నిలిచిన ఆహార భద్రత కొత్త కార్డులు
పెండింగ్లో 19,776 దరఖాస్తులు
పట్టించుకోని అధికారులు
ఇబ్బంది పడుతున్న పేదలు
సాక్షిప్రతినిధి, వరంగల్ : పేదలకు సబ్సిడీతో నిత్యావసర సరుకులు లభించే ఆహార భద్రత(తెల్ల రేషన్) కార్డుల పంపిణీ జిల్లాలో నిలిచిపోయింది. మూడు నెలలుగా కొత్త కార్డులు జారీ చేయడం లేదు. దీనిపై జాయింట్ కలెక్టర్ ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించలేదు. దీంతో క్షేత్రస్థాయి అధికారులు ఈ విషయాన్ని పట్టించుకోవడం మానేశారు. మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటున్న అర్హులకు సైతం ఆహార భద్రత కార్డులు రాక వారు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ప్రజా పంపిణీపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
ఆహార భద్రత కార్డులకు ఆధార్తో లింక్ చేసి బోగస్ కార్డులను ఏరివేసింది. అనంతరం అర్హులైన వారికి కొత్త కార్డులను జారీ చేస్తోంది. ఆహార భద్రత కార్డులతో ఒక్కో వ్యక్తికి నెలకు ఆరు కిలోల బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఆహార భద్రత కార్డు కోసం... తెల్ల కాగితంపై వివరాలను రాసి, ఆధార్ కార్డు, నివాస ధృవీకరణ పత్రం జిరాక్స్ కాపీలతో స్థానిక మీసేవ కేంద్రంలో రూ.35 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న నాటి నుంచి 30 రోజుల్లో అధికారులు పరిశీలించి అర్హులా, కాదా అనేది నిర్ధారిస్తారు. ఈ ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే జరుగుతుంది. అర్హుల వివరాలను సంబంధిత రేషన్ షాపునకు కేటాయిస్తారు.
మీ సేవలో దరఖాస్తు చేసుకున్న వాటిని మొదట రెవెన్యూ ఇన్స్పెక్టర్, తహసీల్దార్/ఏఎస్వో పరిశీలించి ధృవీకరించిన తర్వాత పౌరసరఫరాల జిల్లా అధికారి ఆమోదం కోసం పంపిస్తారు. ఇక్కడ తుది నిర్ణయం జరిగిన తర్వాత లబ్ధిదారులుగా నిర్ధారించి రేషన్ సరుకుల కోటా జారీ అవుతుంది. జిల్లాలో 9,72,211 ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. వీటిలో అంత్యోదయ కార్డులు 58,484, ఆన్నపూర్ణ కార్డులు 141, సాధారణ ఆహార భద్రత కార్డులు 9,13,586 ఉన్నాయి.
ఇవి కాక 19,776 కుటుంబాల వారి దరఖాస్తులు పెండింగ్లో ఉన్నారుు. అరుుతే ఈ కార్డులు ఇష్టారాజ్యంగా జారీ చేస్తే క్రిమినల్ కేసులు పెడతామని జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్పాటిల్ జిల్లాలోని తహసీల్దార్లను హెచ్చరించారు. ఇలాంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో పరిశీలించి అర్హులకు కార్డులు జారీ చేయాల్సిన అధికారులు మొత్తంగా పక్కన పెడుతున్నారు. దీంతో పేదలు ఇబ్బంది పడుతున్నారు.
ఆహార భద్రత కార్డులకు సంబంధించిన దరఖాస్తులు,
అధికారుల వద్ద పెండింగ్లో ఉన్న వివరాలు...
కార్యాలయం దరఖాస్తులు ఆర్ఐ ఎంఆర్వో/ డీఎస్వో ఆమోదం తిరస్కరించినవి
ఏఎస్వో
ఆత్మకూరు 117 117 0 0 0 0
బచ్చన్నపేట 234 218 4 11 0 1
భూపాలపల్లి 721 284 297 135 5 0
చెన్నారావుపేట 207 190 0 12 5 0
చేర్యాల 319 236 0 83 0 0
చిట్యాల 126 105 16 5 0 0
దేవరుప్పుల 202 127 0 74 1 0
ధర్మసాగర్ 415 410 5 0 0 0
డోర్నకల్ 441 282 0 159 0 0
దుగ్గొండి 113 87 13 12 1 0
ఏటూర్నాగారం 266 266 0 0 0 0
గీసుకొండ 207 168 0 36 3 0
గణపురం 186 115 0 70 1 0
గణపురం(స్టే) 613 208 9 389 7 0
గోవిందరావుపేట 95 75 10 10 0 0
గూడూరు 232 232 0 0 0 0
హన్మకొండ 3,128 2,549 385 149 45 0
హసన్పర్తి 647 305 0 309 31 2
జనగామ 322 315 0 7 0 0
జనగామఅర్బన్ 397 391 0 5 1 0
కేసముద్రం 377 376 1 0 0 0
ఖానాపురం 146 132 4 10 0 0
కొడకండ్ల 431 369 6 54 2 0
కొత్తగూడెం 226 146 26 53 1 0
కురవి 232 167 11 50 4 0
కార్యాలయం దరఖాస్తులు ఆర్ఐ ఎంఆర్వో/ డీఎస్వో ఆమోదం తిరస్కరించినవి
ఏఎస్వో
లింగాలఘనపూర్ 153 152 1 0 0 0
మద్దూరు 356 138 10 198 8 2
మహబూబాబాద్ 494 346 147 0 1 0
మంగపేట 667 609 53 5 0 0
మరిపెడ 286 167 12 98 5 4
మొగుళ్లపల్లి 309 304 0 2 3 0
ములుగు 150 149 1 0 0 0
నల్లబెల్లి 203 36 5 143 4 15
నర్మెట్ట 252 189 0 63 0 0
నర్సంపేట 208 122 3 79 4 0
నర్సింహులపేట 159 158 1 0 0 0
నెక్కొండ 247 223 0 21 2 0
నెల్లికుదురు 360 194 0 166 0 0
పాలకుర్తి 412 274 13 123 2 0
పరకాల 299 206 0 90 3 0
పర్వతగిరి 143 129 2 11 1 0
రఘునాథపల్లి 377 145 40 192 0 0
రాయపర్తి 202 157 0 45 0 0
రేగొండ 175 175 0 0 0 0
సంగెం 196 135 17 34 10 0
శాయంపేట 200 149 51 0 0 0
తాడ్వాయి 61 51 0 9 1 0
తొర్రూర్ 520 510 0 2 0 0
వెంకటాపూర్ 219 153 49 16 1 0
వరంగల్అర్బన్ 2194 1830 79 243 41 1
వర్దన్నపేట 363 228 2 120 11 2
జఫర్గడ్ 171 170 0 1 0 0
మొత్తం 19776 14977 1273 3294 205 27
‘భద్రత’కు బ్రేక్
Published Tue, May 17 2016 9:14 AM | Last Updated on Mon, Sep 4 2017 12:18 AM
Advertisement
Advertisement