కొబ్బరికాయ వేలం రూ.18.50లక్షలు | coconut selling auction for 18.5lakhs | Sakshi
Sakshi News home page

కొబ్బరికాయ వేలం రూ.18.50లక్షలు

Aug 6 2016 1:18 AM | Updated on Sep 4 2017 7:59 AM

మండలంలోని చెర్వుగట్టు గ్రామపంచాయతీ పరిధిలో దేవాలయం గట్టు కింద కొబ్బరికాయలు విక్రయించేందుకు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో సర్పంచ్‌ మల్గరమణ బాలకృష్ణ అధ్యక్షతన శుక్రవారం వేలంపాట నిర్వహించారు


నార్కట్‌పల్లి: మండలంలోని చెర్వుగట్టు గ్రామపంచాయతీ పరిధిలో దేవాలయం గట్టు కింద కొబ్బరికాయలు విక్రయించేందుకు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో సర్పంచ్‌ మల్గరమణ బాలకృష్ణ అధ్యక్షతన శుక్రవారం   వేలంపాట నిర్వహించారు. ఈ వేలం రూ.18.50 లక్షలకు అదే గ్రామానికి చెందిన అంకాల సతీశ్‌ పాటను దక్కించుకున్నట్లు ఈఓఆర్డీ్డ లక్ష్మినారాయణ తెలిపారు. పాట దక్కించుకున్న వ్యక్తులకు ఒక సంవత్సరం పాటు కొబ్బరికాయలు విక్రయించేందుకు హక్కు కలిగి ఉంటారని తెలిపారు. ఈ వేలంలో 13మంది పాల్గొన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి సత్యనారాయణ, ఉప సర్పంచ్‌ పెద్దిరెడ్డి నారాయణరెడ్డి, వార్డు సభ్యులు గుంటిసైదమ్మ, నర్సింహ్మ, కొండేటి వేణు, దాసోజు తిరుపతమ్మ, కోటి, వంపు శివ శంకర్, కుకుట్ల అనురాధ, గణేష్, అండాలు, చంద్రయ్య, పారిజాత, శంకర్, లింగస్వామి,  తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement