selling
-
లాభాల స్వీకరణకే ఎఫ్ఐఐల అమ్మకాలు
న్యూఢిల్లీ: ఎడాపెడా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్ఐఐ) అమ్మకాలతో ఆందోళన చెందుతున్న మదుపరులకు కాస్త ఊరటనిచ్చే ప్రయత్నం చేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. పెట్టుబడులపై మంచి రాబడులను అందించే పటిష్ట స్థితిలో భారత ఎకానమీ ఉండటంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగుతున్నారని ఆమె చెప్పారు.‘ఎఫ్ఐఐలు తమకు అనువైనప్పుడు లేదా లాభాలను స్వీకరించే అవకాశం ఉన్నప్పుడు వైదొలుగుతూ ఉంటారు. భారత ఎకానమీలో నేడు పెట్టుబడులపై మంచి రాబడులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. దానికి తగ్గట్లే లాభాల స్వీకరణ కూడా జరుగుతోంది‘ అని తెలిపారు. ఎఫ్ఐఐలు గతేడాది అక్టోబర్ నుంచి రూ. 1.56 లక్షల కోట్ల మేర స్టాక్స్ అమ్మగా.. ఇందులో ఏకంగా రూ. లక్ష కోట్ల స్టాక్స్ విక్రయాలు ఈ ఏడాడి స్వల్ప కాలంలోనే నమోదవడం తెలిసిందే. -
కోటీశ్వరుడు అవ్వడమే శాపమైంది..!
డబ్బే జీవితంగా బతుకుతుంటారు కొందరూ. అందుకోసం తన పర అనే తేడా లేకుండా ప్రవర్తిస్తుంటారు. బంధాలన్నింటిని డబ్బుతోనే చూస్తారు. నిజానికి అదొక స్టాటస్ ఆఫ్ సింబల్. కాస్త డబ్బు పలుకుబడి ఉంటేనే సమాజంలో గౌరవం కూడా. అయితే అదే డబ్బు మనిషికి కొంచెం కూడా మనశ్శాంతిని, నమ్మకమైన వ్యక్తులను ఇవ్వలేదు అనే నిజం తెలిసేలోపే అన్నింటిని కోల్పోతాం. ఏం కావాలో తెలియక మనో వ్యధకు గురవ్వుతాం. అచ్చం అలాంటి బాధనే అనుభవిస్తున్నాడు ఓ మిలియనీర్. పాపం డబ్బే సర్వం అనుకున్నాడు ఇప్పుడదే అతడికి మనశ్శాంతిని దూరం చేసింది. అసలేం జరిగిందంటే...అమెరికాకు చెందిన జేక్ కాసన్ అనే కాలేజ్ డ్రాపౌట్ డబ్బు సంపాదించడమే ధ్యేయంగా బతికాడు. సంపదే తనకు ఆనందాన్ని తెచ్చిపెడుతుందని నమ్మాడు. అందుకోసం అహర్నిశలు కష్టపడి పనిచేశాడు. చిన్న వయసులోనే లాస్ ఏంజిల్స్కు చెందిన యాక్సెసరీ బ్రాండ్ MVMT వాచెస్ కంపెనీని స్థాపించాడు. అనతికాలంలోనే కోట్లకు పడగెత్తాడు. 27 ఏళ్ల వయసుకి తన బ్రాండ్కి ఉన్న ఇమేజ్ చూసి ఏకంగా రూ. 871 కోట్లకు విక్రయించాడు. మిలియనీర్గా మారాలన్న అతడి కల నెరవేరింది. కానీ అదే అతడికి కష్టాలు, కన్నీళ్లని తెచ్చిపెట్టింది. ఎప్పుడైతే కోటీశ్వరుడు అయ్యాడో అక్కడ నుంచి వ్యక్తిగత జీవితంలో కష్టాలు మొదలయ్యాయి. జస్ట్ 30 ఏళ్లకే వైవాహిక జీవితంలో బ్రేక్అప్లు, ఏదో లక్ష్యం కోల్పోయినట్లు మనశ్శాంతి లేకపోవడం తదితరాలు చుట్టుముట్టాయి. అయితే అతడికి ఎందరో ప్రాణ స్నేహితులు ఉన్నా.. తన ఒంటరితనాన్ని దూరం చేయలేకపోయాయి. ఏదో కావాలన్న ఆరాటం..కానీ ఏం కావాలో తెలియక ఒక విధమైన నైరాశ్యంతో కొట్టుమిట్టాడాడు. చివరికి అదికాస్తా మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపడం ప్రారంభించింది. "డబ్బే అనందాన్ని ఇస్తుందనుకుని కష్టపడి స్థాపించిన కంపెనీని అమ్మేశాను అదే నేను చేసిన తప్పు. వ్యవస్థాపక ప్రయాణం అత్యంత అమూల్యమైనది. ఒక కంపెనీని స్థాపించి దాన్ని నెంబర్ వన్ స్థాయిలో నిలబెట్టడంలో ఉన్న ఆనందం కిక్కు వేరు. డబ్బులు పోగేసుకోవడంలో లేదనే విషయం గ్రహించేలోపే..వ్యక్తిగతంగా అత్యంత ముఖ్యమైన మనశ్శాంతిని కోల్పోయా". అంటూ విలపిస్తున్నాడు కాసన్. అందుకే మళ్లీ పనిలో పడాలని నిర్ణయించుకుని యూట్యూబ్ చానెల్ పెట్టే ఆలోచన చేస్తున్నాడు. అలాగే తన బ్రాండ్కి పెట్టుబడిదారుడిగా ఉండాలని చూస్తున్నాడు. ఇతడి స్టోరీ ఓ గొప్ప విషయాన్ని చాటి చెప్పింది. "డబ్బు వెంట పరిగెడితే మనశ్శాంతి ఉండదు..కష్టపడటంలోనే ఆత్శసంతృప్తి ఉంటుందనే సత్యాన్ని చాటి చెబుతోంది కదూ..!. అయినా అవసరానికి మించిన ధనం కూడా చేటేనేమో..!."(చదవండి: ఎవరీ పూనమ్ గుప్తా..? ఏకంగా రాష్ట్రపతి భవన్లో పెళ్లి..!) -
మార్కెట్లో మతాబులు వెలిగేనా?
ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లపై పలు అంశాలు ప్రభావం చూపనున్నాయి. దేశీయంగా కార్పొరేట్ల క్యూ2 ఫలితాలు, అక్టోబర్ ఎఫ్అండ్వో సిరీస్ ముగింపు కీలకంగా నిలవనున్నాయి. దీంతో ఈ వారం మార్కెట్లు ఆటుపోట్లకు లోనుకానున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మరోవైపు ఇప్పటికే వేడెక్కిన అమెరికా అధ్యక్ష ఎన్నికలు, పశి్చమాసియాలో తలెత్తిన యుద్ధ భయాలు సైతం ట్రెండ్ను ప్రభావితం చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచ స్టాక్ మార్కెట్ల తీరు, క్యూ2 ఫలితాలపై ఇన్వెస్టర్లు ప్రధానంగా దృష్టి సారించనున్నారు. ఈ వారం బీహెచ్ఈఎల్, డాబర్ ఇండియా, గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీలు.. అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, అదానీ పవర్ జులై–సెపె్టంబర్(క్యూ2) పనితీరును వెల్లడించనున్నాయి. గురువారం(31న) అక్టోబర్ డెరివేటివ్స్ గడువు ముగియనుంది. ఇది మార్కెట్లలో హెచ్చుతగ్గులకు కారణంకావచ్చని స్వస్తికా ఇన్వెస్ట్మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా అంచనా వేశారు. స్వల్ప కాలంలో మార్కెట్లు కన్సాలిడేట్ కావచ్చని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ పేర్కొన్నారు. విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల అమ్మకాలు ఆగడం, యూఎస్ అధ్యక్ష ఎన్నికలు పూర్తికావడం వంటి అంశాలు ట్రెండ్ రివర్స్కు దోహదం చేయవచ్చని అభిప్రాయపడ్డారు. ఎఫ్పీఐల ఎఫెక్ట్ కొద్ది రోజులుగా దేశీ స్టాక్స్లో వెల్లువెత్తుతున్న ఎఫ్పీఐల అమ్మకాలు ఇన్వెస్టర్లను ఆందోళనకు లోనుచేస్తున్నట్లు నాయిర్ పేర్కొన్నారు. ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. దీపావళి సందర్భంగా శుక్రవారం(నవంబర్ 1) మార్కెట్లకు సెలవుకాగా.. సంవత్ 2081 ప్రారంభం సందర్భంగా స్టాక్ ఎక్సే్ఛంజీలు గంటపాటు ప్రత్యేక ట్రేడింగ్ను నిర్వహించనున్నాయి. ఎప్పటిలాగే బీఎస్ఈ, ఎన్ఎస్ఈ.. సాయంత్రం 6–7 మధ్య ముహూరత్ ట్రేడింగ్కు తెరతీయనున్నాయి. నిరుత్సాహకర క్యూ2 ఫలితాలు, ఎఫ్పీఐల భారీ అమ్మకాల నేపథ్యంలో గత వారం మార్కెట్లు పతనబాటలో సాగిన సంగతి తెలిసిందే. దీంతో సెంటిమెంటు బలహీనపడినట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ చీఫ్ఇన్వెస్ట్మెంట్ వ్యూహకర్త వీకే విజయ్కుమార్ తెలియజేశారు. అందుబాటు ధరల్లో ఉన్న చైనా మార్కెట్లు, అక్కడి ప్రభుత్వ సహాయక ప్యాకేజీ ఎఫ్పీఐ అమ్మకాలకు కారణమవుతున్నట్లు తెలియజేశారు. విదేశీ అంశాలు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ పరిస్థితులు, ముడిచమురు ధరలు కీలకంగా నిలవనున్నట్లు సంతోష్ పేర్కొన్నారు. వీటికితోడు ఎఫ్పీఐల తీరు, క్యూ2 ఫలితాలకూ ప్రాధాన్యత ఉన్నట్లు వివరించారు. యూఎస్ అధ్యక్ష ఎన్నికలకు ముందు ప్రపంచవ్యాప్తంగా ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించనున్నట్లు తెలియజేశారు. ఈ వారం యూఎస్ క్యూ3(జులై–సెపె్టంబర్) జీడీపీ గణాంకాలు, సెప్టెంబర్ ఉపాధి రిపోర్ట్, చైనా తయారీ రంగ డేటాతోపాటు.. యూఎస్ పీసీఈ ధరలు వెల్లడికానున్నాయి. ఇవి ఫెడరల్ రిజర్వ్ ద్రవ్యోల్బణ అంచనాలపై ప్రభావం చూపే విషయం విదితమే. జపాన్ మానిటరీ పాలసీ సమావేశం జరగనుంది. 2.2 శాతం డౌన్ గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు అమ్మకాలతో నీరసించాయి. సెన్సెక్స్ నికరంగా 1,822 పాయింట్లు(2.25 శాతం) పతనమై 79,402 వద్ద నిలవగా.. నిఫ్టీ మరింత ఎక్కువగా 673 పాయింట్లు(2.7 శాతం) కోల్పోయి 24,181 వద్ద ముగిసింది. మిడ్క్యాప్ 5.2 శాతం, స్మాల్క్యాప్ 7.4 చొప్పున కుప్పకూలాయి. కాగా.. దేశీ మార్కెట్ రికార్డ్ గరిష్టం నుంచి 8 శాతం పతనమైనట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ వెల్త్మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా ప్రస్తావించారు. ఇందుకు నిరాశపరుస్తున్న క్యూ2 ఫలితాలు, ఎఫ్పీఐల అమ్మకాలు కారణమవుతున్నట్లు తెలియజేశారు. సమీపకాలంలో ఈ ట్రెండ్ కొనసాగే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. ఎఫ్పీఐల అమ్మకాల రికార్డ్ గత నెలలో దేశీ స్టాక్స్లో నికర ఇన్వెస్టర్లుగా నిలిచిన ఎఫ్పీఐలు ఉన్నట్టుండి అక్టోబర్లో అమ్మకాల బాట పట్టారు. ఇటీవల అమ్మకాల స్పీడ్ పెంచి నిరవధికంగా స్టాక్స్ నుంచి వైదొలగుతున్నారు. తద్వారా ఈ నెలలో ఇప్పటివరకూ నికరంగా రూ. 85,790 కోట్ల(10.2 బిలియన్ డాలర్లు) పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. వెరసి మార్కెట్ చరిత్రలోనే అక్టోబర్ నెల అత్యధిక విక్రయాల రికార్డ్కు వేదికకానుంది. అంతక్రితం నెల(సెపె్టంబర్)లో ఎఫ్పీఐలు గత 9 నెలల్లోనే అత్యధికంగా రూ. 57,724 కోట్లు ఇన్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఇంతక్రితం 2020 మార్చిలో మాత్రమే ఎఫ్పీఐలు ఒక నెలలో అత్యధికంగా రూ. 61,973 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించారు.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమతో భారీగా ఉద్యోగాలు
డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమ వల్ల భారీగా ఉద్యోగాలు సృష్టించవచ్చని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. ఈ పరిశ్రమ ద్వారా వినియోగదారులకు, విక్రేతలకు దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగించేలా ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని హామీ ఇచ్చారు. అసోసియేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ ఆఫ్ ఇండియా (ఏడీఎస్ఈఐ), ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీస్ (ఫిడ్సీ) సహకారంతో ఏర్పాటు చేసిన ‘తెలంగాణ డైరెక్ట్ సెల్లింగ్ కాన్క్లేవ్’లో ఆయన పాల్గొని మాట్లాడారు.‘ఈ పరిశ్రమ ద్వారా రానున్న రోజుల్లో భారీగా ఉద్యోగాలు సృష్టించవచ్చు. స్థానికంగా ఈ రంగం వృద్ధి చెందితే తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుంది. ఈ పరిశ్రమలో సేవలందించే సంస్థలు నైతిక పద్ధతులను పాటిస్తూ స్థిరాభివృద్ధిపై దృష్టి సారించాలి. వినియోగదారులకు, విక్రేతలకు దీర్ఘకాలిక ప్రయోజనాలను అందించేలా ప్రభుత్వం పోత్సాహం అందిస్తుంది. రాష్ట్రంలో తయారీ యూనిట్లు స్థాపించేందుకు సంస్థలు ముందుకురావాలి. ప్రభుత్వం డైరెక్ట్ సెల్లింగ్ విభాగంలో సేవలందించే సంస్థలకు అన్నివిధాలా మద్దతుగా నిలుస్తుంది’ అని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ ప్రధాన కార్యదర్శి డీఎస్ చౌహాన్ మాట్లాడుతూ..‘పారదర్శకంగా వినియోగదారులకు ఉత్పత్తులు అందించడంలో ఈ పరిశ్రమ కీలకంగా మారనుంది. మోసపూరిత విధానాల నుంచి యూజర్లను రక్షిస్తూ, వారికి ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమ ద్వారా మెరుగైన సేవలందించేందుకు వీలుగా స్టేట్ మానిటరింగ్ కమిటీను త్వరలో ఏర్పాటు చేస్తాం. ఇది వినియోగదారులు, సంస్థల ప్రయోజనాలను కాపాడుతుంది’ అన్నారు. ఏడీఎస్ఈఐ అధ్యక్షుడు సంజీవ్ కుమార్ మాట్లాడుతూ..‘డైరెక్ట్ సెల్లింగ్ ఎకోసిస్టమ్ను ప్రోత్సహించడంలో తెలంగాణ ప్రభుత్వంతో జతకట్టడం సంతోషకరం. పరిశ్రమ, ప్రభుత్వం మధ్య సహకారం నెలకొల్పేందుకు ఈ సదస్సు వేదికగా నిలిచింది’ అన్నారు.ఈ సందర్భంగా ఏడీఎస్ఈఐ, ఫిడ్సీ సంస్థలు డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమ అభివృద్ధికి మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేయడంలో తెలంగాణ ప్రభుత్వానికి తమ మద్దతు తెలుపుతామని ప్రకటించాయి. ఈ సమావేశంలో సామాజిక బాధ్యతను పెంపొందించడంపై దృష్టి సారించడంతో పాటు, భవిష్యత్తులో డైరెక్ట్ సెల్లింగ్ విభాగంలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఏఐ, డేటా అనలిటిక్స్ వినియోగంపై చర్చించారు.ఇదీ చదవండి: మానవ వనరులను ఆకర్షించడంలో విఫలంరిటైల్ వ్యాపారులు, దళారులు వంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా తయారీదారుల నుంచి ఉత్పత్తులను వినియోగదారులకు అందించడమే ‘డైరెక్ట్ సెల్లింగ్’. భవిష్యత్తులో ఈ పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ విధానంలో దళారులు లేకపోవడంతో తుది ఉత్పత్తులు తక్కువ ధరకే లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఈ పరిశ్రమ వైపు మొగ్గు చూపుతున్నాయి. 2022 ఆర్థిక సంవత్సరంలో డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ విలువ ఏకంగా 200 బిలియన్ డాలర్లు(రూ.16 లక్షల కోట్లు)గా ఉంది. 2030 నాటికి ఈ పరిశ్రమ ఏటా 6.4 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని అంచనా. -
పెరిగిన ట్రంప్ క్రేజ్.. ‘ఫైట్ ఫైట్’ టీషర్ట్లకు ఫుల్ డిమాండ్
న్యూయార్క్: అధ్యక్ష ఎన్నికల ప్రచార ర్యాలీలో ట్రంప్పై కాల్పులు జరగడం సంచలనం రేపింది. ఈ ఘటనలో ట్రంప్ చెవికి బుల్లెట్ గాయమై రక్తం చిందింది. బుల్లెట్ కొంచెం పక్కకు తాకి ఉంటే ట్రంప్ ప్రాణాలు పోయేవి. ఇంత జరిగిన తర్వాత కూడా కొద్దిసేపటికే తేరుకున్న ట్రంప్ అదే వేదికపై చేయి పైకి లేపి ఫైట్ఫైట్ అని నినదించడం అందరినీ ఆకర్షించింది.ర్యాలీకి హాజరైన వారంతా ట్రంప్నకు మద్దతుగా నినాదాలు చేశారు. పెన్సిల్వేనియా ర్యాలీలో ట్రంప్పై కాల్పులు సరిగ్గా శనివారం(జులై13) సాయంత్రం 6.30 గంటలకు జరిగాయి.ఘటనపై అధ్యక్షుడు బైడెన్ 8 గంటలకు స్పందించారు. ఇదంతా ఇలాఉంటే చైనాలోని రిటైలర్ కంపెనీలు కాల్పుల తర్వాత ట్రంప్ క్రేజ్ను క్యాష్ చేసుకోవాలని డిసైడయ్యాయి.100% of profits from this shirt go to Trump’s campaignhttps://t.co/AUeoyZ6XPT pic.twitter.com/eS18aZNl2o— Hodgetwins (@hodgetwins) July 13, 2024 కాల్పులు జరిగిన రెండు గంటల్లోనే చైనాలోని ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ తొవాబో ట్రంప్ చేయి పైకెత్తి ఫైట్ఫైట్ అని నినాదాలు చేసే ఫొటోతో కూడిన టీషర్ట్లను అమ్మకానికి పెట్టింది. ఈ ఉదంతంపై అమెరికా మీడియా కథనాలు ప్రసారం చేసింది. దీనిపై తొవాబో స్పందించింది.‘కాల్పులు జరగ్గానే టీషర్ట్లను ఈ కామర్స్ సైట్లో అమ్మకానికి పెట్టాం. అసలు మేము వాటిని ఇంకా ప్రింట్ కూడా చేయలేదు.అప్పుడే 2000కుపైగా టీషర్ట్లకు ఆర్డర్ వచ్చింది’అని తొవాబో తెలిపింది. -
ప్రమోటర్లు వాటాలు అమ్మేస్తున్నారు!
ఇటీవల సెకండరీ మార్కెట్లు బుల్ వేవ్లో పరిగెడుతున్నాయి. తాజాగా సెన్సెక్స్ 79,000, నిఫ్టీ 24,000 పాయింట్ల మైలురాళ్లను అధిగమించాయి. తద్వారా ప్రామాణిక ఇండెక్సులు సరికొత్త గరిష్టాలను సాధించాయి. ఈ నేపథ్యంలో పలు లిస్టెడ్ కంపెనీల ప్రమోటర్లు కొంతమేర సొంత వాటాలను విక్రయించేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఇందుకు పలు అంశాలు ప్రభావం చూపుతున్నాయి. వివరాలు చూద్దాం..ముంబై: రోజుకో చరిత్రాత్మక గరిష్టాన్ని తాకుతూ దౌడు తీస్తున్న దేశీ స్టాక్ మార్కెట్లో పలు లిస్టెడ్ కంపెనీల షేర్లు సైతం కొత్త గరిష్టాలను తాకుతున్నాయి. దీంతో కొన్ని కంపెనీల ప్రమోటర్లు ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా తమ వాటాలో కొంతమేర విక్రయిస్తున్నారు. తద్వారా నిధులను సమకూర్చుకుంటున్నారు. వీటిని రుణ చెల్లింపులు, విస్తరణ ప్రణాళికలు, పబ్లిక్కు కనీస వాటా తదితరాలకు వినియోగిస్తున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు.కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ వివరాల ప్రకారం 2024 తొలి ఆరు నెలల్లోనే ఎన్ఎస్ఈ–500లోని కొన్ని కంపెనీల ప్రమోటర్లు 10.5 బిలియన్ డాలర్ల(రూ. 87,000 కోట్లకుపైగా) విలువైన ఈక్విటీలను విక్రయించారు. మరొక విశ్లేషణ ప్రకారం గత రెండు నెలల్లోనే సుమారు 200 లిస్టెడ్ కంపెనీల ప్రమోటర్లు రూ. 33,000 కోట్లకుపైగా విలువైన షేర్లను విక్రయించడం తాజా ట్రెండ్కు అద్దం పడుతోంది. వెరసి దేశీ ఈక్విటీల విలువలు అత్యంత ప్రీమియంస్థాయికి చేరాయన్న సంకేతాలు వెలువడుతున్నట్లు స్టాక్ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇందువల్లనే కొన్ని లిస్టెడ్ కంపెనీల ప్రమోటర్లు తమతమ బిజినెస్లలో లాభాల స్వీకరణకు ప్రాధాన్యత ఇస్తున్నారని విశ్లేíÙంచారు. కరోనా ఎఫెక్ట్...ప్రస్తుత మార్కెట్లలో పలు కంపెనీల షేర్లు గరిష్ట విలువలకు చేరడంతో బ్లాక్ డీల్స్ లేదా బల్క్ డీల్స్ ద్వారా ప్రమోటర్లు కొంతమేర వాటాలను అమ్మివేస్తున్నారు. వీరికితోడు ఇటీవల పీఈ దిగ్గజాలు, ఇతర సంస్థాగత ఇన్వెస్టర్లు సైతం తమ పెట్టుబడులను విక్రయించి సొమ్ము చేసుకుంటున్న సంగతి తెలిసిందే. కాగా.. ప్రస్తుత ట్రెండ్ కారణంగా 2023 జనవరి–డిసెంబర్లో నమోదైన 12.5 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 1,04,000 కోట్లు) విక్రయ రికార్డ్ 2024 కేలండర్ ఏడాదిలో తుడిచిపెట్టుకుపోయే వీలున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.2023లో అదానీ గ్రూప్ ప్రమోటర్లు వాటాలు విక్రయించిన విషయం విదితమే. 2024లో ఇప్పటివరకూ దేశ, విదేశీ ప్రమోటర్లు మొత్తంగా రూ. 87,000 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించారు. కోవిడ్–19 నేపథ్యంలో 2020 జనవరి–డిసెంబర్లోనూ రికార్డు నెలకొల్పుతూ రూ. 78,500 కోట్ల విలువైన షేర్లను వివిధ కంపెనీల ప్రమోటర్లు అమ్మివేశారు.జూన్లో పలువురు ప్రమోటర్లు బ్లాక్ డీల్స్ ద్వారా భారీగా వాటాలను విక్రయించారు. రుణ భారాన్ని తగ్గించుకునే ప్రణాళికలతో ఇండస్ టవర్స్లో యూకే దిగ్గజం వొడాఫోన్ గ్రూప్ 18 % వాటాను విక్రయించింది. ఇక ఎంఫసిస్లో 15% వాటాను పీఈ దిగ్గజం బ్లాక్స్టోన్ 80 కోట్ల డాలర్లకు అమ్మింది. దేశీ మైనింగ్ దిగ్గజం వేదాంతా లిమిటెడ్లో ప్రమోటర్ వేదాంతా రిసోర్సెస్ 2.63% వాటా విక్రయం ద్వారా రూ. 4,184 కోట్లు సమీకరించింది. ఇక జెడ్ఎఫ్ కమర్షియల్ వెహికల్లో వాబ్కో ఏషియా 30 కోట్ల డాలర్ల విలువైన వాటాను విక్రయించింది.విక్రయ తీరు(రూ. కోట్లలో)కంపెనీ పేరు షేర్ల విలువ ఇండస్ టవర్స్ 15,300 ఎంఫసిస్ 6,680 వేదాంతా 4,184 ఇంటర్గ్లోబ్ 3,300 జెడ్ఎఫ్ సీవీ 2,194 గ్లాండ్ ఫార్మా 1,754 -
వడాపావ్ అమ్ముతూ రోజుకు రూ.40 వేల సంపాదన.. ఎవరీ బ్యూటీ! (ఫోటోలు)
-
నకిలీ విత్తనాల తయారీకి అడ్డాగా మారిన పాలమూరు జిల్లా
-
అమ్మకానికి ఆడ శిశువు
-
పీఎస్యూ బ్యాంకుల్లో వాటా విక్రయం
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిబంధనల ప్రకారం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కేంద్ర ప్రభుత్వం కొంతమేర వాటాలను విక్రయించనుంది. పబ్లిక్కు కనీసం 25 శాతం వాటా నిబంధన(ఎంపీఎస్) అమలులో భాగంగా ఐదు బ్యాంకుల్లో వాటాలను ఆఫర్ చేయనుంది. ఈ జాబితాలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(సీబీఐ), బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐవోబీ), యుకో బ్యాంక్, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్(పీఎస్బీ) ఉన్నట్లు ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ వివేక్ జోషీ పేర్కొన్నారు. 2023 మార్చి 31కల్లా మొత్తం 12 పీఎస్యూ బ్యాంకుల్లో 4 ఎంపీఎస్ నిబంధనలను అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ బాటలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24)లో మరో 3 ప్రభుత్వ రంగ బ్యాంకులు 25 శాతం ఎంపీఎస్ను సాధించినట్లు పేర్కొన్నారు. ఇకపై మిగిలిన 5 బ్యాంకులు సైతం నిబంధనలను అందుకునే కార్యాచరణకు తెరతీయనున్నట్లు తెలియజేశారు. ప్రస్తుత తీరిలా: ప్రస్తుతం పీఎస్బీలో కేంద్ర ప్రభుత్వం 98.25 శాతం వాటాను కలిగి ఉంది. ఈ బాటలో ప్రభుత్వానికి ఐవోబీలో 96.38 శాతం, యుకో బ్యాంక్లో 95.39 శాతం, సెంట్రల్ బ్యాంక్లో 93.08 శాతం, బ్యాంక్ మహారాష్ట్రలో 86.46 శాతం చొప్పున వాటాలున్నాయి. -
సినబాబు సిలక్కొట్టుడు.. టిక్కెట్ల పేరిట డబ్బులు వసూళ్లు
టీడీపీలో నంబర్ టూ స్థానంలో ఉన్నానని భావిస్తున్న లోకేష్ కొన్ని సందర్భాల్లో పార్టీని తానే సొంతంగా లీడ్ చేయాలని ఆశిస్తుంటారు. పార్టీ విధానపరమైన నిర్ణయాల్లోనూ కొన్ని సార్లు కీలకంగా వ్యవహరిస్తుంటారు. చాలా సందర్భాల్లో అవి ఎదురుతంతున్నప్పటికీ తీరు మార్చుకొని లోకేష్ వివాదాస్పద వ్యాఖ్యలు సైతం చేస్తూ తండ్రిని ఇరకడంలో పెడుతున్నారు. జనసేనతో అధికార పంపిణీ విషయంలో అయన చేసిన కామెంట్స్ జనసైనికుల్లో అగ్రహాన్ని లేపాయి. అసలు అలాంటి ఆలోచనే లేదని, కూటమి సీఎంగా చంద్రబాబే ఉంటారని తేల్చేసారు. దానికి తోడు యువగళం పాదయాత్రలో తనలో పోరాట పటిమ, పరిణితి బాగా పెరిగిందని భావిస్తున్న లోకేష్ ఇప్పటికే తండ్రిని ఓవర్ టేక్ చేసి తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీలో చిక్కులు తెస్తున్నట్లు పెద్దలు గుర్తించారు. వాస్తవానికి ఆమధ్య పాదయాత్రలో భాగంగా లోకేష్ చాలాచోట్ల బహిరంగసభల్లో మాట్లాడారు. ఆ సందర్భంగా కొందరు నాయకులను అక్కడికక్కడే ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించేసారు. అయితే అయన ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలను ప్రకటించుకుంటూ వెళ్లడంతో చంద్రబాబు ఆగ్రహించి ఇకముందు అలా చేయొద్దని హెచ్చరించడంతో ఆ తరువాత అయన అభ్యర్థుల ప్రకటనను ఆపేసారు. కానీ తనలోని పెద్దరికపు కోరికను చంపుకోలేని లోకేష్ దాదాపు నలభై మంది వరకు ఆశావహుల దగ్గర టిక్కెట్లు ఆశచూపి డబ్బులు తీసుకున్నారని అంటున్నారు. గుంటూరు, కృష్ణ, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఎక్కువమంది లోకేష్ కు దాదాపు ఐదేసి కోట్లవరకు డబ్బులిచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు వారికి టిక్కెట్ దక్కుతుందా లేదా అన్నది ప్రశ్నర్థకంగా మరేంది. గుంటూరు జిల్లాలో ఓ విద్యాసంస్థకు చెందిన యజమాని దగ్గర దాదాపు ఐదు కోట్లు తీసుకున్నారని తెలిసింది. ఐతే ఇప్పుడు అయన టిక్కెట్ వెనుకబడినట్లు చెబుతున్నారు. లోకేష్ హామీ ఇచ్చినావాళ్ళకు ప్రజాదరణ లేదని సర్వేల్లో తేలిందని, అందుకే వాళ్లకు టిక్కెట్లు ఇవ్వలేమని చంద్రబాబు స్పష్టం చేసారని అంటున్నారు. అనంతపురంలో ఓ మాజీ మంత్రి కుటుంబానికి చెందిన వ్యక్తి దగ్గర కూడా ఇలాగే కొంత డబ్బు తీసుకుని లోకేష్ హామీ ఇచ్చినా అక్కడ ఐవీఆర్ఎస్ ద్వారా మళ్ళీ సర్వే చేస్తున్నారు. అందులోకానీ సదరు నాయకుడికి మంచి మార్కులు రాకపోతే టిక్కెట్ ఇచ్చేది లేదని చంద్రబాబు చెప్పేశారట. విశాఖ నుంచి కూడా ఇలాగే కొందరికి హామీ ఇచ్చిన లోకేష్ ఇప్పుడు ఏమి సమాధానం చెబుతారో తెలియడం లేదని అంటున్నారు. అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యం ఇస్తామని, ఎమ్మెల్సీలు ఇస్తామని లోకేష్ నచ్చజెబుతున్నట్లు అంటున్నారు. కానీ ఆ మాటలు నమ్మేలా లేవని, అనవసరంగా డబ్బులిచ్చి ఇరుక్కున్నామని వారు వాపోతున్నారు. మొత్తానికి చినబాబు లోకేష్ జోక్యం పార్టీకి పెద్ద తలనొప్పులు తెచ్చిందని అంటున్నారు. :::సిమ్మాదిరప్పన్న -
పీహెచ్డీ ఉన్నా కూరగాయల అమ్మకం
ప్రైవేట్ జాబ్లు చేసి.. అవి నచ్చక వ్యాపారం చేసినవారిని చూశాం. చాలీచాలని జీతాలకు కుటుంబాలను పోషించలేక పలు ఆదాయ మార్గాలను వెతుకున్న ప్రైవేట్ టీచర్లు, లెక్చరర్లకు సంబంధించిన వార్తలు కూడా చదివాం. అయితే తాగాజా ఓ వ్యక్తి నాలుగు మాస్టర్ డిగ్రీలు తీసుకొని.. ఏకంగా న్యాయశాస్త్రంలో పీహెచ్డీ చేసి కూరగాయలు అమ్ముతున్నారు. ఈ విషయం నెట్టింట్లో వైరల్ అవుతోంది. పంజాబ్కు చెందిన డా.సందీప్ సింగ్ పంజాబ్ యూనివర్సిటీలో కాంట్రాక్టు ప్రోఫెసర్గా పని చేసేవారు. అనుకోని పరిసస్థితుల్లో ఆయన తన ఉద్యోగం మానేసి ఇల్లూఇల్లు తిరుగుతూ కురగాయలు అమ్ముతున్నారు. యూనివర్సిటీలోని లా డిపార్టుమెంట్లో 11 ఏళ్లపాటు పనిచేసిన సందీప్ సింగ్ నాలుగు మాస్టర్ డిగ్రీలు(న్యాయ శాస్త్రం, పంజాబీ, జర్నలిజం, పొలిటికల్ సైన్స్)తో పాటు లా కోర్సులో పీహెచ్డీ పూర్తి చేశారు. ఇన్నేళ్లపాటు కాంట్రాక్టు ఉద్యోగం చేసిన సందీప్ నెలవారి జీతాల విషయంలో చాలా ఇబ్బందుల ఎదుర్కొన్నారు. జీతాల తగ్గింపు, సరైన సమయానికి సాలరీ రాకపోవటం వంటివి ఆయన్ను తీవ్రంగా వెంటాడాయి. చేసేదేంలేక కూరగాయల అమ్మకాన్ని మొదలుపెట్టారు డా. సందీప్. తాను ఇల్లూ ఇల్లు తిరిగి కూరగాయలు అమ్మె బండికి వినూత్నంగా ‘పిహెచ్డీ సబ్జీవాలా’ అని పేరు పెట్టుకున్నారు. పంజాబ్లోని పాటియాలకు చెందిన సందీప్.. ఉద్యోగం కంటే కూడా కూరగాయలు అమ్మటం వల్లనే తాను ఎక్కువగా డబ్బు సంపాదిస్తున్నట్లు చెప్పటం గమనార్హం. మరోవైపు తాను మరో మాస్టర్ డిగ్రీ కోసం చదువకుంటూ.. కూరగాలయలు అమ్మగా వచ్చిన మొత్తంతో టీచింగ్ వృత్తిని మానుకోకుండా పిల్లలకు ట్యూషన్ సెంటర్ను ఏర్పాటు చేస్తానని చెప్పుకొచ్చారు. చదవండి: Punjab: వృద్ధులకు నజరానా ప్రకటించిన పంజాబ్ ప్రభుత్వం -
Stock Market: జీవితకాల గరిష్టాల వద్ద బేర్ పంజా..!
