ప్రధాన వార్తలు

అక్రమ మద్యం కేసు.. ‘సిట్’ మరో కొత్త నాటకం
సాక్షి, హైదరాబాద్: అక్రమ మద్యం కేసులో మరో నాటకానికి సిట్ తెరతీసింది. సోదాల పేరుతో హడావుడి సృష్టించేందుకు సిట్ ప్రయత్నించింది. హైదరాబాద్లోని బాలాజీ గోవిందప్ప నివాసంలో మరోసారి సోదాల పేరుతో సిట్ అధికారులు హల్చల్ చేశారు. గతంలోనే బాలాజీ గోవిందప్ప ఇంటిలో సిట్ అధికారులు సుదీర్ఘంగా సోదాలు నిర్వహించారు.మే 13న బాలాజీ గోవిందప్పను సిట్ అరెస్ట్ చేసింది. 74 రోజులుగా ఆయన రిమాండ్లో ఉన్నారు. బాలాజీ గోవిందప్పకు వ్యతిరేకంగా ఒక్క ఆధారం కూడా కోర్టు ముందు సిట్ పెట్టలేకపోయింది. ఏసీబీలో కోర్టులో బాలాజీ గోవిందప్ప బెయిల్ పిటిషన్ వేశారు. ఆయన పిటిషన్పై ఈనెల 29న కోర్టు విచారణ చేపట్టనుంది.బాలజీ గోవిందప్ప బెయిల్ను అడ్డుకునేందుకు సోదాల పేరుతో సిట్ అధికారులు మరో కొత్త నాటకానికి తెరలేపారు. కొత్తగా ఆధారాలు దొరికాయంటూ చెప్పేందుకే ఈ నాటకం చేస్తున్నారని గోవిందప్ప న్యాయవాదులు అంటున్నారు. బాలాజీ గోవిందప్ప.. ప్రఖ్యాత అంతర్జాతీయ కంపెనీ వికాట్ ఇంటర్నేషనల్లో ఫుల్టైమ్ డైరెక్టర్గా ఉన్నారు. వికాట్ గ్రూప్కు సంబంధించిన కార్యాలయంలో కూడా సిట్ అధికారులు సోదాలు చేపట్టారు.

మరింతగా దిగజారిన ఏపీ ఆర్థిక స్థితి.. వైఎస్ జగన్ ఆందోళన
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలనలో దిగజారిన ఆర్థిక పరిస్థితిపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరపు మొదటి త్రైమాసికంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దిగజారిందని గణాంకాలతో సహా పేర్కొన్నారాయన. కాగ్ విడుదల చేసిన మంత్లీ కీ ఇండికేటర్ ప్రకారం.. రాష్ట్ర ఆర్థిక స్థిరత్వం ప్రమాదంలో ఉందని వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. ఆ నివేదికలో.. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వనరులు (పన్నులు, పన్నేతర ఆదాయాలు) అత్యంత మందగమనం చూపించాయని అన్నారాయన. జీఎస్టీ, సేల్స్ టాక్స్ ఆదాయాలు గత సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే తక్కువగా ఉన్నాయని తెలిపారు. ఆదాయాలు లేకపోగా శరవేగంగా అప్పులు పెరుగుతున్నాయ్ప్రభుత్వ విధానాలతో ఏపీ అప్పుల్లో కూరుకుపోయిందిమొదటి త్రైమాసికంలో రాష్ట్రంపై ఆర్థిక ఒత్తిడి ఏర్పడిందిఏపీలో ఆర్థిక స్థిరత్వం, నిర్వహణ సరిగా లేనేలేదువిభజనతో మొదలైన సమస్య మరింత తీవ్రరూపం దాల్చిందిఏపీలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందిఖజానాకు రావాల్సిన ఆదాయం రాకుండా పోతోందిపన్ను ఆదాయం, పన్నేతర ఆదాయాలు పేలవంగా ఉన్నాయిగతేడాది త్రైమాసికంతో పోలిస్తే ఈ ఏడాది.. జీఎస్టీ ఆదాయాలు, అమ్మకపు పన్ను ఆదాయాలు తక్కువగా ఉన్నాయికొన్ని శాఖల్లో అత్యంత అధ్వాన్నమైన వృద్ధిరేటు ఉందిరాష్ట్ర సొంత ఆదాయాలు కేవలం 3.47 శాతం మాత్రమే పెరిగాయికేంద్రం నుంచి వచ్చే ఆదాయాలతో సహా మొత్తం ఆదాయాలు 6.14 శాతం మాత్రమే పెరిగిందిఅప్పులు మాత్రం మూడు నెలల్లో ఏకంగా.. 15.61శాతం వేగంతో పెరిగాయిఇది ఏపీపై ఆర్థిక ఒత్తిడికి సంకేతం అని జగన్ అన్నారు. అలాగే.. చంద్రబాబు ప్రభుత్వం ఖర్చులు, సొంత ఆదాయాలపై కాకుండా అప్పులపై ఆధారపడుతున్నాయని, ఇది ఆర్థిక స్థిరత్వానికి ప్రమాదకరంగా మారిందని జగన్ అభిప్రాయపడ్డారు.Fiscal stress worsens in the first quarter of this financial yearThe CAG uploaded the Monthly Key Indicators for the first quarter of this financial year and these figures very clearly suggest a precarious outlook for the financial stability of the State Government, Public… pic.twitter.com/0tYnKfNSQi— YS Jagan Mohan Reddy (@ysjagan) July 26, 2025వైఎస్సార్సీపీ హయాంలో అప్పులపై చంద్రబాబు చేసిన తప్పుడు లెక్కల ప్రచారం(రూ.14 లక్షల కోట్లంటూ..) గురించి తెలిసిందే. అంతేకాదు.. ఆ సమయంలో ఏపీ మరో శ్రీలంక అయిపోతోందంటూ గగ్గోలు పెట్టారాయన. అయితే మొత్తంగా జగన్ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో చేసిన అప్పులు రూ.3,39,580 కోట్లు మాత్రమేనని కూటమి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ఇంకోవైపు.. ప్రతీ మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చేసుకున్న చంద్రబాబు, కేవలం 12 నెలల్లోనే 1,37,546 లక్షల కోట్ల అప్పు చేయడం విశేషం.

ఘనంగా ‘కింగ్డమ్’ ట్రైలర్ లాంచ్.. అంచనాలు తారాస్థాయికి
తెలుగులో రూపొందుతోన్న భారీ చిత్రాల్లో ‘కింగ్డమ్’ ఒకటి. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘కింగ్డమ్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది.శనివారం(జూలై 26) సాయంత్రం తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్స్ లో ‘కింగ్డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక ఘనంగా జరిగింది. విజయ్ దేవరకొండ ఖాతాలో మరో ఘన విజయం చేరనుందనే భరోసాను ఈ ట్రైలర్ ఇస్తోంది.‘కింగ్డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుకలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, "గత సంవత్సర కాలంగా 'కింగ్డమ్' గురించి ఆలోచిస్తున్నాను. నాకు ఒక్కటే అనిపిస్తుంది. మన తిరుపతి ఏడుకొండల వెంకన్న స్వామి నా పక్కనుండి నడిపిస్తే.. చాలా పెద్దోడిని అయిపోతాను. ఎప్పటిలాగే ఈ సినిమాకి కూడా కోసం ప్రాణం పెట్టి పనిచేశాను. దర్శకుడు గౌతమ్, సంగీత దర్శకుడు అనిరుధ్, నిర్మాత నాగవంశీ గారు, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే అందరూ కూడా ప్రాణం పెట్టి పనిచేశారు. ఇప్పటికీ పనిచేస్తూనే ఉన్నారు. ఆ వెంకన్న స్వామి దయ, మీ అందరి ఆశీస్సులు ఉంటే.. ఈ సినిమాతో ఘన విజయం సాధిస్తాను. జూలై 31న థియేటర్లలో కలుద్దాం." అన్నారు.

‘నేను జైల్లో ఉన్నప్పుడు మా అన్న కేటీఆర్, మా బావ హరీష్ వచ్చి..’
హైదరాబాద్: కాంగ్రెస్-బీఆర్ఎస్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కౌంటర్లకు రీ కౌంటర్లు అన్నట్లు ఇరు పార్టీలు ఎక్కడా తగ్గడం లేదు. ఈ క్రమంలోనే బీజేపీ-కాంగ్రెస్లు కలిసి కేసీఆర్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాయన్న బీఆర్ఎస్ వర్కింగ ప్రెసిడెంట్ కేటీఆర్కు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటరిచ్చారు. తన సోషల్ మీడియా అకౌంట్ ‘ఎక్స్’ వేదికగా బీఆర్ఎస్పై మండిపడ్డారు. ‘ నేను జైల్లో ఉన్నప్పుడు…మా అన్న కేటీఆర్, మా బావ హరీష్ రావు ఇద్దరూ వచ్చి మన పార్టీని BJP లో విలీనం చేద్దామనుకుంటున్నాం… ఏమంటావ్!?” అని అడిగారు. మీరు విలీనం చేసుకుంటామంటే చేసుకోండి… నాకు సంబంధం లేదు. బయటకు వచ్చాక కూడా అదే చెబుతా! అని వాళ్లకు చెప్పాను.సుమారు నాలుగైదు నెలల క్రితం జాగృతి కవిత ఈ breaking news ను ఈ రాష్ట్రంలో తనకు సన్నిహితులైన దాదాపు అన్నీ ఛానెళ్ల, పత్రికల ప్రతినిధులకు రకరకాల రూపంలో స్వయంగా లీక్ ఇచ్చింది. పాపం ఆవిడ breaking ఆవేదనను ఎవరూ అర్థం చేసుకోలేదు. సింగిల్ కాలం వార్త కూడా వేయలేదు.ఆ తర్వాత ఆమె రాసిన లేఖ లీకు అందిరికీ తెలిసిన విషయమే’ అంటూ పోస్ట్ పెట్టారు ఎంపీ చామల. “నేను జైల్లో ఉన్నప్పుడు…మా అన్న కేటీఆర్…మా బావ హరీష్ రావు… ఇద్దరూ వచ్చి మన పార్టీని BJP లో విలీనం చేద్దామనుకుంటున్నాం… ఏమంటావ్!?” అని అడిగారు. “మీరు విలీనం చేసుకుంటామంటే చేసుకోండి… నాకు సంబంధం లేదు. బయటకు వచ్చాక కూడా అదే చెబుతా!” అని వాళ్లకు చెప్పాను. సుమారు నాలుగైదు… pic.twitter.com/38Qrgs6NoE— Kiran Kumar Chamala (@kiran_chamala) July 26, 2025

Asia Cup: పూర్తి షెడ్యూల్ విడుదల.. భారత్- పాక్ మ్యాచ్ల తేదీలివే!
Asia Cup 2025: ఆసియా కప్-2025 నిర్వహణకు మార్గం సుగమమైంది. ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహించే టోర్నమెంట్కు సంబంధించి ఆసియా క్రికెట్ మండలి (ACC) శనివారం షెడ్యూల్ విడుదల చేసింది. యూఏఈ వేదికగా సెప్టెంబరు 9- 28 వరకు ఈ మెగా ఈవెంట్ను నిర్వహించనున్నారు.మూడుసార్లు ఢీకొట్టే అవకాశం!చిరకాల ప్రత్యర్థులు భారత్- పాకిస్తాన్ (India vs Pakistan) జట్లు సెప్టెంబరు 14న పరస్పరం తలపడనున్నాయి. దాయాదులు రెండూ ఒకే గ్రూపులో ఉన్నాయి కాబట్టి సూపర్ ఫోర్ దశలో మరోసారి అంటే.. సెప్టెంబరు 21న ఢీకొట్టే వీలుంది. ఒకవేళ ఇరుజట్లు ఫైనల్ చేరితో సెప్టెంబరు 28న మరోసారి ముఖాముఖి పోటీపడతాయి.గ్రూప్- ఎ నుంచి ఇండియా, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్ పోటీపడనుండగా.. శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, హాంకాంగ్ గ్రూప్-బి నుంచి తలపడతాయి. దుబాయ్, అబుదాది వేదికలుగా ఈ 19 మ్యాచ్ల టోర్నమెంట్ను నిర్వహించనున్నారు.బీసీసీఐపై విమర్శలుకాగా ఆసియా కప్ టీ20 టోర్నీకి ఈసారి భారత్ వేదిక. అయితే, ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం గతంలో మాదిరి ఈసారి కూడా తటస్థ వేదికపై టోర్నీని నిర్వహించనున్నారు. అయితే, పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాక్తో అన్ని స్థాయిల్లోనూ క్రీడల్లోనూ బంధం తెంచుకోవాలనే డిమాండ్లు వచ్చాయి. బీసీసీఐ సైతం దాయాదితో పోటీ పడేందుకు సుముఖంగా లేమని వెల్లడించింది.కానీ.. తాజా షెడ్యూల్ ప్రకారం చిరకాల ప్రత్యర్థితో టీమిండియా తలపడనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ తీరుపై విమర్శలు వస్తున్నాయి. కాగా ఇటీవల వరల్డ్ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్లో పాక్తో మ్యాచ్ ఆడేందుకు ఇండియా చాంపియన్స్ నిరాకరించింది. దీంతో ఇరుజట్ల మధ్య మ్యాచ్ రద్దు కాగా.. చెరో పాయింట్ వచ్చింది.లీగ్ దశ షెడ్యూల్👉సెప్టెంబరు 9: అఫ్గనిస్తాన్ వర్సెస్ హాంగ్కాంగ్👉సెప్టెంబరు 10: ఇండియా వర్సెస్ యూఏఈ👉సెప్టెంబరు 11: బంగ్లాదేశ్ వర్సెస్ హాంగ్కాంగ్👉సెప్టెంబరు 12: పాకిస్తాన్ వర్సెస్ ఒమన్👉సెప్టెంబరు 13: బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక👉సెప్టెంబరు 14: ఇండియా వర్సెస్ పాకిస్తాన్👉సెప్టెంబరు 15: యూఏఈ వర్సెస్ ఒమన్👉సెప్టెంబరు 15:శ్రీలంక వర్సెస్ హాంగ్కాంగ్👉సెప్టెంబరు 17: పాకిస్తాన్ వర్సెస్ యూఏఈ👉సెప్టెంబరు 18: శ్రీలంక వర్సెస్ అఫ్గనిస్తాన్👉సెప్టెంబరు 19: ఇండియా వర్సెస్ ఒమన్సూపర్ 4 దశ👉సెప్టెంబరు 20: గ్రూప్- బి టాపర్ వర్సెస్ రెండో స్థానంలో ఉన్న జట్టు (B1 Vs B2)👉సెప్టెంబరు 21: గ్రూప్-ఎ టాపర్ వర్సెస్ రెండో స్థానంలో ఉన్న జట్టు (A1 vs A2)👉సెప్టెంబరు 23: A2 vs B1👉సెప్టెంబరు 24: A1 vs B2👉సెప్టెంబరు 25: A2 vs B2👉సెప్టెంబరు 26: A1 vs B1👉సెప్టెంబరు 28: ఫైనల్.చదవండి: IND vs AUS: ధావన్ ధనాధన్.. పఠాన్ విధ్వంసం.. యువీ మాత్రం విఫలం

ఏడాది వయస్సున్న బుడ్డోడు కొరికితే కోబ్రానే చనిపోయింది..!
సాధారణంగా పాము కరిచి ప్రజలు మృత్యువాత పడిన ఘటనలే మనకు కనిపిస్తూ ఉంటాయి. అదే మనిషి కరిస్తే పాము చచ్చిపోతుందా అనేది మాత్రం ఇక్కడ ఆసక్తికరం. ఒకవేళ ఈ తరహా ఘటనలు జరిగినా అరుదనే చెప్పాలి. మరి ఏడాది వయస్సున్న చంటోడు కోబ్రాను కొరికితే అది చచ్చిపోయిన ఘటన తాజాగా వెలుగుచూసింది. ఈ ఘటన బిహార్ రాష్ట్రంలోబెట్టాహ్ జిల్లాలోని వెస్ట్ చాంపరన్లో చోటుచేసుకుంది. ఆ బుడ్డోడు ఇంట్లో ఆడుకుంటున్న సమయంలో కోబ్రా వచ్చింది. అయితే అది ఆట వస్తువు అనుకున్న ఆ పిల్లాడు.. దాన్ని గట్టిగా పట్టుకుని ఒక పట్టుపట్టాడు. ఆ పామును కోరిక పారేశాడు. దాంతో ఆ పాము చనిపోవడం ఇప్పుడు షాకింగ్ ఘటనగా మారిపోయింది. పామును కరిచిన తర్వాత ఆ చంటోడు స్పృహ కోల్పోవడంతో హుటాహుటీనా ఆస్పత్రికి తరలించారు. ఆ పిల్లాడికి ఎటువంటి విషం ఎక్కలేదని డాక్టర్లు చెప్పడంతో తల్లి దండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ పిల్లాడ్ని కొన్ని గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచాలనే డాక్టర్ల సూచన మేరకు అక్కడే ఉంచారు. ఆ పిల్లాడి అమ్మమ్మ చెప్పిన దాని ప్రకారం.. ఒక పొడవాటి కోబ్రా ఇంట్లోకి వచ్చిందని, ఆ సమయంలో పిల్లాడు ఆడుకుంటూ ఉన్నాడని, ఆ పామును ఆట వస్తువు అనుకుని దగ్గరకు వెళ్లి దాన్ని పట్టుకుని నోటితో కొరికినట్లు చెప్పారు.

ఈ హీరోయిన్కు అప్పట్లో ఫుల్ క్రేజ్.. ఇలా మారిపోయిందేంటి!
పైన కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? అప్పట్లో ఓ వెలుగు వెలిగింది. తెలుగులోనే కాదు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేసింది. కోలీవుడ్లో అగ్ర కథానాయికగా స్టార్డమ్ అందుకుంది. కానీ, అందరిలాగే పెళ్లి కాగానే నటనకు గుడ్బై చెప్పి ఇంటికే పరిమితమైంది. 2009 తర్వాత మరే చిత్రంలోనూ కనిపించనేలేదు. ఇంతకీ ఆ కథానాయిక మరెవరో కాదు మాళవిక (Actress Malavika).పెళ్లయ్యాక సినిమాలకు గుడ్బైమాళవిక అసలు పేరు శ్వేత కొన్నూర్ మీనన్ (Shweta Konnur Menon). చాలా బాగుంది చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. దీవించండి, శుభకార్యం, నవ్వుతూ బతకాలిరా, ప్రియ నేస్తమా, అప్పారావు డ్రైవింగ్ స్కూల్, చంద్రముఖి చిత్రాల్లో నటించింది. తమిళంలో స్టార్ హీరోల సరసన హీరోయిన్గా నటించి ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. బోల్డ్ పాత్రల్లోనూ కాదనకుండా యాక్ట్ చేసింది. 2007లో సుమేశ్ మీనన్ను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. ఆమధ్య రీఎంట్రీకి రెడీ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇలా అయిపోయిందేంటి?పుష్పలో సమంతలా 'ఊ అంటావా మావా.. ఉఊ అంటావా మావా..' వంటి ఐటం సాంగ్స్ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు చెప్పింది. కానీ ఇంతవరకు ఏ సినిమాలోనూ కనిపించనేలేదు. అప్పట్లో నాజూకుగా ఉన్న మాళవిక ప్రస్తుతం కాస్త బొద్దుగా తయారైంది. యోగాతో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటున్న ఈమె.. ఇంతలా లావైపోవడంతో అభిమానులు వెంటనే గుర్తుపట్టలేకపోతున్నారు. మాళవిక ఇలా అయిపోయిందేంటని ఆశ్చర్యపోతున్నారు. View this post on Instagram A post shared by Shweta Konnur Menon (@shwetakonnurmenon) View this post on Instagram A post shared by Shweta Konnur Menon (@shwetakonnurmenon) చదవండి: ప్రియురాలితో ఎక్కువసేపు గడపాలనుంది: విజయ్ దేవరకొండ

స్పెషల్ సిలబస్గా ‘ఆపరేషన్ సిందూర్’..!
ఢిల్లీ: పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్.. తరగతి గదుల్లో పిల్లలు చదువుకునే పాఠాల్లోకి రావడానికి కసరత్తులు జరుగుతున్నాయి. ఇది తరతరాలు గుర్తుపెట్టుకునే దిశగా ఉండేందుకు వీలుగా ఇప్పటికే కార్యాచరణ మొదలైంది. ఈ మేరకు ఎన్సీఈఆర్టీ(నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్) సిలబస్లో ఆపరేషన్ సిందూర్ ను పాఠ్యాంశంగా చేర్చేందుకు ఏర్పాట్లు జరగుతున్నాయి. దీన్ని స్పెషల్ క్లాస్రూమ్ సిలబస్’గా ప్రవేశపెట్టే యోచనలో ఉంది ఎన్సీఈఆర్టీ. మూడో తరగతి నుంచి 12వ తరగతి వరకూ ఈ సిలబస్ను ప్రవేశ పెట్టాలనే దిశగా కసరత్తు జరుగుతుంది. దీన్ని రెండు భాగాలుగా విభజించి.. మూడు నుంచి ఎనిమిదో తరగతి వరకూ ఒక పార్ట్గా, తొమ్మిదో తరగతి నుంచి 12వ తరగతి వరకూ రెండో పార్ట్గా విభజించి సదరు సిలబస్లో చేర్చడానికి ఎన్సీఈఆర్టీ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఉగ్రవాద ముప్పులకు దేశాలు ఎలా స్పందిస్తాయో అనే అంశంతో పాటు జాతీయ భద్రతలో రక్షణ, దౌత్యం మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం ఎలాంటి పాత్ర పోషిస్తాయో అనేది విద్యార్థులకు చేరువ చేయడమే ఈ సిలబస్ యొక్కు ముఖ్య ఉద్దేశంగా సమాచారం.

రూ.15 వేలు బోనస్.. ఆగస్టు 1 నుంచి కొత్త పథకం
కేంద్ర ప్రభుత్వ కొత్త పథకం ఆగస్టు 1 నుంచి ప్రారంభం కానుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ)లో రిజిస్టర్ చేసుకున్న మొదటిసారి ఉద్యోగులు అంటే ఇప్పుడే కొత్తగా ఉద్యోగంలో చేరుతున్నవారికి కొత్తగా ప్రారంభిస్తున్న పీఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన (పీఎం-వీబీఆర్వై) కింద రూ.15,000 లభిస్తాయి. ఎంప్లాయిమెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ (ఈఎల్ఐ)గా పిలిచే ఈ పథకానికి రూ.99,446 కోట్ల బడ్జెట్తో కేంద్ర కేబినెట్ ఇటీవల ఆమోదం తెలిపిందని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించింది. పీఎం-వీబీఆర్వై పథకం యాజమాన్యాలకు ప్రోత్సాహకాలను అందించడం ద్వారా కొత్త ఉద్యోగాలను సృష్టించడానికి ప్రోత్సహిస్తుంది. వివిధ రంగాల్లో, ముఖ్యంగా తయారీ రంగంలో ఉద్యోగావకాశాలను పెంచడమే దీని ప్రధాన లక్ష్యం. ఉపాధి ఆధారిత అభివృద్ధి ద్వారా భారత ఆర్థిక వృద్ధిని నడిపించడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తుంది.పథకం అమలు తీరు ఇలా..ఈ పథకం రెండు విధాలుగా ప్రోత్సాహాలు అందిస్తుంది. ఒకటి మొదటిసారి ఉద్యోగుల కోసం, మరొకటి యజమానుల కోసం. ఈ భాగం మొదటిసారిగా శ్రామిక శక్తిలో చేరిన (ఈపీఎఫ్ఓలో నమోదై ఉండాలి) వారిని లక్ష్యంగా చేసుకుంటుంది. అర్హత కలిగిన ఉద్యోగులు (రూ .1 లక్ష వరకు వేతనం ఉన్నవారు) రూ .15,000 వరకు వన్ టైమ్ ఈపీఎఫ్ వేతన ప్రయోజనాన్ని పొందుతారు.దీన్ని ఉద్యోగంలో చేరిన 6 నెలల తరువాత, మళ్లీ 12 నెలల నిరంతర సర్వీస్ తర్వాత రెండు వాయిదాలలో చెల్లిస్తారు. రెండో విడత పొందాలంటే ఉద్యోగులు తప్పనిసరిగా ఫైనాన్షియల్ లిటరసీ ప్రోగ్రామ్ పూర్తి చేయాలి. పొదుపు అలవాట్లను పెంపొందించడానికి ఈ ప్రోత్సాహకంలో కొంత భాగాన్ని పొదుపు ఖాతా లేదా సాధనానికి కేటాయిస్తారు. దాన్ని తరువాత ఉపసంహరించుకోవచ్చు.ఇక కొత్తగా ఉద్యోగాలు కల్పిస్తున్న యాజమాన్యాలకూ ఈ పథకం కింద ప్రోత్సాహాలు ఉంటాయి. ముఖ్యంగా తయారీ రంగంలో కొత్త కార్మికులను నియమించుకునే యాజాన్యాలకు కనీసం ఆరు నెలల పాటు ఉద్యోగంలో కొనసాగే ప్రతి కొత్త ఉద్యోగికి నెలకు రూ.3,000 వరకు ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఈ మద్దతు రెండు సంవత్సరాలు కొనసాగుతుంది. అదే తయారీ యూనిట్లకు అయితే ప్రోత్సాహక కాలాన్ని మూడు, నాల్గవ సంవత్సరాలకు కూడా పొడిగించే అవకాశం ఉంటుంది.ఈ పథకం నుండి ప్రయోజనం పొందడానికి,ఈపీఎఫ్ఓలో నమోదైన కంపెనీలు కొత్త ఉద్యోగులను నియమించుకుని వారిని కనీసం ఆరు నెలల పాటు కొనసాగించాల్సి ఉంటుంది. 50 మంది కంటే తక్కువ ఉద్యోగులు ఉన్న సంస్థలైతే కనీసం ఇద్దరిని, 50 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న సంస్థలు కనీసం ఐదుగురిని కొత్తగా నియమించుకోవాలి.ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ (ఏబీపీఎస్)ను ఉపయోగించి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) ద్వారా తొలిసారి ఉద్యోగులకు చెల్లింపులు జరుగుతాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే సమయంలో లబ్ధిదారు కంపెనీలకు ప్రోత్సాహకాలను నేరుగా ఆ సంస్థ పాన్ లింక్ అయిన బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు.

బాబుకు టెన్షన్!.. అమరావతి పుంజుకునేది ఇంకెన్నడు?
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ కోసం రైతులకు ఇస్తున్న ప్యాకేజీ బాగుందా? లేక పంజాబ్లో ఇటీవల ప్రకటించింది మెరుగ్గా ఉందా?. అమరావతి రైతులు ఈ విషయంపై కొంత విశ్లేషణ చేసుకోవడం మేలు. పంజాబ్ ప్రభుత్వం గృహ నిర్మాణం, పారిశ్రామిక రంగం కోసం ఇటీవలే 21 ప్రాంతాల్లో సుమారు 65 వేల ఎకరాలు సేకరించేందుకు సిద్ధమైంది. పరిహారం కోసం ముందుగా ఒక ప్యాకేజీ ప్రకటించింది కానీ విపక్షాలు, రైతులు తీవ్రంగా వ్యతిరేకించడంతో సవరించాల్సి వచ్చింది.కొత్త ప్యాకేజీతో పూర్తిగా సంతృప్తి చెందకపోయినా కొన్నిచోట్ల మాత్రం రైతులు స్వచ్ఛందంగా భూమి ఇచ్చేందుకు ముందుకు వస్తున్నట్లు పంజాబ్ మీడియా కథనాలు చెబుతున్నాయి. వాణిజ్య అవసరాల కోసం ఇస్తే ఎకరా భూమికి 800 గజాల ప్లాట్ కేటాయించారు. పారిశ్రామిక అవసరాల కోసం ఇస్తే వెయ్యి గజాల పారిశ్రామిక ఫ్లాట్, 300 గజాల నివాస ప్రాంతం, వంద గజాల వాణిజ్య ప్లాట్ ఇస్తామని పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. ఎకరాకు రూ.30 వేల కౌలు ముందు ప్రకటించారు. వ్యతిరేకతతో దీన్ని రూ.50 వేలకు పెంచారు. సేకరించిన భూమి అభివృద్ధి మొదలుపెట్టిన తరువాత రైతులకు ఎకరాకు రూ.లక్ష చొప్పున చెల్లించాలని నిర్ణయించింది. భూమి అభివృద్దిలో ఆలస్యం జరిగితే కౌలు మొత్తాన్ని ఏడాదికి పది శాతం చొప్పున పెంచుతారు. సేకరించిన భూమి సెంట్లలో మాత్రమే ఉన్నా వారికి కూడా వాణిజ్య ప్లాట్లు ఇస్తారు. ప్రభుత్వం ఇచ్చే లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఆధారంగా బ్యాంకుల నుంచి రుణాలు పొందడానికి అవకాశం కల్పిస్తున్నారు.అమరావతిలో చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించిన ల్యాండ్ పూలింగ్ ప్యాకేజీని పంజాబ్తో పోల్చి చూస్తే ఎన్నో లోటుపాట్లు కనిపిస్తాయి. ముఖ్యంగా భూమి అభివృద్ధి మొదలుపెట్టిన తరువాత కౌలు మొత్తం రూ.లక్ష చెల్లించే అంశం ఉన్నట్లు లేదు. ప్రభుత్వం ఆ స్థలంలో అభివృద్ధి చేపట్టేలోగా క్రయ విక్రయాలు జరుపుకోవచ్చని పంజాబ్ ప్రభుత్వం తెలిపింది. అలాగే ఆ భూములలో పట్టణాభివృద్ధి పనులు ఆరంభం అయ్యే వరకు రైతులు వ్యవసాయం కొనసాగించుకోవచ్చు. ఏపీలో అసలు అభివృద్ది పనులు ఆరంభం కాకముందే వేల ఎకరాలలో గట్లను తొలగించి, రైతులు పంటలు వేసుకునే అవకాశం లేకుండా చేశారు. దాంతో అవి పిచ్చి చెట్లతో నిండిపోయాయి. ఇప్పుడు ఆ కంప కొట్టడానికి ఏపీ ప్రభుత్వం కోట్లు వెచ్చిస్తోంది.మరోవైపు రైతులు స్వచ్చందంగా ఇస్తేనే భూమి తీసుకుంటామని, బలవంతంగా సమీకరించబోమని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ చెప్పడం విశేషం. అయినప్పటికీ అక్కడి విపక్షం రైతుల భూములు దోచుకుంటున్నారని, ఉద్యోగులకు జీతాలు పెన్షన్లు ఇవ్వలేకపోతున్న ప్రభుత్వం ఈ స్కీమును ఎలా అమలు చేస్తుందని ప్రశ్నించాయి. ప్రతి మహిళకు నెలకు రూ.వెయ్యి చొప్పున ఇస్తామని చేసిన హామీ మాటేమిటని ప్రశ్నించాయి. విపక్షాల ప్రచారాన్ని భగవంత్ సింగ్ మాన్ కొట్టిపారేసి, రైతులకు మేలైన ప్యాకేజీ ప్రకటించామని చెబుతున్నారు. ఈ రకంగా ఆలోచిస్తే ఏపీలో ఇప్పటికే 13 నెలల్లోనే సుమారు రూ.1.80 లక్షల కోట్ల అప్పులు చేసిన ప్రభుత్వం ఖజానా ఖాళీగా ఉందని తరచూ ప్రకటిస్తోంది. సూపర్ సిక్స్లో ఒకటి అర హామీలు మాత్రమే అమలు చేసింది. అమలు చేయని వాటిలో ఆడబిడ్డ నిధి కూడా ఉంది. అయినా ఏపీ ప్రభుత్వం అదనంగా మరో 44 వేల ఎకరాల భూమి సేకరణకు సిద్ధమైంది. ఈ విషయంలో ఇక వెనక్కు తగ్గేదే లేదని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఇటీవలే స్పష్టం చేసిన విషయం తెలిసిందే.పోలీసులు, మీడియాను అడ్డం పెట్టుకుని, అమరావతి సెంటిమెంట్ను ప్రయోగించి విపక్ష గొంతు నొక్కి అయినా తాను అనుకున్న విధంగా లక్ష ఎకరాల భూమిని తన అధీనంలోకి తీసుకోవాలని చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి సర్కార్ చేస్తున్న ప్రయత్నాలు ఎంత మేర సఫలమవుతాయన్నది చర్చనీయాంశంగా ఉంది. పంజాబ్ రైతుల మాదిరి మరింత గట్టిగా నిలబడితే అమరావతి ప్రాంత రైతులకు కాని, కొత్తగా భూములు తీసుకోబోతున్న గ్రామాల రైతులకు కానీ ప్రయోజనం ఉండవచ్చు. ప్రభుత్వం సకాలంలో భూమిని అభివృద్ధి చేసి వారికి ప్లాట్లు ఇస్తే, వాటికి మంచి ధర పలికితేనే రైతులకు, లేదా భూమి సొంతదారులకు ఉపయోగం ఉండవచ్చు. కానీ, ఏపీలో అమరావతి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ఆశించిన రీతిలో లేకపోవడం కొంత నిరుత్సాహం కలిగిస్తుంది. ఒకప్పుడు ప్రభుత్వం సృష్టించిన విపరీతమైన హైప్ వల్ల భూముల రేట్లు భారీగా పెరిగాయి. కానీ ఆచరణలో ప్రభుత్వం భూమిని అభివృద్ది చేయలేకపోవడం, ఓవరాల్గా ఆర్థిక వ్యవస్థ దేశవ్యాప్తంగా కొంత మందగించడం మొదలైన కారణాలు రియల్ ఎస్టేట్ను ప్రభావితం చేశాయి. దాంతో అమరావతి గ్రామాలలో కొనుగోలు, అమ్మకపు లావాదేవీలు తగ్గుముఖం పట్టాయన్న అభిప్రాయం ఉంది. ధరలు కూడా గతంలో ఉన్న స్థాయిలో లేవని చెబుతున్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మీడియా బలంతో ప్రతి విషయాన్ని తనకు అనుకూలంగా మలచుకుని ఏదో జరిగిపోతోందన్న భ్రమ కల్పిస్తుంటారు. కొన్నిసార్లు ఆ వ్యూహం సక్సెస్ అయినా, ఎక్కువ సార్లు విఫలమవుతుంటుంది. అప్పుడు దానిని వదలిపెట్టి కొత్తదేదో చేపడుతుంటారు. అమరావతి రాజధాని విషయంలో కూడా అలాగే జరుగుతున్నట్లు అనిపిస్తుంది. తొలుత అమరావతి రాజధాని నిర్ణయాన్ని రకరకాలుగా ప్రచారం చేయడంతో కొన్ని ప్రాంతాల వారు ముఖ్యంగా నూజివీడు పరిసర ప్రాంతాలలో భూములు కొన్నవారు అప్పట్లో తీవ్రంగా నష్టపోయారు. కానీ, అంతర్గత సమాచారం ఆధారంగా ప్రస్తుతం రాజధానిగా పరిగణిస్తున్న గ్రామాలలో టీడీపీ నేతలు పలువురు భూములు కొని లాభపడ్డారని చెబుతారు. కానీ, అది కూడా తాత్కాలికమే అయింది. రైతుల వద్ద కాస్త అధిక ధరకు కొనుగోలు చేసి, అంతకన్నా ఎక్కువకు అమ్ముకున్న వారు లాభపడ్డారు. కానీ, ఇంకా బాగా లాభాలు వస్తాయన్న భావనతో ఉన్నవారు మాత్రం కొంతమేర నష్టాల పాలయ్యారు.2024లో చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత భూముల ధరలు పెరుగుతాయని టీడీపీ వర్గాలు ప్రచారం చేశాయి. ఎన్నికలలో కూడా ఆ పాయింట్ ఆధారంగా లబ్ది పొందే యత్నం చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక ఆ పరిస్థితి కనిపించడం లేదని చెబుతున్నారు. భూముల రేట్లు కృత్రిమంగా పెంచడం కోసం టీడీపీ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసినా జనం పెద్దగా విశ్వసిస్తున్నట్లు కనబడడం లేదు. దానికి తోడు ప్రభుత్వం మరో 44వేల ఎకరాల భూమి సేకరించబోతుందన్న ప్రకటన రావడంతో మొత్తం అప్సెట్ అయ్యారు. ప్రభుత్వం ముందు రైతుల నుంచి తీసుకున్న 33 వేల ఎకరాలతోపాటు, ప్రభుత్వ భూములు 20 వేల ఎకరాలు అభివృద్ది చేసిన తర్వాత తమ భూములు తీసుకోవాలి కాని, అదేమీ చేయకుండా భూ సమీకరణకు వస్తే అంగీకరించబోమని రైతులు ఖరాఖండిగా చెబుతున్నారు.రైతు నేత, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర రావు వంటి వారు సైతం చంద్రబాబు ప్రభుత్వ విధానాలను తీవ్రంగా తప్పుపడుతూ రైతులు భూములు ఇవ్వవద్దని ప్రచారం చేస్తున్నారు. గతంలో తీసుకున్న భూములకు రైతులకు ఇవ్వవలసిన ప్లాట్లు కాగితాల మీదే ఉన్నాయి తప్ప ఎవరికి అందలేదు. ఎకరాకు 1200 గజాలు ఇస్తామని ప్రభుత్వం తెలిపే డాక్యుమెంట్ల ఆధారంగా బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదట. నెల రోజుల నుంచి రియల్ ఎస్టేట్ రంగం మరీ కుదేలైందని వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం తెలిపిన దాని ప్రకారం రైతులకు ఇచ్చిన ప్లాట్లను అన్ని సదుపాయాలతో అభివృద్ది చేయాలి. ఆ పని ఇంతవరకు మొదలే కాలేదు. రైతులు ఎక్కడ భూమి ఇస్తారో, అక్కడే ప్లాట్లు కూడా ఇవ్వవలసి ఉంటుంది. ఆ పని చేయకుండా ఒక గ్రామంలో ఒక సంస్థకు భూమి కేటాయించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సంస్థ అక్కడ ఎలాంటి కార్యకలాపాలు చేపట్టడానికి వీలు లేకుండా రైతులు అడ్డుకున్నారట.మరోవైపు చంద్రబాబు నాయుడు నిత్యం ఏదో ఒక కార్యక్రమం పెట్టి క్వాంటమ్ వ్యాలీ అని, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అని, ఆదాని క్రీడా నగరమని, ఔటర్ రింగ్ రోడ్డు, ఆ రోడ్డు చుట్టూ హైటెక్ సిటీ అని విస్తారంగా ప్రచారం చేస్తున్నారు. ఎల్లో మీడియా ఆ వార్తలను పతాక శీర్షికలుగా వండి వారుస్తోంది. ఇదంతా ఎప్పటికి అవుతుందో తెలియని స్థితిలో రైతులు ఆందోళన చెందుతున్నారు. రాజధాని నిర్మాణం పేరుతో రూ.31 వేల కోట్ల అప్పు చేసిన ప్రభుత్వం టెండర్లు మాత్రం రూ.ఏభై వేల కోట్లకు పైగానే పిలిచిందట. ఈ నిర్మాణాలన్నీ పూర్తి కావడానికి మూడు, నాలుగేళ్లు పట్టవచ్చని ప్రభుత్వమే చెబుతోంది. ప్రభుత్వ భవనాల నిర్మాణం వల్ల రియల్ ఎస్టేట్ ఎంతమేర పుంజుకుంటుందో చెప్పలేం. వ్యాపార, పారిశ్రామిక రంగంలో కొత్త సంస్థలు వస్తే కొంత అభివృద్ది ఉండవచ్చు. కాని ప్రస్తుత పరిస్థితి అంత అనువుగా లేదు.ఎంతో అభివృద్ది చెందిన హైదరాబాద్ నగరంలోనే రియల్ ఎస్టేట్ రంగం ఆశించిన రీతిలో సాగడం లేదన్నది సర్వత్రా ఉన్న అభిప్రాయం. ఇంకో మాట చెప్పాలి. విశాఖ వంటి నగరంలో పెద్ద కంపెనీలకు 99 పైసలకే ఎకరా భూములు కట్టబెడుతున్న ప్రభుత్వం అమరావతిలో మాత్రం కొన్ని సంస్థలకు ఎకరా రూ.నాలుగు కోట్లకు చెల్లించాలని అంటోంది. ప్రపంచ బ్యాంకుకు ఇచ్చిన నివేదికలో ఎకరా ఇరవై కోట్లకు పైగానే అమ్ముడు పోతుందని తెలిపారట. భూముల అమ్మకం ద్వారా అప్పులు తీర్చుతామని చెబితే అదెప్పుడు ఆరంభం అవుతుందని ప్రపంచ బ్యాంక్ అడిగితే ప్రభుత్వం సమాధానమిచ్చేందుకు మల్లగుల్లాలు పడుతోంది.అమరావతి ద్వారా సంపద సృష్టి ఎప్పటి నుంచి మొదలు అవుతుందని ఒక విలేకరి చంద్రబాబును అడిగితే అది నిరంతర ప్రక్రియ అని, మూడేళ్లలో సెట్ అవుతుందని, ఆ తర్వాత దాని ప్రభావం ఉంటుందని జవాబు ఇచ్చారు. ఒకప్పుడు ఇది సెల్ఫ్ ఫైనాన్స్డ్ నగరం అని చంద్రబాబు ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు వేల కోట్ల అప్పులు చేయాల్సి వస్తోంది. అయినా రియల్ ఎస్టేట్ రంగం ప్రభుత్వం కోరుకున్న రీతిలో సాగడం లేదు. ఈ వ్యాపారం సంగతి ఎలా ఉన్నా, ప్రభుత్వం రైతులకు మేలు చేయదలిస్తే పంజాబ్లో మాదిరి ప్యాకేజీని, ప్రత్యేకించి కౌలు మొత్తాన్ని పెంచితే కొంతవరకు మంచిదేమో ఆలోచించాలి.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
ఘనంగా ‘కింగ్డమ్’ ట్రైలర్ లాంచ్.. అంచనాలు తారాస్థాయికి
స్పోర్ట్స్ టీచర్ నిర్వాకం.. విద్యార్థినులకు అస్వస్థత
IND vs ENG: ముగిసిన నాలుగవ రోజు ఆట.. భారత్ స్కోరు ఎంతంటే..
ఏడాది వయస్సున్న బుడ్డోడు కొరికితే కోబ్రానే చనిపోయింది..!
ఫోన్కి వస్తున్న మెసేజ్లలో కొత్త మార్పులు.. గమనించారా?
‘నేను జైల్లో ఉన్నప్పుడు మా అన్న కేటీఆర్, మా బావ హరీష్ వచ్చి..’
ఈ హీరోయిన్కు అప్పట్లో ఫుల్ క్రేజ్.. ఇలా మారిపోయిందేంటి!
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. నలుగురు మావోలు మృతి
Asia Cup: పూర్తి షెడ్యూల్ విడుదల.. భారత్- పాక్ మ్యాచ్ల తేదీలివే!
500 ఫ్లాట్లు.. రూ .1,600 కోట్లు.. వారంలో ఫినిష్!
రియల్ హీరో అనిపించుకున్న సోనూ సూద్.. ఫిష్ వెంకట్ ఫ్యామిలీకి సాయం!
'హరి హర వీరమల్లు' మొదటిరోజు కలెక్షన్స్.. గట్టిగానే బాయ్కాట్ దెబ్బ
తల్లి ఏమరపాటు.. బిడ్డ ప్రాణం తీసింది
బగారా రైస్. చికెన్ కర్రీతో టీచర్ల విందు..కట్ చేస్తే కలెక్టర్..!
చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్.. తొలి ప్లేయర్గా ప్రపంచ రికార్డు
'మళ్లీ ఇలాంటి అద్భుతమైన అవకాశం దొరికింది': అనసూయ
హరి హర వీరమల్లు.. హిట్టా..! ఫట్టా..!
హైదరాబాద్లో రూ.25 లక్షలకే 2 BHK ఫ్లాట్
HHVM Review: ‘హరి హర వీరమల్లు’ మూవీ రివ్యూ
ఓటీటీ ప్రియులకు పండగే.. ఈ శుక్రవారం 14 చిత్రాలు స్ట్రీమింగ్!
హరిహర వీరమల్లు పార్ట్-2.. నిర్మాత రత్నం షాకింగ్ సమాధానం!
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. వ్యాపారాలు విస్తరిస్తారు
భారతీయులను నియమించకుండా కాపలాగా నాడ్యూటీ తనే చేస్తున్నారు!
'మహావతార్: నరసింహ' మూవీ రివ్యూ
విశ్వంభరకు బై బై
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం
త్వరలో 25000 మంది ఉద్యోగాలు కట్..
మీరు నటనకు ఎప్పుడూ దూరంగా లేర్సార్! నటిస్తూనే ఉన్నారు!
ఊపిరి పీల్చుకున్న పసిడి ప్రియులు.. తులం ఎంతంటే..
ఘనంగా ‘కింగ్డమ్’ ట్రైలర్ లాంచ్.. అంచనాలు తారాస్థాయికి
స్పోర్ట్స్ టీచర్ నిర్వాకం.. విద్యార్థినులకు అస్వస్థత
IND vs ENG: ముగిసిన నాలుగవ రోజు ఆట.. భారత్ స్కోరు ఎంతంటే..
ఏడాది వయస్సున్న బుడ్డోడు కొరికితే కోబ్రానే చనిపోయింది..!
ఫోన్కి వస్తున్న మెసేజ్లలో కొత్త మార్పులు.. గమనించారా?
‘నేను జైల్లో ఉన్నప్పుడు మా అన్న కేటీఆర్, మా బావ హరీష్ వచ్చి..’
ఈ హీరోయిన్కు అప్పట్లో ఫుల్ క్రేజ్.. ఇలా మారిపోయిందేంటి!
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. నలుగురు మావోలు మృతి
Asia Cup: పూర్తి షెడ్యూల్ విడుదల.. భారత్- పాక్ మ్యాచ్ల తేదీలివే!
500 ఫ్లాట్లు.. రూ .1,600 కోట్లు.. వారంలో ఫినిష్!
రియల్ హీరో అనిపించుకున్న సోనూ సూద్.. ఫిష్ వెంకట్ ఫ్యామిలీకి సాయం!
తల్లి ఏమరపాటు.. బిడ్డ ప్రాణం తీసింది
'హరి హర వీరమల్లు' మొదటిరోజు కలెక్షన్స్.. గట్టిగానే బాయ్కాట్ దెబ్బ
బగారా రైస్. చికెన్ కర్రీతో టీచర్ల విందు..కట్ చేస్తే కలెక్టర్..!
చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్.. తొలి ప్లేయర్గా ప్రపంచ రికార్డు
'మళ్లీ ఇలాంటి అద్భుతమైన అవకాశం దొరికింది': అనసూయ
హైదరాబాద్లో రూ.25 లక్షలకే 2 BHK ఫ్లాట్
HHVM Review: ‘హరి హర వీరమల్లు’ మూవీ రివ్యూ
ఓటీటీ ప్రియులకు పండగే.. ఈ శుక్రవారం 14 చిత్రాలు స్ట్రీమింగ్!
హరిహర వీరమల్లు పార్ట్-2.. నిర్మాత రత్నం షాకింగ్ సమాధానం!
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. వ్యాపారాలు విస్తరిస్తారు
భారతీయులను నియమించకుండా కాపలాగా నాడ్యూటీ తనే చేస్తున్నారు!
'మహావతార్: నరసింహ' మూవీ రివ్యూ
విశ్వంభరకు బై బై
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం
త్వరలో 25000 మంది ఉద్యోగాలు కట్..
మీరు నటనకు ఎప్పుడూ దూరంగా లేర్సార్! నటిస్తూనే ఉన్నారు!
పుట్టబోయే బిడ్డ కోసం మెగా జంట షాపింగ్
ఊపిరి పీల్చుకున్న పసిడి ప్రియులు.. తులం ఎంతంటే..
సినిమా

