
ఈ మసీదుకు 250 ఏళ్లు
250 సంవత్సరాల క్రితం నిర్మించిన మసీద్ ఇబ్రహీంపట్నంలోని ఫీర్జాదిమహల్లో ఉంది. జామా మసీదుగా దీనిని పిలుస్తారు. కులీకుతుబ్షా పాలనలో స్థానిక చెరువుకట్ట నిర్మించిన సమయంలో ఇబ్రహీం బాషా ఈ మసీదును నిర్మించినట్లుగా ముస్లిం పెద్దలు చెబుతున్నారు.
ఇబ్రహీంపట్నం : 250 సంవత్సరాల క్రితం నిర్మించిన మసీద్ ఇబ్రహీంపట్నంలోని ఫీర్జాదిమహల్లో ఉంది. జామా మసీదుగా దీనిని పిలుస్తారు. కులీకుతుబ్షా పాలనలో స్థానిక చెరువుకట్ట నిర్మించిన సమయంలో ఇబ్రహీం బాషా ఈ మసీదును నిర్మించినట్లుగా ముస్లిం పెద్దలు చెబుతున్నారు. మసీదు పైకప్పు దెబ్బతిని వర్షం పడితే నీరు కారుతుండడంతో అప్పటి గోడలపైనే ఇటీవల శ్లాబ్ను వేశారు. మసీదు ముందు భాగం, లోపలి గోడలు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ముస్లింలు ఇప్పటికీ నిత్యం ఈ మసీదులో ప్రార్థనలు చేస్తుంటారు.