ముంబై: దలాల్ స్ట్రీట్లో కొత్త శిఖరాలపై దూసుకెళ్తున్న బుల్ను ఒక్కసారిగా బేర్ ముట్టడించింది. ఫలితంగా ఆరంభ లాభాలను కోల్పోయిన సూచీలు గడిచిన 9 నెలల్లో అతిపెద్ద నష్టాన్ని చవిచూశాయి. సెన్సెక్స్ 931 పాయింట్లు క్షీణించి 70,506 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 303 పాయింట్లు నష్టపోయి 21,150 వద్ద నిలిచింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. పలు రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 476 పాయింట్లు లాభపడి 71,913 వద్ద, నిఫ్టీ 140 పాయింట్లు పెరిగి 21,593 వద్ద కొత్త జీవికాల గరిష్టాలు నమోదు చేశాయి. దేశీయంగా నెలకొన్న ప్రతికూల ప్రభావాలతో ఇన్వెస్టర్లు గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ట్రేడింగ్ ముగిసే అన్ని రంగాల షేర్లలో అమ్మకాల సునామీ తలెత్తడంతో సూచీలు ఒకశాతానికి పైగా పతనమయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,134 పాయింట్లు పతనమై 70,303 వద్ద, నిఫ్టీ 366 పాయింట్లు క్షీణించి 21,087 వద్ద ఇంట్రాడే గరిష్టాలను తాకాయి. చిన్న, మధ్య తరహా షేర్లలో భారీ అమ్మకాలు తలెత్తాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ సూచీలు వరుసగా 3.42%, 3.12% చొప్పున నష్టపోయాయి. ► ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ బుధవారం ఒక్కరోజే రూ.8.91 లక్షల కోట్ల సంపద తగ్గి రూ.350 లక్షల కోట్లకు దిగివచ్చింది. ► సెన్సెక్స్ సూచీ 30 షేర్లలో ఒక్క హెచ్డీఎఫ్సీ బ్యాంక్(0.19%) మినహా మిగిలిన 29 షేర్లూ 4% వరకు నష్టపోయాయి. ► రంగాల వారీగా యుటిలిటీ 4.65%, టెలికం 4.36%, విద్యుత్ 4.33%, సరీ్వసెస్ 4.20%, మెటల్, కమోడిటీ, పారిశ్రామిక, క్యాపిటల్ గూడ్స్ రంగాలు 3.50% వరకు నష్టపోయాయి. ► ప్రభుత్వరంగ బ్యాంక్ షేర్లు భారీ నష్టాలను చవిచూశాయి. యూకోబ్యాంక్ 10.50%, ఐఓబీ 10%, సెంట్రల్ బ్యాంక్ 8%, పీఎస్బీ, పీఎస్బీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు 5% పతనయ్యాయి. ఇండియన్ బ్యాంక్, బీఓబీ షేర్లు 4–3% పడ్డాయి. ఈ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ ఈ ఏడాదిలో అత్యధికంగా 4% క్రాష్ అయ్యింది. దుమ్మురేపిన డోమ్స్.. డోమ్స్ ఇండస్ట్రీస్ లిస్టింగ్ హిట్ అయ్యింది. బీఎస్ఈలో ఇష్యూ ధర (రూ.790)తో పోలిస్తే 77% ప్రీమియంతో రూ.1,400 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్లో 82% ర్యాలీ చేసి రూ.1,434 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివర్లో స్వల్ప లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో 68% లాభంతో రూ.1,331 వద్ద ముగిసింది. కంపెనీ విలువ రూ.8,077 కోట్లుగా నమోదైంది. కాగా, ఇండియా షెల్టర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిస్టింగ్ పర్వాలేదనిపించింది. బీఎస్ఈ ఇష్యూ ధర (రూ.493)తో పోలిస్తే 12% ప్రీమియంతో రూ.613 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్లో 27% ర్యాలీ చేసి రూ.625 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని వద్ద తాకింది. చివరికి 10% లాభంతో రూ.544 వద్ద ముగిసింది. కంపెనీ విలువ రూ.5,818 కోట్లుగా నమోదైంది. ఇవీ నష్టాలకు కారణాలు లాభాల స్వీకరణ విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల ప్రోద్బలంతో దేశీయ ఈక్విటీ మార్కెట్ గత నెల రోజుల్లో ఏకంగా 7.2% లాభపడింది. పలు రంగాల షేర్లు అధిక వాల్యుయేషన్ల వద్ద ట్రేడవుతున్నాయి. సాంకేతిక చార్టులు ‘అధిక కొనుగోలు’ సంకేతాలను సూచిస్తున్నాయి. వరుస ర్యాలీతో గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణ అనివార్యమైందని మార్కెట్ నిపుణులు తెలిపారు. మళ్లీ కరోనా భయాలు... దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 614 కరోనా కేసులు నమోదయ్యాయి. కేరళలో కోవిడ్ 19 సబ్ వేరియంట్ జేఎన్.1కి సంబంధించి 292 కేసులు నమోదయ్యాయి. ముగ్గురు మృతి చెందారు. కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ పరిణామాలు ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేశాయి. ఎర్ర సముద్రం వద్ద ఉద్రిక్తతలు ప్రపంచంలో ముఖ్య నౌకా మార్గాల్లో ఒకటైన ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీ తిరుగుబాటుదారులు దాడులు చేస్తుండడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. అనేక వాణిజ్య సంస్థలు ఆ మార్గం ద్వారా తమ నౌకలు వెళ్లకుండా నిలుపుదల చేశాయి. ఈ నేపథ్యంలో ముడి చమురు ధరలు మరింత పెరిగే వీలున్నందున ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. ప్రాథమిక మార్కెట్లో ఐపీఓ ‘రష్’ గడిచిన నెల రోజుల్లో ప్రధాన విభాగం నుంచి 11 కంపెనీలతో సహా అనేక చిన్న, మధ్య తరహా స్థాయి కంపెనీలు నిధుల సమీకరణకు సిద్ధమయ్యాయి. ఈ పబ్లిక్ ఇష్యూల్లో పాల్గొనేందుకు అవసరమైన లిక్విడిటి(ద్రవ్య)ని పొందేందుకు హెచ్ఎన్ఐలు, రిటైల్ ఇన్వెస్టర్లు షేర్ల అమ్మకాలకు పాల్పడంతో సెకండరీ మార్కెట్ ఒత్తిడికి లోనై ఉండొచ్చని స్టాక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్ లో దేశీ సంస్థల హవా
-
20 ఏళ్లనాటి భవనం అమ్మేసిన విప్రో.. దెబ్బకు పతనమైన షేర్లు
తమిళనాడులోని 20 ఏళ్ల నాటి భవనంతో పాటు 14 ఎకరాల భూమిని విక్రయించినట్లు ఐటీ కంపెనీ విప్రో ఇటీవల ప్రకటించింది. చెన్నైలోని షోలింగనల్లూరు ఐటీ కారిడార్లో దాదాపు 5,89,778 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ భవనాన్ని రూ. 266.38 కోట్లకు కాసాగ్రాండ్ బిజ్పార్క్ ప్రైవేట్ లిమిటెడ్కు విక్రయించినట్లు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది. విప్రో తన ఆస్తులను విక్రయించిన తరువాత కంపెనీ షేర్స్ అన్నీ కూడా వరుస నష్టాలను చవి చూడాల్సి వచ్చింది. 2023 - 24 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కంపెనీ రూ. 2870.10 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. కాగా గత ఏడాది ఇదే కాలంలో సంస్థ లాభం రూ. 2563.60 కోట్లు. ఈ లెక్కన 2022 కంటే 2023 లో కంపెనీ ఆదాయం 12 శాతం పెరిగింది. ఇదీ చదవండి: నిరుద్యోగులకు శుభవార్త.. పండుగ సీజన్లో 5 లక్షల ఉద్యోగాలు! విప్రో వంటి పెద్ద సంస్థ తన ఆస్తులను అమ్మడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. దీని వల్ల చాలామందికి కంపెనీ నష్టాల్లో ఉందా అనే ఆలోచన వచ్చింది. ఈ దెబ్బతో షేర్లు క్రమంగా తగ్గాయి. అయితే విప్రో నిజంగా నష్టాల్లో ఉందా.. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుందా అనే వివరాలు అధికారికంగా వెల్లడి కాలేదు. -
డెట్ ఫండ్స్ నుంచి ఉపసంహరణలు
న్యూఢిల్లీ: డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఆగస్ట్ నెలలో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. జూలై నెలలో నికర పెట్టుబడులను ఈ విభాగం ఆకర్షించగా.. ఆగస్ట్లో రూ.25,872 కోట్లు వీటి నుంచి బయటకు వెళ్లిపోయాయి. అమెరికాలో ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు ఇంకా ముగియకపోవడంతో ఇన్వెస్టర్లు డెట్ ఫండ్స్లో పెట్టుబడుల పట్ల అప్రమత్త ధోరణితో వ్యవహరించినట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డెట్లో 16 విభాగాలకు గాను 9 విభాగాల నుంచి నికరంగా పెట్టుబడులు బయటకు వెళ్లినట్టు మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. లిక్విడ్ ఫండ్స్ (రూ.26,824 కోట్లు), అల్ట్రా షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ (రూ.4,123 కోట్లు)లో ఎక్కువగా అమ్మకాలు నమోదయ్యాయి. ఇవన్నీ స్వల్పకాల పెట్టుబడుల కోసం ఉద్దేశించిన పథకాలు. అలాగే, బ్యాంకింగ్ అండ్ పీఎస్యూ విభాగం సైతం నికరంగా రూ.985 కోట్ల పెట్టుబడులను కోల్పోయింది. ఇక ఓవర్ నైట్ ఫండ్స్ రూ.3,158 కోట్లు, ఫ్లోటర్ ఫండ్స్ రూ.2,325 కోట్లు, కార్పొరేట్ బాండ్ ఫండ్స్ రూ.1,755 కోట్ల చొప్పున ఆకర్షించాయి. ఈ ఏడాది జూలైలో డెట్ మ్యూచువల్ ఫండ్స్లోకి రూ.61,140 కోట్ల పెట్టుబడులు రావడం గమనార్హం. ఈక్విటీల్లోకి పెట్టుబడులు.. ‘‘ప్రస్తుత వడ్డీ రేట్ల వాతావరణం, వడ్డీ రేట్ల గమనంపై నెలకొన్న అనిశి్చతితో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించినట్టు కనిపిస్తోంది. వడ్డీ రేట్ల గమనంపై స్పష్టత వచ్చే వరకు వేచి ఉండే ధోరణి అనుసరించినట్టుగా ఉంది. అదే సమయంలో ఈక్విటీల్లో ర్యాలీ మొదలు కావడంతో డెట్ నుంచి పెట్టుబడులను అటువైపు మళ్లించినట్టున్నారు’’అని మారి్నంగ్ స్టార్ ఇండియా రీసెర్చ్ మేనేజర్ మెలి్వన్ శాంటారియా వివరించారు. తాజా అమ్మకాలతో ఆగస్ట్ చివరికి మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలోని డెట్ ఫండ్స్ పెట్టుబడుల విలువ రూ.14 లక్షల కోట్లకు పరిమితమైంది. జూలై చివరికి ఇది రూ.14.17 లక్షల కోట్లుగా ఉంది. -
హైదరాబాద్లో రియల్ఎస్టేట్ సంస్థల మాయాజాలం.. రెరా మొద్దు నిద్ర!
ఎంకేజీఆర్ ఎస్టేట్స్ హౌసింగ్ ఎల్ఎల్పీ కంపెనీ కేపీహెచ్బీలో 92 ఎకరాల్లో లేక్ వ్యూ మెగా టౌన్íÙప్ను నిర్మిస్తున్నామని ప్రచారం చేస్తుంది. ఇందులో అపార్ట్మెంట్లు, విల్లాలు, ఆఫీసు, కమర్షియల్ స్పేస్ అన్నీ ఉంటాయని చెబుతుంది. 30 ఎకరాలలో 33 అంతస్తులలో అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నామని ప్రీలాంచ్లో చ.అ.కు రూ.4,500 చొప్పున వసూలు చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ ఉన్న భూమికి టైటిలే లేకపోవటం గమనార్హం. ప్రణవ రియల్టర్స్ ఇండియా ఎల్ఎల్పీ కడ్తాల్లో టెంపుల్ టౌన్ వెంచర్ను అభివృద్ధి చేస్తున్నామని ఢంకా బజాయిస్తుంది. ఇందులో అన్నీ విల్లా ప్లాట్లేనని, గజం రూ.18,999లకు విక్రయిస్తుంది. ఇదే సంస్థ కాప్రాలో 60 వేల చ.అ.లలో జీ+4 అంతస్తులలో కమర్షియల్ కాంప్లెక్స్ కూడా నిరి్మస్తున్నామని చెబుతుంది. ఏ ప్రాజెక్టు కూడా రెరాలో నమోదు కాకపోవటమే కాదు నిర్మాణ అనుమతులూ లేకపోవటం విశేషం. సాక్షి, హైదరాబాద్: ఇలా ఒకటి రెండు కాదు నగరంలో రాత్రికి రాత్రే పుట్టగొడుగుల్లా నిర్మాణ సంస్థలు వెలుస్తున్నాయి. గృహ కొనుగోలుదారులకు ఆశ పెట్టి వారి కష్టార్జితాన్ని దోచేస్తున్నాయి. నిబంధనలను అతిక్రమించే డెవలపర్లపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) కేవలం షోకాజ్ నోటీసుల జారీకే పరిమితం అవుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కళ్లముందు వందలాది సంస్థలు ప్రీలాంచ్లో జనాలను నట్టేట ముంచేస్తుంటే మొద్దు నిద్రలో ఉందని డెవలపర్ల సంఘాలు ఆరోపిస్తున్నాయి. బ్రోచర్ల మీదే ప్రాజెక్ట్లు.. రాత్రికి రాత్రే సంస్థలను పెట్టే నకిలీ బిల్డర్ల ప్రాజెక్ట్లన్నీ బ్రోచర్ల మీదనే ఉంటాయి. ప్రభుత్వ విభాగాల నుంచి నిర్మాణ అనుమతులు, రెరాలో నమోదు ఏవీ ఉండవు. వంద శాతం సొమ్ము చెల్లిస్తే చాలు.. సొంతిల్లు సొంతమవుతుందని నమ్మించి నట్టేట ముంచేస్తున్నారు. సాహితీ, జయ గ్రూప్, భువన్తేజ వంటి నిర్మాణ సంస్థలు ఇప్పటికే వేలాది మంది కస్టమర్ల నుంచి రూ.కోట్లలో వసూలు చేసి కుచ్చుటోపి పెట్టిన ఘటనలనేకం. ఇటీవల కోకాపేట, ఖానామెట్ వేలంలో భూములు దక్కించుకున్న పలు నిర్మాణ సంస్థలు కూడా ప్రీలాంచ్లో సొమ్ము వసూలు చేయడం గమనార్హం. హ్యాపెనింగ్ ప్లేస్లలోనే ఎక్కువ.. అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో తక్కువ ధరకే ప్రాపర్టీ అంటే ఎవరైనా ఇట్టే ఆకర్షితులవుతారు. ఇదే ప్రీలాంచ్ మోసగాళ్ల మంత్రం. ప్రధానంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మాదాపూర్, కొల్లూరు, నార్సింగి, నిజాంపేట, ఎల్బీనగర్, కొల్లూరు, నార్సింగి, పుప్పాలగూడ, తెల్లాపూర్ వంటి ప్రాంతాలలో ఎక్కువగా ప్రీలాంచ్ ప్రాజెక్ట్లను చేపడుతున్నారు. అంతా సోషల్ మీడియాలోనే.. ప్రీలాంచ్ ప్రాజెక్ట్ల ప్రచారాలన్నీ సోషల్ మీడియా వేదికగానే సాగుతుంది. పెద్ద కంపెనీలేమో పాత కస్టమర్లకు అంతర్గత విక్రయాలు చేస్తుంటే.. కొన్ని కంపెనీలేమో తమ పేరు బయట పడకుండా ఏజెంట్ల ద్వారా వాట్సాప్, ట్విట్టర్లలో ప్రచారం చేయిస్తున్నాయి. పెద్ద మొత్తంలో కమీషన్ ఇస్తూ ఏజెంట్లను నియమించుకుంటున్నారు. దీంతో గ్రామాలు, పట్టణాలలో తిరుగుతూ వీకెండ్ వస్తే చాలు కార్లలో కస్టమర్లను తరలించి ప్రాజెక్ట్ విజిట్లు చేపిస్తున్నారు. గాలిలో మేడలు చూపిస్తూ కస్టమర్ల నుంచి డబ్బు వసూలు చేస్తున్నారు. -
28 ఏళ్ల క్రితం రూ. 166 కోట్ల జాక్పాట్.. ఇప్పుడు తిరిగి పాత జీవితంలోకి..
అతను నేషనల్ లాటరీలో 11 మిలియన్ యూరోలు(సుమారు రూ.116 కోట్లు) గెలుచుకున్నాడు. ఇంత భారీ మొత్తం దక్కించుకున్న అతను రెండు దశాబ్ధాల తరువాత తన గత వర్కింగ్ లైఫ్లోకి తిరిగి వచ్చేశాడు. 61 ఏళ్ల మార్క్ గార్డ్నర్, అతని బిజినెస్ పార్ట్నర్ పాల్ మెడిసన్ 1995లో 22 మిలియన్ల యూరోలు గెలుచుకున్నారు. దీంతో వారి జీవితం పూర్తిగా మారిపోయింది. మార్క్ .. బ్రిటన్కు చెందినవాడు. అతను కొంత మొత్తాన్ని అస్తవ్యస్త రీతిలో వివిధ సంస్థల్లో పెట్టుబడి పెట్టాడు. దీంతో కోట్లాది రూపాయలు కోల్పోయాడు. అతని నాల్గవ భార్య కూడా ఇదేవిధంగా వివిధ చోట్లు పెట్టుబడులు పెట్టి నష్టపోయింది. ‘ఈ పాటికి నేను పనిచేయడం మానేసేవాడిని’ అయితే మార్క్ కొంత మొత్తాన్ని మాత్రం సరైన చోట్ల పెట్టుబడిగా పెట్టాడు. వాటిలో యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్ కూడా ఒకటి. దీనితో పాటు తమ కంపెనీ క్రాఫ్ట్ గ్లాస్లో 2 మిలియన్ యూరోలు పెట్టుబడిగా పెట్టాడు. ఇప్పుడు మార్క్ ఈ కంపెనీని నడుపుతున్నాడు. మార్క్ మీడియాతో మాట్లాడుతూ ‘నన్ను తప్పుగా అనుకోకండి. నేను ఆరోజు కాకుండా.. ఇప్పుడు ఈ 61 ఏళ్ల వయసులో లాటరీలో గెలిచివుంటే పరిస్థితులు మరో విధంగా ఉండేవి. ఈ పాటికి నేను పనిచేయడం మానేసేవాడిని. ఇప్పుడు నా దగ్గర కావాలసినంత తెలివితేటలు ఉన్నాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో నేను ఒక్క రోజు సెలవు తీసుకున్నా, సిబ్బందికి జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉన్నాను’ అని అన్నాడు. ప్రతీవారం లాటరీ టిక్కెట్ల కొనుగోలు మార్క్కు ఇప్పటికీ ఫుట్బాల్తో అనుబంధం ఉంది. అతనికి హాస్టింగ్లో లోకల్ క్లబ్ ఉంది. అలాగే మార్క్ గతంలో బార్బాడోస్లో ఒక ఇల్లు కూడా కొనుగోలు చేశాడు. లాటరీలో వచ్చిన సొమ్మునంతా అతను దుర్వినియోగం చేయలేదు. కొన్ని పెట్టుబడుల వలన అతనికి లబ్ధి చేకూరింది. ఇప్పుడు కూడా మార్క్ ప్రతీవారం లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేస్తుంటాడు. తాను 1995లో ఏ నంబరు లాటరీ టిక్కెట్ కొనుగోలు చేశాడో ఆ నంబరు గల లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేస్తుంటాడు. నాటి తన పార్ట్నర్ పాల్ ప్రస్తుతం స్కాట్ల్యాండ్లో ఉన్నాడని, అయితే అతను ఆ లాటరీ సొమ్ముతో ఏమి చేశాడో తెలియదని మార్క్ తెలిపాడు. ఇది కూడా చదవండి: కేలండర్లో లేని రోజున పుట్టిన పిల్లాడు.. విద్యాశాఖ నిర్లక్ష్యానికి పరాకాష్ట! -
ర్యాలీస్లో రేఖా ఝున్ఝున్వాలా వాటాల విక్రయం
ముంబై: దివంగత ఇన్వెస్ట్మెంట్ గురు రాకేష్ ఝున్ఝున్వాలా సతీమణి రేఖా ఝున్ఝున్వాలా తాజాగా ర్యాలీస్ ఇండియాలో మరో 6.2586 శాతం వాటాలను విక్రయించారు. దీంతో ఇకపై తన దగ్గర 2.278 వాటాలు (సుమారు 44.30 లక్షల షేర్లు) ఉన్నట్లవుతుందని ఆమె స్టాక్ ఎక్సేచంజీలకు తెలియజేశారు. 2013 మార్చి 11 నాటికి తమ వద్ద 2.03 కోట్ల షేర్లు (10.4581 శాతం వాటాలు) ఉన్నట్లు.. అప్పటి నుంచి ఈ ఏడాది జూలై 17 మధ్య తాము 37 లక్షల షేర్లు (1.9446 శాతం) విక్రయించామని పేర్కొన్నారు. జూలై 18 – జూలై 20 మధ్యలో మరో 1.21 కోట్ల షేర్లను (6.2586 శాతం) విక్రయించినట్లు వివరించారు. శుక్రవారం ర్యాలీస్ ఇండియా షేర్లు 1.31 శాతం క్షీణించి సుమారు రూ. 218 వద్ద క్లోజయ్యాయి. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 4,237 కోట్ల ప్రకారం రేఖ వద్ద ప్రస్తుతమున్న వాటాల విలువ సుమారు రూ. 96 కోట్లుగా ఉంటుంది. -
అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్: భారీగా పెరిగిన ఈ-కామర్స్ ఎగుమతులు
న్యూఢిల్లీ: దేశీ ఎగుమతిదారులు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్కి చెందిన గ్లోబల్ సెల్లింగ్ ప్రోగ్రాం ద్వారా ఇప్పటివరకూ చేసిన ఎగుమతులు ఈ ఏడాదితో 8 బిలియన్ డాలర్లు దాటనున్నాయి. గతేడాది ఇవి 5 బిలియన్ డాలర్లకు చేరినట్లు అమెజాన్ తమ ఎక్స్పోర్ట్స్ డైజెస్ట్ 2023 నివేదికలో పేర్కొంది. 2015లో అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్ను ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు 1.25 లక్షల ఎగుమతిదారుల స్థాయికి చేరినట్లు వివరించింది. 1,200 మంది భారతీయ ఎగుమతిదారులు గతేడాది రూ. 1 కోటి విక్రయాలు సాధించినట్లు అమెజాన్ తెలిపింది. అత్యధికంగా ఎగుమతైన వాటిల్లో బొమ్మలు (50 శాతం), గృహ .. వంటగది ఉత్పత్తులు (35 శాతం), సౌందర్య సాధనాలు (25 శాతం) ఉన్నాయి. 2025 నాటికి భారత్ నుంచి మొత్తం ఈ-కామర్స్ ఎగుమతులు 20 బిలియన్ డాలర్లకు చేరేలా తోడ్పడేందుకు లక్షల కొద్దీ చిన్న వ్యాపార సంస్థలు, స్టార్టప్లతో కలిసి పని చేయనున్నట్లు అమెజాన్ ఇండియా డైరెక్టర్ భూపేన్ వాకంకర్ తెలిపారు. అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్ ప్రోగ్రాం ద్వారా అమెరికా, బ్రిటన్, కెనడా, యూఏఈ తదితర దేశాలకు 26.6 కోట్ల పైచిలుకు మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులు ఎగుమతవవుతు న్నాయని నివేదిక పేర్కొంది. 2023లో ఎగుమతులపరంగా ఢిల్లీ అగ్రస్థానంలో ఉండగా, రాజస్తాన్, మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. -
ముచ్చటగా మూడోసారి.. ప్రభుత్వ రంగ సంస్థ అమ్మకానికి బ్రేకులు!
న్యూఢిల్లీ: హెలికాప్టర్ సర్వీసుల పీఎస్యూ పవన్ హన్స్ లో వ్యూహాత్మక వాటా విక్రయానికి బ్రేక్ పడింది. బిడ్డింగ్లో విజయవంతమైన కన్సార్షియంలోని ఒక కంపెనీపై న్యాయపరమైన వివాదాలరీత్యా అనర్హతవేటు పడటం దీనికి కారణమని దీపమ్ పేర్కొంది. వెరసి పవన్ హంస్ ప్రయివేటైజేషన్ ప్రయత్నాలకు మూడోసారి చెక్ పడింది. బిడ్ను గెలుపొందిన స్టార్9 మొబిలిటీ ప్రయివేట్ లిమిటెడ్ కన్సార్షియంలోని అల్మాస్ గ్లోబల్ అపార్చునిటీ ఫండ్ ఎస్పీసీపై పెండింగ్ కేసుల నేపథ్యంలో ప్రభుత్వం పవన్ హంస్ డిజిన్వెస్ట్మెంట్ నిర్ణయాన్ని రద్దు చేసినట్లు దీపమ్ తెలియజేసింది. భాగస్వామ్య కంపెనీ పవన్ హంస్లో ప్రభుత్వానికి 51 శాతం, ఇంధన రంగ పీఎస్యూ దిగ్గజం ఓఎన్జీసీకి 49 శాతం చొప్పున వాటా ఉంది. 2018లో షురూ: తొలుత పవన్ హన్స్ లో గల 51 శాతం వాటా విక్రయానికి ప్రభుత్వం 2018లో బిడ్స్కు ఆహ్వానం పలికింది. అయితే ఓఎన్జీసీ సైతం 49 శాతం వాటాను విక్రయించేందుకు సిద్ధపడటంతో నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. 2019లో తిరిగి కంపెనీలో 100 శాతం వాటా విక్రయానికి బిడ్స్ను ఆహ్వానించినప్పటికీ స్పందన లభించకపోవడం గమనార్హం! ప్రభుత్వం 2020 డిసెంబర్లో మూడోసారి పవన్ హన్స్ విక్రయానికి తెరతీసింది. కంపెనీ కొనుగోలుకి ఆసక్తి వ్యక్తీకరణ(ఈవోఐ) బిడ్స్ను ఆహ్వానించింది. 2022 ఏప్రిల్లో స్టార్9 మొబిలిటీ కన్సార్షియం గరిష్ట బిడ్డర్గా నిలిచింది. కన్సార్షియంలో అల్మాస్ గ్లోబల్ అపార్చునిటీసహా.. బిగ్ చార్టర్ ప్రయివేట్ లిమిటెడ్, మహరాజ ఏవియేషన్ ప్రయివేట్ లిమిటెడ్ సైతం భాగస్వాములుగా ఉన్న సంగతి తెలిసిందే. -
పాపం పసివాడు
స్కూల్కు వెళ్లాల్సిన పిల్లలు ఎర్రటి ఎండలో రోడ్డు పక్కన, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర బెలూన్లు అమ్ముకోవడం కోసం పడే కష్టం చూస్తుంటే మనసు చివుక్కుమంటుంది. గుజరాత్లోని అహ్మదాబాద్లో.... ఒక పిల్లాడు కీచైన్లు అమ్మడం కోసం ఫుట్పాత్పై కూర్చున్నాడు. కాలికి అయిన గాయానికి ప్లాస్టిక్ పేపర్ చుట్టుకున్నాడు. సాక్షి అనే యూజర్ పోస్ట్ చేసిన ఈ వీడియో 7.4 మిలియన్ల వ్యూస్ను సొంతం చేసుకుంది. ‘అయ్యయ్యో’ అని సానుభూతి చూపుతున్న వాళ్లతో పాటు... ‘పిల్లాడి తల్లిదండ్రుల తప్పా? వ్యవస్థ తప్పా?’ అని ప్రశ్నించేవాళ్లు.... ‘ఆ పిల్లాడికి నా వంతుగా సహాయం చేస్తాను’ అని ముందుకు వస్తున్నవారు ఎందరో ఉన్నారు. -
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 పుస్తకాలు
-
మంచిర్యాల జిల్లాలో నవజాత శిశువు అమ్మకం
-
బ్లాక్స్టోన్ చేతికి ట్రాన్సిండియా పార్క్.. డీల్ విలువ ఎంతంటే?
ముంబై: హర్యానాలోని జజ్జర్ లాజిస్టిక్స్ పార్క్ను గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ బ్లాక్స్టోన్కు విక్రయించనున్నట్లు ట్రాన్సిండియా రియల్టీ తాజాగా పేర్కొంది. సరుకు రవాణా దిగ్గజం ఆల్కార్గో లాజిస్టిక్స్తో విడివడిన తదుపరి ట్రాన్సిండియా వాటా విక్రయ ప్రణాళికలకు తెరతీసింది. దీనిలో భాగంగా లాజిస్టిక్స్ పార్క్ను రూ. 625 కోట్లకు విక్రయించేందుకు ప్రతిపాదించినట్లు వెల్లడించింది. అంతేకాకుండా ఇతర పార్క్లలోనూ 10 శాతం వాటా విక్రయానికి సైతం ఇతర సంస్థలతో డీల్ కుదుర్చుకోనున్నట్లు తెలియజేసింది. ఇందుకు రూ. 60 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు అందుకోనున్నట్లు వెల్లడించింది. వెరసి అన్ని రకాల చెల్లింపుల తదుపరి రూ. 400 కోట్లకుపైగా సమకూర్చుకోనున్నట్లు పేర్కొంది. ఈ నిధులను కంపెనీ వృద్ధి ప్రణాళికలకు వినియోగించనున్నట్లు తెలియజేసింది. కంపెనీ గతంలో ట్రాన్సిండియా రియల్టీ అండ్ లాజిస్టిక్స్ పార్క్స్ లిమిటెడ్గా కార్యకలాపాలు నిర్వహించింది. -
బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు..
బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు ఓ ఐఐటీయన్. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఆహార బ్రాండ్లలో ఒకటైన ‘బిర్యానీ బై కిలో’ అనే సంస్థను 2015లో విశాల్ జిందాల్ స్థాపించారు. అప్పటి నుంచి కంపెనీ వార్షిక ఆదాయం పెరుగుతూ వస్తోంది. అయితే దీంతోనే అతను సంతృప్తి చెందలేదు. వచ్చే రెండు మూడేళ్లలో రూ.1000 కోట్ల టర్నోవర్ సాధించబోతున్నాడు. బిర్యానీ బిజినెస్తో సక్సెస్ అయిన ఐఐటీయన్ కథ ఇది.. అనేక వ్యాపారాలు ఉన్న విశాల్ జిందాల్ స్వయంగా ఆహార ప్రియుడు. అందుకే ఆయనకు ఎన్ని వ్యాపారాలు ఉన్నా బిర్యానీ వ్యాపారమంటేనే ఆయనకు మక్కువ. ఈ బిరియానీ వ్యాపారం వెనుక ఉన్న ప్రధాన ఆలోచన భారతదేశంలోని ఖాన్సామా సంప్రదాయాన్ని పునరుద్ధరించడం. అంటే ఇక్కడ ప్రతి ఆర్డర్ను విడివిడి వండుతారు. వండిన బిర్యానీని మట్టి పాత్రల్లో కాల్చిన పిండి సహాయంతో ప్యాక్ చేస్తారు. ఇదీ చదవండి: అపరిచితుడికి కిడ్నీ దానం.. అపర దాన కర్ణుడు ఈ బిలియనీర్.. ఐఐటీ నుంచి ఇంజినీరింగ్ చేసిన విశాల్ జిందాల్ ఆ తర్వాత న్యూయార్క్లోని సిరక్యూస్ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఫైనాన్స్ చదివారు. సింగపూర్కు చెందిన ఎకోసిస్టమ్ అడ్వైజరీ బోర్డులో జిందాల్ కూడా ఉన్నారు. ఇది అతని మొదటి కంపెనీ కాదు. గుర్గావ్లో కార్పెడియం క్యాపిటల్ పార్టనర్స్ అనే ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ను స్థాపించారు. ఫిడిలిటీ వెంచర్స్ వ్యవస్థాపకుడు అలాగే ఆ సంస్థకు ఎండీగా, అక్షయం క్యాపిటల్ సీఈవోగా ఉన్నారు. (layoffs: షాకిచ్చిన ఇండియన్ ట్విటర్, 30 శాతం మందికి గుడ్ బై?) భారతీయ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి డైరెక్టర్గా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ సంస్థను ఆయనే స్థాపించి మిలియన్ డాలర్ల కంపెనీగా మార్చారు. ఇది అన్ని మెట్రో నగరాల్లో 100 మంది ఉద్యోగులు, కార్యాలయాలను కలిగి ఉంది. విశాల్ జిందాల్ అమెరికాలో 1994లో అమనో సిన్సినాటి అనే కంపెనీకి మార్కెటింగ్ అసోసియేట్గా పనిచేశారు. ‘బిర్యానీ బై కిలో’ సంస్థ 2023 ఆర్థిక సంవత్సరంలో రూ. 300 కోట్ల ఆదాయం వస్తుందని ఆశించారు. అయితే ప్రస్తుతం కంపెనీ నష్టాల్లో ఉంది. అయినప్పటికీ జూన్ నాటికి పుంజుకుంటుందని ఆశిస్తున్నారు. కంపెనీకి రూ. 700-750 టిక్కెట్ సైజుతో రోజుకు 10,000 కంటే ఎక్కువ ఆర్డర్లు వస్తున్నాయి. ఈ కంపెనీకి అన్ని మెట్రో నగరాలతో సహా 45 కంటే పైగా నగరాల్లో 100కి పైగా అవుట్లెట్లు ఉన్నాయి. (కండోమ్స్ బిజినెస్: 50లక్షలనుంచి రూ. 43వేల కోట్లతో దడ పుట్టించిన బ్రదర్స్) 2022 ఆర్థిక సంవత్సరంలో వారు రూ. 135 కోట్లు, అంతకుముందు 2021 సంవత్సరంలో రూ. 65.6 కోట్లు ఆర్జించారు విశాల్ జిందాల్. వచ్చే రెండు మూడు ఏళ్లలో రూ.1000 కోట్ల టర్నోవర్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందు కోసం మార్కెటింగ్ వ్యయాన్ని కూడా పెంచాలనుకుంటున్నట్లు, మెక్డొనాల్డ్స్, స్టార్బక్స్ కంటే పెద్ద వ్యాపారాన్ని నిర్మించాలనుకుంటున్నట్లు విశాల్ జిందాల్ టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తా సంస్థతో పేర్కన్నారు. ఇదీ చదవండి: Mukesh Ambani Birthday: వ్యాపారంలోకి రాకముందు ముఖేష్ అంబానీ ఏమవ్వాలనుకున్నారో తెలుసా? -
ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు
ముంబై: ఐటీ, ఫైనాన్స్, విద్యుత్ షేర్లలో అమ్మకాలు తలెత్తడంతో స్టాక్ సూచీలు మూడోరోజూ నష్టాలను చవిచూశాయి. ఇప్పటివరకు వెల్లడైన కార్పొరేట్ క్యూ4 ఆర్థిక ఫలితాలు మార్కెట్ వర్గాలను మెప్పించలేకపోయాయి. అలాగే అంతర్జాతీయ బలహీన సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు సెంటిమెంట్ను బలహీనపరిచాయి. ఉదయం సెన్సెక్స్ 19 పాయింట్ల స్వల్ప లాభంతో 59,746 వద్ద, నిఫ్టీ ఏడు పాయింట్లు నష్టపోయి 17,653 వద్ద మొదలయ్యాయి. రోజంతా పరిమిత శ్రేణిలో కదలాడాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 292 పాయింట్ల పరిధిలో సెన్సెక్స్ 59,453 వద్ద కనిష్టాన్ని, 59,745 గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 159 పాయింట్లు నష్టపోయి 59,568 వద్ద నిలిచింది. నిఫ్టీ 17,580 – 17,666 శ్రేణిలో ట్రేడైంది. ఆఖరికి 41 పాయింట్లు పతనమై 17,619 వద్ద నిలిచింది. మెటల్, ఫార్మా, రియల్టీ, ఇంధన షేర్లకు చెందిన మధ్య తరహా షేర్లకు కొనుగోళ్లకు మద్దతు లభించడంతో బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ స్వల్పంగా 0.12 శాతం పెరిగింది. కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు, ఆయా కేంద్ర బ్యాంకులు ద్రవ్య విధాన వైఖరిపై ఎదురుచూపుల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు లాభ, నష్టాల మధ్య ట్రేడవుతున్నాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ► నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాల వెల్లడి(గురువారం)కి ముందు హెచ్సీఎల్ టెక్ షేరు అమ్మకాల ఒత్తిడికి లోనైంది. బీఎస్ఈలో రెండున్నర శాతం నష్టపోయి రూ.1,038 వద్ద స్థిరపడింది. ► రియల్టీ సంస్థ ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ షేరు రెండున్నర శాతం లాభపడి రూ.450 వద్ద ముగిసింది. ఆర్థిక సంవత్సరం(2022–23)లో వార్షిక ప్రాతిపదికన రూ. 12,930 కోట్ల విలువైన ఆస్తులను విక్రయించడంతో ఈ షేరుకు డిమాండ్ పెరిగింది. మ్యాన్కైండ్ @ రూ. 1,026–1,080 ఈ నెల 25–27 మధ్య ఐపీవో రూ. 4,326 కోట్ల సమీకరణకు రెడీ న్యూఢిల్లీ: హెల్త్కేర్ రంగ కంపెనీ మ్యాన్కైండ్ ఫార్మా పబ్లిక్ ఇష్యూలో భాగంగా షేరుకి రూ. 1,026–1,080 ధరల శ్రేణి ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 25న ప్రారంభమై 27న ముగియనుంది. ఐపీవోలో భాగంగా కంపెనీ మొత్తం 4 కోట్లకుపైగా ఈక్విటీ షేర్లను ఆఫర్ చేస్తోంది. కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు వీటిని విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా రూ. 4,326 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. -
పాత సామాన్లు, చెత్త అమ్ముతున్న మోడల్.. లక్షల్లో సంపాదన
సెలబ్రెటీలు వాడిన వస్తువులకు మార్కెట్లో ధరలు భారీగా ఉంటాయని అందరికి తెలుసు. అయితే వాచ్లు, షర్ట్స్, బైక్స్ వంటి వస్తువులకు అభిమానులు ఎక్కువ డబ్బు ఖర్చు చేసి కొనేస్తూ ఉంటారు. అయితే దీనికి భిన్నంగా అమెరికాకు చెందిన ఒక మోడల్ గోర్ల క్లిప్పింగ్స్, పాదాల చర్మం, డాండ్రఫ్ వంటివి అమ్ముతూ లక్షల్లో సంపాదిస్తోంది. అమెరికా నార్త్ కరోలినాలో చెందిన 'రెబెక్కా బ్లూ' గతంలో ఎగ్జోటిక్ డ్యాన్సర్గా చేసి ప్రస్తుతం వెబ్క్యామ్ మోడల్, ఇన్ఫ్లూయెన్సర్గా ఉంటోంది. అయితే ఈమె తన వస్తువులను ఆన్లైన్లో విక్రయిస్తూ కావాల్సినంత డబ్బు సంపాదిస్తోంది. మొదట్లో తన స్ట్రిప్పింగ్ అవుట్ఫిట్స్ను ఒక వ్యక్తికి 20 డాలర్లకు విక్రయించింది. ఈ విధంగా ప్రారంభమైన తన వ్యాపారం ఇప్పుడు పరుగులు పెడుతోంది. తన వద్ద ఉన్న వస్తువులకు డిమాండ్ భారీగా ఉండటం గ్రహించి బిజినెస్ ప్రారంభించి 28 ఏళ్లకే బిలినియర్ అయిపోయింది. మొదట సాక్స్ వంటి వాటిని విక్రయించడం మొదలు పెట్టి ఇప్పడు ఉమ్మి, కాలి గోర్లు, పాదాల నుంచి కత్తిరించిన చర్మం, తన ఇంట్లోని చెత్త, కాటన్ స్వాబ్స్, ఇతర చిత్రవిచిత్రమైన వస్తువుల్ని కూడా అమ్మి డబ్బు సంపాదిస్తోంది.. నిజానికి ఇలాంటి వస్తువులను అమ్మిన సెలబ్రిటీలు ఇంతకు ముందు చాలానే ఉన్నారు. అమెరికాకు చెందిన మాజీ రియాల్టీ టీవీ స్టార్ స్టెఫానీ మాటో గతంలో అపాన వాయువును బాటిళ్లలో నింపి విక్రయించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాపారం ఆమెకు బాగా కలిసి వచ్చింది. దాంతో పెద్ద ఎత్తున డబ్బు సంపాదించింది. ప్రస్తుతం రెబెక్కా బ్లూ ఇలాంటి చిన్న చిన్న పనికిరానివన్నీ విక్రయిస్తూ నెలకు 2000 డాలర్లు సంపాదిస్తోంది. అంటే ఇది భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ.1.60 లక్షలకుపైనే ఉంటుంది. ఇలాంటి ఘటనలు మనదేశంలో చాలా తక్కువగా వినిపిస్తూ ఉంటాయి. కానీ అమెరికా వంటి దేశాల్లో అప్పుడప్పుడు వెలుగులోకి వస్తూ ఉంటాయి. -
బిస్లెరీని విక్రయించం: రమేష్ చౌహాన్
న్యూఢిల్లీ: ప్యాకేజ్డ్ వాటర్ బిజినెస్ బిస్లెరీ ఇంటర్నేషనల్ను విక్రయించే ప్రణాళికలేవీ ప్రస్తుతానికి లేవని వెనుకటితరం పారిశ్రామికవేత్త రమేష్ చౌహాన్ తాజాగా స్పష్టం చేశారు. ఇందుకు ఎవరితోనూ చర్చలు నిర్వహించడంలేదని తెలియజేశారు. బిస్లెరీ విక్రయానికి నాలుగు నెలలుగా టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్తో కంపెనీ చర్చలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే బిస్లెరీ కొనుగోలుకి ఎలాంటి ఒప్పందమూ కుదుర్చుకోలేదని, చర్చలు విరమించుకున్నామని ఇటీవలే టాటా కన్జూమర్ ప్రకటించింది. వెరసి టాటాతో డీల్ చర్చలకు తెరపడిన మూడు రోజుల తదుపరి చౌహాన్ తాజాగా ఇచ్చిన వివరణకు ప్రాధాన్యత ఏర్పడింది. కాగా.. గతేడాది నవంబర్లో టాటా కన్జూమర్సహా పలు సంస్థలతో బిస్లెరీ విక్రయానికి చర్చలు జరుపుతున్నట్లు చౌహాన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. కుమార్తెకు ఆసక్తి లేదు: బిస్లెరీ బిజినెస్ను ఇకపై ప్రొఫెషనల్స్ హ్యాండిల్ చేయవలసి ఉన్నట్లు చౌహాన్ వ్యాఖ్యానించారు. అయితే తన కుమార్తె జయంతికి బిస్లేరీ బిజినెస్పట్ల ఆసక్తి లేదని తెలియజేశారు. బాటిల్డ్ వాటర్ విభాగంలో బిస్లేరీ ఇంటర్నేషనల్ ప్రధానంగా బిస్లేరీ బ్రాండుతో బిజినెస్ నిర్వహిస్తోంది. వేదికా బ్రాండుతో స్ప్రింగ్ వాటర్ను సైతం అందిస్తోంది. అంతేకాకుండా స్పైసీ, లిమొనాటా, ఫోంజో, పినాకోలాడ బ్రాండ్లతో ఫిజ్జీ డ్రింకులను సైతం ఆఫర్ చేస్తోంది. సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్లు థమ్సప్, గోల్డ్ స్పాట్, సిట్రా, మాజా, లిమ్కాలను మూడు దశాబ్దాల క్రితం(1993) యూఎస్ దిగ్గజం కోకకోలాకు చౌహాన్ కుటుంబం విక్రయించిన సంగతి తెలిసిందే. హిమాలయన్ బ్రాండుతో ఇప్పటికే టాటా కన్జూమర్ బాటిల్డ్ వాటర్ విభాగంలో బిజినెస్ను కలిగి ఉంది. గ్రూప్ కంపెనీలు టాటా కెమికల్స్, టాటా గ్లోబల్ బెవరేజెస్ కలయికతో టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ ఆవిర్భవించింది. హైడ్రేషన్ విభాగంలోని టాటా కాపర్ ప్లస్ వాటర్, టాటా గ్లూకో బ్రాండ్లు సైతం ఈ కంపెనీవే. -
Viral Video: భయపెట్టిన వడగండ్ల వాన.. రండి బాబు రండి.. రూ. 100 కిలో!
-
తోపుడు బండి మీద సమోసాలు అమ్మి.. రోజుకు రూ.12 లక్షలు సంపాదిస్తున్న క్యూట్ కపుల్!
Ghar, Padosi, Bacche Hi Rishtedar Ek Samosa Toh Banta Hai Yaar నవ్వొస్తుంది కదా. బట్ ఇదే ట్యాగ్ లైన్తో సమోసా సింగ్ అనే కంపెనీ మొత్తం మార్కెట్నే క్యాప్చర్ చేస్తోంది. ఇప్పటికే వందల కోట్ల సమోసా వ్యాపార సామ్రాజ్యాన్ని నెలకొల్పింది. భవిష్యత్లో ప్రపంచ దేశాల్లో సైతం సమోసాలు అమ్మి వేలకోట్ల టర్నోవర్ సాధించేలా ప్రణాళికలు రచిస్తుంది. తోపుడు బండి మీద సమోసాలు అమ్మిన నిధి సింగ్, శిఖర్ వీర్ సింగ్..వందల కోట్ల వ్యాపారంగా ఎలా తీర్చిదిద్దారు. పూలమ్మిన చోటే కట్టెలమ్మే అనే సామెతను తిరగరాసిన ఈ దంపతులిద్దరూ సమోసాలు ఎందుకు అమ్మాలనుకున్నారో తెలుసుకుందాం పదండి. కరణ్ జోహార్ సినిమా తరహాలో రియల్ లైఫ్లో హీరో శిఖర్ వీర్ సింగ్, హీరోయిన్ నిధి సింగ్ బ్యాచిలర్ బయోటెక్నాలజీ డిగ్రీని పూర్తి చేసేందుకు 2004లో థానేలోని కురకేత్ర యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత ఏమైందంటే? రీల్ లైఫ్ తరహాలో రియల్ లైఫ్లో శిఖర్ వీర్ సింగ్, నిధి సింగ్లు స్నేహితులు కాస్త ప్రేమికులుగా మారారు. అలా అని చదువును ఆటకెక్కించలేదు. ఇద్దరూ డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం నిధి బయోటెక్నాలజీ చదవనైతే చదివింది కానీ మనసంతా మార్కెటింగ్ వైపే మళ్లింది. అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా థానే నుంచి ఢిల్లీకి పయనమైంది. ఢిల్లీలో అమెరికాకు చెందిన ఫార్మా కంపెనీలో మార్కెటింగ్ విభాగంలో జాయిన్ అయింది. లైఫ్ సైన్సెస్ అమితంగా ఇష్టపడే శిఖర్ మాస్టర్స్ చేసేందుకు ఉన్నత చదువుల కోసం థానే నుంచి హైదరాబాద్కు వచ్చాడు. లైఫ్ సైన్సెస్ చదివే సమయంలో శిఖర్ ఫాస్ట్ ఫుడ్ తరహాలో స్నాక్ ఐటమ్స్ అమ్మకాల్లో శుభ్రత లేకపోవడాన్ని గమనించాడు. అన్నీ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లలలో పిజ్జాలు, బర్గర్లను అమ్మితే.. అదే ఇండియన్ స్నాక్స్, సావీరస్ (సాల్టీగా-స్పైసీగా) ను వీధుల్లో అమ్మడాన్ని గమనించాడు. సమోసాలు అమ్ముదాం నిధి అదిగో అప్పుడే శిఖర్కు దిగ్గజ రెస్టారెంట్లకు పోటీగా సమోసా వ్యాపారం చేయాలన్న ఆలోచనకు బీజం పడింది. తన ఐడియాను నిధికి షేర్ చేశాడు. వ్యాపార మెళుకువలు తెలియని శిఖర్.. కియోస్కోలో సమోసా అమ్మితే ఎలా ఉంటుందని నిధికి తన మనసులో మాట చెప్పాడు. శిఖర్ 2009లో సైంటిస్ట్గా బయోకాన్ కంపెనీలో చేరాడు. కొంత కాలానికి వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి, నచ్చిన జీతం ఇంతకంటే ఏం కావాలి? కానీ వాళ్లు అలా అనుకోలేదు. ఉద్యోగాల నిమిత్తం దేశాలు పట్టుకొని తిరిగినప్పటికీ సమోసా వ్యాపారం చేయాలన్న ఆశ పోలేదు. ఇంకా రెట్టింపు అయ్యింది. వ్యాపార ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. శుభ్రత (hygiene)తో పాటు సమోసాను వినూత్నంగా తయారు చేయాలని అనుకున్నారు. కానీ అది కార్య రూపం దాల్చలేదు. జాబ్కు రిజైన్ చేసి సంవత్సరాలు గడిచాయి. చివరికి 2015 అక్టోబర్ నెలలో బిజినెస్ ప్లాన్ రెడీ చేసుకున్నారు. బిజినెస్ కోసం ఎవరు ఏం చేయాలో డిసైడ్ అయ్యారు. అందుకు నిధి అమోదం తెలపడంతో తన స్టార్టప్ ప్రయత్నాల్ని ప్రారంభించాడు శిఖర్. అక్టోబర్ 13, 2015లో శిఖర్ తాను చేస్తున్న జాబ్కు రిజైన్ చేశాడు. నిధి తాను కూడా జాబ్కు రిజైన్ చేస్తానంటే కంపెనీ ఒప్పుకోలేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ స్టార్టప్ ప్రారంభించుకోమని ఆఫర్ ఇచ్చింది. వెంటనే వాళ్లిద్దరూ కలిసి రెండు చిన్న కిచెన్ రూమ్లు అద్దెకు తీసుకున్నారు. వంట చేసే వాళ్లను నియమించుకున్నారు. పరిశోధన- అభివృద్ధి (Research and Development)లో నిమగ్నమయ్యారు. నాలుగు నెలల కష్టం 4 నెలల పాటు రేయింబవళ్లు నిద్రాహారాలు మాని వినూత్నంగా పలు షేపుల్లో సమోసాను తయారు చేశాడు శిఖర్. బిజినెస్ ప్రారంభించాలన్న తమ ప్రయత్నాల్లో ఎట్టకేలకు మరో అడుగు ముందుకు వేశారు. ఆర్ అండ్ డీలో రకరకాల రుచులతో సమోసాలు వేయించాలి. కాల్చకూడదు, జిడ్డు లేకుండా ఆరోగ్యం ఉండాలన్న ఆలోచన శిఖర్ బయోటెక్ అనుభవం నేర్పిచ్చింది. రకరకాల ఫ్లేవర్లతో ప్రత్యేకంగా తయారు చేసిన పిండితో సమోసాపై భాగంగా గట్టిగా ఉండేలా చూసుకున్నారు. అలా సంప్రదాయ సమోసా షేప్ కంటే వీళ్లు తయారు చేసిన సమోసా చూడటానికి బాగుంది. సమోసా ఆకారం ఇలా ఉండడం (కింద ఇమేజ్లో చూపించినట్లుగా) వల్ల నూనెను పీల్చుకోదని తెలిపారు. చికెన్ మఖానీ (బటర్ చికెన్), కడాయి పనీర్ నుండి చాక్లెట్ వరకు రకరకాల రుచుల్లో సమోసాలు అందించేందుకు సిద్ధమయ్యారు. సమోసా సింగ్ పేరు భలే ఉందే అమ్మేందుకు సమోసా సిద్ధమైంది. ప్రొడక్ట్ ఉంటే సరిపోదు కదా. దానికంటూ పేరుండాలి. అందుకే అందరి నోళ్లలో నానేలా మా సంస్థకు సమోసా సింగ్ అని పేరుపెట్టాం. ఓ రోజు శిఖర్ నా దగ్గరకు వచ్చి కంపెనీ పేరు సమోసా సింగ్ అని చెప్పడంతో ‘అరె ఈ పేరేదో భలే ఉందే అని’ నవ్వుకున్నట్లు నిధి వివరించారు. తోపుడుబండి మీద సమోసాలు ప్రొడక్ట్ (సమోసా),పేరు రెడీ. మార్కెటింగ్లో మెళుకువలు నేర్చుకున్నారు. ముందుగా తాము తయారు చేసిన సమోసా గురించి కస్టమర్ల నుంచి అభిప్రాయం తెలుసుకునేందుకు తోపుడుబండి మీద సమోసాలు అమ్మారు. రద్దీ ఉండే ఏరియాల్లో కియోస్కోలు ఏర్పాటు చేసి సమోసా గురించి కస్టమర్ల అభిప్రాయాలు సేకరించారు. ఫీడ్బ్యాక్ పాజిటీవ్గా రావడంతో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా బెంగళూరులో సమోసా సింగ్ పేరుతో క్యూఎస్ఆర్ అవుట్ లెట్ను ప్రారంభించారు. నిధి బిల్ కౌంటర్ను నిర్వహిస్తుండగా, శిఖర్ కొంతమంది వర్కర్లతో కలిసి సమోసాలు తయారు చేసి అమ్మడం, హోమ్ డెలివరీలు చేయడం ప్రారంభించారు. టేస్ట్ అదిరింది. ధర రీజనబుల్గా ఉంది. రెండు సమోసాలు రూ.20, చికెన్ మఖానీ సమోసాలు (రెండు) రూ. 55కే ధర తక్కువగా ఉండడం సమోసా సింగ్కు కలిసి వచ్చింది. మౌత్ పబ్లిసిటీ పెరిగి రెండు నెలల్లో ఆర్డర్లు రోజుకు 500 సమోసాలు అమ్మే స్థాయికి ఎదిగారు. భారీ ఆర్డర్ దశ తిరిగింది బిజినెస్ ఊహించని విధంగా సాగుతుండడంతో నిధి క్యాష్ కౌంటర్ నుంచి..కార్పొరేట్ ఆర్డర్ల కోసం మార్కెటింగ్ విభాగంలో అడుగు పెట్టింది. అలా తనకున్న మార్కెటింగ్ అనుభవంతో జర్మన్ కంపెనీ నుంచి 8వేల సమోసాలను తయారు చేసి ఇచ్చే ఆర్డర్ను సంపాదించింది. ఆర్డర్ అయితే వచ్చింది. చేయడం,వాటిని నిల్వ చేయడంలో విఫలమయ్యే అవకాశం ఉందని భావించారు. సదరు సంస్థను వారం రోజుల సమయం అడిగారు. వారంలో మళ్లీ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్పై పనిచేశారు. సమోసా చెప్పిన టైంకు చేసి ఆర్డర్ ఇవ్వాలి. ప్రొడక్ట్ చెడిపోకుండా తయారు చేసేలా రీసెర్చ్ చేశారు. షిప్ట్ల వారీగా సమోసాలు తయారు చేసి చెప్పిన టైం కంటే ముందే ఆర్డర్ సిద్ధం చేశారు. ఇల్లు అమ్మి జర్మనీ ఆర్డర్ తర్వాత సమోసా సింగ్ మారు మ్రోగింది. ఆర్డర్ల సంఖ్య పెరిగింది. వివిధ నగరాల్లో అవుట్ లెట్లను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. కానీ చేతిలో సరిపడ డబ్బు లేకపోవడంతో బెంగళూరులో ఉన్న ఇల్లును అమ్మి వ్యాపారానికి అనువుగా ఉండేలా అవుట్ లెట్లను అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం బెంగళూరు,హైదరాబాద్, పూణేతో పాటు ఇతర నగరాల్లో సమోసాలు అమ్ముతున్నారు. ఇలా సమోసాలు అమ్ముతూ రోజుకు రూ.12 లక్షల నుంచి సంవత్సరానికి వందల కోట్లు సంపాదిస్తున్నారు. కృషితో నాస్తి దుర్భిక్షం అనే సిద్ధాంతం తమను ఇక్కడికి దాకా తీసుకొచ్చిందని, భవిష్యత్లో విదేశీయులతో తమ సమోసాను టేస్ట్ చేయించాలని అనుకుంటున్నట్లు నిధిసింగ్, శిఖర్ సింగ్లు విజయ గర్వంతో చెబుతున్నారు. -
ఇండియాలో మోస్ట్ సెల్లింగ్ కార్ ఏదో తెలుసా?
సాక్షి, ముంబై: మారుతి సుజుకి బాలెనో ఫిబ్రవరి 2023 నెలలో ప్యాసింజర్ కార్ల అమ్మకాల్లో టాప్ ప్లేస్ కొట్టేసింది. గత ఏడాది ఇదే కాలంలో 12,570 యూనిట్లతో పోలిస్తే ఈ ఏడాది ఫిబ్రవరిలో 18,592 యూనిట్లు అమ్ముడయ్యాయి. దీనితో వార్షిక ప్రాతిపదికన పాజిటివ్ వాల్యూమ్ 48 శాతం పెరిగింది. ప్రీమియం హ్యాచ్బ్యాక్ స్విఫ్ట్, ఆల్టో మోడల్స్ను అధిగమించి మరి బాలెనో ఈ పాపులారిటీ సాధించింది. ఈ రెండు మోడల్స్ కార్లు ఒక్కొక్కటి 18,000 యూనిట్లకు పైగా సేల్ అయ్యాయి. అలాగే గత నెలలో ప్రధాన ప్రత్యర్థులు హ్యుందాయ్ i20 , టాటా ఆల్ట్రోజ్లను వెనక్కి నెట్టేసింది బాలెనో. అప్డేటెడ్గా వచ్చిన బాలెనో మోడల్ రాక గేమ్ ఛేంజర్గా మారిందని. ప్రస్తుతం,మారుతి సుజుకి బాలెనో సిగ్మా, డెల్టా, జీటా, ఆల్ఫా అనే మొత్తం నాలుగు వేరియంట్లలో,ఆరు రంగల్లో అందుబాటులో ఉంది. ధర రూ. 6.56 లక్షలు- రూ. 9.83లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. మారుతి సుజుకి బాలెనో ఇంజీన్ బాలెనోలోని 1.2-లీటర్ 4-సిలిండర్ DualJet VVT పెట్రోల్ ఇంజిన్ 6,000 rpm వద్ద గరిష్టంగా 90 PS పవర్ అవుట్పుట్ , 4,400 rpm వద్ద 113 Nm గరిష్ట టార్క్ను అందిస్తుంది. 170 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్, 37 లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యం , 339 లీటర్ల బూట్స్పేస్ని కలిగిఉంది. 5-స్పీడ్ MT లేదా 5-స్పీడ్ AMT ట్రాన్స్మిషన్తో కూడి ఉంది. HUD, 360-డిగ్రీ కెమెరా సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, ఆర్కామిస్ ఆడియో సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, ఆరు ఎయిర్బ్యాగ్లు, రియర్ AC వెంట్స్, సుజుకి కనెక్ట్ 40+ కనెక్ట్ చేయబడిన ఫీచర్లు, ఫాగ్ ల్యాంప్స్, UV కట్ గ్లాస్ వంటి ఫీచర్లు ఈ కారు సొంతం. -
బీటెక్ అమ్మాయి.. బుల్లెట్పై హైజీనిక్ పానీపూరి
ఈ మధ్య చదువులకు, చేసే పనికి సంబంధం ఉండటం లేదు. డిగ్రీలున్నా ఉద్యోగ అవకాశాలు లేక కొందరు చిరు వ్యాపారాలతో స్వయం ఉపాధి చూసుకుంటుంటే మరికొందరు మాత్రం డిగ్రీ చేసినా ప్రత్యేకమైన లక్ష్యంతో చిరువ్యాపారాల బాట పడుతున్నారు. 21 ఏళ్ల తాప్సీ ఉపాధ్యాయ్.. బీటెక్ పానీపూరి వాలీగా ప్రసిద్ధి చెందారు. బుల్లెట్ బండికి ఏర్పాటు చేసుకున్న చిన్న బండిపై ఆమె పానీపూరీలను విక్రయిస్తున్నారు. బీటెక్ పూర్తి చేసిన తర్వాత ఆమె ఈ వ్యాపారాన్ని ప్రారంభించారు. ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతోనే తాను ఈ వ్యాపారాన్ని ప్రారంభినట్లు తాప్సీ చెబుతున్నారు. (జీవితాంతం ఒంటరిగానే ఉంటా కానీ! హోలీ యాడ్పై దుమారం: అసలేమైంది?) ఇదీ చదవండి: టాప్ సీక్రెట్ చెప్పిన గూగుల్ మాజీ వైస్ ప్రెసిడెంట్... ఇది ఉంటే జాబ్ పక్కా! View this post on Instagram A post shared by Are you hungry (@are_you_hungry007) తాజాగా ఆమె బుల్లెట్ వాహనానికి పానీపూరి బండిని కట్టుకుని తీసుకెళ్తున్న వీడియోను ఓ వ్యక్తి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయగా వైరల్గా మారింది. అంత చదువు చదువుకుని ఇలా పానీపూరీ అమ్ముకుంటున్నావేంటి అని చాలా మంది ప్రశ్నించారని, కొందరైతే భద్రంగా ఉండాలంటే ఇంటికి తిరిగి వెళ్లాలని సలహా ఇచ్చారని తాప్సీ చెప్పారు. ఈ వీడియో పోస్ట్ చేసినప్పటి నుంచి దాదాపు మూడు లక్షల లైక్లు వచ్చాయి. ఆ యువతి స్ఫూర్తిని అభినందిస్తూ పలువురు కామెంట్లు పెట్టారు. -
Raisina Dialogue: అన్నీ అమ్మేసే తొందరేమీ లేదు..
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిలోనూ (పీఎస్ఈ) హడావిడిగా వాటాలు విక్రయించేయాలన్న తొందరలో ప్రభుత్వమేమీ లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. టెలికం సహా వ్యూహాత్మకమైన నాలుగు రంగాల్లో ప్రభుత్వం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రైజినా డైలాగ్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. పీఎస్ఈ పాలసీ ప్రకారం అటామిక్ ఎనర్జీ, అంతరిక్షం, రక్షణ; రవాణా, టెలికం; విద్యుత్, పెట్రోలియం, బొగ్గు, ఇతర ఖనిజాలు; బ్యాంకింగ్, బీమా, ఆర్థిక సేవల విభాగాలను నాలుగు వ్యూహాత్మక రంగాలుగా వ్యవహరిస్తున్నారు. ఈ పాలసీ ప్రకారం ‘అన్నీ హడావిడిగా అమ్మేసేయాలన్న తొందర్లో ప్రభుత్వం లేదు. అలాగే గుండుసూదుల నుంచి పంటల దాకా ప్రతి వ్యాపారాన్ని ప్రభుత్వమే నడిపిస్తుందనీ ఈ పాలసీలో ఏమీ లేదు. కాబట్టి తన అవసరం లేని రంగాల్లో ప్రభుత్వం ప్రమేయం ఉండదు. కానీ వ్యూహాత్మక ప్రయోజనాలు ఇమిడి ఉన్న రంగాల్లో.. ఉదాహరణకు టెలికం వంటి వాటిల్లో ఉంటుంది. ప్రభుత్వ యాజమాన్యంలో, ప్రొఫెషనల్గా నడిచే ఒక టెలికం కంపెనీ ఉంటుంది‘ అని మంత్రి చెప్పారు. వ్యూహాత్మక రంగాల్లోనూ తమంతట తాము నిలదొక్కుకోగలిగేంత పెద్ద సంస్థల్లో ప్రభుత్వం కొనసాగుతుందని ఆమె వివరించారు. అలా కాకుండా మరీ చిన్నవి.. నిలదొక్కుకోలేనివి ఉంటే వాటిని పెద్ద సంస్థల్లో విలీనం చేసే అవకాశాలను పరిశీలిస్తామని పేర్కొన్నారు. కేంద్రం గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ. 65,000 కోట్లు సమీకరించాలని భావించింది. కానీ దీన్ని తర్వాత రూ. 50,000 కోట్లకు సవరించింది. తాజా బడ్జెట్లో దాన్ని కాస్త స్వల్పంగా పెంచుతూ రూ. 51,000 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆర్థిక మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
ఆదిలాబాద్ జిల్లాలో చిన్నారుల అక్రమ అమ్మకం కలకలం
-
పాక్ ఆర్థిక కష్టాలు.. అమ్మకానికి అమెరికాలోని ఎంబసీ ఆస్తులు
ఇస్లామాబాద్: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది పాకిస్థాన్. చేసిన అప్పులు తీర్చేందుకు, ఉద్యోగులకు జీతాలు సైతం ఇచ్చేందుకు ఇబ్బందులు పడుతూ ఆస్తులు అమ్ముకుంటోంది. తమకు సాయం చేయాలని అంతర్జాతీయ సంస్థలతో పాటు వివిధ దేశాలను వేడుకుంటోంది. ఈ క్రమంలోనే అమెరికాలోని ఎంబసీ ఆస్తులను అమ్మకానికి పెట్టింది. వాషింగ్టన్లోని పాత ఎంబసీ బిల్డింగ్ను అమ్మకానికి పెట్టగా కొనుగోలు చేసేందుకు మూడు సంస్థలు బిడ్లు దాఖలు చేసినట్లు పాకిస్థాన్ స్థానిక మీడియా వెల్లడించింది. భారత సంస్థ బిడ్.. వాషింగ్టన్లోని పాక్ ఎంబసీ భవనాన్ని కొనుగోలు చేసేందుకు అత్యధికంగా 6.8 మిలియన్ డాలర్లకు జువిష్ సంస్థ బిడ్ దాఖలు చేసింది. ఆ భవనం స్థానంలో ప్రార్థనా మందిరం నిర్మించాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఆ తర్వాత రెండోస్థానంలో భారత్కు చెందిన ఓ రియాల్టీ సంస్థ బిడ్ వేసింది. 5 మిలియన్ డాలర్లకు ఖర్చు చేసేందుకు ముందుకు వచ్చింది. అలాగే.. పాకిస్థాన్కు చెందిన రియాల్టీ సంస్థ 4 మిలియన్ డాలర్లకు కోట్ చేసినట్లు పాక్ డాన్ పత్రిక వెల్లడించింది. మరోవైపు.. ప్రైవేటీకరణపై ఏర్పడిన పాకిస్థాన్ కేబినెట్ కమిటీ ఆర్థిక మంత్రి ఇషాక్ డార్ నేతృత్వం సోమవారం భేటీ అయింది. న్యూయార్క్లోని రూసెవెల్త్ హోటల్ సైట్ను లీజుకు ఇచ్చేందుకు ఫైనాన్షియల్ అడ్వైజర్ను నియమించాలని ప్రైవేటీకరణ కమిషన్కు సూచించినట్లు డాన్ పత్రిక తెలిపింది. పాకిస్థాన్కు వాషింగ్టన్లో రెండు ప్రాంతాల్లో రాయబార కార్యాలయాలు ఉన్నాయి. అందులో ఒకటి పాతది కాగా మరొకటి కొత్తది. ఆర్ స్ట్రీట్లో ఉన్న భవనాన్ని 1956లో కొనుగోలు చేశారు. 2000 వరకు అందులో కార్యకలాపాలు సాగాయి. పాత భవనాన్ని అలాగే అమ్మేయాలా? లేక పునరుద్ధరణ పనులు చేయించి విక్రయించాలా? అనే అంశంపై ఎంబసీ అధికారులు చర్చిస్తున్నట్లు పాక్ పత్రిక పేర్కొంది. ఇదీ చదవండి: ‘ఏ దోస్త్ మేమున్నాం’.. పాకిస్థాన్కు జిన్పింగ్ భరోసా -
పొగరాయుళ్లకు కేంద్రం షాక్! ఇక సిగరెట్లు అలా లభించడం కష్టమే?
పొగరాయుళ్లకు కేంద్రం షాకివ్వనుంది. రానున్న రోజుల్లో విడిగా సిగరెట్ల అమ్మకాల్ని బ్యాన్ చేయనున్నట్లు తెలుస్తోంది. పలు నివేదికల ప్రకారం.. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని అరికట్టేలా సింగిల్ సిగరెట్ల అమ్మకాల్ని బ్యాన్ చేయాలని సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. వదులుగా ఉన్న సిగరెట్ల అమ్మకాలు పొగాకు నియంత్రణపై చేస్తున్న ప్రచారాన్ని ప్రభావితం చేస్తున్నాయని కమిటీ సభ్యులు వాదించారు. దీంతో పాటు దేశంలోని అన్ని ఎయిర్పోర్ట్లలో స్మోకింగ్ జోన్లను తొలగించాలని కమిటీ సిఫార్స్ చేసింది. స్టాండింగ్ కమిటీ సిఫారసులకు అనుగుణంగా ప్రభుత్వం వ్యవహరిస్తే, పార్లమెంట్ త్వరలో సింగిల్ సిగరెట్ల అమ్మకాల్ని నిషేధించవచ్చు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ సిఫారసు మేరకు 3 సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం ఇ-సిగరెట్ల అమ్మకం, వాడకాన్ని నిషేధించిన విషయం తెలిసిందే. జీఎస్టీ అమలు తర్వాత కూడా పొగాకు ఉత్పత్తులపై పన్నులో పెద్దగా పెరుగుదల లేదని స్టాండింగ్ కమిటీ గుర్తించింది. మద్యం, పొగాకు ఉత్పత్తుల వినియోగం క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని కమిటీ హైలైట్ చేసింది.తాజా పన్ను శ్లాబుల ప్రకారం..బీడీలపై 22 శాతం, సిగరెట్లపై 53 శాతం, పొగలేని పొగాకుపై 64 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. మరోవైపు, పొగాకు ఉత్పత్తులపై 75శాతం జీఎస్టీ విధించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత ప్రభుత్వాన్ని కోరింది. ఏడాదికి 3.5లక్షల మందికి మరణం పలు నివేదికల ప్రకారం, మన దేశంలో స్మోకింగ్ కారణంగా ఏడాదికి 3.5 లక్షల మంది మరణిస్తున్నట్లు తేలింది. 2018 లో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ నిర్వహించిన ఒక సర్వేలో ధూమపానం చేసే వారిలో 46 శాతం మంది నిరక్షరాస్యులు, 16 శాతం మంది కాలేజీ విద్యార్ధులు ఉన్నారు. ఫౌండేషన్ ఫర్ స్మోక్ ఫ్రీ వరల్డ్ నివేదిక ప్రకారం.. భారత్లో ప్రతి సంవత్సరం సుమారు 6.6 కోట్ల మంది సిగరెట్లు తాగుతుండగా, 26 కోట్లకు పైగా ఇతర పొగాకు ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారు. పొగాకు వాడకం వల్ల భారతదేశంలో సుమారు 21శాతం మందికి క్యాన్సర్ సోకుతున్నట్లు ఓ అధ్యయనం వెలుగులోకి తెచ్చింది. -
ఎగబడి కొంటున్న జనం! ఈ ఇళ్లకు యమ డిమాండ్
సాక్షి, హైదరాబాద్: కరోనా తర్వాతి నుంచి గృహ కొనుగోలుదారుల అభిరుచిలో మార్పులు వచ్చాయి. భౌతిక దూరం నేపథ్యంలో ఇంటి విస్తీర్ణం కూడా పెరిగింది. గతంలో రెండు పడక గదుల వైపు ఆసక్తి చూపిన కొనుగోలుదారులు శరవేగంగా మూడు పడక గదుల వైపు మళ్లుతున్నారు. గతేడాది జనవరి–జూన్ (హెచ్ 1)లో 46 శాతం మంది 2 బీహెచ్కే కొనుగోళ్లకు ఇష్టపడగా.. ఈ ఏడాది హెచ్1 నాటికి 38 శాతానికి తగ్గింది. ఇదే సమయంలో 40 శాతంగా ఉన్న 3 బీహెచ్కే కాస్త 2022 హెచ్1 నాటికి 44 శాతానికి పెరిగిందని సీఐఐ – అనరాక్ కన్జ్యూమర్ సెంటిమెంట్ సర్వే వెల్లడించింది. ►జనవరి–జూన్ మధ్య ఆన్లైన్లో నిర్వహించిన ఈ సర్వేలో 5,500 మంది పాల్గొన్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో 92 శాతం మంది ఆర్ధిక వ్యవస్థ ప్రస్తుత స్థాయిలోనే కొనసాగుతుందని, 16 శాతం మంది వచ్చే ఏడాది కాలంలో స్వల్పంగా మెరుగుపడుతుందని అంచనా వేశారు. ► నాలుగు పడక గదులకూ డిమాండ్ పెరిగింది. గతేడాది హెచ్1లో 2 శాతంగా ఉన్న ఈ గృహాల ఆసక్తి.. ఇప్పుడు 7 శాతానికి వృద్ధి చెందింది. రూ.1.5 కోట్ల కంటే ఎక్కువ ధర ఉండే లగ్జరీ ప్రాపర్టీల లావాదేవీలు 4 శాతం మేర వృద్ధి చెందాయి. కరోనా కంటే ముందు 6 శాతంగా ఉన్న ఈ ప్రాపర్టీల డిమాండ్.. 2022 హెచ్1 నాటికి 10 శాతానికి పెరిగింది. ప్రీమియం ప్రాపర్టీలకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో డెవలపర్లు కూడా ఈ గృహాల సరఫరాను పెంచారని అనరాక్ గ్రూప్ చైర్మన్ అనూజ్ పూరీ తెలిపారు. దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో 2022 హెచ్1లో రూ.33,210 లగ్జరీ యూనిట్లు లాంచింగ్ అయ్యాయని పేర్కొన్నారు. గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉంటేనే.. కరోనా తర్వాతి నుంచి గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇళ్లకు డిమాండ్ పెరిగింది. రెడీగా ఉన్న, నిర్మాణంలో ఉన్న ఇళ్లకు మధ్య అంతరం క్రమంగా తగ్గుతుంది. 2020 హెచ్1లో రెడీ టు మూవ్, కొత్త ప్రాజెక్ట్ మధ్య 46:18 శాతంగా ఉన్న నిష్పత్తి.. ఈ ఏడాది హెచ్1 నాటికి 30:25 శాతానికి చేరింది. 69 శాతం మంది సొంతంగా ఉండేందుకు గృహాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటే.. 31 శాతం మంది పెట్టుబడుల రీత్యా కొంటున్నారు. 8–10 ఏళ్ల పెట్టుబడి జోన్లో ఉన్న పెట్టుబడిదారులు సానుకూల దృక్పథంతో ఉన్నారని, వచ్చే ఏడాది కాలంలో నివాస సముదాయాల పెట్టుబడిదారుల మార్కెట్ మెరుగవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గతేడాది హెచ్1లో 54 శాతం మంది ఇతర పెట్టుబడి సాధనాలతో పోలిస్తే రియల్ ఎస్టేట్ ఉత్తమమైనదని భావించగా.. 2022 హెచ్1 నాటికిది 59 శాతానికి పెరిగింది. చదవండి👉 ‘మేం ఫ్రీగా డబ్బులిస్తాం...ఇళ్లు కట్టుకోండి’.. బంపరాఫర్ ఇచ్చిన ప్రభుత్వం! -
ఎఫ్ఐఐల అమ్మకాలు కొనసాగుతాయి..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇతర వర్ధమాన మార్కెట్లతో పోలిస్తే భారత మార్కెట్లు మెరుగైన పనితీరే కనబరుస్తున్నా యని పీజీఐఎం ఇండియా మ్యూచువల్ ఫండ్ హెడ్ (ఈక్విటీస్) అనిరుద్ధ నాహా తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) విక్రయాలను కొనసాగిస్తారని, నిధులను ఇతర మార్కెట్లలోకి తిప్పుతుంటారని ఆయన పేర్కొన్నారు. గత తొమ్మిది నెలలుగా ఎఫ్ఐఐలు విక్రయించడం, దేశీ సంస్థలు కొనుగోళ్లు జరుపుతుండటం కొనసాగుతోందని నాహా చెప్పారు. భారీ అమ్మకాలు వెల్లువెత్తుతున్నా, మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతు న్నప్పటికీ దేశీ ఇన్వెస్టర్లు పరిణితితో వ్యవహరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. దేశీ మదుపుదారుల పెట్టుబడులు కొనసాగుతుండటంతో ఎఫ్ఐఐల అమ్మకాల ఒత్తిడిని తట్టుకుని మార్కెట్లు నిలబడు తున్నాయన్నారు. మార్కెట్లు మరికొంత కరెక్షన్కి లోనుకావచ్చని, అయితే ఈక్విటీలకు కేటాయింపులు జరిపేందుకు.. దీర్ఘకాలంలో సంపద సృష్టించుకునేందుకు ఇది సరైన సమయమని నాహా చెప్పారు. భారతీయులు సాధారణంగా ఈక్విటీలు, ఈక్విటీ ఫండ్లకు ఎక్కువగా కేటాయించరని, ప్రస్తుతం ఆ ధోరణి మారుతోందని తెలిపారు. మరోవైపు, రిస్కులను సమర్ధంగా ఎదుర్కొంటూ మెరుగైన రాబడులు పొందేందుకు, ట్యాక్సేషన్పరంగా ప్రయోజనకరంగా ఉండేందుకు బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ (బీఏఎఫ్) ఆకర్షణీయంగా ఉంటున్నాయని నాహా పేర్కొన్నారు. దీనికి అనుగుణంగానే పీజీఐఎం ఇండియా బీఏఎఫ్ను నిర్వహిస్తున్నామని వివరించారు. మార్కెట్ వేల్యుయేషన్స్ అధిక స్థాయిలో ఉన్నప్పుడు కొంత ఈక్విటీ భాగాన్ని హెడ్జ్ చేసి, డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తామని.. తద్వారా మార్కెట్ పతనమైన పెద్దగా ప్రభావం పడకుండా ఉంటుందని నాహా చెప్పారు. అలాగే తక్కువ స్థాయిలో కొనుగోలు చేసి అధిక స్థాయిలో విక్రయించే సూత్రాన్ని పాటిస్తాం కాబట్టి మెరుగైన రాబడులు అందించేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. -
గ్లోబల్ మాంద్యం భయాలు: 5 లక్షల కోట్లు ఢమాల్
సాక్షి,ముంబై: బలహీనమైన అంతర్జాతీయ సంకేతాలు, గ్లోబల్మాంద్యం, ముఖ్యంగా ఫెడ్ రిజర్వ్ వడ్డింపుతో దేశీయ స్టాక్మార్కెట్ భారీ పతనాన్ని నమోదు చేసింది. అటు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రికార్డు కనిష్టానికి చేరింది. సెన్సెక్స్ 1020 పాయింట్ల నష్టంతో 58,098 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 1.72 శాతం క్షీణించి 17,327 వద్ద ముగిసింది. ఒక దశలో సెన్సెక్స్ 57,981కి పడిపోయింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్స్. ఆటో, ఐటీ రంగ షేర్లు నష్టపోయాయి. వరుసగా మూడో సెషన్లో పతనాన్ని నమోదు చేయడమే కాదు, వరుసగా నాల్గవ వారాంతంలోనూ క్షీణించాయి. అన్ని బిఎస్ఇ-లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ. 276.6 లక్షల కోట్లకు పడిపోయింది. ఈ ఒక్కరోజు ట్రేడర్లు రూ.4.9 లక్షల కోట్ల మేర నష్ట పోయారు. టెక్నికల్గా సెన్సెక్స్ 59500 స్థాయిని నిఫ్టీ 17500 స్థాయికి చేరింది. దీంతో ఇన్వెస్టర్లు టెక్నికల్ లెవల్స్ను జాగ్రత్తగా పరిశీలిస్తారని, ఈ స్థాయిలు బ్రేక్ అయితే అమ్మకాల వెల్లువ తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా ఫెడ్ వడ్డింపు, డాలర్ ఇండెక్స్ 20ఏళ్ల గరిష్టానికి చేరడంతో, రూపాయి పతనం,అమెరికా బాండ్ ఈల్డ్స్ పతనం,ఎఫ్ఐఐల అమ్మకాలు బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీలో పతనం తదితర కారణాలు మార్కెట్ ఔట్లుక్ను బేరిష్గా మార్చాయి. దీనికి తోడుఫెడ్బాటలోనే ఆర్బీఐ కూడా రానున్న సమీక్షలో కీలక వడ్డీరేట్లను పెంచనుందనే అంచనాలున్నాయి. ఇప్పటికే బ్రిటన్, స్వీడన్, స్విట్జర్లాండ్, నార్వే సెంట్రల్ బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను పెంచిన సంగతి తెలిసిందే. -
ఫ్లాట్ అమ్ముతున్నారా? అయితే ఈ విషయాలు గమనించండి
ప్రశ్న: నేను హైదరాబాద్లో నా ఫ్లాట్ని అమ్ముతున్నాను. రూ. 18 లక్షలకు ఒప్పందం కుదిరింది. కానీ, సబ్–రిజిస్ట్రార్ కార్యాలయం వాళ్లు మార్కెట్ విలువ రూ. 23,00,000 అంటున్నారు. – ఎ. సత్యప్రసాద్, హైదరాబాద్ జ. స్థిరాస్తుల క్రయవిక్రయ విషయంలో ఎంతో జాగ్రత్త వహించాలి. ఇటు అమ్మే వ్యక్తి, అటు కొనే వ్యక్తి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే.. ♦ ఎటువంటి పరిస్థితుల్లోనూ కాస్త వైట్, కాస్త బ్లాక్ జోలికి పోకండి. ♦ ఏ పరిస్థితుల్లోనూ నగదు వ్యవహారం వద్దు. ♦ నగదు తప్పనిసరి అయితే రూ. 2,00,000 లోపలే ఉండేలా చూసుకోండి. ♦ 2001 ఆర్థిక సంవత్సరానికి ముందు కొన్న ఆస్తి విలువ 01-040-2001 నాటి మార్కెట్ విలువను ప్రామాణికంగా ఫెయిర్ మార్కెట్ విలువగా తీసుకుంటారు. జాగాకి గజం ఇంత అని, చదరపు అడుగుకు ఇంత అని సబ్–రిజిస్ట్రార్ సర్టిఫికెట్ ఇస్తారు. ♦ అలా నిర్ధారించిన విలువను ఇండెక్సింగ్ ద్వారా పెంచుతారు. 2001-02 నుండి 2002–03 వరకు ఒక టేబుల్ ఆన్లైన్లో దొరుకుతుంది. ♦ ఉదాహరణకు 2001–02లో మార్కెట్ విలువ 100 అనుకుంటే అది ఇప్పుడు 331కి సమానం అవుతుంది. మీరు గతంలో ఎంతకు కొన్నా 01–04–2001 నాటు మార్కెట్ విలువ రూ. 5,00,000 అనుకోండి 5,00,000/100 X331 = రూ. 16,55,000గా భావిస్తారు. ♦ పైన లెక్కించిన రూ. 16,55,000ని కొన్న ధరగా పరిగణిస్తారు. ♦ ఒప్పందంలో ఉన్న మొత్తం, మార్కెట్ విలువ ఈ రెండింటిలో ఏది ఎక్కువ అయితే ఆ మొత్తాన్ని అమ్మకపు విలువుగా పరిగణిస్తారు. మీరు చెప్పిన కేసులో ఒప్పందపు విలువ రూ. 18,00,000, సబ్–రిజిస్ట్రార్ కట్టిన విలువ రూ. 23,00,000. సబ్–రిజిస్ట్రార్ విలువనే పరిగణిస్తారు. కొనే వ్యక్తి దీని మీదే రిజిస్ట్రేషన్ రుసుం, వగైరాలు చెల్లించాలి. ♦ ఈ ప్రకారం రూ. 23 లక్షలను ప్రాతిపదికగా తీసుకుని, అందులో నుంచి రూ. 16,55,000ని తీసివేయగా మిగిలిన రూ. 6,45,000ని దీర్ఘకాలిక మూలధన లాభంగా లెక్కిస్తారు. ♦ మీరు నిజంగా రూ. 18,00,000లే తీసుకున్నా, ఆ మేరకు అన్ని సాక్షాలు ఉన్నప్పటికీ రూ. 23,00,000నే పరిగణనలోకి తీసుకుంటారు. ♦ సాధారణంగా ఒప్పందం విలువ ఎక్కువగా ఉండి, మార్కెట్ విలువ తక్కువగా ఉంటుంది. ఆ అదనపు మొత్తం నగదుగా తీసుకుంటూ ఉంటారు. అలా ససేమిరా చేయవద్దు. కొంత మంది అదనపు మొత్తాన్ని విడిగా నాలుగైదు చెక్కులుగా ఇస్తాం.. మీరు వేరే అకౌంటులో వేసుకోండి అంటూ ఉంటారు. అలాంటివి చేయొద్దు. ♦ మీరు ఎలా అయితే క్యాపిటల్ గెయిన్కి గురి అవుతారో అలాగే ప్రతిఫలం ఇచ్చిన వ్యక్తి సదరు మొత్తానికి ’సోర్స్’ చూపించాలి. అలా చూపించకపోతే ఆ మొత్తం మీద 30 శాతం పన్ను చెల్లించాలి. ♦ ‘ఇద్దరం లబ్ధి పొందాలి, ఉభయతారకంగా ఉండాలి‘ అని ఆలోచించకండి. నల్లధనంపై ఉంది ఆంక్ష .. కొంత మంది పెడతారు పరీక్ష .. కానీ మనకు పడేను శిక్ష .. మీ నిజాయితీయే మీకు శ్రీరామరక్ష! స్థిరాస్తి క్రయవిక్రయాల్లో .. జాగ్రత్త -
నకిలీ సర్టిఫికెట్ల తయారీలో శిక్షణ!