టెన్షన్ ఎందుకు? భర్త ఉద్యోగానికి వెళ్తే భార్య పిల్లల్ని చూసుకోవాలి!
భర్త ఉద్యోగానికి వెళ్తే భార్య పిల్లల్ని చూసుకోవాలి అంటున్నాడు బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి. ఆమాత్రం అర్థం చేసుకోకపోతే సంబంధాలు ఎలా నిలుస్తాయని ప్రశ్నిస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సునీల్ శెట్టి (Suniel Shetty) మాట్లాడుతూ.. ఈరోజుల్లో పిల్లలకు బొత్తిగా ఓపిక ఉండట్లేదు. పెళ్లి అంటే కాంప్రమైజ్ అనుకుంటున్నారు. మీరు అర్థం చేసుకోవాల్సిందేంటే.. పెళ్లంటే ఒకరికోసం మరొకరు జీవించడం. భార్య పిల్లల్ని చూసుకోవాలిమీకు పిల్లలు ప్టుటారే అనుకోండి.. భర్త ఉద్యోగానికి వెళ్తే భార్య పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. భర్త కెరీర్ కూడా ముఖ్యమే కదా అని ఆలోచించి పిల్లల బాధ్యత తీసుకోవాలి. భర్త కూడా పిల్లల గురించి ఆలోచిస్తాడు, వారికి అండగా నిలబడతాడు. కానీ ఈరోజుల్లో ప్రతిదానికీ టెన్షన్ పడుతున్నారు. అన్నింటినీ ఒత్తిడిలా ఫీలవుతున్నారు. పైగా ఈ డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరూ సలహా ఇచ్చేవాళ్లే! పెద్దవాళ్లను చూసి నేర్చుకోండితల్లి ఎలా ఉండాలి? తండ్రి ఎలా ఉండాలి? ఏం తినాలి? ఏం చేయాలి? ఇవన్నీ ఆన్లైన్లో కూడా కనిపిస్తాయి. వాటితో ఇంట్లో వాళ్లను పోలుస్తూ.. నా భాగస్వామి ఇలా లేదేంటని బాధపడతారు. ఏదైనా సరే అనుభవాల నుంచి నేర్చుకుంటేనే మంచిది, లేదంటే అమ్మ, నానమ్మ, అమ్మమ్మ, అక్క, వదినలు.. వీరిని చూసి కూడా ఎంతోకొంత నేర్చుకోవచ్చు. వారిలో మీకు పనికొచ్చే లక్షణాలను ఎంపిక చేసి ఆచరించండి. పనికిరానివి వదిలేయండి. కానీ అవన్నీ ఇప్పుడెవరు చేస్తున్నారు. అలా పెళ్లయిందో లేదో ఇలా విడాకులు తీసుకుంటున్నారు అని చెప్పుకొచ్చాడు.ఫస్ట్ సినిమాకు ముందే 40 చిత్రాలుసినీ జర్నీ గురించి మాట్లాడుతూ.. నా తొలి సినిమా రిలీజవ్వడానికి ముందే నా చేతిలో 40 చిత్రాలున్నాయి. అందులో ఏవి ఆడతాయి? ఏవి ఫ్లాప్ అవుతాయి? అని నేను పెద్దగా ఆలోచించలేదు. అప్పట్లో మానసిక ఆరోగ్యం, డిప్రెషన్ అన్న పదాలే మాకు తెలియవు. కాస్త బాధపడుకుంటూ ఉన్నా సరే అమ్మ వచ్చి తిట్టగానే అదెటో వెళ్లిపోయేది. బాధపడుతూ కూర్చునేంత టైం ఇచ్చేవాళ్లు కాదు అని చెప్పుకొచ్చాడు. అయితే ఈ రోజుల్లో మానసిక ఆరోగ్యం దిగజారుతున్న నేపథ్యంలో 2023లో సునీల్ శెట్టి లెట్స్ గెట్ హ్యాపీ అనే హెల్త్ యాప్ రిలీజ్ చేశాడు. సినిమాల విషయానికి వస్తే.. బాలీవుడ్లో అనేక చిత్రాలు సునీల్ శెట్టి తెలుగులో మోసగాళ్లు, గని మూవీస్లో కనిపించాడు. ప్రస్తుతం వెల్కమ్ టు ద జంగిల్ చిత్రంలో నటిస్తున్నాడు.చదవండి: బ్లాంక్ చెక్ ఇచ్చాం.. అయినా అతడు రిజెక్ట్ చేశారు: మురళీ మోహన్

బేబీ బంప్తో తొలిసారి కనిపించిన మెగా కోడలు
మెగా కోడలు లావణ్య త్రిపాఠి త్వరలో బిడ్డకు జన్మనివ్వబోతుంది. ఈ క్రమంలోనే అందుకు కావాల్సినవన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. రీసెంట్గానే భర్త వరుణ్ తేజ్తో కలిసి దుబాయి వెళ్లిన లావణ్య.. బేబీ కోసం షాపింగ్ కూడా పూర్తి చేసేసింది. ఇప్పుడు తిరిగి హైదరాబాద్ వచ్చేసింది. ఈ క్రమంలోనే తొలిసారిగా ఈమె బేబీ బంప్తో కెమెరా కంటికి కనిపించింది. ప్రస్తుతం ఆ ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా)ఇకపోతే మెగా ఫ్యామిలీకి చెందిన వరుణ్ తేజ్తో మిస్టర్, అంతరిక్షం సినిమాలు చేసిన లావణ్య త్రిపాఠి.. అతడితోనే ప్రేమలో పడింది. దాదాపు ఆరేడేళ్ల పాటు వీళ్లిద్దరూ లవ్ చేసుకున్నారు. కానీ ఎక్కడా ఆ విషయం బయటపడకుండా జాగ్రత్త పడ్డారు. అలా పెద్దల్ని ఒప్పించి 2023 నవంబరులో పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది మే లో తాము తల్లిదండ్రులు కాబోతున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు పుట్టబోయే బేబీ కోసం షాపింగ్ కూడా పూర్తి చేసి తిరిగి హైదరాబాద్ వచ్చేశారు.లావణ్య త్రిపాఠి విషయానికొస్తే.. ఉత్తరప్రదేశ్కి చెందిన ఈమె 'అందాల రాక్షసి' సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది. తర్వాత తెలుగుతో పాటు తమిళంలోనూ పలు చిత్రాలు చేసింది. భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయన, దూసుకెళ్తా తదితర సినిమాలు లావణ్యకు మంచి పేరు తీసుకొచ్చాయి. కానీ గత కొన్నేళ్లలో చేసిన మూవీస్ మాత్రం బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆడలేదు. ప్రస్తుతం ఈమె చేతిలో 'సతీ లీలావతి', తనళ్ అనే సినిమాలు ఉన్నాయి. వీటి షూటింగ్ అయితే లావణ్య పూర్తి చేసినట్లు ఉంది. త్వరలో ఇవి రిలీజ్ కావొచ్చు.(ఇదీ చదవండి: ఎన్టీఆర్ 'కొత్త' ఇల్లు.. ఫ్రెండ్స్తో పార్టీ!)

రూ.200 కోట్ల క్లబ్లో ‘సైయారా’.. ఖాన్స్ రికార్డ్స్ బద్దలు
బాలీవుడ్ మొత్తం ఇప్పుడు సైయారా జపం చేస్తోంది. ఎక్కడ చూసినా ఈ చిన్న సినిమా గురించే చర్చిస్తున్నారు. విడుదలై వారం రోజులు దాటినా..జనాలు ఈ సినిమాను మర్చిపోవడం లేదు. బాక్సాఫీస్ కలెక్షన్స్ రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. వారం రోజుల్లో ఈ చిత్రం రూ. 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించి.. బడా హీరోల పేరిట ఉన్న రికార్డులను కొల్లగొడుతోంది.అహన్ పాండే, అనీత్ పడ్డా హీరోహీరోయిన్లు నటించిన ఈ చిత్రానికి మోహిత్ సూరి దర్శకత్వం వహించాడు. ఈ నెల 18న ఎలాంటి అంచనాలు లేకుండా కేవలం 800 థియేటర్స్లో మాత్రమే విడుదలైంది. తొలి రోజే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సంపాదించుకుంది. ఫలితంగా రెండో రోజు నుంచి ఈ సినిమా వసూళ్లు పుంజుకున్నాయి. ఎనిమిది రోజుల్లో రూ. 200 కోట్ల వరకు వసూళ్లను సాధించింది. ఇటీవల బాలీవుడ్లో విడుదలైన అన్ని చిత్రాల్లో ఇదే అత్యధిక కలెక్షన్స్. ఖాన్ సినిమాలు సైతం ఈ స్థాయిలో కలెక్షన్స్ని రాబట్టడం లేదు.(చదవండి: బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్.. 'సయారా' రివ్యూ) ఆమిర్ ఖాన్ ‘సితారే జమీన్ పర్ (164 కోట్లు), అజయ్ దేవ్గన్ రైడ్ 2 (173 కోట్ల) చిత్రాలకు మించిన కలెక్షన్స్ని రాబట్టి.. అత్యధిక వసూళ్ల సాధించిన డెబ్యూ ఫిల్మ్గా రికార్డెకెక్కింది. సినిమాకు హిట్ టాక్ రావడంతో థియేటర్స్ సంఖ్య కూడా భారీగా పెరిగింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 2000 థియేటర్స్లో ఈ సినిమా ప్రదర్శితం అవుతోంది. సైయారా కథ విషయానికొస్తే..వాణి బత్రా(అనీత్ పడ్డా) ఓ రైటర్. కాలేజీలో తన సీనియర్ అయిన మహేశ్ అయ్యర్ని ప్రేమించి, ఇంట్లో వాళ్లకి చెప్పి పెళ్లికి కూడా ఒప్పిస్తుంది. కానీ చివరి నిమిషంలో అతను హ్యాండ్ ఇస్తాడు. ఆరు నెలల వరకు వాణి ఆ డిప్రెషన్లోనే ఉంటుంది. తర్వాత ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరుతుంది. అదే రోజు ఆమె జీవితంలోకి క్రిష్ కపూర్ (అహన్ పాండే) వస్తాడు. తానో సింగర్. అవకాశాల కోసం తిరుగుతుంటారు. వాణితో కలిసి ఓ పాట కోసం పని చేస్తారు. ఈ క్రమంలో ఇద్దరు ప్రేమలో పడిపోతారు. అదే సమయంలో వాణి జీవితంలోకి మళ్లీ మహేశ్ అయ్యర్ వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది. ఈ ఇద్దరిలో వాణి ఎవరికి దగ్గరైంది అనేదే మిగతా కథ.

బ్లాంక్ చెక్ ఇచ్చాం.. అయినా అతడు రిజెక్ట్ చేశారు: మురళీ మోహన్
కొత్త సినిమాలు వస్తున్నా సరే పాత చిత్రాలను ఇంకా రీరిలీజ్ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే మహేశ్బాబు హీరోగా నటించిన క్లాసిక్ మూవీ అతడు (Athadu Movie Re Release)ను వచ్చే నెలలో మళ్లీ విడుదల చేస్తున్నారు. మహేశ్ బర్త్డే రోజైన ఆగస్టు 9న అతడు రీరిలీజ్ కానున్నట్లు ఇదివరకే ప్రకటించారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ చిత్ర నిర్మాత మురళీ మోహన్ ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చారు. అప్పటికే సినిమాలకు దూరం..ఈ సినిమాలో శోభన్బాబు నటించాల్సిందని, కానీ ఆయన రిజెక్ట్ చేశారని పేర్కొన్నారు. మురళీ మోహన్ (Murali Mohan) మాట్లాడుతూ.. అప్పటికే శోభన్బాబు సినిమాలు చేయడం ఆపేశారు. అతడు మూవీలో నాజర్ వేసిన క్యారెక్టర్ శోభన్బాబు వేస్తే బాగుంటుందనిపించింది. డైరెక్టర్ త్రివిక్రమ్తో చెప్తే అంతకంటే కావాల్సింది ఇంకేముంది? అన్నాడు. అప్పటికే మేము హైదరాబాద్ వచ్చేశాం. ఆయన చెన్నైలోనే ఉన్నారు. నేను నేరుగా అడగడానికి మొహమాటపడి మేకప్మెన్ రామును పిలిచాను. ఖాళీ చెక్..ఓ బ్లాంక్ చెక్ ఇచ్చి రాముతో చెన్నై పంపించాం. రెమ్యునరేషన్ తనకెంత కావాలనుకుంటే అంత రాసుకోమన్నాం. దాని గురించి బేరమాడాలనుకోలేదు. ఈ క్యారెక్టర్ ఆయన చేస్తే ఆ పాత్రకు ప్రాముఖ్యత పెరుగుతుంది, సినిమాకు విలువ వస్తుందనుకున్నాను. కానీ శోభన్బాబు (Sobhan Babu) ఫోన్ చేసి.. సారీ, మురళీ మోహన్గారు, ఏమీ అనుకోవద్దు. హీరోగానే గుర్తుండిపోవాలిఎవరైనా శోభన్బాబు అని గుర్తు చేసుకోగానే హీరోగా అందంగా, టిప్టాప్గా కనిపించాలే తప్ప తండ్రిగా, తాతగా, రోగిష్టిగా వారికి గుర్తు రాకూడదు. అలాంటి క్యారెక్టర్లు నేను చేయదల్చుకోలేదు. మీరేం అనుకోవద్దు. ఇది కచ్చితంగా మంచి సినిమా అయ్యుంటుంది, లేకపోతే మీరు తీయరు. నాకు ఇచ్చిన పాత్ర కూడా మంచిదే అయ్యుంటుంది, లేకుంటే మీరు నన్ను అడగరు. దయచేసి ఏమీ అనుకోవద్దు. నేను చేయలేనని తిరస్కరించారు అని మురళీ మోహన్ చెప్పుకొచ్చారు.చదవండి: ప్రియురాలితో ఎక్కువసేపు గడపాలనుంది: విజయ్ దేవరకొండ
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

IND vs AUS: ధావన్ ధనాధన్.. పఠాన్ విధ్వంసం.. యువీ ఫెయిల్
ఆస్ట్రేలియా చాంపియన్స్తో మ్యాచ్లో ఇండియా చాంపియన్స్ (INDCH vs AUSCH) భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ శిఖర్ ధావన్ ధనాధన్ ఇన్నింగ్స్తో దంచికొట్టగా.. ఆల్రౌండర్ యూసఫ్ పఠాన్ విధ్వంసకర ఇన్నింగ్స్తో విరుచుకుపడ్డాడు. వీరిద్దరి అద్భుత ప్రదర్శన నేపథ్యంలో.. నిర్ణీత 20 ఓవర్లలో ఇండియా చాంపియన్స్ నాలుగు వికెట్లు మాత్రమే నష్టపోయి 203 పరుగులు సాధించింది.కాగా ప్రపంచ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL 2025)లో భాగంగా శనివారం నాటి మ్యాచ్లో ఇండియా- ఆస్ట్రేలియా తలపడుతున్నాయి. ఇంగ్లండ్లోని లీడ్స్లో గల హెడింగ్లీ మైదానంలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ధావన్ సెంచరీ మిస్ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన ఇండియా చాంపియన్స్కు ఓపెనర్లు రాబిన్ ఊతప్ప (Robin Uthappa), శిఖర్ ధావన్ శుభారంభం అందించారు. ఊతప్ప 21 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 37 పరుగులు చేయగా.. ధావన్ మెరుపు ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. మొత్తంగా 60 బంతులు ఎదుర్కొన్న గబ్బర్ 12 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 91 పరుగులు చేశాడు.The 𝕆𝔾 duo roll back the good 'ol days 🔥Team 🇮🇳 race to 62/2 in six overs all thanks to a flurry of boundaries 🤩Are we in for a 200+ total? Find the answers right away, LIVE on FanCode 😎#WCL2025 pic.twitter.com/PGO86izRKQ— FanCode (@FanCode) July 26, 2025 ఆఖరి వరకు అజేయంగా ఉన్న ధావన్.. దురదృష్టవశాత్తూ.. సెంచరీకి తొమ్మిది పరుగుల దూరంలో నిలిచిపోయాడు. ఇక వన్డౌన్ బ్యాటర్ అంబటి రాయుడు డకౌట్ కాగా.. సురేశ్ రైనా (11) కూడా నిరాశపరిచాడు. కెప్టెన్ యువరాజ్ సింగ్ (3) కూడా విఫలం కాగా.. యూసఫ్ పఠాన్ తుపాన్ ఇన్నింగ్స్తో విరుచుకుపడ్డాడు.పఠాన్ ఫటాఫట్ కేవలం 23 బంతుల్లోనే 52 పరుగులతో పఠాన్ దుమ్ములేపాడు. ధావన్తో కలిసి ఆఖరి వరకు నాటౌట్గా నిలిచిన ఈ బ్యాటింగ్ ఆల్రౌండర్ ఇన్నింగ్స్లో మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో డానియల్ క్రిస్టియన్ ఊతప్ప, అంబటి రాయుడు రూపంలో రెండు వికెట్లు తీయగా.. కెప్టెన్ బ్రెట్ లీ రైనా వికెట్ దక్కించుకున్నాడు. ఇక డీ ఆర్సీ షార్ట్ యువరాజ్ సింగ్ రూపంలో కీలక వికెట్ తనఖాతాలో వేసుకున్నాడు. లక్ష్యాన్ని ఛేదించిన ఆసీస్ చాంపియన్స్ఇండియా చాంపియన్స్ విధించిన 204 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా చాంపియన్స్.. మరో బంతి మిగిలి ఉండగానే ఛేదించింది. ఓపెనర్లు షాన్ మార్ష్ (11), క్రిస్ లిన్ (25).. వన్డౌన్లో వచ్చిన డీ ఆర్సీ షార్ట్ (20) నిరాశపరిచినా.. లోయర్ ఆర్డర్ అద్భుతంగా ఆడింది.డానియెల్ క్రిస్టియన్ 28 బంతుల్లో 39 పరుగులు సాధించగా.. కల్లమ్ ఫెర్గూసన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 38 బంతుల్లోనే ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాది 70 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. బెన్ కటింగ్ వేగంగా (6 బంతుల్లో 15) ఆడగా.. రాబ్ క్వినీ (8 బంతుల్లో 16 నాటౌట్) కూడా ఆకట్టుకున్నాడు. ఫలితంగా 19.5 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి ఆసీస్ 207 పరుగులు చేసింది. దీంతో ఇండియా చాంపియన్స్ నాలుగు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. భారత బౌలర్లలో పీయూశ్ చావ్లా మూడు వికెట్లు తీయగా.. హర్భజన్ సింగ్ రెండు, వినయ్ కుమార్ ఒక వికెట్ దక్కించుకున్నారు.యువీ సేనకు భంగపాటుకాగా అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన దిగ్గజాలతో ఇంగ్లండ్ డబ్ల్యూసీఎల్ టీ20 టోర్నమెంట్ గతేడాది మొదలైంది. అరంగేట్ర సీజన్లో ఫైనల్ చేరిన యువీ సేన.. టైటిల్ పోరులో దాయాది పాకిస్తాన్ను చిత్తు చేసి ట్రోఫీ గెలిచింది. ఇక 2025 సీజన్లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన ఇండియా చాంపియన్స్ ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది.ఇరుదేశాల మధ్య ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్తో జరగాల్సిన తొలి మ్యాచ్ రద్దు కాగా.. రెండో మ్యాచ్లో సౌతాఫ్రికా చాంపియన్స్ చేతిలో ఓటమిపాలైంది. తాజాగా మూడో మ్యాచ్లో ఆస్ట్రేలియా చాంపియన్స్ చేతిలోనూ ఓడిపోయింది.కాగా ఇండియా, పాకిస్తాన్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, ఇంగ్లండ్ పాల్గొంటున్న ఈ టీ20 టోర్నీ తాజా సీజన్లో.. సౌతాఫ్రికా చాంపియన్స్ ఇప్పటికి నాలుగు మ్యాచ్లు పూర్తి చేసుకుని మూడు గెలిచింది. తద్వారా ఆరు పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ఇండియా చాంపియన్స్ ఇంకా ఖాతా తెరవలేదు. పాక్తో మ్యాచ్ రద్దైన నేపథ్యంలో ఒక పాయింట్ రాగా.. పట్టికలో అట్టడుగున ఆరో స్థానంలో ఉంది.చదవండి: వైభవ్ సూర్యవంశీ మిస్సయ్యాడు! సౌతాఫ్రికా స్టార్ ప్రపంచ రికార్డు

తొలి ఓవర్లో రెండు వికెట్లు.. కష్టాల్లో టీమిండియా!.. గంభీర్పై ఫ్యాన్స్ ఫైర్
ఇంగ్లండ్తో నాలుగో టెస్టులో.. రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియాకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal)తో పాటు వన్డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ కూడా డకౌట్ అయ్యాడు. ఇంగ్లండ్ బౌలింగ్ అటాక్ మొదలుపెట్టిన పేసర్ క్రిస్ వోక్స్ (Chris Woakes)అద్భుతమైన డెలివరీలతో వీరిద్దరిని పెవిలియన్కు పంపాడు.మొదటి ఓవర్లోనే రెండు వికెట్లు డౌన్తొలి ఓవర్లో నాలుగో బంతికి వోక్స్ సంధించిన బంతిని జైసూ షాట్ ఆడేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. బ్యాట్ ఎడ్జ్ను తాకిన బంతి గాల్లోకి లేవగా.. ఫస్ట్ స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న జో రూట్ (Joe Root) చేతుల్లోకి వెళ్లింది. అయితే, క్యాచ్ పట్టడంలో తడబడిన రూట్.. ఎట్టకేలకు బంతిని జాగ్రత్తగా ఒడిసిపట్టాడు. దీంతో.. నాలుగు బంతులు ఎదుర్కొన్న జైస్వాల్... పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు.ఇక జైసూ స్థానంలో వచ్చిన సాయి సుదర్శన్ను మరుసటి బంతికే వోక్స్ పెవిలియన్కు పంపాడు. వోక్స్ వేసిన బంతిని వదిలేయాలని సాయి భావించగా.. బాల్ అతడు ఊహించిన దానికంటే కాస్త ఎక్కువగానే జంప్ అయింది. ఈ క్రమంలో బ్యాట్ బాటమ్ ఎడ్జ్ను తాకిన బంతి.. సెకండ్ స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న హ్యారీ బ్రూక్ చేతుల్లో పడింది. దీంతో భారత్ తొలి ఓవర్లోనే రెండు కీలక వికెట్లు కోల్పోయింది.భారీ ఆధిక్యంలో ఇంగ్లండ్ఇక అంతకముందు 669 పరుగులకు ఆలౌట్ అయిన ఇంగ్లండ్.. భారత్ రెండో ఇన్నింగ్స్లో తొలి ఓవర్ ముగిసేసరికి 311 పరుగుల ఆధిక్యంలో కొనసాగడంతో పాటు.. రెండు వికెట్లు తీసి సత్తా చాటింది. వరుస బంతుల్లో వికెట్లు తీసిన వోక్స్... కెప్టెన్ శుబ్మన్ గిల్ను వికెట్ల ముందు దొరకబుచ్చుకునే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. దీంతో అతడు హ్యాట్రిక్ మిస్సవగా.. టీమిండియా ఊపిరి పీల్చుకుంది.ఈ క్రమంలో రెండో ఓవర్లో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ సింగిల్, గిల్తో కలిసి సింగిల్ తీయడంతో ఎట్టకేలకు భారత్ పరుగుల ఖాతా తెరిచింది. శనివారం నాటి నాలుగో రోజు ఆటలో భోజన విరామ సమయానికి మూడు ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి కష్టాల్లో కూరుకుపోయింది. మరోవైపు.. ఇంగ్లండ్కు 310 పరుగుల భారీ ఆధిక్యం ఉంది. ఇక భారత్ తొలి ఇన్నింగ్స్లో 358 పరుగులు చేసిన విషయం తెలిసిందే. కాగా ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఇంగ్లండ్ గడ్డ మీద ఐదు టెస్టులు ఆడుతోంది. గంభీర్పై ఫ్యాన్స్ ఫైర్ఇందులో ఇప్పటికి మూడు పూర్తి కాగా ఆతిథ్య జట్టు రెండు గెలిచి గిల్ సేనపై 2-1తో ఆధిక్యంలో ఉంది. ఇక మాంచెస్టర్ వేదికగా బుధవారం మొదలైన నాలుగో టెస్టులోనూ టీమిండియా పట్టు కోల్పోయింది. ఈ నేపథ్యంలో హెడ్కోచ్ గౌతం గంభీర్పై టీమిండియా అభిమానులు ఫైర్ అవుతున్నారు. వన్డే, టీ20ల సంగతి ఎలా ఉన్నా టెస్టు జట్టు కోచ్గా పనికిరాడంటూ ట్రోల్ చేస్తున్నారు.కాగా గంభీర్ ప్రధాన కోచ్గా వచ్చిన తర్వాత స్వదేశంలో టెస్టుల్లో న్యూజిలాండ్ చేతిలో 3-0తో క్లీన్స్వీప్నకు గురైన భారత జట్టు.. పదేళ్ల తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి బోర్డర్- గావస్కర్ ట్రోఫీ కోల్పోయింది. తాజాగా ఇంగ్లండ్ పర్యటనలో వైఫల్యాన్ని కొనసాగిస్తోంది.చదవండి: వైభవ్ సూర్యవంశీ మిస్సయ్యాడు! సౌతాఫ్రికా స్టార్ ప్రపంచ రికార్డు

చరిత్ర సృష్టించిన స్టోక్స్!.. ఇంగ్లండ్ ఆలౌట్.. స్కోరెంతంటే!
ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఒకే టెస్టు మ్యాచ్లో ఐదు వికెట్లు తీయడంతో పాటు శతకం సాధించిన సారథుల సరసన చేరాడు. ఇంగ్లండ్ తరఫున ఈ ఫీట్ నమోదు చేసిన తొలి కెప్టెన్గానూ చరిత్రకెక్కాడు.ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ (Tendulkar- Anderson Trophy)లో భాగంగా భారత్- ఇంగ్లండ్ (Ind vs Eng) మధ్య నాలుగో టెస్టులో స్టోక్స్.. టీమిండియా తొలి ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు కూల్చాడు. సాయి సుదర్శన్ (61), శుబ్మన్ గిల్ (12)ల రూపంలో రెండు కీలక వికెట్లు కూల్చిన స్టోక్స్.. శార్దూల్ ఠాకూర్ (41), వాషింగ్టన్ సుందర్ (27), అన్షుల్ కంబోజ్ (0) వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.141 పరుగులుఅనంతరం బ్యాటింగ్లోనూ ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ ఇరగదీశాడు. శనివారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా స్టోక్స్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మహ్మద్ సిరాజ్ బౌలింగ్లో ఫోర్ బాది వంద పరుగుల మార్కు దాటాడు. మొత్తంగా 198 బంతులు ఎదుర్కొన్న స్టోక్స్.. 11 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 141 పరుగులు సాధించాడు. భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా బౌలింగ్లో సాయి సుదర్శన్కు క్యాచ్ ఇవ్వడంతో స్టోక్స్ శతక ఇన్నింగ్స్కు తెరపడింది.ఒకే టెస్టు మ్యాచ్లో ఐదు వికెట్లు తీయడంతో పాటు సెంచరీ చేసిన కెప్టెన్లు వీరే🏏డెనిస్ అట్కిన్సన్ (వెస్టిండీస్)- 1955లో ఆస్ట్రేలియా మీద🏏గ్యారీ సోబర్స్ (వెస్టిండీస్)- 1966లో ఇంగ్లండ్ మీద🏏ముష్తాక్ మొహమ్మద్ (పాకిస్తాన్)- 1977లో వెస్టిండీస్ మీద🏏ఇమ్రాన్ ఖాన్ (పాకిస్తాన్)- 1983లో టీమిండియా మీద🏏బెన్ స్టోక్స్ (ఇంగ్లండ్)- 2025లో టీమిండియా మీదఇంగ్లండ్ ఆలౌట్.. స్కోరెంతంటే?ఇదిలా ఉంటే.. 544/7 ఓవర్నైట్ స్కోరుతో శనివారం ఆట మొదలుపెట్టిన ఇంగ్లండ్ కాసేపటికే లియామ్ డాసన్ (26) వికెట్ కోల్పోయింది. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో అతడు బౌల్డ్ అయ్యాడు. స్టోక్స్ వికెట్ను జడేజా దక్కించుకున్నాడు. అదే విధంగా.. బ్రైడన్ కార్స్ (47)ను వెనక్కి పంపాడు. దీంతో ఇంగ్లండ్ 157.1 ఓవర్లలో 669 పరుగులు స్కోరు చేసి ఆలౌట్ అయింది. టీమిండియా కంటే తొలి ఇన్నింగ్స్లో ఏకంగా 311 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.భారత బౌలర్లలో జడ్డూ అత్యధికంగా నాలుగు వికెట్లు పడగొట్టగా.. వాషింగ్టన్ సుందర్, బుమ్రా రెండేసి వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. అరంగేట్ర పేసర్ అన్షుల్ కంబోజ్, మహ్మద్ సిరాజ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. చదవండి: గిల్.. నేనైతే ఆ తప్పు చేసేవాడిని కాదు: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్𝘾𝙖𝙡𝙢, 𝘾𝙤𝙤𝙡, 𝘾𝙚𝙣𝙩𝙪𝙧𝙞𝙤𝙣 🔥#BenStokes shows great composure, calmly facing 6 dot balls on 99 before finally reaching a well-earned century with a confident shot 🙌#ENGvIND 👉 4th TEST, DAY 4 | LIVE NOW on JioHotstar 👉 https://t.co/xkvCs073fI pic.twitter.com/TzhM6CBR6L— Star Sports (@StarSportsIndia) July 26, 2025

శతక్కొట్టిన బెన్ స్టోక్స్.. ఎనిమిదేళ్ల తర్వాత అలా!.. ఇప్పుడిలా..
టీమిండియాతో నాలుగో టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) శతక్కొట్టాడు. మాంచెస్టర్ వేదికగా శనివారం నాటి నాలుగో రోజు ఆటలో వంద పరుగుల మార్కును అందుకున్నాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్కు దిగిన 34 ఏళ్ల ఈ బ్యాటింగ్ ఆల్రౌండర్.. 164 బంతుల్లో 103 పరుగులు సాధించాడు. కాగా స్టోక్స్కు ఇది టెస్టుల్లో పద్నాలుగవ సెంచరీ కాగా.. టీమిండియాపై రెండోది. ఇంగ్లండ్- భారత్ జట్ల మధ్య ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ (Anderson- Tendulkar Trophy)లో భాగంగా ఐదు టెస్టుల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మొదటి మూడు టెస్టుల్లో రెండు గెలిచిన ఆతిథ్య ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉంది.ఐదు వికెట్లతో చెలరేగిన గిల్ఇరుజట్ల మధ్య బుధవారం నాలుగో టెస్టు మొదలుకాగా.. టాస్ గెలిచిన ఇంగ్లండ్ భారత్ను తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఈ క్రమంలో టీమిండియా 358 పరుగులకు తొలి ఇన్నింగ్స్లో ఆలౌట్ అయింది. స్టోక్స్ ఐదు వికెట్లతో చెలరేగి.. గిల్ సేనను దెబ్బకొట్టాడు. తద్వారా ఎనిమిదేళ్ల తర్వాత తొలిసారి ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.మూడేళ్లలో తొలిసారి!అంతేకాదు.. అదే మ్యాచ్లో సెంచరీ కూడా కొట్టి స్టోక్స్ మాంచెస్టర్ టెస్టును మరింత ప్రత్యేకం చేసుకున్నాడు. కాగా గత మూడేళ్లలో టెస్టుల్లో స్టోక్స్కు ఇదే మొదటి సెంచరీ కావడం గమనార్హం. నవతరం టాప్ ఆల్రౌండర్లలో ఒకడైన స్టోక్స్ ఈ టెస్టు ద్వారా తనను తాను మరోసారి నిరూపించుకున్నాడు.ఇదిలా ఉంటే.. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ దుమ్మురేపుతోంది. ఓపెనర్లు జాక్ క్రాలీ (84), బెన్ డకెట్ (94) మెరుపు అర్ధ శతకాలతో ఆకట్టుకోగా.. జో రూట్ 150 పరుగులతో అదరగొట్టాడు. తాజాగా కెప్టెన్ స్టోక్స్ కూడా సెంచరీతో చెలరేగగా.. 149 ఓవర్ల ఆట ముగిసేసరికి ఇంగ్లండ్ ఎనిమిది వికెట్ల నష్టానికి 614 పరుగుల భారీ స్కోరు సాధించింది. టీమిండియా కంటే 256 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. చదవండి: గిల్.. నేనైతే ఆ తప్పు చేసేవాడిని కాదు: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
బిజినెస్

అంత తక్కువ వడ్డీ అంటే అనుమానించాలి కదా?
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ నగర శివార్లలోని తెల్లాపూర్లో ఉంటున్న ఓ వ్యక్తి తాను ముంబైలో ఉంటున్నట్లు ఆన్లైన్లో ప్రచారం చేసుకున్నాడు. ఫిన్పెయిర్ పేరుతో వెబ్సైట్ ఏర్పాటు చేసి వ్యాపారాభివృద్ధికి రుణం ఇస్తానంటూ ఎర వేశాడు. నమ్మి ముందుకు వచ్చిన నగర వ్యాపారి నుంచి రూ.1.5 కోట్లు స్వాహా చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుడు డి.నాగరాజును అరెస్టు చేసినట్లు డీసీపీ దార కవిత శుక్రవారం వెల్లడించారు.తెల్లాపూర్ రోడ్డులోని హోనర్ వివాంటీస్లో నివసించే నాగరాజు ఆన్లైన్లో ఫిన్ పెయిర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను ఏర్పాటు చేశాడు. దీనికోసం ఓ వెబ్సైట్ను రూపొందించిన ఇతగాడు అందులో ఇది ముంబై కేంద్రంగా పని చేస్తున్నట్లు పేర్కొన్నాడు. వివిధ రకాలైన వ్యాపారులను వారి వ్యాపారాభివృద్ధి కోసం తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తామంటూ ఆన్లైన్ వేదికగా ప్రచారం చేశాడు.నగరానికి చెందిన ఓ వ్యాపారి (39) ఆన్లైన్లో వచ్చిన ఈ ప్రకటన చూసి ఆకర్షితుడయ్యాడు. తనకు రుణం కావాలంటూ ఆ ప్రకటనలో పొందపరచగా...అది చూసిన నాగరాజు 2023 జూన్లో సదరు వ్యాపారిని సంప్రదించాడు. వ్యాపారి పూర్వాపరాలు, రుణం అవసరాలను తెలుసుకున్న నాగరాజు భారీ మొత్తం తక్కువ వడ్డీకి ఇవ్వడానికి అంగీకరించాడు. ఆపై వివిధ రకాలైన రుసుముల పేరు చెప్పి ఆ ఏడాది నవంబర్ నుంచి దశల వారీగా రూ. కోటీ 55 లక్షలు స్వాహా చేశాడు.అప్పటి నుంచి త్వరలో రుణం మంజూరై ఖాతాలో పడుతుందంటూ నమ్మబలుకుతున్నాడు. ఎట్టకేలకు మోసపోయానని తెలుసుకున్న బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీన్ని దర్యాప్తు చేసిన ఇన్స్పెక్టర్ కె.సతీష్ రెడ్డి నేతృత్వంలోని బృందం నిందితుడిని అరెస్టు చేసింది. ఇతడు ఇలాంటి నేరాలు ఇంకా ఏవైనా చేశాడా? అనే కోణంలో దర్యాప్తు చేస్తోంది.

టెక్నాలజీ అందుబాటులోకి తీసురావడమే లక్ష్యం
రిలయన్స్ రిటైల్ ఇటీవల ఎలక్ట్రోలక్స్ గ్రూప్ కన్జూమర్ డ్యూరబుల్స్ బ్రాండ్ కెల్వినేటర్ కొనుగోలు డీల్పై కంపెనీ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్ఆర్వీఎల్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇషా అంబానీ స్పందించారు. కంపెనీ ఉత్పత్తుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ప్రతి వినియోగదారుడి విభిన్న అవసరాలను తీర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.‘కెల్వినేటర్ కొనుగోలు కంపెనీ అభివృద్ధికి ఒక కీలక ఘట్టాన్ని సూచిస్తుంది. ఇది భారతీయ వినియోగదారులకు నమ్మకమైన ప్రపంచ ఆవిష్కరణలను అందుబాటులోకి తీసుకురావడానికిక వీలు కల్పిస్తుంది. దానికి కంపెనీ మార్కెట్ లీడింగ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఎంతో తోడ్పడుతుంది’ అని ఇషా చెప్పారు. ఇదీ చదవండి: ‘దేశానికి రక్షణ కల్పించండి.. మీ సమస్యలతో మేం పోరాడుతాం’ఈ డీల్ విలువ సుమారు రూ.160 కోట్లు. దేశీయంగా అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రీమియం గృహోపకరణాల విభాగంలో కార్యకలాపాలు మరింతగా విస్తరించేందుకు రిలయన్స్ రిటైల్కి ఇది ఉపయోగపడనుంది. రిలయన్స్ రిటైల్ గతంలో కెల్వినేటర్ బ్రాండ్కి లైసెన్సు తీసుకుని, ఉపయోగించుకుంది. దీని కింద ఫ్రిజ్లు, ఏసీలు, వాషింగ్ మెషిన్లు మొదలైనవి అమ్ముడవుతున్నాయి.

‘దేశానికి రక్షణ కల్పించండి.. మీ సమస్యలతో మేం పోరాడుతాం’
భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా సైనికుల కుటుంబాలకు న్యాయసహాయం అందించనున్నారు. ‘నల్సా వీర్ పరివార్ సహాయతా యోజన 2025’ పేరుతో ఈ కొత్త కార్యక్రమం ద్వారా భారతీయ సైనికులకు సాయం చేయనున్నారు. సొంత ఊళ్లకు దూరంగా దేశం కోసం సేవలందిస్తున్న సైనికులు, తమ కుటుంబ సభ్యులు కొన్నిసార్లు స్థానికంగా న్యాయపరమైన వివాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దాంతో దేశం కోసం సుదూర ప్రాంతాల్లో పోరాడుతున్న సైనికులు స్వగ్రామాలకు రావడం కష్టంగా మారుతుంది. అలాంటివారికి, తమ కుటుంబ సభ్యులకు న్యాయసేవ అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ జస్టిస్ సూర్యకాంత్ శ్రీనగర్లో జరిగిన కార్గిల్ విజయ్ దివాస్ సదస్సులో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు. ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈమేరకు నిర్ణయం తీసుకోవడం సైనికులకు ఎంతో వెసులుబాటు కల్పిస్తుందని నమ్ముతున్నారు. ఈ ఆపరేషన్ సమయంలో సాయుధ దళాలు చేసిన త్యాగాలను చూసి తీవ్రంగా చలించిపోయానని జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. న్యాయవ్యవస్థ వారి శ్రేయస్సుకు మరింత ప్రత్యక్షంగా దోహదపడే మార్గాలను అన్వేషిస్తుందన్నారు. అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్లు చెప్పారు.ఇదీ చదవండి: హైదరాబాద్లో ప్లాట్ల అమ్మకాలకు అంతా సిద్ధం..ఈ కార్యక్రమం ఉద్దేశం..సైనికులు విధుల్లో ఉన్నప్పుడు అపరిష్కృత ఆస్తి వివాదాలు, కుటుంబ కలహాలు, భూ సమస్యలు, ఇతర చట్టపరమైన విషయాల నుంచి ఉపశమనం కలిగించేలా న్యాయసేవ అందిస్తారు.సైనికులు వృత్తిపరమైన కారణాలతో కోర్టుకు హాజరు కాలేకపోయినా, కోర్టులో కుటుంబాలకు ప్రాతినిధ్యం వహించడానికి నల్సా రంగంలోకి దిగుతుంది.ఇండియన్ ఆర్మీ, బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, ఇతర పారామిలటరీ బలగాలు దీని పరిధిలోకి వస్తారు.ప్యానెల్ లాయర్లు, పారాలీగల్ వాలంటీర్లకు సులభంగా అందుబాటులో ఉండేలా రాష్ట్రాల్లోని సైనిక్ వెల్ఫేర్ బోర్డులను ఏర్పాటు చేస్తారు.కేసు పురోగతిని పర్యవేక్షించడానికి, సకాలంలో పరిష్కారాన్ని నిర్ధారించడానికి వీరు తోడ్పాటు అందిస్తారు.

యూకే కార్బన్ ట్యాక్స్ విధిస్తే ఎలా?
ఇండియా-బ్రిటన్ దేశాల మధ్య దాదాపు 99% వాణిజ్య వస్తువులపై సుంకాలను నియంత్రించేలా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ)పై ఇరు దేశాల ప్రతినిధులు అధికారికంగా సంతకాలు చేశారు. అయితే భారత ఎగుమతులపై యూకే ప్రతిపాదిత కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం (సీబీఏఎం) ప్రభావం ఎలా ఉండబోతుందోననే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సీబీఏఎం అనేది 2027లో యునైటెడ్ కింగ్డమ్ (యూకే) ప్రవేశపెడుతున్న వాతావరణ సంబంధిత సుంకం. ఇతర దేశాల ఉత్పత్తుల దిగుమతులపై వాటి కర్బన ఉద్గారాల ఆధారంగా పన్ను విధిస్తారు.కార్బన్ పన్నులకు సంబంధించిన స్పష్టమైన నిబంధనలను ఎఫ్టీఏలో చేర్చలేదు. అయితే భవిష్యత్తులో యూకే కార్బన్ లెవీల ఒప్పందం కింద భారతదేశ వాణిజ్య ప్రయోజనాలపై ప్రభావం చూపితే దిద్దుబాటు చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు యూకే నుంచి భారత్ దౌత్య హామీని తీసుకుంది. 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న సీబీఏఎంను అమలు చేసేందుకు యూకే ప్రస్తుతం సన్నాహక దశలో ఉంది. ఇది అమల్లోకి వస్తే ప్రధానంగా ప్రభావితం చెందే వస్తువులు కింది విధంగా ఉన్నాయి.అల్యూమినియంసిమెంట్ఎరువులుహైడ్రోజన్స్టీల్ఇదీ చదవండి: హైదరాబాద్లో ప్లాట్ల అమ్మకాలకు అంతా సిద్ధం..ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తులు దేశీయ వస్తువుల మాదిరిగానే కార్బన్ నిబంధనలకు లోబడి ఉండేలా చూడటం యూకే లక్ష్యంగా పెట్టుకుంది. ఎఫ్టీఏలో సీబీఏఎం సంబంధిత నిబంధనలు చేర్చబడనప్పటికీ భారతదేశ ప్రయోజనాలను పరిరక్షించడానికి ఒక ‘వెర్బల్ నోట్(అధికారిక దౌత్య హామీ)’ని కుదుర్చుకున్నట్లు భారత అధికారులు చెబుతున్నారు. దీనిప్రకారం..‘యూకే సీబీఏఎం భారత ఎగుమతులను ప్రతికూలంగా ప్రభావితం చేస్తే, ఎఫ్టీఏ కింద మార్కెట్ యాక్సెస్ రాయితీలను హరిస్తే భారత్ తిరిగి సమతుల్యత చర్యలు తీసుకోవచ్చు’ అని సీనియర్ అధికార వర్గాలు చెబుతున్నాయి.
ఫ్యామిలీ

కరిష్మా మాజీ భర్త సంజయ్ కపూర్ మరణంపై తల్లి సంచలన ఆరోపణలు
వ్యాపారవేత్త, నటి కరిష్మా కపూర్ మాజీ భర్త, సంజయ్ కపూర్ ఆకస్మికమరణంపై ఆమె తల్లి సంచలన ఆరోపణలు చేశారు. ఆయన మరణించిన నెల రోజుల తర్వాత తన కొడుకు మరణాన్ని అనుమానాస్పదం అని పేర్కొంటూ కొన్ని దిగ్భ్రాంతికర వాదనలు చేశారు. సంజయ్ మరణం తర్వాత ప్రజలు, కుటుంబ వారసత్వాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారన్నారు.సోనా కామ్స్టార్ మాజీ ఛైర్మన్ సంజయ్ కపూర్ (కెనడాలో జూన్ 12న) పోలో ఆడుతూ మరణించడం అందర్నీ దిగ్భ్రాంతికి గురిచేసింది. తేనెటీగ కుట్టడం వలన గుండెపోటు వచ్చి చివరికి అతని మరణం సంభవించిందని వార్తలొచ్చాయి. తాజాగా ఆయనతల్లి రాణి కపూర్ తన కొడుకు ఆకస్మిక మరణంపై అనుమానాలు వ్యక్తం చేయడం సంచలనంగా మారింది. కొడుకు మరణం అనుమానాస్పదం, అంతేకాదు సోనా కామ్స్టార్వార్షిక సర్వసభ్య సమావేశాన్ని వాయిదా వేయమని కోరుతూ లేఖ రాశారు. తన కొడుకు మరణంపై అనేక చిక్కు ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదని వాపోతోంది. తన ఏకైక కుమారుడు మరణంపై వచ్చిన వార్తలన్నీ ఊగాహానాలేనని, యూకేలో చెప్పుకోలేని పరిస్థితులలో చనిపోయాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని సార్లు అడిగినా తన కొడుకు మరణానికి సంబంధించిన వివరాలు అందండం లేదు. సంబంధిత సమాధానాలు, పత్రాలు నాకు అందలేదు. ఇంత దుఃఖంలో కొంతమంది కుటుంబ వారసత్వాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు.బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నారుఅంతేకాదు సంజయ్ కపూర్కు ఖాతాలకు యాక్సెస్ను కూడా నిరాకరించారట. సంజయ్ మరణించిన ఒక నెలలోనే ఎంపిక చేసిన కొద్దిమందికే దీనికి అవకాశం కల్పించారని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. తనకు అర్థం కాని పత్రాలపై సంతకం చేయమని బలవంతం చేశారని కూడా పేర్కొన్నారు. ఏమి రాసి సందో అర్థం చేసుకునేంత భావోద్వేగ స్థితిలో తాను లేనని, తీవ్ర మానసిక, మానసిక వేదన పడుతోంటే, నాలుగ్గోడల మధ్య పత్రాలపై సంతకం చేయమని బలవంతం చేశానంటూ షాకింగ్ వాదనలు చేశారు.ఏజీఎం ఆపాలని లేఖ, లేని పక్షంలో కేసు అవుతుందని హెచ్చరికతన దివంగత భర్త సురీందర్ కపూర్ ఎస్టేట్కు ఏకైక లబ్ధిదారురాల్ని తానేని, సోనా కామ్స్టార్తో సహా సోనా గ్రూప్లో మెజారిటీ వాటాదారుని రాణీ తన లేఖలో పేర్కొన్నారు. సంజయ్ కపూర్ తల్లిగా మాత్రమే కాకుండా, కపూర్ కుటుంబ అధిపతిగా, కంపెనీలో అతిపెద్ద వాటాదారుగా తాను వ్రాస్తున్న ఈ లేఖను బోర్డు,వాటాదారులు నిర్లక్ష్యం చేస్తే కంపెనీ యొక్క దుర్వినియోగం నమ్మక ఉల్లంఘన కేసు అవుతుందని కూడా ఆమె స్పష్టం చేశారు.మరోవైపు AGM ఇప్పటికే ప్రారంభమైందని, సంజయ్ కపూర్ భార్య ప్రియా సచ్దేవ్ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉందని నివేదికలు తెలిపాయి.కాగా పలు నివేదిక ప్రకారం, రూ. 39 వేల కోట్ల ఆస్తిని సంజయ్ కపూర్, అతని ఇద్దరు సోదరీమణులు, సూపర్నా మోట్వానే , మందిరా కపూర్ మధ్య విభజించే అవకాశం ఉంది. దీనిపై ఎలాంటి ధృవీకరణ లేనప్పటికీ, సంజయ్ తన సోదరి మందిరాతో గత నాలుగేళ్లుగా వివాదం నడుస్తోంది. ఇది ఇలా ఉంటే సంజయ్మరణం తరువాత అతని మూడవ భార్య ప్రియా సచ్దేవ్ను కంపెనీకి నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా జెఫ్రీ మార్క్ ఛైర్మన్గా ఎంపికయ్యారు.

కుటుంబం తొలుత ఒప్పుకోకపోయినా..నిలిచి గెలిచిన ప్రేమికులు!
రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్, ముఖేష్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ (Anil Ambani) ఆస్తులపై ఈడీ దాడుల నేపథ్యంలో ఆయన ప్రేమ కథ మరోసారి వార్తల్లో నిలిచింది. 1991లో అప్పటి బాలీవుడ్ నటి టీనా మునిమ్ను (Tina Munim) వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వివాహం వెనుక పెద్ద స్టోరీనే నడించిందట. మొదట్లో అనిల్, టీనా ప్రేమకథను అంబానీ కుటుంబం (Ambani family) అంగీకరించ లేదట. అవును.. వివరాలు తెలుసుకుందాం.కేవలం నటి అన్న కారణంగానే టీనాను ఇంటి కోడలిగా తెచ్చుకునేందుకు తమ చిన్న కొడుకు అనిల్ అంబానీ -టీనాను ప్రేమను తొలుత తల్లిదండ్రులు ధీరూభాయ్ , కోకిలాబెన్ అంబానీ వ్యతిరేకించారట. కానీ ఒపిగ్గా ఎదురు చూసి, తల్లిదండ్రులను ఒప్పించుకుని మరీ తమ ప్రేమను గెలిపించుకున్నారు అనిల్ అంబానీ -టీనా మునిమ్. అంతేకాదు అన్యోన్య దాంపత్యంతో తమ ప్రేమ అమరమని నిరూపించుకున్నారు. అనిల్ టీనాను తొలుత ఎక్కడ చూశాడంటే1983లో వార్టన్లో MBA పూర్తి చేసిన తర్వాత, అనిల్ మొదటిసారిగా టీనాను ఒక వివాహంలో తొలిసార చూశాడు. తొలి చూపులోనే ఆమెపై ప్రేమ చిగురించింది. సాంప్రదాయ హిందూ వివాహంలో బ్లాక్ సారీలో ప్రత్యేకంగా కనిపించిన టీనాను అనిల్ను దృష్టిని ఆకర్షించింది. కానీ అప్పుడు వారిద్దరూ మాట్లాడుకోలేదు. కానీ కొన్ని నెలల తర్వాత ఒక పరస్పర స్నేహితుడు వారిని ఫిలడెల్ఫియాలో పరిచయం చేశాడు.అపుడు టీనా పెద్దగా పట్టించుకోలేదు. కానీ 1986లో మరోసారి టీనా మేనల్లుడు ద్వారా అనిల్ టీనా కలయిక వీరి జీవితాలను మలుపు తిప్పింది. అనిల్ ప్రపోజల్ ప్లాన్, ముఖేష్ అంబానీ ఏం చేశారంటేఅనిల్ అంబానీ పెళ్లి ప్రపోజల్ ప్లాన్తో టీనా మునిమ్ను తన తల్లిదండ్రులు ధీరూభాయ్, కోకిలాబెన్ అంబానీలకు పరిచయం చేశాడు. ఈ సందర్బంలోనే ఆమెకు ప్రపోజ్ చేయాలనుకున్నాడు. కానీ అనిల్ అలా బయటికి వెళ్లగానే అక్కడే వున్న సోదరుడు ముఖేష్ టీనాకు ఆ రహస్యాన్ని చెప్పడంతో ప్రపోజల్ ప్లాన్ చెడిపోయిందట. (Beauty Tips ముడతల్లేకుండా...అందంగా, యవ్వనంగా మెరిసిపోవాలంటే!)అటు తమ చిన్న కుమారుడు ఒక నటితో ప్రేమలో ఉన్నాడని తెలిసి అంబానీ కుటుంబం ఆ సంబంధాన్ని వ్యతిరేకించింది. దీంతో అమితమైన ప్రేమ ఉన్నప్పటికీ వేరే దారిలేక అనిల్ టీనా విడిపోవాల్సి వచ్చింది.టీనా ఇంటీరియర్ డిజైనర్ కోర్సు చేయడానికి అమెరికా వెళ్లిపోయింది. అనిల్తో సంబంధాలు దాదాపు కట్ అయిపోయాయి. ఇక్కడ అనిల్ మాత్రం ఎన్ని పెళ్లి సంబంధాలు తెచ్చినా, అన్నింటినీ తిరస్కరిస్తూ వచ్చాడు. అలా నాలుగేళ్లు గడిచిపోయాయి. అయితే లాస్ ఏంజిల్స్లో భూకంపం రావడంతో అనిల్ పరిగెత్తుకుంటూ ప్రియురాలికి దగ్గరికి వెళ్లిపోయాడు.చదవండి: జిమ్కెళ్లకుండానే 26 కిలోలు కరిగించాడట : బోనీ కపూర్లుక్ వైరల్ మరోవైపు టీనాను వివాహం చేసుకునేందుకు అనిల్ కుటుంబం ఎట్టకేలకు ఒప్పుకుంది. కానీ టీనా అనిల్ను పెళ్లి చేసుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్న క్రమంలో అనిల్ గట్టిగా పట్టుబట్టడంతో ఆ సమయం కోసమే ఎదురు చూస్తున్న టీనా రెక్కలు కట్టుకుని మరీ ఇండియాలో వాలిపోయింది. అలా కుటుంబ ఆమోదంతో 1991, ఫిబ్రవరి 2న సాంప్రదాయ గుజరాతీ పద్ధతిలో వివాహం జరిగింది. ఇపుడు కోకిలాబెన్కు టీనా కూడా ఇష్టమైన కోడలు. తమ ప్రేమను గెలిపించుకునేందుకు అనిల్-టీనా చూపించిన ఓర్పు, పట్టుదల వారి అమర ప్రేమకు చిహ్నంగా నిలిచింది. అలా మూడు దశాబ్దాలకు పైగా అనిల్-టీనా వైవాహిక జీవితం కొనసాగుతోంది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, జై అన్మోల్ ,జై అన్షుల్ ఉన్నారు.

ఎవరీ లండన్ చాయ్వాలా.. ఏంటి ప్రత్యేకత?
ఇండియన్ కల్చర్లో టీకి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇంటికి గెస్టులు ఎవరు వచ్చినా ముందుగా టీయిచ్చి మాటలు కలుపుతాం. మిత్రులు, సావాసగాళ్లతో చాయ్లు తాగుతూ చేసే చర్చలకు అంతే ఉండదు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత చాయ్ పే చర్చ చాలా ఫేమస్ అయింది. తనను తాను చాయ్వాలాగా ఆయన ఎన్నోసార్లు చెప్పుకున్నారు. పీఎం మోదీకి చాయ్ అందించి వైరల్ అయ్యాడో యువ చాయ్వాలా. అది కుడా లండన్లోని బ్రిటన్ ప్రధాని అధికారిక నివాసంలో. ఇద్దరు ప్రధానులకు చాయ్ పోసిన కుర్రాడి పేరు అఖిల్ పటేల్.భారత్, బ్రిటన్ దేశాల మధ్య గురువారం చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ) కుదిరింది. ఈ సందర్భంగా లండన్లోని బ్రిటన్ ప్రధాని అధికారిక నివాసం అయిన చెకర్స్లో కీలక భేటీ జరిగింది. యూకే పీఎం కీర్ స్టార్మర్, ప్రధాని మోదీ కీలకాంశాలపై చర్చలు సాగించారు. పచ్చికలో ఏర్పాటు చేసిన ఒక టీ స్టాల్లో తాజాగా తయారు చేసిన భారతీయ మసాలా చాయ్ను ఇరువురు అగ్రనేతలు ఆస్వాదించారు. తర్వాత ఈ ఫొటోలను మోదీ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. "చెకర్స్లో ప్రధానమంత్రి కీర్ స్టార్మర్తో 'చాయ్ పే చర్చా'... భారత్-యూకే సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని రాశారు. View this post on Instagram A post shared by Amala Chai | Masala Chai (@amala_chai)మోదీ షేర్ చేసిన ఫొటోలో.. సాంప్రదాయ భారతీయ కుర్తాలో ఒక యువకుడు.. ఇద్దరు ప్రధానులకు చాయ్ సర్వ్ చేస్తునట్టు కనబడింది. ముఖ్యంగా టీస్టాల్ బ్యానర్పై రాసివున్న క్యాప్షన్ అందరినీ ఆకర్షించింది. "తాజాగా తయారుచేసిన మసాలా చాయ్. భారతదేశం నుంచి వచ్చించి, లండన్లో తయారైంది అని రాసుంది. ఇరువురు అగ్రనేతలకు చాయ్ అందించిన ఆ యువకుడి పేరు అఖిల్ పటేల్. అమలా చాయ్ పేరుతో యూకేలో ఆయన బిజినెస్ చేస్తున్నారు.‘Chai Pe Charcha’ with PM Keir Starmer at Chequers...brewing stronger India-UK ties! @Keir_Starmer pic.twitter.com/sY1OZFa6gL— Narendra Modi (@narendramodi) July 24, 2025 ఒక చాయ్వాలాకు మరో చాయ్వాలా..భారత్, బ్రిటన్ ప్రధానులకు చాయ్ అందించి అపరూప క్షణాలకు సంబంధించిన వీడియోను అఖిల్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. అమలా చాయ్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో రీల్ను షేర్ చేశారు. కీర్ స్టార్మర్తో కలిసి మోదీ.. టీస్టాల్ వద్దకు రావడం.. మీరు ఇండియా రుచులను ఆస్వాదిస్తారు అంటూ స్టార్మర్తో మోదీ చెప్పడం వంటివి వీడియోలో ఉన్నాయి. "ఇందులో ఏలకులు, జాజికాయ, నల్ల మిరియాలు ఉన్నాయి" అని కప్పుల్లో టీ పోస్తూ పటేల్ చెప్పాడు. ప్రధాని మోదీకి టీ గ్లాస్ అందిస్తూ.. ఒక చాయ్వాలాకు మరో చాయ్వాలా (Chaiwala) టీ అందిస్తున్నాడు అనగానే.. మోదీ గట్టిగా నవ్వేశారు. కీర్ స్టార్మర్ చాయ్ తాగుతూ చాలా బాగుందని కితాబిచ్చారు. ఎవరీ అఖిల్ పటేల్?భారత మూలాలు కలిగిన అఖిల్ పటేల్.. 2019లో తన అమ్మమ్మ ప్రేరణతో అమలా చాయ్ను ప్రారంభించాడు. అతడి అమ్మమ్మ 50 ఏళ్ల క్రితం లండన్కు వలసవచ్చి స్థిరపడ్డారు. పటేల్ లింక్డ్ఇన్ బయో ప్రకారం.. అతడు లండన్లోని హాంప్స్టెడ్లోని యూనివర్సిటీ కాలేజ్ స్కూల్లో చదువుకున్నాడు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ (LSE) నుంచి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (BSc), మేనేజ్మెంట్ చేశాడు. గ్రాడ్యుయేషన్ వివిధ సంస్థల్లో ఇంటర్న్షిప్లు పూర్తి చేశాడు.చదవండి: మీరు ఎలా చనిపోవాలనుకుంటున్నారు?చిన్నతనంలో తన అమ్మమ్మ పెట్టే మసాలా చాయ్ అంటే అఖిల్కు చాలా ఇష్టం. అయితే బయట తాగే చాయ్లలో ఇలాంటి రుచి లేదని గమనించాడు. తన అమ్మమ్మ ఫార్ములాతో బ్రిక్ లేన్ ప్రాంతంలో అమల చాయ్ పేరుతో టీస్టాల్ ప్రారంభించాడు. అస్సాం, కేరళ రైతుల నుంచి నేరుగా తేయాకులు, సుగంధ ద్రవ్యాలు తెప్పించుకుని వాటితోనే మాసాలా చాయ్ తయారు చేస్తాడు. అందుకే అమల చాయ్కు తక్కువ కాలంలోనే బాగా పేరొచ్చింది. తాజాగా ఇద్దరు ప్రధాన మంత్రులకు మసాలా చాయ్ అందించి ప్రపంచం దృష్టిలో పడ్డాడు అఖిల్ పటేల్.

