మద్యం సీసాలతో ఎస్సై, సిబ్బంది
పాచిపెంట : మండల కేంద్రంలోని చాలపు వీధిలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న సబ్బిశెట్టి మురళీ అనే వ్యక్తి వద్ద నుంచి 290 మద్యం సీసాలను సోమవారం రాత్రి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై ఎ.సన్యాసినాయడు తెలిపారు. వినాయక నిమజ్జనంలో భాగంగా మెయిన్రోడ్డులో వెళ్తుండగా ఓ అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు ఈ దాడి చేసినట్లు తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా మద్యం అమ్ముతున్న వ్యక్తి నుంచి 290 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. వీటిని ఎక్సైజ్ శాఖకు తరలిస్తామన్నారు.