సాక్షి, హైదరాబాద్: నకిలీ విద్యార్హత పత్రాల తయారీ ముఠా గుట్టురట్టయ్యింది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాలకు చెందిన ఇంటర్, డిగ్రీ సర్టిఫికెట్లను సృష్టించి, విక్రయిస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం ఎస్ఓటీ డీసీపీ కే మురళీధర్, ఎల్బీనగర్ డీసీపీ సన్ప్రీత్సింగ్లతో కలిసి రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ వివరాలు వెల్లడించారు. చాంద్రాయణగుట్ట, క్యూబా కాలనీకి చెందిన మహ్మద్ ఖలీముద్దీన్ అలియాస్ ఖలీం నకిలీ సర్టిఫికెట్లను తయారు చేయడంలో దిట్ట. గత ఏడేళ్లుగా ఈ దందాను నిర్వహిస్తున్నాడు. ఇతనిపై చాంద్రాయణగుట్ట, అబిడ్స్ ఠాణాలలో రెండు కేసులున్నాయి. పోలీసుల నిఘా ఉండటంతో అజ్ఞాతంలో ఉంటూ తన అనుచరులకు శిక్షణ ఇస్తున్నాడు. ఖలీం స్నేహితుడైన గోల్కొండ మోతీ దర్వాజకు చెందిన ముక్తార్ అహ్మద్కు అడోబ్ ఫొటోషాప్లో ఫొటోలు, డాక్యుమెంట్ల ఎడిటింగ్పై మంచి అనుభవం ఉంది. దీంతో ఖలీం ఇతనికి నకిలీ సరి్టఫికెట్ల తయారీ శిక్షణ ఇచ్చాడు. అలాగే విద్యార్హత పత్రాల తయారీకి అవసరమైన యూనివర్సిటీ గుర్తింపు చిహ్నలు, హాలోగ్రామ్స్ ఇతరత్రా వస్తువులను అందించాడు. తన పేరు బయటకు రాకుండా రహస్యంగా ఉంచాలని, కమీషన్ ఏజెంట్లను నియమించుకోవాలని సూచించాడు. రాజేంద్రనగర్కు చెందిన అహ్మద్ ఫిరోజ్, లక్డీకపూల్ ఏసీ గార్డ్స్కు చెందిన మహ్మద్ ఫరూక్ అజీజ్, టోలిచౌకీ పారామౌంట్ కాలనీకి చెందిన మహ్మద్ సారూషుల్లా ఖాన్లను ముక్తార్ కమీషన్ ఏజెంట్లుగా నియమించుకున్నాడు. వారికి అవసరమైనట్లు నకిలీ విద్యార్హత పత్రాలను తయారు చేసేవాడు. ఒక్కో సరి్టఫికెట్ను రూ. లక్ష, రూ. 2 లక్షలకు విక్రయించేవాడు. ఇందులో 25 శాతం కమీషన్ను ఖలీంకు చెల్లించేవారు. ఈ క్రమంలో నిందితుల నుంచి హుస్సేనీఆలంకు చెందిన మహ్మద్ జుబేర్ అలీ, టోలిచౌకీకి చెందిన సయ్యద్ అతీఫుద్దిన్ రూ.లక్షకు నకిలీ విద్యార్హత పత్రాలను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. సర్టిఫికెట్లను తీసుకునేందుకు బాలాపూర్ ఎర్రకుంటకు వెళ్లారు. విశ్వసనీయ సమాచారంతో పోలీసులు దాడులు చేసి సరూషుల్లా ఖాన్, జుబేర్, అతీఫుద్దిన్, ఫరూఖ్ అజీజ్, మహ్మద్ ఫిరోజ్, ముక్తార్ అహ్మద్లను పట్టుకున్నారు. వీరి నుంచి నకిలీ సర్టిఫికెట్లతో పాటు ల్యాప్టాప్, స్టాంప్లు, 6 సెల్ఫోన్లు ఇతరత్రా వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు ఈ ముఠా 258 సర్టిఫికెట్లను తయారు చేసి, విక్రయించారని, వీరిలో పలువురు విదేశాలకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఎర్రగడ్డకు చెందిన సల్మాన్ యూకేకు, కాలాపత్తర్కు చెందిన మీర్జా యూసుఫుద్దిన్ న్యూయార్క్కు, మెహదీపట్నానికి చెందిన మహ్మద్ మాజీద్ అమెరికాకు, గోల్కొండకు చెందిన రెహాన్, అశ్వాక్ అహ్మద్ దుబాయ్ దేశాలకు వెళ్లినట్లు సీపీ తెలిపారు. నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేసి, ఫాస్ట్ట్రాక్ కోర్ట్లో శిక్ష పడేలా చేస్తామని పేర్కొన్నారు. వీరి వెనకెవరున్నారు? ఈ నకిలీ సరి్టఫికెట్ల రాకెట్ను నడుపుతున్న ప్రధాన నిందితుడు మహ్మద్ ఖలీముద్దిన్తో సహా ఇతర నిందితులు, కొనుగోలు చేసే విద్యార్థులు అందరూ ఒకే వర్గానికి చెందిన వారే కావటంతో పోలీసులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. వీరి నుంచి నకిలీ పత్రాలను కొనుగోలు చేసిన విద్యార్థులు ఎక్కువగా గల్ఫ్ దేశాలకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో వీరి వెనక ఎవరైనా అదృశ్య శక్తులు ఉండి ఈ రాకెట్ను నడిపిస్తున్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు సూత్రధారి ఖలీం పట్టుబడితేనే దీని వెనక ఎవరున్నారనేది బయటపడుతుందని ఓ పోలీసు ఉన్నతాధికారి పేర్కొన్నారు. అతని కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు తెలిపారు. (చదవండి: నకిలీ పత్రాలతో ఇల్లు విక్రయం) -
నాసిరకం ప్రెజర్ కుక్కర్ల అమ్మకాలు, ఫ్లిప్కార్ట్పై సీసీపీఏ ఆగ్రహం!
న్యూఢిల్లీ: ఫ్లిప్కార్ట్పై సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) రూ.లక్ష జరిమానా విధించింది. వినియోగ హక్కులను ఉల్లంఘనలకు పాల్పడుతూ,తన ప్లాట్ఫారమ్లో నాసిరకం ప్రెజర్ కుక్కర్లను విక్రయించడానికి అనుమతించినందుకు గాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీసీపీఏ చీఫ్ కమిషనర్ నిధి ఖేర్ వెల్లడించారు. ఫ్లిప్కార్ట్ తన ప్లాట్ఫారమ్లో విక్రయించిన మొత్తం 598 ప్రెజర్ కుక్కర్ల వినియోగదారుల పేర్లనూ నోటిఫై చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. విక్రయించిన ప్రెజర్ కుక్కర్లను రీకాల్ చేసి వినియోగదారులకు డబ్బును రీయింబర్స్ (తిరిగి చెల్లింపులు) చేయాలని ఆదేశించినట్లు ఆమె తెలిపారు. ఈ అంశంపై స్థాయీ నివేదికను 45 రోజుల లోపు సమర్పించాలని కూడా ఇ– కామర్స్ దిగ్గజాన్ని అథారిటీ ఆదేశించింది. తీవ్ర ప్రమాదాల నుంచి వినియోగదారులను రక్షించడానికి, వినియోగదారు ప్రయోజనాలే ప్రధాన ధ్యేయంగా కేంద్రం పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రెజర్ కుక్కర్లపై ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యత గుర్తును ఉపయోగించడాన్ని ప్రభుత్వం 2021 ఫిబ్రవరి నుంచి తప్పనిసరి చేసింది. అన్ని వంటింటి ప్రెజర్ కుక్కర్లు ‘ఐఎస్ 2347:2017’ ప్రమాణానికి అనుగుణంగా ఉండాలి. ప్రెజర్ కుక్కర్లను ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో విక్రయించినా వీటికి సంబంధించి అత్యధిక భద్రతా ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. సీసీపీఏ ప్రకారం, ఫ్లిప్కార్ట్ తన ’వినియోగ నిబంధనల’లో ప్రెజర్ కుక్కర్లకు సంబంధించి ప్రతి ఇన్వాయిస్పై ’ఫ్లిప్కార్ట్ ద్వారా ఆధారితం’ అని పేర్కొంది. వివిధ పంపిణీ ప్రయోజనాల కోసం విక్రేతలను ’బంగారం, వెండి, కాంస్య’గా గుర్తించింది. అమ్మకాల విషయంలో ఫ్లిప్కార్ట్ పోషించిన పాత్రను ఇది సూచిస్తుంది. తన ఈ–కామర్స్ ప్లాట్ఫారమ్లో ఇటువంటి ప్రెజర్ కుక్కర్లను విక్రయించడం ద్వారా రూ. 1,84,263 ఫీజును సంపాదించినట్లు ఫ్లిప్కార్ట్ అంగీకరించింది. ఈ నేపథ్యంలో వినియోగదారులకు విక్రయించడం వల్ల ఉత్పన్నమయ్యే పరిణామాలు, ఇందుకు సంబంధించి బాధ్యత నుండి ఫ్లిప్కార్ట్ తప్పించుకోలేదు. విస్తృత అవగాహనా కార్యక్రమాలు.. వినియోగదారుల హక్కుల పరిరక్షణకు సంబంధించి దేశ వ్యాప్తంగా విస్తృత అవగాహనా ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు సీసీపీఏ చీఫ్ కమిషనర్ నిధి ఖేర్ వెల్లడించారు. ఆమె తెలిపిన ముఖ్యాంశాలు... ► ప్రభుత్వం నోటిఫై చేసిన కొన్ని ఉత్పత్తులకు సంబంధించి ప్రమాణాలను ఉల్లంఘించే నకిలీ వస్తువుల విక్రయాలను నిరోధించడం సీసీపీఏ దేశవ్యాప్త ప్రచార లక్ష్యం. ► ఈ ప్రచారంలో ముఖ్యంగా హెల్మెట్లు, ప్రెజర్ కుక్కర్లు, వంట గ్యాస్ సిలిండర్లపై దృష్టి సారిస్తోంది. ► అటువంటి ఉత్పత్తుల తయారీ లేదా విక్రయాలకు సంబంధించిన అన్యాయమైన వాణిజ్య పద్ధతులు, వినియోగదారుల హక్కుల ఉల్లంఘనలపై విచారణ జరిపి తీసుకున్న చర్యల నివేదికను సమర్పించాలని దేశవ్యాప్తంగా జిల్లా కలెక్టర్లకు లేఖ రాసింది. ► ప్రచారంలో భాగంగా ప్రామాణికంగా లేని పలు హెల్మెట్లు, ప్రెజర్ కుక్కర్లను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ (బీఐఎస్) అధికారులు గుర్తించారు. ఆయా కంపెనీలపై చర్యలకు శ్రీకారం చుట్టారు. ► నేషనల్ కన్సూ్యమర్ హెల్ప్లైన్లో ఫిర్యాదుల్లో దాదాపు 38% ఇ–కామర్స్కు సంబంధించినవి. ఇందులో లోపభూయిష్ట ఉత్పత్తి డెలివరీ, చెల్లింపుల వాపసులో వైఫల్యం, ఉత్పత్తి డెలివరీలో జాప్యం వంటి అంశాలు ఉన్నాయి. -
నాసిరకం ప్రెజర్ కుక్కర్ల అమ్మకాలు, అమెజాన్కు భారీ ఫైన్!
ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్కు భారీ షాక్ తగిలింది. ఆన్ లైన్లో నాసిరకం ప్రెజర్ కుక్కర్లను అమ్ముతుందంటూ అమెజాన్కు సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) ఫైన్ విధించింది. సీసీపీఏ అమెజాన్ ఫ్లాట్ ఫామ్లో వినియోగదారులు కొనుగోలు చేసిన 2,265 ప్రెజర్ కుక్కర్లను పరిశీలించింది. వాటి పనితీరు సరిగ్గా లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే వాటిని రీకాల్ చేయడంతో పాటు కొనుగోలు దారులకు డబ్బులు తిరిగి చెల్లించాలని ఆదేశించింది. క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్(క్యూసీఓ) నిబంధనకు విరుద్దంగా ప్రెజర్ కుక్కర్ల అమ్మకాలు జరిపిన అమెజాన్ లక్షరూపాయల పెనాల్టీని సీసీపీఏకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా అమెజాన్ క్యూసీవో నిబంధనల్ని ఉల్లంఘించిందంటూ సీపీపీఏ విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. అమెజాన్ ఎంత సంపాదించిందంటే క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్(క్యూసీఓ) ప్రకారం.. 2,265 ప్రెజర్ కుక్కర్లలలో నాణ్యత లోపించింది. ఆ కుక్కర్లను అమ్మగా అమెజాన్ రూ.6,14,825.41 సంపాదించినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. -
ఇలా చేస్తే ఏ స్థిరాస్తి అమ్మినా .. పన్ను భారం లేకుండా..
గతంలో ఏ ఆస్తి అమ్మితే ఆ ఆస్తినే మళ్లీ కొంటే పన్ను భారం ఉండదని తెలుసుకున్నాం. ఈవారం ఏ మూలధన ఆస్తి అమ్మినా మీకు మినహాయింపు రావాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. 54 ఉఉ ప్రకారం సారాంశం ఏమిటంటే.. ♦ ఇది వ్యక్తులకు, హిందూ కుటుంబాలకు వర్తిస్తుంది ♦ ఏ మూలధన ఆస్తి (దీర్ఘకాలికం) అమ్మినా, వచ్చిన లాభాలను ఇన్వెస్ట్ చేయాలి ♦అమ్మినా 6 నెలల్లోగా చేయాలి ♦01–04–2019కి ముందు జారీ చేసిన యూనిట్లలో లేదా గవర్నమెంటు నోటిఫై చేసిన వాటిలో మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి ♦గరిష్ట పరిమితి రూ. 50,00,000 ♦ఎంత ఇన్వెస్ట్ చేశారో అంతకే మినహాయింపు ఉంటుంది ♦వీటిలో లాక్–ఇన్ పీరియడ్ 3 సంవత్సరాలు ♦3 సంవత్సరాల లోపల ఈ యూనిట్లు లేదా నోటిఫై చేసిన వాటిని అమ్మినా / బదిలీ చేసినా మినహాయింపు రద్దు అయిపోతుంది. 54 ఉఇ ప్రకారం ముఖ్యమైన విశేషాలు ఏమిటంటే.. ♦ఈ సెక్షన్ అందరికీ వర్తిస్తుంది ♦2018–19 అసెస్మెంట్ వరకూ ఏ మూలధన ఆస్తి అమ్మినా వర్తించింది (దీర్ఘకాలికం). ♦2019–20 అసెస్మెంట్ నుండి కేవలం భూమి, భవనం, జాగాతో కలిపి ఇల్లు (భవనం, ఫ్లాటు అన్నీ వస్తాయి) అమ్మగా ఏర్పడ్డ దీర్ఘకాలిక మూలధన లాభాలకు మాత్రమే వర్తిస్తుంది ♦బదిలీ జరిగిన తేదీ నుండి ఆరు (6) నెలల్లోగా ఇన్వెస్ట్ చేయాలి ♦నేషనల్ హైవే అథారిటీ, రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్ జారీ చేసిన బాండ్లలో మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి ♦ఈ బాండ్ల కాలపరిమితి 5 సంవత్సరాలు ♦వీటి మీద వచ్చే వడ్డీపై పన్ను వర్తిస్తుంది ♦ఇక 5వ పాయింట్లో చెప్పిన రెండూ కాకుండా ప్రభుత్వ రంగ ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ జారీ చేసే బాండ్లను కూడా కేంద్రం నోటిఫై చేసింది. మినహాయింపు కావాలంటే వీటిలోనూ ఇన్వెస్ట్ చేయొచ్చు. ♦మీరు అన్నింట్లోనూ పెట్టుబడి పెట్టొచ్చు లేదా ఏదైనా ఒక దానిలోనైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. ♦మీరు కొన్న బాండ్లు కొన్న తేదీ నుండి 5 సంవత్సరాల వరకు బదిలీ చేయకూడదు. అలా చేస్తే మినహాయింపును రద్దు చేస్తారు. ♦ఎక్కువ ఇన్వెస్ట్ చేసినా లాభానికి వర్తించే దానికి మించి మినహాయింపు ఇవ్వరు. తక్కువ చేస్తే, చేసినంత మేరకే ఇస్తారు. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 50,00,000 దాటి ఇన్వెస్ట్ చేయరాదు ♦అలా అని మొదటి సంవత్సరం రూ. 50,00,000, రెండో ఏడాది రూ. 50,00,000 చేయడానికి వీలు లేదు (డిసెంబర్ తర్వాత అమ్మినప్పుడు ఇలాంటి అవకాశం ఉంది). ♦ఈ ఇన్వెస్ట్మెంట్కు 80సి మినహాయింపు లేదు. ♦వీటిని తనఖా పెట్టి అప్పు తీసుకుంటే ఆ అప్పుగా వచి్చన మొత్తం అంతా కూడా అమ్మకం ద్వారా వచ్చినట్లు లెక్క. అలా అప్పు తీసుకోకండి. ♦చివరగా కేవలం పన్ను భారాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని ఆలోచించకండి. మీ కుటుంబానికి సంబంధించిన ప్రాధాన్యతలు, మీ బాధ్యతలు ..పెళ్లి / చదువు / ముఖ్యమైనవి / రుణాలు చెల్లించడం మొదలైనవి చేయడం కూడా మంచి ప్లానింగే. చింత ఉండదు. శాంతి నెలకొంటుంది. -
అమ్మకాల సునామీ: కుప్పకూలిన స్టాక్మార్కెట్
సాక్షి, ముంబై: దేశీయస్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం భారీ లాభాలతో ఊరించిన కీలక సూచీలు మిడ్ సెషన్నుంచి కనిష్ట స్థాయిలను నమోదు చేశాయి. ఇన్వెస్టర్ల అమ్మకాలతో 15451వద్ద నిఫ్టీ 52 వారాల దిగువకు చేరింది. అటు సెన్సెక్స్ కూడా 52 వారాల కనిష్టానికి అతి సమీపంలో ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఏకంగా వెయ్యి పాయింట్లు పతనమైంది. అన్ని రంగాల షేర్లు భారీగా నష్టపోతున్నాయి. బ్రిటానియా, మారుతి సుజుకి తప్ప సెన్సెక్స్, నిఫ్టీలలో అన్ని షేర్లు భారీగా నష్టాల్లో కొనసాగుతున్నాయి. హిందాల్కో, టాటా స్టీల్, విప్రో, ఓఎన్జీసీ, సిప్లా, టెక్ మహీంద్ర, భారతి ఎయిర్టెల్, గ్రాసిం, ఇన్ఫోసిస్ , టైటన్ , బజాజ్ ఫిన్ సర్వ్ టాప్ లూజర్స్గా ఉన్నాయి. -
సాయం చేస్తానని చెప్పి ... వ్యభిచార గృహానికి విక్రయించేందుకు యత్నం
కర్ణాటక(దొడ్డబళ్లాపురం): ఇంట్లో తల్లిదండ్రులతో గొడవపడి బెంగళూరు వచ్చిన యువతిని సహాయం చేస్తానని మాయమాటలు చెప్పి విక్రయించడానికి ప్రయత్నించిన నిందితుడిని కెంపేగౌడ ఎయిపోర్టు పోలీసులు అరెస్టు చేసారు. కోలారుకు చెందిన యువతి ఇంట్లో గొడవపడి బెంగళూరుకు వచ్చి మెజెస్టిక్లో కూర్చుని ఉండగా ట్రావెల్ ఏజెన్సీలో పనిచేస్తున్న నాగేశ్ యువతిని పలకరించి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి దేవనహళ్లికి తీసుకువచ్చాడు. ఆపై యువతిపై అత్యాచారం చేసి తరువాత ఢిల్లీకి తీసుకెళ్లి వ్యభిచార గృహానికి విక్రయించాలని పథకం వేశాడు. అయితే ఎయిర్పోర్టులో నాగేశ్, యువతి ప్రవర్తనపై అనుమానం వచ్చిన సీఐఎస్ఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. నిందితుడిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆ‘గాలి’ అమ్ముకొని వారానికి రూ. 53 లక్షలు సంపాదిస్తోంది..
తమ అభిమాన తారలకు సంబంధించిన అలవాట్లు, అభిరుచులు, వస్తువులు.. ఇలా వేటినైనా తెగ ఇష్టపడుతుంటారు డై హార్డ్ ఫ్యాన్స్. వారు వాడే యాక్సెసరీల నుంచి ఆటోగ్రాఫ్ చేసిన పేపర్ వరకు ఏది దొరికినా వాటిని మధుర జ్జాపకంగా పదిలంగా దాచుకుంటారు. ఇప్పటి వరకు స్టార్స్ తమ వాచ్లు, షర్ట్స్, బైక్లు వంటి వస్తువలను వేలంలో అమ్మి డబ్బులు సంపాదించిన ఘటనలు ఎన్నో చూశాం కానీ ఓ టీవీ స్టార్ తన అపాన వాయువును (పిత్తు) అమ్మి లక్షల్లో ఆదాయం గడిస్తుందంటే నమ్ముతారా.. నిజమేనండి. బహిరంగంగా మాట్లేందుకు ఇబ్బందిగా ఫీల్ అయ్యే అపానవాయువుతో డబ్బులు కూడా సంపాదిస్తున్నానని స్టెఫానీ మాటో అనే టీవీ ఆర్టిస్ట్ చెప్పడం వైరల్గా మారింది. 90డే ఫియాన్స్ అనే టీవీ షో ద్వారా స్టెఫానీ మట్లో సోషల్ మీడియాలో తెగ పాపులారిటీని సంపాదించింది. అయితే తనకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడంతో తన అపానవాయువును అమ్మే బిజినెస్ను ప్రారంభించింది. ఆ వాయువును అమ్ముతూ వారానికి ఏకంగా 70 వేల డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు 53 లక్షల రూపాయలను ఆమె సంపాదిస్తోంది. ఈ విషయాన్ని స్టెఫానీ స్వయంగా తన ఇన్స్టాగ్రామ్లో వెల్లడించింది. చదవండి: హృదయ విదారకం.. చనిపోయిన తల్లి ఫోటోతో వధువు కన్నీళ్లు తన అపానవాయువును ఓ గాజు పాత్రలో వేసి ఒక్కో యూనిట్ను 1,400 డాలర్లకు (సుమారు లక్ష) తన అభిమానులకు ఆన్లైన్లో అమ్ముకుంటుంది. దీనికి సంబంధించిన వీడియోలను సైతం ఇన్స్టాగ్రామ్లో షేర్చేస్తూ అపానవాయువును అమ్మడం ద్వారా డబ్బు ఎలా సంపాదిస్తుందో పేర్కొంది. అలాగే అపానవాయువు బయటకు రావడం కోసం తాను ఎలాంటి ఫుడ్ తీసుకుంటుందో వివరించింది. వీడియోలో బీన్స్, ప్రోటీన్ మఫిన్, గట్టిగా ఉడికించిన గుడ్లు, ప్రోటీన్ షేక్, పెరుగు చూపిస్తుంది. ఇంతకూ గబ్బు లేపే అపానవాయువును కొనేదెవరు? ఈ సోది ఏంటి అనేగా మీ సందేహం. రెండు రోజుల్లోనే ఆమె 90 జార్లు అమ్మేసిందంటే... వాటికి ఎంత డిమాండ్ ఉందో ఆలోచించండి. తను అపానవాయువు పంపే గాజు పాత్రలో పూల రేకులు పెట్టడంతో అది సువాసన భరితంగా ఉంటుందని ఆమె తెలిపింది. వీటికి తోడు ఓ నోట్ కూడా రాసి పంపుతోంది. ఇంకేముంది అభిమాన తార నుంచి అపురూప కానుక అంటూ ఫ్యాన్స్ వేలకు వేలు పోసి కొనుక్కుంటున్నారు. చదవండి: నాలుగేళ్ల జైలు శిక్ష!.... రెండు రోజుల్లో విడుదల అంతలోనే.. బజ్ఫీడ్ అనే మీడియా కంపెనీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్టెఫానీ మాట్లాడుతూ.. ‘అపానవాయువు అమ్ముకోవడం నాకు తగిన పని అని అనిపించింది. అంతేగాక కొంచెం ఫన్నీగా, డిఫరెంట్గా ఫీల్ అయ్యాను. ఇది కొత్త ఉపాధి కూడా’ అని ఆమె పేర్కొంది. View this post on Instagram A post shared by Stephanie Matto (@stepankamatto) View this post on Instagram A post shared by Stephanie Matto (@stepankamatto) -
Drugs: అలవాటయ్యే వరకు అగ్గువ!