క్రీడలలో ఎథిక్స్ & లీడర్షిప్ 7వ ప్రపంచ సదస్సులో శ్రీ శ్రీ రవిశంకర్ కీలకోపన్యాసం
వరల్డ్ ఫోరమ్ ఫర్ ఎథిక్స్ ఇన్ బిజినెస్ - WFEB (World Forum for Ethics in Business)నిర్వహించిన క్రీడలలో నైతికత, నాయకత్వంపై 7వ ప్రపంచ శిఖరాగ్ర సదస్సులో శ్రీ శ్రీ రవిశంకర్ కీలకోపన్యాసం చేశారు.7వ వరల్డ్ సమ్మిట్ ఆన్ ఎథిక్స్ అండ్ లీడర్షిప్ ఇన్ స్పోర్ట్స్ సమ్మిట్లో విలువలు రాజీపడితే విజయం నిజంగా కొనసాగుతుందా లేదా అనే దానిపైనా, తీవ్ర ఒత్తిడి ఉన్న ప్రపంచంలో సమగ్రతతో గెలవడానికి ఏమి అవసరమో అనే దానిపై ఆలోచనాత్మక ఆలోచనల మార్పిడిలో క్రీడలు, రాజకీయాలు, వ్యాపారం, విద్యాసంస్థలు, NGOలు , థింక్ ట్యాంక్ల నుండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురితో చర్చించింది.క్రీడలలో, మీరు గెలుస్తారు లేదా మీరు ఇతరులను గెలిపించుకుంటారు" అని రవిశంకర్ తన ముఖ్యోపన్యాసంలో పేర్కొన్నారు. ఈ రోజుల్లో యుద్ధాలు క్రీడలుగా, క్రీడలు యుద్ధాల్లా జరుగుతున్నాయని రవిశంకర్ వ్యాఖ్యానించారు. ఆటల్లో జయాపజయాలను రెండింటినీ స్వీకరించాలన్నారు. ఆట అనే చర్య ఆనందాన్ని తెస్తుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడు, మనం సహజంగానే క్రీడలలో నైతికంగా ఉంటాం ,లేదంటే క్రీడా రంగాలు హింసాత్మకంగా మారిపోతాయన్నారు.బిడ్డ నడవడం ప్రారంభించినంత సహజంగా క్రీడలుంటాయిని మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావాన్ని పడవేస్తాయన్నారు. క్రీడలు ,సంగీతం ఉన్నప్పటికీ, ప్రపంచ జనాభాలో మూడింట ఒక వంతు మంది ఒంటరిగా, నిరాశ, అసంతృప్తులతో బాదపడుతున్నారని ఇది ఆలోచించాల్సిన విషయమని రవిశంకర్ గుర్తు చేశారు మనం మొత్తం జీవితాన్ని ఒక క్రీడగా తీసుకోగలిగితే, ప్రపంచంలో యుద్ధం ఉండదు, గుండెల్లో మంటలు ఉండవు, అపనమ్మకం ఉండదు అని గురుదేవ్ అన్నారు"ఫుట్బాల్ నాకు స్వేచ్ఛగా మారింది," అని ఫలస్తీనియన్ మహిళల ఫుట్బాల్ జట్టు సహవ్యవస్థాపకురాలు హనీ తల్జీహ్ పంచుకున్నారు. "అది కేవలం ఆట కాదు, అది ఓ ప్రకటన. ఇది కదలడానికి, మాట్లాడడానికి, కలలు కనడానికి ఓ హక్కు.అడ్డంకులను ఛేదించడంలో , అణగారిన వర్గాలకు సాధికారత కల్పించడంలో క్రీడలు పోషించగల పాత్రను దృష్టిలో ఉంచుకుని, పాలస్తీనా మహిళా ఫుట్బాల్ జట్టు మొదటి కెప్టెన్ హనీ థాల్జీ ఇలా వ్యాఖ్యానించారుఈ మధ్య కాలంలో రికార్డులు నెలకొల్పడం, ఖ్యాతిని సాధించడం అనే లక్ష్యాల్లో నైతిక ఉల్లంఘనలు తీవ్రమైన అంశంగా మారాయి. వీటి వల్ల ప్రేక్షకుల విశ్వాసం దెబ్బతింటోంది. అదే సమయంలో, క్రీడాస్ఫూర్తి, క్రీడా నైపుణ్యం మరియు నైతికత ఒక ఆట యొక్క స్ఫూర్తిని ఎలా ఉద్ధరిస్తాయి, మొత్తం తరాన్ని ఏకం చేస్తాయి మరియు ప్రేరేపిస్తాయి అనేదానికి తగినంత ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు.క్రీడలు శాంతిని నెలకొల్పడానికి ఒక సాధనంగా, లింగ సమానత్వం, మానసిక ఆరోగ్యం, గరిష్ట పనితీరు మరియు దీర్ఘాయువు మరియు క్రీడలలోనే కాకుండా జీవితంలో మరియు నాయకత్వంలో ఉత్తమంగా ఉండటానికి ఏమి అవసరమో అనే దానిపై సమ్మిట్లో ఆకర్షణీయమైన చర్చలు జరిగాయి. ఫెయిర్ ప్లే, టీమ్ స్పిరిట్ ,ఓర్పు వంటి రంగాల నుండి పాఠాలు రాజకీయాలు మరియు వ్యాపారంలో నైతిక నాయకత్వాన్ని ఎలా రూపొందిస్తాయో కూడా సదస్సులో చర్చకు వచ్చింది.ఏడు ఖండాల్లోని ఎత్తైన శిఖరాలను అధిరోహించిన 17 ఏళ్ల కామ్య కార్తికేయన్; ఒలింపిక్ బంగారు పతక విజేత, 400 మీటర్ల హర్డిల్స్లో మాజీ ప్రపంచ రికార్డు హోల్డర్ కెవిన్ యంగ్; ఉక్రెయిన్ పార్లమెంటు సభ్యుడు గౌరవనీయులైన స్వ్యటోస్లావ్ యురాష్; పాలస్తీనా ఫుట్బాల్ మార్గదర్శకుడు హనీ థాల్జీ; యూరో '96 ఛాంపియన్, టీవీ పర్సనాలిటీ థామస్ హెల్మెర్; ఆసియా క్రీడలలో స్వర్ణం గెలుచుకున్న భారతదేశపు తొలి మహిళా గుర్రపు స్వారీ దివ్యకృతి సింగ్ ఇతర ప్రముఖ వక్తలలో ఉన్నారు.క్రీడా స్ఫూర్తి మరియు నైతికతలో ఒక ప్రమాణాన్ని నిర్దేశించే ప్రదర్శనలను ఎథిక్స్ ఇన్ స్పోర్ట్స్ అవార్డులతో సత్కరించింది. అంతర్జాతీయ ఫుట్బాల్ స్టార్ జెర్డాన్ షకీరికి 'క్రీడ ద్వారా ఏకీకరణ, న్యాయబద్ధత, అంతర్ సాంస్కృతిక సంభాషణకు అతని దీర్ఘకాల నిబద్ధత' కోసం అత్యుత్తమ వ్యక్తిగత అవార్డును ప్రదానం చేశారు. క్రీడలలో మానసిక ఆరోగ్యానికి అత్యుత్తమ సహకారం మానసిక ఆరోగ్యం, క్రీడలో న్యాయబద్ధత , యువ మహిళా అథ్లెట్లకు మద్దతు కోసం ఆమె వాదనకు గాను ఎలైట్ స్విస్ రోవర్ జీనిన్ గ్మెలిన్కు లభించింది.ఐక్యరాజ్యసమితిలో ప్రత్యేక సంప్రదింపుల హోదా కలిగిన వరల్డ్ ఫోరం ఫర్ ఎథిక్స్ ఇన్ బిజినెస్, రెండు దశాబ్దాలకు పైగా నైతిక వాదనలో ముందంజలో ఉంది. శ్రీ శ్రీ రవిశంకర్ దార్శనికత ప్రకారం, విలువలు పనితీరు విరుద్ధమైనవి కావు.అవి విడదీయరాని మిత్రులు అనే సందేశాన్ని ప్రచారం చేయడానికి WFEB యూరోపియన్ పార్లమెంట్, FIFA, మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ మరియు జెనీవాలోని UN వంటి ప్రపంచ సంస్థలతో భాగస్వామ్యం కలిగి ఉందని నిర్వాహకులు ప్రకటించారు.
ఫొటోలు
అంతర్జాతీయం

అంతా ఉత్తుత్తే.. మస్క్ మీద ప్రేమ ఒలకబోస్తున్న ట్రంప్
వాష్టింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. టెస్లా సీఈవో,అపర కుబేరుడు ఎలాన్ మస్క్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.‘నాకు మస్క్ కావాలి. మస్క్తో కలిసి పనిచేయాలని ఉంది. మస్క్ కంపెనీలకు అమెరికా ప్రభుత్వం ఇచ్చే భారీ సబ్సిడీలు తీసేస్తానని అందరూ అంటున్నారు. ఇది నిజం కాదు! నేను మస్క్ను, అలాగే అమెరికాలోని అన్ని వ్యాపారాలను అద్భుతంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను’అని ట్రూత్ సోషల్ వేదికగా ట్వీట్ చేశారు. తాజా, ట్రంప్ ట్వీట్తో గత కొంతకాలంగా ట్రంప్-మస్క్ల మధ్య కొసాగుతున్న మాటల యుద్ధానికి పులిస్టాప్ పెట్టినట్లైంది. ఒకప్పుడు డొనాల్డ్ ట్రంప్- మస్క్లు స్నేహితులు. కానీ బిగ్ బ్యూటీఫుల్ బిల్లుతో మిత్రలు కాస్తా బద్ద శత్రువుల్లా మారారు. బిగ్ బ్యూటీఫుల్ బిల్లాంతా నాన్సెస్ అని మస్క్ అంటే.. మస్క్ కంపెనీలకు అమెరికా ప్రభుత్వం రాయితీలు ఇవ్వబోదని వార్నింగ్ ఇస్తూ కయ్యానికి కాలుదువ్వారు.అదిగో అప్పడే జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్లో ట్రంప్ ప్రయోమం అందంటూ మస్క్ వరుస ట్వీట్లు, అమెరికాలో ప్రస్తుతం ఉన్న రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా ది అమెరికా పార్టీ పేరుతో కొత్త పార్టీ అంటూ హడావిడి చేశారు. ఉన్నట్లుండి ఏమైందో ఏమో మస్క్ సైలెంట్ అయ్యారు.ఈ క్రమంలో ట్రంప్ కూడా ఓ మెట్టుదిగొచ్చాడు. ట్రూత్ పోస్టులో ఎలాన్ మస్క్ కంపెనీలపై సబ్సిడీలు తొలగిస్తానన్న ఆరోపణలను ఖండించారు. మస్క్ కంపెనీలతో పాటు అమెరికాను అభివృద్ధి చేస్తానంటూ ట్వీట్లో చెప్పడంతో వ్యాపార వర్గాల్లోనే కాదు రాజకీయాల్లో సైతం ఆసక్తికరంగా మారింది.

పత్రాలన్నీ వెంట ఉండాల్సిందే
వాషింగ్టన్: అసలు కంటే కొసరు పనే ముఖ్యమన్న తరహా లో అమెరికా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఎలాగూ వీసా నిబంధనలు, ఎయిర్పోర్ట్లో క్షుణ్ణంగా తనిఖీలు దాటుకొని అమెరికాలోకి అడుగుపెట్టినా దాదాపు ప్రతి ఒక్క అమెరికాయేతర వ్యక్తులంతా ఎక్కడ పడితే అక్కడ అధికారులు అడిగే అన్ని రకాల డాక్యుమెంట్లను చూపించాల్సిందేనని ట్రంప్ సర్కార్ హెచ్చరించింది. ఈ మేరకు అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్స్(సీబీపీ) విభాగం హెచ్చరికలు జారీచేసింది. గ్రీన్కార్డ్ సాధించిన వ్యక్తులు సహా అమెరికా పౌరసత్వం పొందని వారంతా నిరంతరం తమ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను తమ వెంటేసుకుని తిరగాల్సిందేనని సీబీపీ పే ర్కొంది. అధికారులు అడిగినప్పుడు చూపించకపోతే జరిమానా ముప్పు తప్పదని, కొన్ని సార్లు అత్యల్పస్థాయి నేరాభియోగాలను సైతం ఎదుర్కో వాల్సిఉంటుందని సీబీపీ హెచ్చరించింది. 18 ఏళ్లు, ఆపైబడిన వారందరికీ ఇదే నియమం వర్తించనుంది. దీంతో విద్య, ఉద్యోగాల కోసం వచ్చే భారతీ యులు, వారి వెంట వచ్చే కుటుంబసభ్యులు, చిన్నారులకు కొత్త సమస్య వచ్చిపడింది. సినిమా, షాపింగ్, పార్క్, హోటల్, ఆస్పత్రి, రైల్వేస్టేషన్.. ఇలా ఎక్కడికి వెళ్లినా ముఖ్యమైన రిజిస్ట్రేషన్ పత్రా లు పట్టుకెళ్లడమంటే ఎంతో ఇబ్బందితో కూడిన వ్యవహారం. అక్రమంగా వలసవచ్చారని ఏ క్షణాన ఎవరిపై అనుమానం వచ్చినా వెంటనే అధికారులు సోదాలు, తనిఖీలుచేసేందుకు వీలుగా విదేశీయు లకు ఈ అడ్వైజరీని జారీచేసినట్లు సీబీపీ తెలిపింది.

భగ్గుమన్న సరిహద్దు వివాదం
బ్యాంకాక్: థాయ్లాండ్–కాంబోడియాల మధ్య దశాబ్దాలుగా నలుగుతున్న సరిహద్దు వివాదం తీవ్రరూపం దాల్చింది. సరిహద్దు ప్రాంతాల్లో ఇరు దేశాల సైనికులు గురువారం ఉదయం తుపాకులు, ఫిరంగులు, రాకెట్లతో కాల్పులకు దిగారు. థాయ్లాండ్ వైమానిక దాడులను సైతం ప్రారంభించింది. ఈ ఘటనల్లో 12 మంది చనిపోయారు. వీరిలో 11 మంది పౌరులు కాగా, ఒక సైనికుడు ఉన్నారని థాయ్ తాత్కాలిక ప్రధాని ఫుంథమ్ వెచాయచై తెలిపారు. మరో నలుగురు సైనికులు 25 మంది వరకు పౌరులు గాయపడ్డారన్నారు. మృతులు, క్షతగాత్రుల సంఖ్యను కాంబోడియా విడుదల చేయలేదు. ఘర్షణల నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లోని పౌరులు భయంతో ఇళ్లను వదిలి పారిపోతున్నట్లు తెలిపే వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమయ్యాయి. సరిహద్దుల్లోని కనీసం ఆరు ప్రాంతాల్లో కాల్పులు కొనసాగుతున్నట్లు థాయ్ రక్షణ శాఖ తెలిపింది. ఏం జరిగిందంటే..ప్రాచీన ‘ట మ్యుయెన్ థోమ్’ఆలయం సమీపంలోనే గురువారం ఉదయం ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ మొదటగా మొదలైంది. ఘర్షణకు కారణం మీరంటే మీరేనని ఎవరికి వారు ఆరోపణలు సంధించుకుంటున్నారు. సరిహద్దుల్లోని తమ సైనిక స్థావరాలకు సమీపంలో డ్రోన్ కనిపించగా కొద్దిసేపటికే ఆరుగురు కాంబోడియా సైనికులు దూసుకొచ్చారని, ఘర్షణను నివారించేందుకు ప్రయత్నిస్తుండగానే వారు కాల్పులకు దిగారని థాయ్ ఆర్మీ తెలిపింది. ఆస్పత్రిపైనా కాంబోడియా దాడులు చేసిందని ఆరోపించింది. అందుకే, తాము సైనిక లక్ష్యాలపై వైమానిక దాడులు చేపట్టినట్లు అనంతరం ప్రకటించింది. తమ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగిస్తే ఆత్మ రక్షణ చర్యలను తీవ్రతరం చేస్తామని థాయ్ ప్రభుత్వం హెచ్చరించింది. అయితే, థాయ్ సైన్యం తమ ప్రాంతంలోకి ముందుగా డ్రోన్ను పంపించిందని, ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపామని కాంబోడియా ఆర్మీ పేర్కొంది. పురాతన ప్రియా విహియార్ ఆలయంలోని రహదారిపై థాయ్ జెట్ విమానాలు బాంబులు విసిరాయని ఆరోపించింది. థాయ్ దురాక్రమణను వెంటనే నిలిపివేసేందుకు భద్రతా మండలిని సమావేశపర్చాలని కాంబోడియా ప్రధాని హున్ మనెత్ ఐరాసకు తాజాగా లేఖ రాశారు.పేలిన మందుపాతరబుధవారం వివాదాస్పద సరిహద్దు ప్రాంతంలో మందుపాతర పేలి థాయ్లాండ్ సైనికుడొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో థాయ్ ప్రభుత్వం కాంబోడియా రాయబారిని బహిష్కరించడంతోపాటు ఆ దేశంలోని తమ రాయబారిని వెనక్కి పిలిపించుకుంది. కాంబోడియాతో గల ఈశాన్య సరిహద్దు క్రాసింగ్లన్నిటినీ మూసివేస్తున్నట్లు ప్రకటించింది. తమ పౌరులను కాంబోడియా వీడాలని కోరింది. ప్రతిగా కాంబోడియా సైతం థాయ్తో దౌత్య సంబంధాలను కనీస స్థాయికి తగ్గించుకుంటున్నట్లు తెలిపింది. బ్యాంకాక్లోని తమ దౌత్య సిబ్బంది మొత్తాన్ని వెనక్కి పిలిపించుకుంది. థాయ్లాండ్ దౌత్య సిబ్బంది మొత్తం తమ దేశం విడిచివెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. తమ ఉబోన్ రట్చంథని ప్రావిన్స్లో బుధవారం మందుపాతర పేలి ఐదుగురు గాయపడినట్లు థాయ్లాండ్ ప్రభుత్వం తెలపగా తమ ప్రియా విహియార్ ప్రాంతంలో ఈ పేలుడు చోటుచేసుకుందని కాంబోడియా అంటోంది.వెయ్యేళ్ల ఆలయమే కేంద్రంగాభారతదేశాన్ని పాలించిన గుప్తులు, పల్లవ చక్రవర్తుల ప్రాబల్యం అప్పట్లో థాయ్లాండ్, కాంబోడియాల దాకా విస్తరించింది. పల్లవుల కాలంలో 11వ శతాబ్దంలో ఖ్మెర్ రాజులు నిర్మించిన మూడు హిందూ ఆలయాలున్నాయి. ఈ ఆలయా ల్లో శివలింగం, సంస్కృత లిపిలో శాసనాలు, హిందూ దేవతల చిత్రాలు ఉన్నాయి. ఇక్కడి ప్రసత్తా మ్యుయెన్ థోమ్ అనే శివాల యా న్ని 11వ శతాబ్దంలో ఉదయాదిత్యవర్మన్–2 అనే రాజు నిర్మించాడు. దాంగ్రెక్ పర్వతాల్లో పురాతన ఖ్మెర్ హైవేను కాంబోడి యాలోని అంగ్కోర్ను థాయ్లాండ్లోని ఫిమయితో కలిపే మార్గంలో ఈ ఆలయం ఉంది. దీని ప్రకారం ఖ్మెర్ సామాజ్య సరిహద్దులపై తమకే హక్కుందని కాంబోడియా అంటుండగా, థాయ్లాండ్ అంగీకరించట్లేదు. శిథిలావస్థకు చేరిన ఈ ఆలయాలు రెండు దేశాల మధ్య వివాదంతో మరోసారి తెరపైకి వచ్చాయి. ఫ్రాన్స్ ఇచ్చిన మ్యాప్తో వివాదంథాయ్లాండ్లోని సురిన్ ప్రావిన్స్, కాంబోడియా లోని ఒద్దార్ మియాంచే ప్రావిన్స్ల పొడవునా ఉన్న వెయ్యేళ్లనాటి ప్రాచీన శివాలయం ‘టమ్యుయెన్ థోమ్’ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. థాయ్లాండ్, కాంబోడియాలు గతంలో ఫ్రాన్స్ వలస పాలనలో ఉన్నాయి. ఆ సమయంలో 1907లో రెండు దేశాల సరిహద్దులను విభజిస్తూ ఫ్రాన్స్ ఒక మ్యాప్ను రూపొందించింది. ఈ మ్యాప్లో పేర్కొన్న భూ భాగం తమదేనని కాంబోడియా అంటుండగా, థాయ్లాండ్ అది అస్పష్టంగా ఉందని వాదిస్తోంది. దీనిపై కాంబోడియా అంతర్జాతీయ న్యాయ స్థానానికి వెళ్లగా 1962లో అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో అప్పటి నుంచీ తరచూ చోటుచేసుకుంటున్న సైనిక ఘర్షణల్లో కనీసం 20 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో కాంబోడియా 2011లో మరోసారి అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. విచారించిన న్యాయస్థానం 2013లో మరోసారి కాంబోడియాకే ఆ దేవాలయ ప్రాంతంపై హక్కుందంటూ మరోసారి ప్రకటించింది. థాయ్లాండ్ మాత్రం ఈ తీర్పును అంగీకరించడంలేదు.

