించింది ఓ ఇల్లాలు. విశాఖపట్నం జిల్లాలోని మధురవాడలో జరిగిన ఈ ఘటన వివరాలు పీఎంపాలెం పోలీసులు బుధవారం తెలిపారు. బక్కనపాలెం ఎనీ్టఆర్ కాలనీకి చెందిన అల్లాడ నాగరాజు(38), రమ్య దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. కంచరపాలేనికి చెందిన సంజీవి వసంతరావుతో రమ్య వివాహేతర సంబంధం పెట్టుకుంది. తమకు అడ్డు వస్తున్నాడనే నెపంతో ఎలాగైనా భర్త అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి హత్యకు పథకం రచించింది. నాగరాజును చంపేందుకు వీరిద్దరూ కంచరపాలేనికి చెందిన బాలకృష్ణ, ప్రవీణ్కు రూ.50 వేలు ఇచ్చారు. నిందితులు వసంతరావు, బాలకృష్ణ, ప్రవీణ్ పథకం ప్రకారం నవంబరు 29న మధురవాడ మిథిలాపురి వుడా కాలనీలో గల ఓ లాడ్జిలో నాగరాజును హత్య చేసి శవాన్ని తిమ్మాపురం వెళ్లే రోడ్డులో ఉన్న బావికొండ సమీప నిర్మానుష్య ప్రాంతంలో పడేశారు. అనంతరం ఏమీ తెలియనట్లు రమ్య తన భర్త కనిపించడం లేదంటూ డిసెంబర్ 17న పీఎంపాలెం పోలీసులకు ఫిర్యాదు ఇచి్చంది. మిస్సింగ్ కేసు నమోదు చేయాలని, తన భర్త మద్యానికి బానిసయ్యాడని, రూ.5 వేలు నగదు, బంగారం పట్టుకుని వారం రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడని ఫిర్యాదులో పేర్కొంది. అనుమానం వచి్చన పోలీసులు రమ్యను తమదైన శైలిలో విచారించగా, హత్య ఉదంతం బయటపడింది. పథకం ప్రకారం తామే హత్య చేసినట్లు ఒప్పుకుంది. దీంతో పోలీసులు బుధవారం మృతదేహం పడేసిన ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. బాగా పాడైపోయిన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కి తరలించారు. కేసు నమోదు చేసి, నిందితులు నలుగురినీ అరెస్టు చేసినట్లు పీఎంపాలెం సీఐ బాలకృష్ణ చెప్పారు. -
జైల్లో గంజాయి ఘటన .. అధికారి సస్పెండ్
సాక్షి నిజామాబాద్: సెంట్రల్ జైల్లో అధికారుల నిర్లక్ష్యంపై పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఇటీవల గంజాయి తీసుకున్నారనే నెపంతో ఇద్దరు ఖైదీలపై దాడి చేసిన జైలర్ ఉపేందర్ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. మరో జైలర్ సాయి సురేశ్పై బదిలీ వేటు వేశారు. అంతేకాకుండా జైలు సూపరిండెంట్ దశరథంపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫారసు చేశారు.ఇటీవల నిజామాబాద్ జైలులో జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇద్దరు ఖైదీలు గంజాయికోసం ఘర్షణ పడుతుండడంతో వారిని గమనించిన జైలు అధికారి వారిపై దాడిచేశారు దీంతో వారికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ఒకరికి ప్రక్కటెముకలు విరిగాయి. దీంతో ఈ విషయం అందరికీ తెలిసింది. ఈకేసును బోధన్ కోర్టు విచారించగా పోలీసులు తమను తీవ్రంగా కొట్టారని న్యాయమూర్తి ముందు ఖైదీలు తెలపారు. దీంతో ఈ కేసుపై కోర్టు విచారణకు ఆదేశించింది.ఆ నేపథ్యంలో ఉన్నతాధికారులు వారిపై చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా జైలులో గంజాయి, బీడీలు, ఇతర నిషేధిత వస్తువులతో అక్రమ వ్యాపారం చేస్తున్న ఏడుగురు ఖైదీలను సంగారెడ్డి, చర్లపల్లి, చంచల్గూడ జైలుకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. -
ఉన్నావ్ కేసులో సుప్రీం షాక్.. నిందితుని బెయిల్ పై స్టే..