సాక్షి, సిటీబ్యూరో(హైదరాబాద్): గంజాయి సంబంధిత ద్రవ పదార్థమైన హష్ ఆయిల్ విక్రయంలో ఓ ముఠా కొత్త ఎత్తు వేసింది. ప్రధానంగా యువత, విద్యార్థులను టార్గెట్గా చేసుకున్న వీళ్లు..ఈ మత్తుకు అలవాటు పడేవరకు వారికి తక్కువ రేటుకు అమ్మారు. బానిసలుగా మారిన తర్వాత భారీ రేటు కట్టి విక్రయించారు. ఈ ముఠా వ్యవహారంపై సమాచారం అందుకున్న దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు వలపన్ని పట్టుకున్నారని టాస్క్ఫోర్స్ డీసీపీ చక్రవర్తి గుమ్మి బుధవారం వెల్లడించారు. సనత్నగర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ మహబూబ్ అలీ వృత్తిరీత్యా డ్రైవర్ అయినప్పటికీ నేర చరితుడు. మాదాపూర్లో రెండు దోపిడీ, మరో హత్యాయత్నం కేసులతో పాటు ఎస్సార్నగర్లో డ్రగ్స్ కేసు ఇతడిపై నమోదై ఉన్నాయి. గంజాయి, హష్ ఆయిల్ వినియోగానికి బానిసగా మారిన ఇతగాడు తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం హష్ ఆయిల్ తీసుకువచ్చి ఇక్కడ విక్రయించాలని భావించాడు. ఈ ఆలోననను తన స్నేహితులైన సనత్నగర్ వాసులు మహ్మద్ సర్ఫ్రాజ్, మహ్మద్ హాజీ పాషాలకు చెప్పడంతో వాళ్లూ జట్టుకట్టారు. కొన్నాళ్ల క్రితం ఈ త్రయం ఆంధ్రప్రదేశ్లోని ఏజెన్సీ ప్రాంతమైన పాడేరు వెళ్లింది. అక్కడి వెంకట్ అనే వ్యక్తి నుంచి హష్ ఆయిల్ ఖరీదు చేసుకువచ్చింది. తన స్నేహితులు, పరిచయస్తులైన వారికి తక్కువ రేటుకు అమ్మడం మొదలెట్టింది. వారి ద్వారా పరిచయమైన వారికీ ఈ మాదకద్రవ్యం విక్రయించింది. అలా వారిని ఈ మత్తుకు బానిసలుగా మార్చేసిన తర్వాత హష్ ఆయిల్ రేటును అమాంతం పెంచేసి అధిక ధరకు అమ్మి సొమ్ము చేసుకుంటోంది. హైదరాబాద్తో పాటు సైబరాబాద్ పరిధిలోని వారికీ దీన్ని విక్రయిస్తోంది. ఇప్పుడు వీళ్లు వెళ్లాల్సిన పని లేకుండా ఆర్డర్ చేస్తే చాలా వెంకట్ వివిధ రకాలుగా పార్శిల్ చేసి పంపిస్తున్నాడు. వీరి వ్యవహారాలపై సమాచారం అందుకున్న దక్షిణ మండల టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్.రాఘవేంద్ర నేతృత్వంలో ఎస్సైలు వి.నరేందర్, ఎన్.శ్రీశైలం, మహ్మద్ థకియుద్దీన్, కె.చంద్రమోహన్ వలపన్నారు. బంజారాహిల్స్ ప్రాంతంలో హష్ ఆయిల్ డెలివరీ ఇవ్వడానికి వచ్చిన ముగ్గురినీ పట్టుకున్నారు. వీరి నుంచి 205 చిన్న బాక్సుల్లో ఉన్న 1.02 లీటర్ల హష్ ఆయిల్ స్వాధీనం చేసుకుని కేసును బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. పరారీలో ఉన్న వెంకట్ కోసం గాలిస్తున్నారు. -
పాత ఇల్లు అమ్మకం.. పన్ను రాయితీ పొందడానికి మార్గాలు
దీర్ఘకాలిక మూలధన లాభాలని ఆదాయంగా భావించి పన్నుభారం లెక్కేస్తారు. ఇతర ఆదాయాలలో కలపకుండా, ఈ లాభం మీద ప్రత్యేక రేట్ల ప్రకారం లెక్కలు వేస్తారు. స్పెషల్ రేటు 20 శాతం, సెస్సు అదనం. పన్ను భారం లేకుండా బైటపడాలంటే మరో ఇల్లు కొనండి లేదా నిర్దేశించిన క్యాపిటల్ గెయిన్ బాండ్లలో ఇన్వెస్ట్ చేయండి. కింది పేర్కొన్న ఉదాహరణలు ఒకసారి గమనించండి (డిపార్ట్మెంట్ సౌజన్యంతో).. ∙ఎంత ఇన్వెస్ట్ చేయాలి? కేవలం వ్యవహారంతో ముడిపడ్డ లాభం మాత్రమే ఇన్వెస్ట్ చేయవచ్చు. అమ్మగా వచ్చిన మొత్తం కాదు. ఉదాహరణకు ఇల్లు అమ్మగా వచ్చిన ప్రతిఫలం రూ. 90,00,000 అనుకోండి. లెక్కల ప్రకారం దీనిలో మూలధనం లాభం రూ. 22,00,000 అనుకోండి. కొత్త ఇంటి నిమిత్తం కేవలం రూ. 22 లక్షలు వెచ్చిస్తే సరిపోతుంది. ∙రెండు ఇళ్ల మీద లాభం వెచ్చించవచ్చా? మూలధన లాభాలు రూ. 2 కోట్లకు లోబడి, గడువు తేదీ లోగా రెండు ఇళ్లు కొనుక్కోవచ్చు. అయితే, ఇలా ఒకేసారి రెండు ఇళ్లకు జీవితకాలంలో ఒకసారి మాత్రమే అనుమతిస్తారు. మూలధన లాభం రూ. 2 కోట్లు దాటితే, రెండు ఇళ్లు అనుమతించరు. కొత్తవి రెండు ఇళ్లు ఒకేసారి కొనాలనేమీ లేదు. వెనుకా ముందు అయినా ఫర్వాలేదు. కానీ నిర్దేశించిన గడువు లోపల లావాదేవీ జరగాలి. అంటే 3 సంవత్సరాల లోపు గానీ లేదా ఒక సంవత్సరం ముందు/రెండు సంవత్సరాల లోపు గానీ జరగాలి. ∙మినహాయింపు ఎంత ఇస్తారు? మినహాయింపు మొత్తం మూలధన మొత్తాన్ని దాటదు. మొత్తం మూలధన లాభాలను ఇన్వెస్ట్ చేయాలి. లేదా ఎంత చేస్తే అంతకే మినహాయింపు పరిమితం అవుతుంది. మూలధన లాభం రూ.50,00,000 అనుకోండి.. రూ. 50 లక్షలు పెట్టి ఇల్లు కొంటేనే పూర్తిగా మినహాయింపు లభిస్తుంది. కేవలం రూ.40 లక్షలు పెట్టి కొంటే.. మినహాయింపు కూడా అంతకే పరిమితమవుతుంది. ∙పైన ఉదాహరణకు మరో మార్గం ఉందా? ఇల్లు కొనే బదులు మీరు క్యాపిటల్ బాండ్లలో ఇన్వెస్ట్ చేయొచ్చు. మినహాయింపు ఇస్తారు. రూ. 40,00,000 పెట్టి ఇల్లు కొని మిగతా రూ. 10,00,000 పెట్టి బాండ్లు కొన్నా మీకు పూర్తి మినహాయింపునిస్తారు. ∙గడువు తేదీలోగా ఇల్లు కొనలేకపోతే? ఏవైనా ఇతరత్రా కారణాల వల్ల ఇల్లు కొనలేకపోయినా లేదా కట్టుకోలేకపోయినా గాభరా పడక్కర్లేదు. ఆయా సంవత్సరానికి గాను ఆదాయపు పన్ను రిటర్ను వేసే గడువు తేదీ లోపల మూలధన లాభాన్ని బ్యాంకులో ‘క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్‘లో డిపాజిట్ చేయాలి. ఇలా సకాలంలో డిపాజిట్ చేస్తే ఆ మొత్తం మీద మినహాయింపునిస్తారు. ఆ తర్వాత ఈ మొత్తాన్ని విత్డ్రా చేసి ఈ మొత్తాన్ని సకాలంలో వెచ్చించకపోతే మినహాయింపుని రద్దు చేస్తారు. ∙ఏయే పరిస్థితుల్లో మినహాయింపు పోతుంది? కొత్త ఇంటిని 3 సంవత్సరాల లోపల అమ్మేస్తే ముందు ఇచ్చిన మినహాయింపును రద్దు చేస్తారు. కాబట్టి హోల్డింగ్ పీరియడ్ విషయంలో తగిన జాగ్రత్త వహించాలి. (వచ్చే వారం ఉదాహరణలు చూద్దాం) - కేసీహెచ్ఏవీఎస్ఎన్ మూర్తి, కేవీఎన్ లావణ్య (ట్యాక్సేషన్ నిపుణులు) చదవండి: 75 ఏళ్లు దాటినవారికి ఐటీ రిటర్నుల మినహాయింపు -
కూరగాయలు అమ్ముతున్న ఐఏఎస్ అధికారి.. అసలు నిజం ఇదే!
లక్నో: ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముతున్న ఫోటో గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఉత్తర ప్రదేశ్లోని ఐఏఎస్ అధికారి అఖిలేష్ మిశ్రా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో స్పెషల్ సెక్రటరీగా పనిచేస్తున్నాడు. అయితే ఈయన ఇటీవల రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముతూ ఉన్న ఒక ఫోటోను తన ఫేస్బుక్లో షేర్ చేయడంతో అప్పటి నుంచి ఈ ఫోటో నెట్టింట్టా హల్చల్ చేసింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఒక ఉన్నత అధికారి అయి ఉండి ఇలా సామాన్యుడిలా రోడ్డుపై కూరగాయలమ్మడాన్ని ప్రశంసిస్తున్నారు. ఆయన సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. చదవండి: అదృష్టం వీరికి పిల్లి రూపంలో వచ్చింది ! అయితే తాజాగా ఈ ఫోటోపై సదరు ఐఏఎస్ అధికారి అఖిలేష్ మిశ్రా స్పందించారు.. కూరగాయలు దుకాణం వద్ద కూర్చున్న ఫోటో నిజమే.. కానీ తాను కూరగాయలు అమ్మలేదని, కొనుగోలు చేయడానికి మార్కెట్కు వెళ్లానని స్పష్టం చేశారు. ‘నేను వృత్యిరీత్యా ప్రయాగ్రాజ్కు వెళ్లినప్పుడు, అక్కడ మార్కెట్లో ఆగి కూరగాయలు కొన్నాను. అయితే కూరగాయలు అమ్మే ఓ ముసలామే కాసేపు ఆమె కూరగాయల షాప్ వద్ద కూర్చోవాలని అడిగింది. దీంతో ఏం చెప్పాలో అర్థం కాలేదు. కానీ ఆమె అడిగినదానికి కాదనలేకపోయా. అక్కడే కాసేపు కూర్చున్నాను. ఈ లోగా కొందరు అక్కడికి కూరగాయలు కొనడానికి వచ్చారు. అది చూసిన నా స్నేహితుడు ఫొటో తీసి నా ఫోన్ ద్వారా ఫేస్బుక్లో పెట్టారు. నేను కూడా ఆ ఫోటోను ఈ రోజే చూశాను’ అని అఖిలేశ్ మిశ్రా వివరించారు. చదవండి: పెళ్లిలో వరుడి చెంప చెళ్లుమనిపించిన వధువు.. అంతా షాక్! -
డిసెంబరే టార్గెట్.. ఎయిరిండియాను అమ్మేయడానికే
ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను ఈ ఏడాది డిసెంబర్ నాటికి అమ్మేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (డీఐపీఎఎమ్) ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న ఎయిరిండియా నష్టాలు 2020 మార్చి 31 నాటికి రూ. 70,820 కోట్లకు చేరినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఈ అప్పుల ఊబిలో నుంచి బయటపడేందుకు వ్యూహాత్మక పెట్టుబడుల కోసం బిడ్డింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు డీఐపీఎఎమ్ ప్రతినిధులు వెల్లడించారు. ఇక ఎయిర్ ఇండియాకు వ్యతిరేకంగా న్యూయార్క్ కోర్ట్లో కొనసాగుతున్న విచారణ పెట్టుబడిదారులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, అవసరమైతే బిడ్డర్లకు ప్రభుత్వం హామీ ఇస్తుందని బిజినెస్ టైమ్స్తో డీఐపీఎఎమ్ ప్రతినిధులు చెప్పినట్లు కొన్ని కథనాలు వెలుగులోకి వస్తున్నాయి. కాగా,ఈ బిడ్డింగ్ ప్రక్రియ పూర్తయితే ఈ ఏడాదిలోనే అమ్మేయడం ఖరారైనట్లేనని ఆర్ధిక వేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
గోల్డ్ ఈటీఎఫ్ల్లో అమ్మకాలు
న్యూఢిల్లీ: బంగారం ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్లు) సుదీర్ఘకాలం తర్వాత అమ్మకాల ఒత్తిడిని చూశాయి. 2021 జూలై నెలలో నికరంగా రూ.61 కోట్లను ఇన్వెస్టర్లు వెనక్కి తీసేసుకున్నారు. ఈక్విటీ, డెట్ సాధనాలవైపు పెట్టుబడులను మళ్లించడమే ఇందుకు కారణమని విశ్లేషకుల అభిప్రాయం. అయినప్పటికీ ఫోలియోల సంఖ్య (పెట్టుబడుల గుర్తింపు సంఖ్య) 19.13 లక్షలకు పెరిగింది. జూన్ చివరికి ఫోలియోలు 18.32 లక్షలుగానే ఉన్నాయి. 2019 ఆగస్ట్ నుంచి గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి పెట్టుబడుల రాక సానుకూలంగానే నమోదవుతోంది. 2020 ఫిబ్రవరి, నవంబర్ నెలల్లో మాత్రమే పెట్టుబడులు వరుసగా రూ.195 కోట్లు, రూ.141 కోట్ల చొప్పున వెనక్కి వెళ్లాయి. ఇక ఈ ఏడాది జూన్లో రూ.360 కోట్లు, మే నెలలో రూ.288 కోట్ల చొప్పున బంగారం ఈటీఎఫ్ల్లోకి నికరంగా పెట్టుబడులు రావడం గమనార్హం. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో ఇన్వెస్టర్లు రూ.3,107 కోట్లను గోల్డ్ ఈటీఎఫ్ల్లో పెట్టుబడులుగా పెట్టినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. -
స్టార్టప్స్ విజేతలకు అమెజాన్ బంపర్ ఆఫర్
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా దేశంలోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, స్టార్టప్స్ వ్యాపారాలకు మద్దతుగా నిలుస్తోంది. ప్రారంభ దశలోని స్టార్టప్స్కు సహాయం అందించేందుకు స్టార్టప్ ఇండియా, సిక్వోయా క్యాపిటల్ ఇండియా, ఫైర్సైడ్ వెంచర్స్తో భాగస్వామ్యమై యాక్సిలేటర్ ప్రోగ్రామ్ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నిర్వహించిన అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్ ప్రొఫైల్ స్టార్టప్ యాక్సిలేటర్లో స్లర్ప్ ఫార్మ్, సిరోనా హైజీన్, వెల్బీయింగ్ న్యూట్రీషన్ మూడు స్టార్టప్లను విజేతలుగా ఎంపిక చేసింది. వీటికి 50 వేల డాలర్లు (rs.3,71,2875.00) ఈక్విటీలను గ్రాంట్గా అందించామని అమెజాన్ ఇండియా కంట్రీ హెడ్, గ్లోబల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ అగర్వాల్ తెలిపారు. దేశం ఆర్ధిక స్వావలంబన దిశగా పయనిస్తుందని.. ఈ ప్రయాణంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, స్టార్టప్స్, స్మూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఎగుమతులను పెంచడంలో, మేడిన్ ఇండియా ఉత్పత్తులకు ప్రధాన పాత్ర వహిస్తున్నాయని వివరించారు. చదవండి: హైదరాబాద్ వినియోగదారుల ఫోరంలో ఎస్బీఐకి దెబ్బ -
శిశువులపై శ్రీమతి కన్ను పడితే అంతే
మైసూరు: మైసూరు జిల్లాలో శిశువులను విక్రయిస్తున్న శ్రీమతి అనే మహిళ బాగోతం బయటపడింది. ఎస్పీ చేతన్ గురువారం మీడియాతో మాట్లాడారు. నంజనగూడులో ఇటీవల ఒక చిన్నారి మిస్సయింది. పేద వితంతు మహిళ మూడు నెలల బిడ్డను శ్రీమతి అనే మహిళ మాయమాటలు చెప్పి తీసుకెళ్లింది. ఈమె పేదలు, యాచకులను కలిసి మీ పిల్లలను తన వద్ద ఉన్న ఆశ్రమంలో చదివించి మంచిగా చూసుకుంటానని తీసుకుని వెళ్లి పిల్లలు లేనివారికి డబ్బులకు విక్రయించేది. ఇటీవల ఒక చిన్నారిని తీసుకెళ్లి రూ. 3 లక్షలకు అమ్మేసిందని ఎస్పీ తెలిపారు. ప్రస్తుతం పోలీసులు శ్రీమతి కోసం గాలిస్తున్నారని, అతి త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. -
బెస్ట్ స్టూడెంట్.. జామకాయలు అమ్ముతూ..
సాక్షి, సుందరయ్య విజ్ఞానకేంద్రం (హైదరాబాద్): ఆమె ఉన్నతమైన కుటుంబంలో పుట్టింది. నీట్లో మంచి ర్యాంక్ సాధించింది. అయినా... తమ తోటలో పండే ఆర్గానిక్ జామకాయలను విక్రయిస్తూ ఆదర్శంగా నిలిచింది. ఉస్మానియా మెడికల్ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ మాచర్ల రామన్న బర్కత్పురలో నివాసముంటున్నారు. ఈయన కూతురు అశ్రిత. తల్లి టాటా కన్సల్టెన్సీలో ఉద్యోగం చేస్తుంది. డబ్బుకు ఎలాంటి లోటు లేదు అయినప్పటికి అశ్రిత ఏ విధమైన బిడియం లేకుండా బాగ్లింగంపల్లిలోని సుందరయ్యపార్కు ముందు ఆర్గానిక్ జామకాయలు విక్రయిస్తూ ఆదర్శంగా నిలుస్తుంది. అశ్రిత ఇటీవల వెలుపడ్డ నీట్ పరీక్షా ఫలితాల్లో 843వ ర్యాంక్ సాధించి శభాష్ అనిపించుకుంది. ఎటువంటి బిడియం లేకుండా పార్కుల ముందు తమతోటలో కాసే జామకాయలను విక్రయిస్తూ మన్నన పొందుతోంది. రోజూ ఏదో ఒక పార్కు ముందు జామకాయలను విక్రయిస్తోంది. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అశ్రితకు ప్రత్యేకంగా ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. చదవండి: నీట్ స్టేట్ ర్యాంకులు విడుదల -
అమ్మకాల దెబ్బ- మార్కెట్లు బేర్
తొలి నుంచీ ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యత ఇవ్వడంతో దేశీ స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి. సెన్సెక్స్ 540 పాయింట్లు కోల్పోయి 40,145 వద్ద ముగిసింది. నిఫ్టీ 162 పాయింట్లకు నీళ్లొదులుకుని 11,768 వద్ద నిలిచింది. మిడ్సెషన్కల్లా అమ్మకాలు ఊపందుకోవడంతో సెన్సెక్స్ 40,000 పాయింట్ల మార్క్ దిగువకు చేరింది. 39,,948ను తాకింది. ట్రేడింగ్ ప్రారంభంలో సాధించిన 40,724 పాయింట్లే ఇంట్రాడే గరిష్టంకాగా.. నిఫ్టీ సైతం ఒక దశలో 11,712 పాయింట్ల దిగువకు చేరింది. తొలుత 11,943 పాయింట్ల వద్ద ఇంట్రాడే గరిష్టం నమోదైంది. ఫ్యూచర్ గ్రూప్, ఆర్ఐఎల్ డీల్కు చెక్ పడటం, గురువారం ఎఫ్అండ్వో ముగింపు వంటి అంశాలు సెంటిమెంటును బలహీనపరచినట్లు నిపుణులు పేర్కొన్నారు. అమ్మకాల తీవ్రత ఎన్ఎస్ఈలో ఎఫ్ఎంసీజీ మినహా మిగిలిన రంగాలన్నీ 3.5-1 శాతం మధ్య డీలాపడ్డాయి. ప్రధానంగా మెటల్, ఆటో, మీడియా, రియల్టీ 3.5-2 శాతం మధ్య నష్టపోయాయి. నిఫ్టీ దిగ్గజాలలో హీరో మోటో, బజాజ్ ఆటో, హిందాల్కో, ఎంఅండ్ఎం, జేఎస్డబ్లూ స్టీల్, యూపీఎల్, టాటా స్టీల్, ఆర్ఐఎల్, టెక్ మహీంద్రా, ఐషర్, ఎస్బీఐ, యాక్సిస్, ఐసీఐసీఐ, కోల్ ఇండియా, సన్ఫార్మా, బజాజ్ ఫిన్ 7- 2 శాతం మధ్య క్షీణించాయి. ఇతర కౌంటర్లలో హెచ్డీఎఫ్సీ లైఫ్, నెస్లే, కొటక్ బ్యాంక్, ఇండస్ఇండ్, ఎస్బీఐ లైఫ్, ఎల్అండ్టీ, పవర్గ్రిడ్, హెచ్యూఎల్, హెచ్డీఎఫ్సీ 3.2- 0.5 శాతం మధ్య బలపడ్డాయి. కోఫోర్జ్ డౌన్ డెరివేటివ్ కౌంటర్లలో కోఫోర్జ్, జిందాల్ స్టీల్, మణప్పురం, హెచ్పీసీఎల్, సెయిల్, పీవీఆర్, రామ్కో సిమెంట్, జీఎంఆర్, టీవీఎస్ మోటర్, అశోక్ లేలాండ్, నౌకరీ, బయోకాన్ 8- 4 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. మరోవైపు పీఎన్బీ, భెల్, టాటా కన్జూమర్, ఎల్అండ్టీ ఫైనాన్స్, ఐబీ హౌసింగ్ మాత్రమే అదికూడా 2-0.3 శాతం మధ్య పుంజుకున్నాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 2-1 శాతం మధ్య నీరసించాయి. ట్రేడైన షేర్లలో 1,683 నష్టపోగా.. 998 లాభాలతో నిలిచాయి. ఎఫ్పీఐల కొనుగోళ్లు నగదు విభాగంలో వారాంతాన విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 907 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 892 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించాయి. గురువారం ఎఫ్పీఐలు రూ. 1,118 కోట్లకుపైగా విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 2,020 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే -
సింగపూర్ సూపర్ పెంటహౌజ్ అమ్మకం
కౌలాలంపూర్: సింగపూర్లోనే అంత్యంత ఎత్తైన, ఖరీదైన మూడు అంతస్తుల భవన పెంటహౌజ్ను బ్రిటిష్ బిలియనీర్ జేమ్స్ డైసన్ ఆయన భార్య అమ్మకానికి పెట్టారు. బ్యాగ్లెస్ వ్యక్యూమ్ క్లీనర్ ఆవిష్కకర్తే జెమ్స్ డైసన్. అంత్యంత ఖరీదైన భవనానం పెంటహౌజ్ను డైసన్ గతేడాది 74 మిలియన్సింపూర్ డాలర్(యుఎస్ డాలర్. 54 మిలియన్)లకు కొనుగొలు చేశారు. అయితే ఈ పెంటహౌజ్ను డైసన్ 62 మిలియన్ల సింగపూర్ డాలర్కు ఆమెరికాకు చెందిన వ్యాపారవేత్తకు అమ్ముతున్నట్లు డైసన్ సంస్థ ప్రతినిధి అక్కడి మీడియాకు వెల్లడించారు. (చదవండి: నెటిజన్లను ఆశ్చర్యంలో ముంచెత్తిన వీడియో) అయితే దీనిని డైసన్ కొనుగొలు చేసిన దానికంటే 15 శాతం నష్టానికి అమ్ముతున్నట్లు ఆయన చెప్పారు. ఈ పెంట్హౌజ్ను ఇండోనేషియాకు చెందిన అమెరికా పౌరుడు లియో కొగువాన్ కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. లియో కొగువాన్ అమెరికా ఇన్పోటెక్ ప్రోవైడర్, ఎస్హెచ్ఐ ఇంటర్నేషనల్ చైర్మన్, సహా వ్యవస్థాపకుడు. టాంజోంగ్ పగర్ సెంటర్, ఐదు పడక గదులతో సూపర్ పెంట్ హౌజ్గా పేదొందిన ఈ భవనం విలువ ఒకప్పుడు 100 మిలియన్ యుఎస్ డాలర్గా ఉండేది. ఈ సూపర్ పెంటహౌజ్లో అతిపెద్ద స్విమ్మింగ్ పూల్, జాకుజీతో పాటు విలాసవంతమైన ప్రైవేటు గార్డెన్ ఉంది. (చదవండి: ట్రంప్కు షాకిచ్చిన ట్విట్టర్) -
మార్కెట్లపై అమ్మకాల పిడుగు
టెక్ దిగ్గజాలలో వెల్లువెత్తిన అమ్మకాలతో గురువారం యూఎస్ మార్కెట్లు పతనంకాగా.. దేశీయంగానూ సెంటిమెంటుకు షాక్ తగిలింది. ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఎగబడటంతో దేశీ స్టాక్ మార్కెట్లు సైతం కుప్పకూలాయి. సెన్సెక్స్ 655 పాయింట్లు పడిపోయి 38,336కు చేరగా.. నిఫ్టీ 191 పాయింట్లు కోల్పోయి 11,337 వద్ద ట్రేడవుతోంది. ఇటీవల ఆకాశమే హద్దుగా సరికొత్త రికార్డులను తాకుతున్న అమెరికా టెక్నాలజీ స్టాక్స్లో ట్రేడర్లు లాభాల స్వీకరణకు తెరతీసినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ప్రభావం దేశీయంగానూ కనిపిస్తున్నట్లు తెలియజేశారు. నేలచూపులతో ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ 2.5-1 శాతం మధ్య డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇన్ప్రాటెల్, బ్రిటానియా మాత్రమే అదికూడా 1 శాతం స్థాయిలో బలపడ్డాయి. ఇతర బ్లూచిప్స్లో జీ, ఐసీఐసీఐ, హిందాల్కో, ఎస్బీఐ, కొటక్ బ్యాంక్, ఇండస్ఇండ్, యాక్సిస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, బజాజ్ ఫిన్, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ లైఫ్, బజాజ్ ఫైనాన్స్, గ్రాసిమ్, ఐషర్, అదానీ పోర్ట్స్, హెచ్సీఎల్ టెక్, విప్రో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా మోటార్స్ తదితరాలు 3-1.5 శాతం మధ్య నష్టపోయాయి. ఒక్కటి మాత్రమే డెరివేటివ్స్లోనూ టొరంట్ ఫార్మా 0.2 శాతం బలపడగా.. ఐసీఐసీఐ ప్రు, చోళమండలం, ఐడియా, ఆర్బీఎల్ బ్యాంక్, ఎన్ఎండీసీ, పేజ్, అదానీ ఎంటర్, మ్యాక్స్ ఫైనాన్స్, ఐబీ హౌసింగ్, సెయిల్, ఫెడరల్ బ్యాంక్, శ్రీరామ్ ట్రాన్స్, భెల్, డీఎల్ఎఫ్ 5-3 శాతం మధ్య పతనమయ్యాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 2 శాతం చొప్పున నీరసించాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1380 నష్టపోగా.. 363 మాత్రమే లాభాలతో కదులుతున్నాయి. -
ఈ మిడ్ క్యాప్ షేర్లకూ అమ్మకాల సెగ
భారీ లాభాలతో హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు తదుపరి అమ్మకాల పిడుగు పడటంతో ఒక్కసారిగా కుప్పకూలాయి. వెరసి భారీ నష్టాలతో కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని మిడ్ క్యాప్ కౌంటర్లలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు క్యూ కట్టారు. దీంతో నవీన్ ఫ్లోరిన్ ఇంటర్నేషనల్, సిటీ యూనియన్ బ్యాంక్, దీపక్ నైట్రైట్, ప్రిజమ్ జాన్సన్, లా ఒపాలా ఆర్జీ.. పతన బాటలో సాగుతున్నాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్ పరిమాణం సైతం పెరిగింది. వివరాలు చూద్దాం.. నవీన్ ఫ్లోరిన్ ఇంటర్నేషనల్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 9 శాతం కుప్పకూలి రూ. 1950 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1883 వరకూ జారింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 13,500 షేర్లుకాగా.. ఈ కౌంటర్లో మిడ్సెషన్కల్లా 15,000 షేర్లు చేతులు మారాయి. సిటీ యూనియన్ బ్యాంక్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 10 శాతం పతనమై రూ. 135 దిగువన ట్రేడవుతోంది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 1.42 లక్షల షేర్లుకాగా.. ఈ కౌంటర్లో మిడ్సెషన్కల్లా 5.85 లక్షల షేర్లు చేతులు మారాయి. దీపక్ నైట్రైట్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 10 శాతంపైగా దిగజారి రూ. 671 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 1.59 లక్షల షేర్లుకాగా.. ఈ కౌంటర్లో మిడ్సెషన్కల్లా 1.25 లక్షల షేర్లు చేతులు మారాయి. ప్రిజమ్ జాన్సన్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 9 శాతం పడిపోయి రూ. 52 దిగువన ట్రేడవుతోంది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 48,000 షేర్లుకాగా.. మిడ్సెషన్కల్లా ఈ కౌంటర్లో 1.02 లక్షల షేర్లు చేతులు మారాయి. లా ఒపాలా ఆర్జీ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 9 శాతం కోల్పోయి రూ. 205 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 27,000 షేర్లుకాగా.. ఈ కౌంటర్లో మిడ్సెషన్కల్లా 23,000 షేర్లు చేతులు మారాయి. -
ఆస్పత్రి మాటున అరాచకం
సాక్షి, విశాఖపట్నం: వి.మాడుగుల మండలం కానికారమాత కాలనీకి చెందిన ముప్ఫై నాలుగేళ్ల వయసు గల మహిళ భర్త చనిపోయాడు. మరొకరితో వివాహేతర సంబంధం కారణంగా ఆమె గర్భం దాల్చింది.విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆమెను మందలించారు. ఈ వ్యవహారం ఆశా కార్యకర్తలు కోడి వెంకటలక్ష్మి, బొట్టా అన్నపూర్ణకు తెలిసింది. ఇంకే ముంది వారు ఏజెంట్ అర్జిరామకృష్ణకు సమాచారం ఇచ్చారు. తర్వాత వీరు ముగ్గురూ సుందరమ్మను కలిసి ఉచితంగా డెలివరీ చేయిస్తామని, పసికందును ఇచ్చేస్తే కొంత డబ్బు కూడా ఇస్తామని నమ్మించారు. దీనికి సుందరమ్మ అంగీకరించడంతో ఆమెను జిల్లా పరిషత్ ప్రాంతంలో ఉన్న యూనివర్సల్ సృష్టి ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఆ ఆస్పత్రిలో సుందరమ్మ మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆమెను డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించేశారు. ఆస్పత్రి ఎండీ పచ్చిపాల నమ్రత ఆ బిడ్డను పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన వారికి విక్రయించారు. చైల్డ్లైన్కు ఫిర్యాదుతో విషయం వెలుగులోకి మహిళ గర్భవతిగా ఉన్న సమయంలో అంగన్వాడీ నుంచి పౌష్టికాహారం పొందేది. అక్కడ అంగన్వాడీ టీచర్ గుంటు సరోజిని ఆ మహిళ డెలివరీ విషయాన్ని తెలుసుకొని బిడ్డ విషయాన్ని అడిగింది. అందుకు ఆమె సరైన సమాధానం చెప్పకపోవడంతో అంగన్వాడీ టీచర్కు అనుమానం వచ్చి ఈ ఏడాది మార్చి 14న చైల్డ్లైన్కు సమాచారం అందించింది. దీనిపై చైల్డ్లైన్ సిబ్బంది విచారణ చేపట్టడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ముఠా సభ్యులు విక్రయించిన పసికందును మార్చి 20న వెనక్కి తీసుకువచ్చారు. చైల్డ్లైన్ సిబ్బంది బేబీని శిశుగృహలో చేర్పించి విషయాన్ని పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు జరిగిన విషయంపై దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో ప్రస్తుత కేసుతో పాటు అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆస్పత్రి ముసుగులో పసిపిల్లల విక్రయాలు : సీపీ ఆర్కే మీనా చైల్డ్లైన్ నుంచి వచ్చిన సమాచారం మేరకు విచారణ చేపడితే చాలా అక్రమాలు వెలుగులోకి వచ్చాయని సీపీ ఆర్కే మీనా చెప్పారు. ఆదివారం మీడియా సమావేశంలో సీపీ మీనా పూర్తి వివరాలు వెల్లడించారు. పిల్లలను విక్రయిస్తున్న యూనివర్సల్ సృష్టి ఆస్పత్రి ఎండీ పచ్చిపాల నమ్రతతో పాటు ఓ డాక్టర్, ఇద్దరు ఆశా వర్కర్లను, వారికి సహకరించిన ఇద్దరు వ్యక్తులను, పసిబిడ్డను కొనుగోలు చేసిన పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన ఇద్దరితో కలిపి 8 మందిని అరెస్టు చేసినట్టు చెప్పారు. ఆస్పత్రి ఎండీ డాక్టర్ పచ్చిపాల నమ్రతతో పాటు ఆశా వర్కర్లు కోడి వెంకటలక్ష్మి, బొట్టా అన్నపూర్ణ ఏ2, ఏ3లుగా, ఏజెంట్గా వ్యవహరించిన అర్జి రామకృష్ణను ఏ4గా, ఆస్పత్రి ఎండీ దగ్గర పనిచేస్తున్న వైద్యురాలు తిరుమలను ఏ5గా, ఎండీ దగ్గర పనిచేస్తున్న లోపింటి చంద్రమోహన్ను ఏ6గా, పసికందును కొనుగోలు చేసిన పశ్చిమబెంగాల్కు చెందిన ఇద్దరిని ఏ7, ఏ8గా గుర్తించి అరెస్టు చేసినట్లు తెలిపారు. ఆస్పత్రి ఎండీపై ఇప్పటికే రెండు కేసులు డాక్టర్ పచ్చిపాల నమ్రత జిల్లా పరిషత్ ప్రాంతంలో సృష్టి టెస్ట్ట్యూబ్ బేబీ సెంటర్ను ప్రారంభించారు. పసిపిల్లలను విక్రయించడం, ఇతరత్రా విషయాలపై ఆమెపై 2018లో రెండు కేసులు నమోదయ్యాయి. దీంతో ఆస్పత్రి పేరును యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ అండ్ రీసెర్చ్ సెంటర్గా మార్చారు. ఆ తర్వాత హైదరాబాద్, విజయవాడ, భువనేశ్వర్, కోల్కతాలో నాలుగు బ్రాంచ్లు ప్రారంభించారు. ఆస్పత్రి ఎండీ నమ్రత విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోనే కాకుండా ఒడిశా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తుండేవారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న ఆశా వర్కర్ల ద్వారా పేద బాలింతలు, అక్రమ సంబంధాల ద్వారా కలిగే గర్భవతుల వివరాలను తెలుసుకునే వారు. ఆశా వర్కర్లనే ఆ బాలింతల దగ్గరకు వెళ్లి ఉచితంగా డెలివరీ చేయిస్తామని, ఆ బిడ్డలను ఆస్పత్రికి ఇచ్చేస్తే కొంత డబ్బు కూడా ఇప్పిస్తామని నమ్మిస్తున్నారు. ఇలా గ్రామీణ ప్రాంతాల్లో డాక్టర్ నమ్రత తన నెట్వర్క్ను విస్తరించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన బాలింతలకు డెలివరీ చేసి ఆ పసికందులను డబ్బున్న వారికి విక్రయించడాన్ని వ్యాపారంగా మార్చుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా కొనుగోలు చేసిన వారు తల్లిదండ్రులుగా, తమ ఆస్పత్రిలోనే డెలివరీ అయిన విధంగా ఆ పసికందుల డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లను సైతం ఇప్పిస్తూ వస్తున్నారు. ఇదే విధంగా వి.మాడుగుల మండలం కానికారమాత కాలనీకి చెందిన మహిళను కూడా నమ్మించి మార్చి 9న ఆస్పత్రిలో చేర్పించారు. అదే రోజు ఆమె మగబిడ్డను జన్మనివ్వడంతో ఆ పసికందును పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన దంపతులకు విక్రయించారు. ఈస్ట్ ఏసీపీ కులశేఖర్ పర్యవేక్షణలో మహారాణిపేట సీఐ జి.సోమశేఖర్, గాజువాక క్రైం సీఐ పి.సూర్యనారాయణ, హార్బర్ సీఐ ఎం.అవతారం, మహారాణిపేట ఎస్ఐ పి.రమేష్ ఈ కేసు దర్యాప్తులో పాల్గొన్నారు. -
కూరలమ్ముకుంటున్న బాలీవుడ్ నటుడు
భువనేశ్వర్: కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా కార్మికులనుంచి,సెలబ్రిటీలదాకా అందరినీ సంక్షోభంలో పడేసింది. ప్రధానంగా సినీపరిశ్రమ దాదాపుగా మూత పడిన పరిస్థితుల్లో ఒడిశాకు చెందిన బాలీవుడ్ నటుడు కార్తికా సాహూ బాధితుడిగా మారారు. నిర్మాణ కార్యక్రమాలు ఆగిపోవడం, చాలా ప్రొడక్షన్స్ నిలిచిపోవంతో కూరగాయాలను అమ్ముకుంటూ జీవనం సాగించాల్సి పరిస్థితి ఏర్పడింది. (ఆ కథనంపై చలించిన సోనూసూద్) ఒడిశా కేంద్రాపాడ జిల్లాలోని గరద్పూర్కు చెందిన సాహూ 17 సంవత్సరాల వయసులో 2014లో బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ముంబై వెళ్ళాడు. కొన్నాళ్లు అమితాబ్ బచ్చన్, సచిన్ టెండూల్కర్ లాంటి ప్రముఖులకు బాడీగార్డ్గా పనిచేశాడు చివరకు 2018లో అతని కల సాకారమైంది. మెల్లిగా అవకాశాలు రావడం మొదలైంది. కానీ ఇంతలోనే కరోనా, లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డాడు. చాలా సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలలో గుర్తించదగిన పాత్రలను పోషించాననీ, ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్తో రాబోయే చిత్రం 'సూర్యవంశి'లో ఫైట్ సీక్వెన్స్ కూడా ఉందని సాహూ చెప్పు కొచ్చారు. దేశవ్యాప్త లాక్డౌన్కు ముందు జైపూర్లో ఒక షూటింగ్లో పాల్గొన్నానని, ఇక ఆ తరువాత పని దొరకకపోవడంతో ఒడిశాలోని ఇంటికి తిరిగి చేరుకున్నానని తెలిపాడు. అప్పటినుంచీ పొదుపు చేసిన డబ్బులతో కుటుంబాన్ని పోషించానని వెల్లడించాడు. ముఖ్యంగా మెడికల్ ఎమర్జీన్సీకి చాలా డబ్బు ఖర్చయిపోయిందని వాపోయాడు. చివరికి రాజధాని నగరం భువనేశ్వర్కు వెళ్లినా ప్రయోజనం లేకపోవడంతో కూరగాయల విక్రయం ద్వారా పొట్ట పోషించుకుంటున్నామన్నాడు. అయితే పరిస్థితులు చక్కబడిన తరువాత మళ్లీ బాలీవుడ్లోతనకు అవకాశాలు తప్పక లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశాడు. అప్పటి వరకు మనుగడ కోసం కష్టపడక తప్పదని సాహు పేర్కొన్నాడు. -
గాలిగాళ్ల దోపిడీ
-
రూ.75కే మీడియా సంస్థ అమ్మకం!
వెల్లింగ్టన్: కరోనా మహమ్మారి దెబ్బకు రెవెన్యూ పడిపోయి మీడియా సంస్థలు కుదేలవుతున్నాయి. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ ‘స్టఫ్’. ఎన్నో జాతీయ దినపత్రికలను ప్రచురిస్తూ, స్టఫ్ పేరుతోనే ఎంతో ప్రజాదరణ కలిగిన వెబ్సైట్ను నిర్వహిస్తున్న ఈ సంస్థను.. కేవలం డాలర్కే (మన రూపాయిల్లో రూ.75) కంపెనీ సీఈవో సినేడ్ బౌచర్కు విక్రయిస్తున్నట్టు మాతృ సంస్థ నైన్ ఎంటర్టైన్మెంట్ ప్రకటించింది. ఈ డీల్ ఈ నెలాఖరుకు పూర్తవుతుందని ఆస్ట్రేలియన్ స్టాక్ మార్కెట్కు తెలియజేసింది. స్టఫ్లో 400 జర్నలిస్టులు సహా 900 మంది పనిచేస్తున్నారు. ప్రకటనల ఆదాయం పడిపోవడంతో స్టఫ్ ఆర్థికంగా కష్టాలను ఎదుర్కొంటున్న క్రమంలో ఈ డీల్ చోటు చేసుకుంది. -
తిరుమల వెంకన్నకు మేం సేవకులమే: వైవీ సుబ్బారెడ్డి
-
పీఏసీఎల్ : ప్రముఖ గాయకుడికి సెబీ షాక్
సాక్షి, ముంబై: ప్రముఖగాయకుడు సోనూ నిగమ్కు మార్కెట్ రెగ్యులేటరీ సెబీ భారీ షాక్ ఇచ్చింది. వివాదాస్ప సంస్థ పెరల్స్ ఆగ్రోటెక్ కార్పొరేషన లిమిటెడ్ (పీఏసీఎల్) నుంచి కొనుగోలు చేసిన ముంబైకి 62 కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్జాత్లో నిగమ్ ఫామ్హౌస్ విక్రయంపై నిషేధం విధించింది. అలాగే గత 18 సంవత్సరాలుగా సమిష్టి పెట్టుబడి పథకాల ద్వారా పెట్టుబడిదారుల నుండి అక్రమంగా రూ .60,000 కోట్లకు పైగా వసూలు చేసిన పీఏసీఎల్పై సెబీ అనేక ఆంక్షలు విధించింది. ఆస్తుల విక్రయం, బదిలీలకు అనుమతిని నిరాకరించింది. మహారాష్ట్రలోని కర్జాత్ ప్రాంతంలోని వ్యవసాయ భూముల విక్రయాన్ని లేదా బదిలీ చేయడాన్ని అడ్డుకుంటూ సెబీ ఉత్తర్వులు జారీచేసింది. అలాగే సోనూ నిగంతోపాటు వైటల్ సీ మార్కెటింగ్కు చెందిన స్థిర, చర ఆస్తుల పూర్తి వివరాలను రెండు వారాల్లో అందించాలని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) మార్చి 9 తేదీన ఆదేశించింది. పీఏసీఎల్ ఆస్తులను విక్రయించడానికి మరియు అమ్మకపు ఆదాయాన్ని పెట్టుబడిదారులకు తిరిగి చెల్లించడానికి అప్పగించిన పీఏసీఎల్ కమిటీకి, జనవరి 15, 2018న ఫాం హౌస్ను సోనూ నిగమ్ కొనుగోలు చేసిన వివరాలపై కమిటీకి తెలియజేస్తూ జాన్ కల్యాణ్ ట్రస్ట్ ఏప్రిల్ 2018 లో ఒక లేఖ రాసింది. పీఏసీఎల్ అనుబంధ సంస్ధ వైటల్ సీ మార్కెటింగ్ నుంచి కొనుగోలు చేసినట్టు తెలిపింది. అయితే 99 శాతానికి పైగా మూలధనం వాటా నేరుగా దాని 21 అసోసియేట్ కంపెనీలు నియంత్రిస్తాయని పీఏసీఎల్ 2018 మేలో ప్రత్ర్యేక కమిటీకి అందించిన సమాచారంలో తెలిపింది. దీని ప్రకారం, తమ అసోసియేట్ సంస్థ వైటల్ సీ మార్కెటింగ్ ఆస్తులను ఎటాచ్ చేయాలని సెబీని కోరింది. కాగా వ్యవసాయం, రియల్ ఎస్టేట్ వ్యాపారాల పేరిట ప్రజల నుంచి పీఏసీఎల్ అక్రమంగా రూ. 60వేల కోట్లు సమీకరించిందని తేలిన నేపథ్యంలో ఆగస్టు 22, 2014 నాటి ఉత్తర్వులలో డబ్బును తిరిగి చెల్లించాలని పీఏసీఎల్, దాని ప్రమోటర్లు డైరెక్టర్లను సెబీ ఆదేశించింది. అయితే డబ్బు తిరిగి చెల్లించడంలో విఫలమైనందుకు పీఏసీఎల్, దాని తొమ్మిదిమంది ప్రమోటర్లు, డైరెక్టర్ల అన్ని ఆస్తులను అటాచ్ చేయాలని 2015 డిసెంబర్లో ఆదేశించింది. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు కూడా సంస్థ ఆస్తులను విక్రయించి ఆ నిధులను ఇన్వెస్టర్లకు తిరిగి చెల్లించాలంటూ ఆదేశించింది. ఇందుకోసం రిటైర్డ్ జస్టిస్ ఆర్ఎం లోధా సారథ్యంలో సెబీ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి సంగతి తెలిసిందే. చదవండి: డెక్కన్ క్రానికల్ చైర్మన్పై సెబీ నిషేధం -
కూలిన మార్కెట్, 12వేల దిగువకు నిఫ్టీ
సాక్షి, ముంబై: అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలకు తోడు, కరోనా భయాలతో దేశీయంగా అమ్మకాల వెల్లువతో కీలక సూచీ సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా కుప్పకూలింది. అటు మరోకీలక సూచీ నిఫ్టీ కూడా ప్రధాన మద్దతు స్థాయి 12000 దిగువకు చేరింది. ప్రస్తుతం సెన్సెక్స్ 337 పాయింట్లుపతనమై 40715 వద్ద, నిఫ్టీ 111 పాయింట్లు నష్టపోయి 11935 వద్ద కొనసాగుతోంది. దాదాపు అన్ని రంగాలు నష్ట పోతున్నాయి. భారతి ఇన్ఫ్రాటెల్, యస్ బ్యాంకు, టాటా మోటార్స్, ఇండస్ఇండ్ బ్యాంకు, భారతి ఎయిర్టెల్, హిందాల్కో, ఓఎన్జీసీ టాప్ లూజర్స్గా కొనసాగుతున్నాయి. మరోవైపు బీపీసీఎల్, జీ ఎంటర్ టైన్మెంట, కోల్ ఇండియా, ఇన్ఫోసిస్, ఐషర్ మోటార్స్, గెయిల్, టీసీఎస్ లాభపడుతున్నాయి.ఆఖరి గంట ట్రేడింగ్ కీలకం కానుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండస్ ఇండ్ బ్యాంక్, యస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ నష్టాలతో నిఫ్టీ బ్యాంకు 1.38 శాతం నష్టపోయింది. అలాగే సర్దుబాటు చేసిన స్థూల రాబడి (ఎజిఆర్) బకాయిలను టెలి కమ్యూనికేషన్ విభాగానికి (డాట్) కొంత చెల్లింపులు చేశాయి. అయినా ఇన్వెస్టర్ల ఆందోళన నేపథ్యంలో వోడాఫోన్ ఐడియా 15 శాతం కుప్పకూలగా, భారతి ఎయిర్టెల్ 4 శాతం నష్టంతో కొనసాగుతోంది. కాగా చైనాలో వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ దాదాపు 1900 మందిని బలితీసుకోగా, 72వేలమందికి ఈ వ్యాధి సోకింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కొనసాగుతోంది. దీనికి తోడు నూతన సంవత్సర సెలవు విరామం తర్వాత కర్మాగారాలు తిరిగి ప్రారంభించడంలో ఆలస్యం కావడంతో అంతర్జాతీయంగా సెంటిమెంట్ దెబ్బతింది. మరోవైపు ఈ వారం ట్రేడింగ్ 4 రోజులే కొనసాగనుంది. శివరాత్రి సందర్భంగా శుక్రవారం మార్కెట్లకు సెలవు కావడం గమనార్హం. చదవండి : వేలాడుతున్న హెచ్1బీ కత్తి! -
మూఢ నమ్మకాలు..వన్యప్రాణుల అమ్మకాలు
సాక్షి, హైదరాబాద్: అరుదైన వన్యప్రాణులను ఈశాన్య రాష్ట్రాల నుంచి తీసుకువచ్చి పాతబస్తీ కేంద్రంగా అక్రమంగా విక్రయిస్తున్న ఇద్దరు అన్నదమ్ముల గుట్టును దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. నిందితుడి నుంచి 4 స్లోలోరిస్లతో పాటు నక్షత్ర తాబేలు, మరో అరుదైన తాబేలును స్వాధీనం చేసుకున్నామని అదనపు డీసీపీ చక్రవర్తి గుమ్మి ఆదివారం వెల్లడించారు. కేసును అధీనంలోకి తీసుకున్న అటవీ శాఖ అధికారులు వివిధ కోణాల్లో ఆరా తీస్తున్నారు. పాతబస్తీలోని బార్కస్కు చెందిన అన్నదమ్ములు సాలెహ్ బిన్ మహ్మద్ బదామ్, అలీ బిన్ మహ్మద్ బదామ్ మందుల షాపు నిర్వహిస్తున్నారు. ఈ ఆదాయం చాలకపోవడంతో అదనపు రాబడి మార్గాలు అన్వేషించారు. ఏడాది క్రితం పావురాల అమ్మకం మొదలెట్టారు. ఆపై కొన్ని రకాలైన పిల్లులు, కోళ్లను విక్రయించేవారు. వీరి వద్దకు వచ్చే కస్టమర్లలో అనేకులు అరుదైన జంతువులు కావాలని కోరడంతో వీరి దృష్టి వాటిపై పడింది. ఈశాన్య రాష్ట్రాల నుంచి తెచ్చి.. కొందరు కస్టమర్లలో ఉన్న మూఢనమ్మకాల నేపథ్యంలో కొన్ని అరుదైన జంతువులకు నగరంలో డిమాండ్ ఉందని అలీ బిన్ గుర్తించాడు. ఈశాన్య రాష్ట్రాల్లో దొరికే వాటిని అక్రమ మార్గంలో తెచ్చి విక్రయించడం ద్వారా తేలిగ్గా భారీ మొత్తం సంపాదించవచ్చని అన్నదమ్ములు పథకం వేశారు. అలీ బిన్ ఈశాన్య రాష్ట్రాల్లో జంతువులను స్మగ్లింగ్ చేసే వారిని సంప్రదించాడు. వారి సహకారం తో ప్రైవేట్ వాహ నాల్లో వాటిని సిటీకి తీసుకు వస్తున్నాడు. వీటిని కొన్నాళ్ల పాటు తమ ‘కబూతర్ ఖానా’లోనే ఉంచి ఆపై కోరిన వారికి మూడు రెట్ల ధరకు అమ్ముతున్నారు. వీరి దందాపై సమాచారం అందుకున్న దక్షిణ మండల టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్.రాఘవేంద్ర నేతృత్వంలో సిబ్బంది నిందితుల ఇంటిపై దాడి చేశారు. సాలెహ్ బిన్ను అదుపులోకి తీసుకుని నాలుగు స్లో లోరిస్లు, స్టార్ తాబేలు, డొప్ప తాబేలును స్వాధీ నం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం జంతువులతో సహా నిందితుడిని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. పరారీలో ఉన్న అలీ బిన్ చిక్కితే ఈ కేసులో కీలకాంశాలు వెలుగులోకి రావచ్చు. స్లో లోరిస్.. రూ.50 వేలు లోరిస్కు చెందిన కొన్ని అవయవాలను సంప్రదాయ వైద్యంలో ఔషధాల తయారీకి వాడుతున్నారు. దీని మాంసం తింటే పటుత్వం పెరుగుతుందని, సజీవంగా తమ ప్రాంగణంలో పాతి పెడితే అదృష్టం పడుతుందనే మూఢనమ్మకాలున్నాయి. ►క్షీరదాల జాతికి చెందిన స్లో లోరిస్ జంతువు నిశాచరి. నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్క్లో కూడా ఇది లేదు. ఇవి ఈశాన్య రాష్ట్రాలతోపాటు బంగ్లాదేశ్, ఇండోనేసియా, ఫిలిప్పీన్స్లో ఉంటాయి. ►శాకాహారి అయిన స్లో లోరిస్ చెట్లపై నివసిస్తూ బొప్పాయి సహా కొన్ని రకాలైన పళ్లను తింటుంది. దీనికి ఆహారం నిమిత్తం రోజుకు రూ.300 వరకు వెచ్చిస్తున్నారు. ►దీనిని రూ.15 వేలకు ఖరీదు చేసి రూ.50 వేలకు అలీ సోదరులు విక్రయిస్తున్నారు. నక్షత్ర తాబేలు రూ.40 వేలు.. స్టార్ టార్టాయిస్ ఇంట్లో ఉంచుకున్నా, పెంచుకున్నా భవిష్యత్తు బాగుంటుందని, అదృష్టం వరిస్తుందనే నమ్మకం ఉంది. మెత్తడి డొప్ప తాబేలు ఇంట్లో ఉంటే అదృష్టం వరిస్తుందని నమ్మకం పలువురిలో ఉంది. ►స్టార్ టార్టాయిస్గా పిలిచే నక్షత్ర తాబేళ్లు పొడి ప్రాంతాలు, కొన్ని అడవుల్లో జీవిస్తుంటాయి. ఇవి భారీ సంఖ్యలో విదేశాలకు స్మగ్లింగ్ అవుతుంటాయి. ►సుదీర్ఘ సమయం నీటి అడుగున ఉండగలిగే మెత్తడి డొప్ప తాబేలు దేశంలోని గంగ, సింధు, మహానదుల్లో మాత్రమే దొరుకుతుంది. ►నక్షత్ర తాబేళ్లను రూ.10 వేలకు కొని.. రూ.40 వేలకు, మెత్తని డొప్పతో ఉండే తాబేళ్లను రూ.5 వేలకు ఖరీదు చేసి రూ.20 వేలకు విక్రయిస్తున్నారు. -
నష్టాల్లో మార్కెట్లు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. వరుసగా రెండో రోజూ లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్ 150 పాయింట్లు ఎగిసి 39వేల ఎగువన, నిఫ్టీ 11600 ఎగువన కొనసాగింది. అనంతరం తీవ్ర అమ్మకాలతో నష్టాల్లోకి జారుకుంది. ప్రస్తుతం సెన్సెక్స్170 పతనమై 38890 వద్ద, నిఫ్టీ 55 పాయింట్లు క్షీణించి 11549 వద్దద్ద కొనసాగుతోంది. తీవ్రమైన ఊగిసలాట ధోరణి నెలకొంది. బ్యాంకింగ్, ఐటీ, టెక్నాలజీ, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు అమ్మకాల ఒత్తిడికి లోనవుతోన్నాయి. గ్రాసిం, భారతి ఇన్ఫ్రాటెల్, ఇండస్ఇండ్, ఎస్బీఐ, భారతి ఎయిర్టెల్, గెయిల్ నష్టపోతుండగా, హెచ్సీఎల్ టెక్ , రిలయన్స్, వేదాంతా, ఏసియన్ పెయింట్స్, బజాజ్ ఆటో, ఐషర్ మోటార్స్, టెక్ మహీంద్రా, టాటా మోటార్స్ , ఎల్అండ్టీ లాభపడుతున్నాయి. -
ఉన్నట్టుండి అమ్మకాలు, 38వేల దిగువకు సెన్సెక్స్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు ఉన్నట్టుండీ ఫ్లాట్గా మారాయి. ఒకదశలో 400పాయింట్లకు పైగా పుంజుకున్న సెన్సెక్స్ ఇన్వెస్టర్ల లాభాలతో స్వీకరణతో నెగిటివ్గా మారిపోయింది. తద్వారా సెన్సెక్స్ 38వేల దిగువకు, నిఫ్టీ 11250 దిగువకు చేరాయి. స్వల్పంగా పుంజుకున్నప్పటికీ లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్న సెన్సెక్స్ ప్రస్తుతం 93 పాయింట్ల లాభంతో 37963 వద్ద, నిఫ్టీ 18 పాయింట్ల స్వల్ప లాభంతో 11252 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ బ్యాంకు కూడా డూ హై నుంచి 850 పాయింట్లు పతనమైంది. మెటల్, బ్యాంకింగ్ లాభపడుతుండగా, ఐటీ, ఫార్మా నష్టపోతోంది. ఇన్ఫోసిస్ , ఓఎన్జీసీ , హెచ్యూఎల్, పవర్గ్రిడ్, కోల్ ఇండియా, కోటక్మహీంద్ర, వేదాంతా , ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, టాప్ గెయినర్స్గా కొనసాగుతున్నాయి. మరోవైపు ఫలితాల ప్రభావంతోటీసీఎస్ నష్టపోతోంది. యస్బ్యాంకు, ఇందస్ఇండ్, ఐవోసీ, గెయిల్, బీపీసీఎల్, ఎం అండ్ ఎం బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. మరోవైపు డాలరు మారకంలో రుపీ బలపడింది. నిన్నటి ముగింపు 71.06తో పోలిస్తే 26 పైసలు ఎగిసి 70.80 స్థాయిని టచ్ చేసింది. -
వీడని చమురు సెగ : భారీ అమ్మకాలు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు భారీ లాభాలతో ముగిసాయి. మిడ్ సెషన్ తరువాత అమ్మకాల ఒత్తిడి భారీగా పెరగడంతో దలాల్ స్ట్రీట్లో నిఫ్టీ, సెన్సెక్స్ రెండూ కీలక మద్దతు స్థాయిలను కోల్పోయాయి. ఒక దశలో 680 పాయింట్లుపైగా పతనమైన సెన్సెక్స్ చివరికి 642 నష్టపోయి 36481 వద్ద ముగియగా, నిఫ్టీ 186 పాయింట్లు క్షీణించి 10817 వద్ద, 10850 స్థాయిని కూడా కోల్పోయింది. దాదాపు అన్ని రంగాలు నష్టపోగా, బ్యాంకింగ్, ఆటో, ఫార్మ షేర్లలో అమ్మకాల ఒత్తిడి భారీగా నెలకొంది. హీరో మోటో, టాటా స్టీల్, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంకు, మారుతి సుజుకి, ఎస్బీఐ, బజాజ్ఆటో, ఇండస్ ఇండ్ టాప్ లూజర్స్గా ఉన్నాయి. మరోవైపు గెయిల్, హెచ్యూఎల్, ఆసియన్ పెయింట్స్, డీఆర్ఎల్ లాభపడ్డాయి. అటు డాలరు మారకంలో రూపీ కూడా నష్టపోతోంది. మళ్లీ 72 స్థాయివైపు కదులుతోంది. -
మెగా మెర్జర్ : ప్రభుత్వ బ్యాంకుల షేర్లు భారీ పతనం
సాక్షి, ముంబై : దలాల్ స్ట్రీట్మంగళవారం భారీ నష్టాలనుమూట గట్టుకుంది. ముఖ్యంగా జీడీపీ 5 శాతం ఆరేళ్ల కనిష్టానికి చేరడంతో పాటు, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం ప్రకటించిన ప్రభుత్వ బ్యాంకుల విలీనం భారీగా దెబ్బ తీసింది. శని, ఆది, సోమ (వినాయక చవితి) సెలవుల అనంతరం మంగళవారం ప్రారంభమైన స్టాక్మార్కెట్లలో బ్యాంకుల షేర్లలో ఇన్వెస్టర్ల అమ్మకాలు భారీ పతనానికి దారి తీసాయి. జీడీపీ ఆరేళ్ల కనిష్టం 5 శాతానికి నీరసించడం, అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు ముదరడం వంటి ప్రతికూల అంశాలు మార్కెట్లను కుప్పకూల్చగా, బ్యాంకింగ్ షేర్లను బాగా ప్రభావితం చేసాయి. ముఖ్యంగా పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఇండియన్, ఓరియంటల్ బ్యాంకు, కెనరా బ్యాంకు 5 నుంచి 12 శాతం కుప్పకూలాయి. పీఎన్బీ9 శాతం, ఇండియన్ బ్యాంకు 8 శాతం, కెనరా బ్యాంకు 8 శాతం నష్టపోయాయి. 10 ప్రభుత్వ బ్యాంకుల ఏకీకరణ ద్వారా నాలుగు బలమైన ప్రభుత్వ రంగ బ్యాంకుల ఏర్పాటు ప్రకటన ప్రతికూల ప్రభావాన్ని చూపింది. విలీన నిష్పత్తిపై స్పష్టత లేకపోవడం ఇన్వెస్టర్ల అమ్మకాలకు దారి తీసిందని నిపుణులు తెలిపారు. ఇండియన్ బ్యాంక్ లిమిటెడ్, 12.5 శాతం కుప్పకూలింది. కెనరా బ్యాంక్ 11 శాతం నష్టపోయి 52 వారాల కనిష్టాన్నితాకింది. యూనియన్ బ్యాంక్ కూడా 9 శాతం కుప్పకూలి 52 వారాల కనిష్టానికి చేరింది. అలాగే ఓరియంటల్ బ్యాంకు 7 శాతం, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) 9 శాతం పతనమైంది. నిఫ్టీ బ్యాంకు 600 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ పీఎస్యూ బ్యాంకు 120 పాయింట్లు (5 శాతం) కుప్పకూలింది. విలీనంలో కీలకమైన నిష్పత్తి ప్రకటించకపోవడం, అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూలత కారణమని రిలయన్స్ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ఎనలిస్ట్ వికాస్ జైన్ వ్యాఖ్యానించారు. జియోజిత్ పరిశోధన విభాగాధిపతి వినోద్ నాయర్ మాట్లాడుతూ, ఈ చర్య దీర్ఘకాలికంగా సానుకూలంగా ఉన్నప్పటికీ, స్వల్ప కాలిక ఒడిదుడుకులు తప్పవని పేర్కొన్నారు. విలీన ప్రక్రియ పూర్తయ్యి, తిరిగి సాధారణ పరిస్థతి రావడానికి ఒకటి నుంచి రెండు సంవత్సరాలు పడుతుందన్నారు. మరోవైపు కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్)మెరుగుపడేందుకు వీలుగా కేంద్ర కేబినెట్ తాజాగా రూ.9వేల కోట్లను అందించనుందనే వార్తలతో ఐడీబీఐ బ్యాంకు కౌంటర్లలో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఐడీబీఐ బ్యాంక్ షేరు 8.2 శాతం దూసుకెళ్లి చివరికి 6శాతం లాభాలతో ముగిసింది. -
అమ్మకాల సెగ : భారీ నష్టాల్లో సూచీలు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు భారీ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయంగా సానుకూలగా ఉన్నప్పటికీ దేశీ స్టాక్ మార్కెట్లు డీలాపడ్డాయి. మధ్యంతర బడ్జెట్, ఎఫ్అండ్వో ముగింపు నేపథ్యంలో మిడ్సెషన్ నుంచీ అమ్మకాలు మరింత ఊపందుకోవడంతో ఒక దశలో సెన్సెక్స్ దాదాపు 500 పాయింట్లు పతనమైంది. ప్రస్తుతం సెన్సెక్స్ 395 పాయింట్లు పతనమై 35,629కు చేరింది. నిఫ్టీ 132 పాయింట్లు క్షీణించి 10,648 వద్ద ట్రేడవుతోంది. దీంతో కీలక సూచీలు రెండు ప్రధాన మద్దతు స్థాయిలు సెన్సెక్స్ 36వేలు, నిఫ్టీ 10700 కిందికి చేరాయి. ఫార్మా, పీఎస్యూ బ్యాంక్స్, ఆటో, మెటల్ రంగాలు భారీగా నష్టపోతుండగా మీడియా లాభపడుతోంది. అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్, ఐబీ హౌసింగ్, ఐసీఐసీఐ, బజాజ్ ఫిన్, యస్ బ్యాంక్, అల్ట్రాటెక్, గ్రాసిమ్, సిప్లా, జేఎస్డబ్ల్యూ స్టీల్ టాప్ విన్నర్స్గా నమోదవుతుండగా ఇన్ఫ్రాటెల్, ఎల్అండ్టీ, టీసీఎస్, కోల్ ఇండియా, యూపీఎల్, విప్రో, ఏషియన్ పెయింట్స్ లాభపడుతున్నాయి. -
అమ్మకానికి కస్టమర్ల డేటా!
శాన్ఫ్రాన్సిస్కో: ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ ఫేస్బుక్ తన వినియోగదారుల సమాచారాన్ని విక్రయించాలని 2012లో అనుకుందని ఓ మీడియా సంస్థ తన కథనంలో వెల్లడించింది. ఫేస్బుక్కు చెందిన గ్రాఫ్ ఏపీఐలో వినియోగదారుల సమాచారం భారీస్థాయిలో నిక్షిప్తమై ఉంటుంది. ఈ గ్రాఫ్ ఏపీఐలోని వివరాలు/సమాచారాన్ని పొందేందుకు కంపెనీల నుంచి కనీసం రెండున్నర లక్షల డాలర్లు వసూల చేయాలని ఫేస్బుక్ 2012లో భావించిందని అర్స్టెక్నికా అనే సంస్థ బయటపెట్టింది. 2014లో ఫేస్బుక్ ఆ నిర్ణయానికి కొన్ని మార్పులు చేసిందనీ, 2015 నాటికి గ్రాఫ్ ఏపీఐలోని కొద్ది సమాచారం మాత్రమే కంపెనీలకు అందుబాటులో ఉండేలా మార్పులు చేసిందని తెలిపింది. కోర్టుకు చేరిన ఓ పత్రం నుంచి సమాచారాన్ని సేకరించి అర్స్టెక్నికా ఈ విషయాన్ని వెల్లడించింది. గ్రాఫ్ ఏపీఐ నుంచి విస్తృత స్థాయిలో సమాచారం పొందేందుకు నిస్సాన్, కెనడా రాయల్ బ్యాంక్, ఎయిర్బీఎన్బీ, నెట్ఫ్లిక్స్, లైఫ్ట్, క్రైస్లర్/ఫియట్ తదితర కంపెనీలు ఉన్నాయని అర్స్టెక్నికా తెలిపింది. ఓ కేసులో బ్రిటన్ పార్లమెంటు ఫేస్బుక్ అంతర్గత పత్రాలను పరిశీలన నేపథ్యంలో తాజా వార్త ఫేస్బుక్కు మరింత ఆందోళన కలిగించనుంది. -
ఇళ్ల క్రయవిక్రయాల్లోకి ‘ఎస్సెక్స్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇల్లు కొనుక్కోవటం అంత ఈజీ కాదు. అనువైన ప్రాంతంలో కావాలంటే కాళ్లరిగేలా తిరగాలి. మరోవంక సదరు ఇంటిని అన్ని అనుమతులు తీసుకున్నాకే బిల్డర్ నిర్మించారా? లోన్ వస్తుందా అన్న సందేహాలూ ఉంటాయి. ఇవన్నీ లేకుండా.. ఒక్క క్లిక్తో సులువుగా ఇల్లు కొనుక్కునే సేవల్ని అందుబాటులోకి తెచ్చింది ‘ఎస్సెక్స్’ దేశంలో అతిపెద్ద మార్కెటింగ్ టెక్నాలజీ కంపెనీ వే2ఆన్లైన్ ఇంటెరాక్టివ్ ప్రమోట్ చేస్తున్న ‘ఎస్సెక్స్ ఇండియా’... టెక్నాలజీని ఆసరాగా కస్టమర్ను, బిల్డర్ను అనుసంధానిస్తోంది. న్యాయ సహకారంతో పాటు గృహ రుణానికీ తగిన సాయం చేస్తుంది. ఎలా పనిచేస్తుందంటే.. ఎస్సెక్స్ ఇండియా వెబ్సైట్లోకి వెళ్లి పేరు, మొబైల్ నంబరు, నగరం పేరు నమోదు చేస్తే చాలు. కంపెనీ ప్రతినిధి 30 నిముషాల్లో కస్టమర్కు కాల్ చేస్తారు. ఏ ప్రాంతంలో ఫ్లాట్/విల్లా కావాలి, ఎంతలో కావాలి? ఎప్పట్లోగా కావాలి? వంటివి అడిగి తెలుసుకుంటా రు. ఈ సమాచారం ఆధారంగా బిల్డర్తో కస్టమర్ను అనుసంధానించి సైట్ విజిట్స్ ఏర్పాటు చేస్తారు. ధరపై కొనుగోలుదారే విక్రేతతో మాట్లాడుకోవచ్చు. కస్టమర్ నుంచి ఎలాంటి ఫీజూ వసూలు చేయరు. బ్యాంకు రుణం సైతం.. కస్టమర్కు బ్యాంకు నుంచి రుణం అందేలా సహకరిస్తామని ఎస్సెక్స్ కో–ఫౌండర్ నిర్భయ్ తనేజా సోమవారమిక్కడ మీడియాకు వెల్లడించారు. ‘భవనాలకు అనుమతులన్నీ ఉన్నాయా లేదా చూస్తాం. కస్టమర్ల క్రెడిట్ స్కోరింగ్ను సైతం ట్రాక్ చేస్తాం. భారత్లో ఏటా రూ.18,000 కోట్లుగా ఉన్న రెసిడెన్షియల్ మార్కెటింగ్, సేల్స్ రంగంలో 5% వాటాను లక్ష్యంగా చేసుకున్నాం’ అని వివరించారు. ఇప్పటి వరకు కంపెనీ రూ.3 కోట్లు వెచ్చించింది. ఆరు నెలల్లో రూ.20 కోట్ల నిధులు సమీకరించనుంది. అందరికీ ఒకే ప్లాట్ఫామ్.. ‘‘ఇళ్ల విక్రయానికి సంబంధించి పెద్ద పెద్ద రియల్టీ బ్రాండ్లకు సమస్యలు ఉండవు. కానీ చిన్నచిన్న బిల్డర్లకు తమ భవనాన్ని మార్కెట్ చేసుకోవడంలో చాలా పరిమితులున్నాయి. ఇదంతా ఖర్చుతో కూడుకున్నపని. దేశవ్యాప్తంగా అమ్ముడుపోని గృహాలు లక్షల్లో ఉంటాయి. చిన్న బిల్డర్ల గృహాలనూ మేం బ్రాండింగ్ చేస్తాం‘‘ అని కంపెనీ కో–ఫౌండర్ చైతన్య రెడ్డి వెల్లడించారు. కంపెనీ ప్రస్తుతం హైదరాబాద్లో మార్కెటింగ్, సేల్స్ సేవలు అందిస్తోంది. దశలవారీగా అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్కత, ముంబై, పుణే నగరాల్లో అడుగుపెడతామని చెప్పారు. -
ఓటు అమ్ముకోవద్దు మామ
సాక్షి, మాచారెడ్డి: గ్రామాల్లో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు ఆయా పార్టీల కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల వాగ్దానాలు చేస్తూ తాయిలాలు వెదజల్లుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ యువకుడు, రైతు మధ్య జరిగిన ముచ్చట ఇది. ఏం మల్లయ్య మామ యాడికి పోతున్నవే అంత మందచిదేనా? అంత మంచిదేరా శ్రీను ఏమ్జేయమంటవురా మీ అయ్య లెక్క నాకేమన్న నౌకరి ఉందారా? ఏదో బత్కుదెరువ కోసం ఇంత కైకిలో గంబడో జేస్కోవాలే. గా రామన్న వడ్ల సంచులు మోసేందుకు రమ్మంటే పోతున్న బిడ్డా అరే నీ పని పాడ్గాను. గీ వయసులో సుత కైకిల్ జేస్తావే. కైకిల్ జేయకుంటే గీ జానెడు కడుపులకు ఓళ్లు వెడ్తర్రా శ్రీను. ఇద్దరు కొడుకులున్నా లేని కిందికే. నీకు దెల్వదు వాళ్ల ఎవనంతల ఆడే ఉండవట్టిరి. ఇగ మీ అత్తకు పచ్చవాతమచ్చి ఏడేండ్లయే. పదేండ్ల సంది దాన్ని కూసుండే బెట్టి సాదవడ్తి. ఇద్దరు కొడుకులున్నా ఎవడేం పెడుతున్రు బిడ్డ. అది నీకు దెల్సిన సంగతేనాయే అరే మామ నీకు కట్టమే ఉందే నిజ్జంగా నీది బట్టు(బష్టు) రాతనేనే. ఇగ నీఅసోంటోళ్లకు దెలిస్తే సాలు బిడ్డా. ఇగవోత బిడ్డ టైమైతుంది. అవేగని మల్లయ్య మామ. మరి ఎలచ్చన్లు అస్తున్నై కదా, ఓట్లు ఓళ్లకేద్దామనుకుంటుండ్రే. ఏమో బిడ్డా మొన్న గాళ్లచ్చి ఓటుకు వేయి రూపాయలు, ఒక కోటరు సీసా ఇస్తమన్నరు. బిడ్డా మరి ఓటు ఓళ్లకేస్తే మంచిగుంటదంటవ్. ఇదిట్లుంటే ఇగ మనూళ్లే పెద్ద మనుషులు ఓళ్లకు ఒక్క మాటిస్తలేరు గట్లెందుకు మామ ఓళ్లకో ఒకళ్లకు ఓటు వేయాలేగదా, గట్లెందుకు నానవెడ్తుండ్రే. ఇంకా కొద్ది రోజులాగితే ఇంకా ఎక్వ పైసల్తిరని గా పెద్ద మనుషులు నాన వెడ్తుండ్రు బిడ్డా. మరి నీకు దెల్సిన వాళ్లు ఓళ్లయినా ఉన్నర్రా శ్రీను ఏ... నీ యవ్వ నాకోల్లు దెల్చే మామ ఓళ్లు దెల్వదు ఏ... కాదు బిడ్డ నువ్వు సదువు శాత్రం దెల్సినోనివి గదా. నీకు నాలుగు ముచ్చట్లు దెలుస్తుయని అడుగుతున్న బిడ్డా, ఏమనికోకు. ఏ తియ్యి మామ నేనేమనుకుంటనే ఏమనుకోను. అది కాదు, మామ ఓటును అమ్ముకోవద్దు. ఇయ్యాళ్ల ఆళ్లు వెయ్యో, రెండు వేలో ఇస్తే మనం ఓటేస్తమనుకో, రేపు ఆళ్లు గెల్సినాంక ఏదన్న పనిమీద మనం బోతే మనల్ని కాన్తరానే. మీరు ఓట్లు పుక్కడికి ఏసిండ్రా పైసలిస్తేనే ఏసిండ్రు. ఇప్పుడు మీకు గా పని కావాలంటే లంచమడుగుతరు. గప్పుడు ఏమ్జేస్తవే చెప్పు మామ. టమరెట్లరా శ్రీను ఉత్తపున్నానికి ఓట్లేయమంటవారా. మీ అయ్యవోను. అవును మామ గిప్పుడు మనం అభిమానంతో నియ్యత్ దప్పకుండా ఓట్లేస్తే ఆళ్లు రేపు మనకు సేవజేస్తరు. అందుకే మా అయ్యకు చెప్పినా, ఓటును అమ్ముకోవద్దని. నీకు చెప్తున్నా సరే బిడ్డా శ్రీను నువ్వెట్ల చెప్తే గట్ల. ఇగ పోయాస్త బిడ్డ మరి. -
‘జీ’పై విదేశీ దిగ్గజాల కన్ను!?
ముంబయి: సుభాష్ చంద్ర... దేశీ మీడియా రంగంలో సుపరిచితమైన పేరు. జీ టెలివిజన్ చానెళ్లతో విదేశీ మీడియా సంస్థలకు దీటుగా వ్యాపారాన్ని విస్తరించారు. అయితే, హఠాత్తుగా ప్రధాన కంపెనీలో వాటాలను విక్రయించాలని నిర్ణయించడంతో మీడియాలో ఇప్పుడిది హాట్ టాపిక్గా మారింది. తన వ్యాపారానికి మూల స్తంభంలాంటి జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్(జీల్) పగ్గాలను ఎందుకు వదులుకోవాలని అనుకుంటున్నారనే దానిపై ఆసక్తి నెలకొంది. అంతర్జాతీయ మీడియా దిగ్గజాలు, టెక్నాలజీ కంపెనీలతో పాటు దేశీయంగా మీడియాలో దూసుకెళ్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా జీ ఎంటర్టైన్మెంట్పై కన్నేసినట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. బంపర్ ఆఫర్ వచ్చిందా... ఒక గ్లోబల్ మీడియా అగ్రగామి నుంచి భారీస్థాయిలో ఆఫర్ వచ్చిందని... ఈ నేపథ్యంలో తాము వాటా విక్రయానికి సిద్ధమైనట్లు స్వయంగా జీల్ సీఈఓ, సుభాష్ చంద్ర తనయుడు పునీత్ గోయెంకా తాజాగా వెల్లడించారు. ప్రస్తుతం ప్రమోటర్లకు (ఎస్సెల్ హోల్డింగ్స్) జీల్లో 42 శాతం వాటా ఉంది. ఇందులో సగం వరకూ వాటాను విక్రయించనున్నామని... కొనుగోలుదారులు అడిగితే మరింత వాటాను విక్రయించడానికి కూడా రెడీగా ఉన్నట్లు గత వారంలో జీ ప్రమోటర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ గోల్డ్మన్ శాక్స్, సలహా సంస్థ లయన్ ట్రీలను కూడా నియమించుకున్నారు. తాము వ్యాపారం నుంచి పూర్తిగా వైదొలిగే ప్రణాళికల్లేవని పునీత్ చెబుతున్నప్పటికీ.. కంపెనీపై నియంత్రణ వదులుకోవడానికి ప్రమోటర్లు సిద్ధపడే అవకాశం ఉందని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ‘జీ ఎంటర్టైన్మెంట్ను కొనుగోలు చేసేందుకు ప్రపంచస్థాయి మీడియా దిగ్గజం ఇటీవలే ప్రమోటర్లను సంప్రతించింది. దీంతో వాటా విక్రయం ప్రక్రియను మొదలుపెట్టాలని నిర్ణయించారు. ఎందుకంటే జీవితంలో ఒక్కసారి మాత్రమే ఇలాంటి అవకాశం లభిస్తుంది’ అని గోయెంకా పేర్కొనడం విశేషం. రేసులో ఎవరెవరు... జీల్ కొనుగోలు రేసులో అంతర్జాతీయ మీడియా, టెక్నాలజీ దిగ్గజాలు ఉన్నట్లు సమాచారం. ఇటీవలి ఒక మీడియా కథనం ప్రకారం కామ్కాస్ట్, సోనీ, చార్టర్ కమ్యూనికేషన్స్, అలీబాబా, గూగుల్, యాపిల్లు ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. రిలయన్స్ జియోతో దేశీ టెలికం రంగంలో సంచలనం సృష్టించిన ముకేశ్ అంబానీ కూడా జీల్లో మెజారిటీ వాటా కోసం పోటీపడొచ్చని వార్తలొస్తున్నాయి. ప్రస్తుత నిబంధనల ప్రకారం దేశీ ఎంటర్టైన్మెంట్ మీడియా కంపెనీల్లో 100 శాతం వాటాను విదేశీ సంస్థలు కొనుగోలు చేసేందుకు వీలుంది. అయితే, తాము వ్యూహాత్మక భాగస్వామ్యానికే మొగ్గుచూపుతామని పునీత్ చెబుతున్నారు. మరోపక్క, విదేశీ కంపెనీలు కూడా ఇక్కడి కంపెనీలను పూర్తి స్థాయిలో టేకోవర్ చేసేందుకు వెనకాడవచ్చనేది నిపుణుల మాట. విభిన్న భాషలు, సంక్లిష్టమైన కార్యకలాపాలతో కూడిన దేశీ ఎంటర్టెన్మెంట్ మార్కెట్ను నడిపించేందుకు స్థానిక భాగస్వామ్యాన్ని వారు కోరుకోవచ్చని భావిస్తున్నారు. కాగా, తాజా షేరు ధర ప్రకారం జీల్ మార్కెట్ విలువ దాదాపు రూ.42,000 కోట్లు. ఇందులో ప్రమోటర్ల వాటా సుమారు రూ.17,600 కోట్లు. అయితే, ఈ విలువకన్నా 20–25 శాతం అధిక ధరకే డీల్ కుదరవచ్చన్నది విశ్లేషకుల అంచనా. దీని ప్రకారం కంపెనీ మార్కెట్ విలువను రూ.57,800 కోట్ల నుంచి రూ. 64,500 కోట్లుగా (8–9 బిలియన్ డాలర్లు) లెక్కగట్టొచ్చని భావిస్తున్నారు. ఈ ఏడాది జూలైలో రూపర్ట్ మర్దోక్కు చెందిన ట్వంటియత్ సెంచురీ ఫాక్స్ వ్యాపారాన్ని డిస్నీ ఏకంగా 71 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడం తెలిసిందే. ఇందులో భారత్ కార్యకలాపాలు కూడా ఉన్నాయి. దీనిప్రకారం స్టార్ ఇండియా విలువను ఏకంగా 15 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. గ్లోబల్ టెలికం– కంటెంట్ దిగ్గజం కామ్కాస్ట్ గనుక జీల్లో మెజారిటీ వాటాను దక్కించుకుంటే... అది దేశీ మీడియా రంగం స్వరూపాన్ని మార్చివేయొచ్చని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు. రిలయన్స్ జియోపై కూడా ఇది తీవ్ర ప్రభావం చూపొచ్చనేది వారి అభిప్రాయం. ఓటీటీలో దూసుకెళ్లేందుకేనా... మీడియా రంగంలో ప్రస్తుతం విపరీతమైన పోటీ నెలకొంది. మరోపక్క, ఇంటర్నెట్ ఆధారిత కంటెంట్ కూడా అంతకంతకూ ప్రేక్షకులను ఆకర్షిస్తుండటం సాంప్రదాయ టెలివిజన్ చానెళ్ల ఆదాయానికి గండికొడుతోంది. ఓవర్ ది టాప్ (ఓటీటీ) ప్లాట్ఫామ్గా పిలుస్తున్న ఈ విభాగంలో యూజర్లు అంతకంతకూ పెరిగిపోతుండటం దీనికి నిదర్శనం. ప్రస్తుతం దేశంలో స్టార్ టీవీ గ్రూప్నకు చెందిన హాట్స్టార్, అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ వంటి ఓటీటీ ఆపరేటర్ల కంటెంట్కు మంచి గిరాకీయే ఉంది. ఇదే తరుణంలో సుభాష్ చంద్ర ప్రారంభించిన జీల్ అనుబంధ సంస్థ జీ5 ఓటీటీ ప్లాట్ఫామ్కు కూడా ఆదరణ పెరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో టెక్నాలజీ మీడియా కంపెనీగా జీల్ మార్పు చెందడం కోసమే వాటా విక్రయానికి నిర్ణయం తీసుకున్నట్లు జీ ప్రమోటర్లు చెబుతున్నారు. హాట్స్టార్ యూజర్ల సంఖ్య 10 కోట్లను దాటింది. జీ5 యూజర్లు కూడా 5 కోట్లకు చేరుకోనున్నారు. వాస్తవానికి జీ5లోనే వ్యూహాత్మక ఇన్వెస్టర్లకు వాటా విక్రయించాలని భావించామని... అయితే, మాతృ సంస్థ వద్ద భారీగా కంటెంట్ ఉండటంతో జీల్లో వాటాకు విదేశీ ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారని పునీత్ చెప్పారు. తాము అధునాతన టెక్నాలజీతో కూడిన కంటెంట్ కంపెనీగానే కొనసాగాలని భావిస్తున్నామని వివరించారు. అంతర్జాతీయ మీడియా రంగంలో ఓటీటీ కంటెంట్తో పాటు టెలికం సేవలు కూడా కలగలిసిపోతు న్నాయి. అందుకే కొన్ని టెలికం, టెక్నాలజీ కంపె నీలు కూడా మీడియాలోనూ (ఓటీటీ ప్లాట్ఫామ్) భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. పునీత్ మాత్రం తమకు టెలికంపై ఎలాంటి ఆసక్తీ లేదని స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో జీల్లో ప్రమోటర్ల వాటా విక్రయానికి భారీగానే విలువ (వేల్యుయేషన్) దక్కొచ్చని నిపుణులు భావిస్తున్నారు. -
దలాల్ స్ట్రీట్లో భారీ నష్టాలు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు దసరా పండుగ ఉత్సాహాన్ని ఉసూరుమనిపించాయి. అంతర్జాతీయ మార్కెట్లు ప్రతికూల సంకేతాలతో ఆరంభంలోనే భారీగా నష్టపోయాయి. ఒకదశలో సెన్సెక్స్ 500 పాయింట్ల వరకూ పతనమైంది. ప్రస్తుతం 350పాయింట్లు క్షీణించి 34,429 వద్ద, నిఫ్టీ 119 పాయింట్లు కోల్పోయి 10,333 వద్ద కొనసాగుతున్నాయి. ఫార్మా తప్ప అన్ని రంగాల్లోనూ అమ్మకాల ధోరణి నెలకొంది. ఐటీ, ప్రయివేట్ బ్యాంక్స్, రియల్టీ, ఆటో రంగాలు నష్టపోతున్నాయి. మైండ్ ట్రీ 9శాతం కుప్పకూలగా.. హెచ్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, విప్రో 4-1.25 శాతం బలహీనంతో కొనసాగుతున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్), యస్ బ్యాంక్, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ సిమెంట్ , హీరోమోటో నష్టాలు మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. మరోవైపు ఇన్ఫ్రాటెల్, గెయిల్, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్పీసీఎల్, బజాజ్ ఫైనాన్స్, సన్ ఫార్మా, ఐవోసీ, బీపీసీఎల్, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్ లాభపడుతున్నాయి. -
అమ్మకానికి ఆర్కే స్టూడియో
ముంబై: ప్రముఖ హిందీ నటుడు రాజ్ కపూర్ స్థాపించిన ముంబైలోని ఆర్కే స్టూడియోను అమ్మేయాలని కపూర్ కుటుంబం నిర్ణయించింది. 1948లో నిర్మించిన ఈ స్టూడియోలో చాలా భాగం గతేడాది సెప్టెంబర్లో జరిగిన అగ్నిప్రమాదంలో దెబ్బతింది. మళ్లీ కొత్త నిర్మాణాలు చేపట్టడం ఆర్థికంగా సాధ్యం కాదని, అందుకే అమ్మేయాలని నిర్ణయించినట్లు రణ్ధీర్ కపూర్ తెలిపారు. ‘మేం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాం. ఆర్కే స్టూడియోను అమ్మకానికి ఉంచాం’ అని ఆయన చెప్పారు. 1988లో రాజ్కపూర్ మరణం అనంతరం ఈ స్టూడియో బాధ్యతల్ని పెద్ద కుమారుడు రణధీర్ చూసుకుంటున్నారు. -
కూతురిని అమ్మేసి.. ఆపై కట్టుకథ..
సాక్షి, హైదరాబాద్ : నగరంలో దారుణం చోటుచేసుకుంది. నవమాసాలు మోసి పెంచిన కన్న తల్లి రెండేళ్ల కూతురిని 20వేలకు అమ్మేసింది. ఈ విషయం గురువారం వెలుగులోకి వచ్చింది. వివరాలివి.. ఆ పాపను కొందరు బ్రోకర్లు ఓ ఎంపీటీసీ భర్తకు రూ. 80వేలకు అమ్మారు. భర్త కొడతాడనే భయంతో ఓ కట్టుకథ చెప్పింది. గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చి పాపను ఎత్తుకెళ్లారని ఆ మహిళ భర్తకు చెప్పి బోరున ఏడ్చింది. దీం అతను వెంటనే ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఆ ప్రాంతంలోని సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితులను అరెస్టు చేసి పాపను తల్లిదండ్రులకు అప్పగించారు.