ఇక స్వేచ్ఛా వాణిజ్యం
లండన్: భారత్, బ్రిటన్ సంబంధాల్లో కీలక ఘట్టం చోటుచేసుకుంది. చరిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్టీఏ)పై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. పరస్పర ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి రెండు రెట్లు పెంచుకోవాలని వ్యూహాత్మక భాగస్వామ్యపక్షాలైన భారత్, యూకే నిర్ణయించుకున్నాయి. అమెరికా వాణిజ్య విధానాల పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఉమ్మడి ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా వాణిజ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని తీర్మానించాయి. భారత ప్రధాని మోదీ గురువారం లండన్లో యూకే ప్రధాని కీర్ స్టార్మర్తో సమావేశమయ్యారు. ఇరువురు నేతలు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ‘యూకే–ఇండియా విజన్ 2035’ రోడ్మ్యాప్ను ఆవిష్కరించారు. అధికారికంగా సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం(సీఈటీఏ)గా పిలుస్తున్న డీల్పై మోదీ, కీర్ స్టార్మర్ సమక్షంలో భారత వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, బ్రిటిష్ వాణిజ్య మంత్రి జోనాథన్ రేనాల్డ్ సంతకాలు చేశారు. ఈ ఒప్పందం వల్ల భారత్, యూకే మధ్య వాణిజ్యం ఏటా 34 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేస్తు న్నారు. ఎఫ్టీఏపై సంతకాలు జరగడం పట్ల మోదీ హర్షం వ్యక్తంచేశారు. భారత్, యూకే సంబంధాల్లో ఇదొక చరిత్రాత్మక దినమని అభివరి్ణంచారు. ఎన్నో ఏళ్ల కఠోర శ్రమ తర్వాత ఈ ఒప్పందంపై సంతకాలు పూర్తయినట్లు తెలిపారు. కీర్ స్టార్మర్ స్పందిస్తూ.. యూరోపియన్ యూనియన్(ఈయూ) తా ము బయటకు వచి్చన అనంతరం కుదుర్చుకున్న అతిపెద్ద ఒప్పందం ఇదేనని స్పష్టంచేశారు. ఉగ్రవాదంపై పోరులో ఐక్యంగానే.. కీర్ స్టార్మర్తో చర్చల అనంతరం ప్రధాని మోదీ ఒక ప్రకటన విడుదల చేశారు. పహల్గాం ఉగ్రవాద దాడిని ఖండించినందుకు యూకే ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఉగ్రవాదంపై పోరులో భారత్, యూకే ఐక్యంగా పనిచేస్తున్నాయని చెప్పా రు. ఈ విషయంలో ద్వంద్వ ప్రమాణాలకు తావులేదన్నారు. భారత్కు ఎనలేని మేలు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో భారత్కు ఎనలేని మేలు జరుగుతుందని ప్రధానమంత్రి వెల్లడించారు. భారత వ్యవసాయ ఉత్పత్తులు, ఆహార పరిశ్రమకు బ్రిటిష్ మార్కెట్లో నూతన అవకాశాలు లభిస్తాయన్నారు. భారతీయ యువత, రైతులు, మత్స్యకారులతోపాటు సూక్ష్మ, చిన్న, మ ధ్య తరహా పరిశ్రమలకు(ఎంఎస్ఎంఈ) లబ్ధి చేకూరుతుందని స్పష్టంచేశారు. భారతీయ వ్రస్తాలు, పాదరక్షలు, వజ్రాలు, బంగారు ఆభరణాలు, సముద్ర ఆహారం, ఇంజనీరింగ్ వస్తువులకు యూకే మార్కెట్లోకి ప్రవేశం లభిస్తుందన్నారు. ‘విజన్–2030’ రోడ్మ్యాప్పై ఇండియా, యూకే అంకితభావంతో ముందుకెళ్తున్నాయని ఉద్ఘాటించారు.మోదీకి స్టార్మర్ విందు యూకే పర్యటన కోసం బుధవారం రాత్రి లండన్ చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. భారీ సంఖ్యలో తరలివచి్చన ప్రవాస భారతీయులు ఆయనకు స్వాగతం పలికారు. లండన్కు 50 కిలోమీటర్ల దూరంలోని తన నివాసంలో గురువారం మోదీకి బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు మీడియాతో మాట్లాడారు. భారత్, యూకే కలిసికట్టుగా పనిచేస్తాయని స్టార్మర్ అన్నారు. రెండు దేశాలు సహజ భాగస్వామ్య పక్షాలు అని మోదీ చెప్పారు. చరిత్రలో నూతన అధ్యాయాన్ని లిఖించుకుంటున్నాయని తెలిపారు. డబుల్ కంట్రిబ్యూషన్స్ కన్వెన్షన్(డీసీసీ)పై ఏకాభిప్రాయానికి వచ్చామని వెల్లడించారు. రెండు దేశాల్లో టెక్నాలజీ, ఫైనాన్స్తోపాటు సేవల రంగానికి మేలు జరుగుతుందన్నారు. సులభతర వాణిజ్యానికి ప్రోత్సాహం లభిస్తుందన్నారు. భారత్–యూకే సంబంధాలపై మోదీ క్రికెట్ పరిభాషలో వివరణ ఇచ్చారు. కొన్నిసార్లు స్వింగ్ అండ్ మిస్ ఉండొచ్చని, అయినప్పటికీ ఎప్పటికీ స్ట్రెయిట్ బ్యాట్తో ఆడుతూనే ఉంటామన్నారు. హైస్కోరింగ్తోపాటు బలమైన భాగస్వామ్యానికి కట్టుబడి ఉన్నాయని స్పష్టంచేశారు. మోదీ, స్టార్మర్ ‘బకింగ్హమ్ స్ట్రీట్ క్రికెట్ క్లబ్’ క్రీడాకారులతో సంభాíÙంచారు. ఒప్పందంతో లాభమేంటి? వాణిజ్య బంధాన్ని బలోపేతం చేసుకోవడంతోపాటు పరస్పర ప్రయోజనాలే లక్ష్యంగా భారత్, యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. మూడేళ్ల చర్చల తర్వాత ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఇది అమల్లోకి వస్తే జరిగేది ఏమిటంటే.. → బ్రిటిష్ ఉత్పత్తులపై ఇండియాలో సగటు సుంకాలు 15 శాతం నుంచి 3 శాతానికి తగ్గిపోతాయి. → బ్రిటన్ నుంచి విస్కీ, చాక్లెట్లు, సాఫ్ట్ డ్రింకులు, కాస్మెటిక్స్, కార్లు, వైద్య పరికరాలు భారత మార్కెట్లోకి విస్తృతంగా ప్రవేశిస్తాయి. → బ్రిటిష్ విస్కీపై ప్రస్తుతం విధిస్తున్న 150 శాతం సుంకాన్ని భారత ప్రభుత్వం 75 శాతానికి తగ్గిస్తుంది. రాబోయే పదేళ్లలో 40 శాతానికి తగిస్తుంది. అంటే బ్రిటిష్ విస్కీ ఇండియాలో చౌకగా లభిస్తుంది. → భారత్ నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులు, వస్తువులపై సుంకాలను యూకే సర్కార్ సగానికి తగ్గిస్తుంది. వ్రస్తాలు, పాదరక్షలు, వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలు తగ్గిపోతాయి. → ప్రధానంగా భారతీయ రైతులకు భారీ లబ్ధి చేకూరుతుంది. వ్యవసాయ ఉత్పత్తులపై యూకేలో టారిఫ్లు దాదాపు 95 శాతం తగ్గుతాయి. జర్మనీ, నెదర్లాండ్స్తోపాటు ఈయూ రైతులతో సమానంగా, కొన్నిసార్లు అంతకంటే ఎక్కువే భారతీయ రైతులు లాభపడతారు. ఇండియా నుంచి దిగుమతి అయ్యే తేయాకు, పండ్లు, కూరగాయలు, మసాలా పొడులు, తృణధాన్యాలు, పచ్చళ్లు, రెడీ–టు–ఈట్ ఆహారం, పండ్ల గుజ్జుతోపాటు శుద్ధి చేసిన ఆహారంపై టారిఫ్లు సున్నాకు పడిపోతాయి. → మత్స్య, సముద్ర ఉత్పత్తులపై సుంకాలను 99 శాతం తగ్గించబోతున్నారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కేరళ, తమిళనాడులో చేపలు, రొయ్యల పెంపకం చేస్తున్న రైతులకు లాభమే. → ఇండియా నుంచి యూకేకు దిగుమతి అయ్యే స్మార్ట్ఫోన్లు, ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్, ఇన్వర్టర్లపై ఎలాంటి టారిఫ్ ఉండదు. → దేశీయ మద్యం ఉత్పత్తులు, పానీయాలు యూకే మార్కెట్లోకి ప్రవేశించబోతున్నాయి. సంప్రదాయ గోవా ఫెనీ, నాసిక్ వైన్స్, కేరళ కల్లు ఇందులో ఉన్నాయి. → ఎఫ్టీఏతో రానున్న మూడేళ్లలో ఇండియా నుంచి యూకేకు వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు 20 శాతానికి పైగా పెరుగుతాయని అంచనా. 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేయాలని ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది. → దేశీయ రైతులు, పరిశ్రమలను దృష్టిలో పెట్టుకొని పాడి ఉత్పత్తులు, వంట నూనెలు, యాపిల్స్ను ఎఫ్టీఏ నుంచి భారత ప్రభుత్వం మినహాయించింది. బ్రిటన్ నుంచి వచ్చే ఈ ఉత్పత్తులపై సుంకాల తగ్గింపు ఉండబోదు. మీరు ఆంగ్ల పదాలు వాడొచ్చు ఎఫ్టీఏపై సంతకాల తర్వాత మోదీ, స్టార్మర్ ఉమ్మడిగా మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. స్టార్మర్ స్పీచ్ను హిందీలోకి అనువాదం చేస్తున్న దుబాసీ కొంత ఇబ్బందిపడ్డారు. ఆయనకు అప్పటికప్పుడు సరైన హిందీ పదాలు తగల్లేదు. అది గమనించిన మోదీ ‘‘ఇబ్బంది పడాల్సిన పనిలేదు. మీరు మధ్యలో ఆంగ్ల పదాలు వాడొచ్చు. దాని గురించి చింతించకండి’’ అని సూచించారు. దుబాసీ క్షమాపణ కోరగా, ఫర్వాలేదని మోదీ అన్నారు. ఇదంతా చూసిన స్టార్మర్ చిరునవ్వు చిందించారు.
జాతీయం

నిలిచాడు.. ఎదిరించాడు.. గెలిచాడు
తేదీ: జూలై ఐదు, 2025..స్థలం: కేరళలోని పన్నియాంకర టోల్ ప్లాజా!ఒక్కటొక్కటిగా కార్లు బారులు తీరుతున్నాయి!నిమిషాలు గడుస్తున్నాయి కానీ..ఒక టోల్బూత్లో వాహనాలు ఎంతకీ ముందుకు కదలడం లేదు!హారన్లు మోగుతున్నాయి... అరుపులు వినిపిస్తున్నాయి.. ఇక లాభం లేదనుకుని కొన్ని వాహనాలు పక్క బూత్లకు మళ్లుతున్నాయి.అంతటి హడావుడిలోనూ షెంటో వి.ఆంటో మాత్రం చాలా కూల్గా ఉన్నాడు!ట్రాఫిక్ మొత్తం నిలిచిపోయిన బూత్లో అందరికంటే ముందు ఉన్నది అతడే. కేరళ సినిమా రంగంలో ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న సినిమాటోగ్రఫర్ ఈ కుర్రాడు. పని కోసం పాలక్కాడ్, ఎర్నాకులం, త్రిశూర్ ప్రాంతాల్లో రోజూ తిరుగుతూంటాడు. రోజులాగే జూలై ఐదున అతడు పన్నియాంకర టోల్ ప్లాజా వద్ద వాహనాన్ని నిలిపేశాడు.. టోల్ కట్టమని బూత్లోని ఉద్యోగి అడుగుతూనే ఉన్నాడు కానీ షెంటో మాత్రం ససేమిరా అంటున్నాడు. డబ్బుల్లేక కాదు. ‘‘నేనిప్పటివరకూ ప్రయాణించిన టోల్ రోడ్డు ఏం బాగాలేదు. అన్నీ బాగా ఉంటేనే కదా నేను ఆ రోడ్డును వాడుకున్నందుకు టోల్ కట్టాలి. బాగాలేదు కాబట్టి కట్టను’’ అని భీష్మించుకున్నాడు. ఉద్యోగి సూపర్వైజర్లు వచ్చినా షెంటో మాత్రం తన పంథా మార్చుకోలేదు. ఏమాత్రం తొణకకుండా, బెణకక్కుండా తన వైఖరిని విస్పష్టంగా చెబుతూనే ఉన్నాడు. ఎక్కడా మాట తూలింది లేదు. గట్టిగా అరిచిందీ లేదు. అంతేకాదు.. గుంతలు పడ్డ ఇలాంటి రహదారుల్లో తాను గర్భవతి అయిన తన చెల్లెల్ని తీసుకెళ్లానని, ఆమెకేమైనా అయిఉంటే బాధ్యత ఎవరిది? అని వివరిస్తున్నాడు. ఇలా ఏమాత్రం భద్రతలేని విధంగా రోడ్లు నిర్మించినందుకు.. నిర్వహణ చేయనందుకు టోల్ ఎందుకు కట్టాలని ప్రశ్నించాడు. సమయం గడుస్తోంది... షెంటో కదలనంటున్నాడు.. టోల్ప్లాజా ఉద్యోగులు వదలమంటున్నారు. ఆఖరుకు టోల్ నిర్వాహకులు ఈ విషయాన్ని తమ ఉన్నతాధికారులకు తెలిపారు. ఏం చేయాలో వారికీ దిక్కుతోచలేదు. మల్లగుల్లాలు పడ్డారో.. చర్చలు జరిపారో తెలియదు కానీ.. తొమ్మిదిన్నర గంటల తరువాత... ‘‘బాబూ నువ్వు టోల్ కట్టనవసరం లేదు. వెళ్లండి’’ అని దారి ఇచ్చారు. ఓరిమికి ఉన్న బలం ఇదన్నమాట!.ఈ ఒక్క నిరసన వైరల్ అయిపోవడం పెద్ద విశేషం కాదు కానీ.. సాఫీగా ప్రయాణించలేని రోడ్లపై టోల్ ట్యాక్స్ వసూలు చేయకూడదని కేరళ హైకోర్టు స్వయంగా వ్యాఖ్యానించడం మాత్రం విశేషమే. పైగా తొమ్మిదిన్నర గంటలపాటు ఎలాంటి ఆవేశ కావేశాలకు లోను కాకుండా షెంటో తన వైఖరికి కట్టుబడి నిలిచిన తీరు అందరి మన్ననలు పొందింది. టోల్ ట్యాక్స్ వసూలు చేసే సంస్థలు కూడా కొంత రహదారులను సక్రమంగా నిర్వహిస్తే మేలేమో!. View this post on Instagram A post shared by Shento V Anto (@shento_v_anto)

పాదపూజ చేసినా.. కనికరించని భర్త
దొడ్డబళ్లాపురం: వివాహిత అనుమానాద స్థితిలో మృతి చెందిన సంఘటన బెంగళూరు ఉత్తర తాలూకా అంచెపాళ్యలో చోటుచేసుకుంది. అంచెపాళ్యలలో అభిషేక్, స్పందన(24) దంపతులు నివాసం ఉంటున్నారు. కాలేజీకి వెళ్లే సమయంలో స్పందన అభిషేక్ ను ప్రేమించి వివాహం చేసుకుంది. అయితే ఈ వివాహం అభిషేక్ కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు. కట్నం కోసం స్పందనను వేధించేవారు. తల్లిదండ్రులకు ఫోన్ చేసి తన బాధలు చెప్పుకుని ఏడ్చేది. ఇటీవల ఇరు వైపుల పెద్దలు మాట్లాడి రూ.5 లక్షలు ఇప్పించారు. గురువారం భీమన అమావాస్య నేపథ్యంలో భర్తకు పాదపూజ చేసిన స్పందన శుక్రవారం ఉదయం విగతజీవిగా మారింది. స్పందన మృతి చెందినట్లు తల్లితండ్రులకు ఫోన్ చేసి చెప్పడంతో వారు వచ్చి బోరున విలపించారు. అయితే స్పందనను అభిషేక్, అతని తల్లి లక్ష్మమ్మ హత్య చేశారని మృతురాలి తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాదనాయకనహళ్లి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

మోదీ టూర్ల ఖర్చు రూ. 362 కోట్లు!
న్యూఢిల్లీ: ఐదేళ్లలో రూ.362 కోట్లు ఖర్చు అంటే.. ఇదేదో ప్రాజెక్టుకు అనుకునేరు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనల ఖర్చు. 2021 నుంచి 2025 మధ్య ఆయన విదేశీ పర్యటనలకోసం అక్షరాలా రూ.362కోట్లు ఖర్చయ్యాయి. ఒక్క 2025లోనే ఆయన పర్యటనలకోసం రూ.67కోట్లకు పైగా ఖర్చు చేశారు. ఇందులో.. అమెరికా, ఫ్రాన్స్ ఉన్నతస్థాయి పర్యటనలు సహా ఐదు పర్యటనలు న్నాయి. రాజ్యసభలో తృణమూల్ ఎంపీ డెరెక్ ఓబ్రియన్ అడిగిన ప్రశ్నకు సమా« దానంగా విదేశాంగ శాఖ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఈ వివరాలను రాజ్యసభకు అందించారు. ఈ డేటా ప్రకారం, 2025లో ప్రధాని పర్యటనల్లో అత్యంత ఖరీదైనది ఫ్రాన్స్ పర్యటన. దీనికి రూ. 25 కోట్లకు పైగా.. ఆ తర్వాత అమెరికా పర్యటనకు రూ. 16 కోట్లకు పైగా ఖర్చయింది. మారిషస్, సైప్రస్, కెనడా దేశాల అదనపు సందర్శనల ఖర్చులు ఇంకా వీటికి కలపలేదు. ఇక 2024 లో రష్యా, ఉక్రెయిన్తో సహా 16 దేశాల్లో పర్యటించడానికి రూ.109 కోట్లు ఖర్చు చేశారు. 2023లో దాదాపు రూ.93 కోట్లు, 2022లో రూ.55.82 కోట్లు, 2021లో రూ.36 కోట్లు ఖర్చు చేశారు. 2021లో అమెరికా పర్యటనకే రూ.19 కోట్లకు పైగా ఖర్చయింది. ఇవి కేవలం పర్యటనలకే పరిమితం కాకుండా.. పర్యటనలకు సంబంధించిన ప్రకటనలు, ప్రసార ఖర్చుల వివరాలు కూడా ఇందులో ఉన్నాయి.

బాలుడిపై లైంగిక దాడి.. 24 కత్తిపోట్లు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం జరిగింది. ప్రత్యర్థి గ్యాంగ్కు సమాచారమిచ్చాడనే కక్షతో 14 ఏళ్ల బాలుడిని అత్యంత కిరాతకంగా చంపేశారు. ఈ దారుణంలో పాలుపంచుకున్న 13 మందిలో అత్యధికులు మైనర్లే కావడం గమనార్హం. అంతా కలిసి బాలుడిపై లైంగిక దాడికి పాల్పడి, హింసించి ప్రాణాలు తీశారు. అతడి శరీరంపై మొత్తం 24 కత్తిపోట్లున్నాయి. మర్మాయవాలను తీవ్రంగా గాయపరిచారు. జూన్ 29–30వ తేదీల్లో ఈ ఘటన చోటుచేసుకోగా బాలుడి మృతదేహం జూలై ఒకటో తేదీన ఢిల్లీలో మునాక్ కాలువ ఒడ్డును నగ్నంగా పడి ఉండగా గుర్తించారు. మొత్తం పది మంది ఈ ఘోరానికి పాల్పడినట్లు తేల్చిన పోలీసులు 19 ఏళ్ల కృష్ణ అలియాస్ భోలాను ప్రధాన నిందితుడిగా గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. వీరిలో కావడ్ యాత్రికులుగా వేషం వేసుకున్న ముగ్గురిని యూపీలోని మీరట్లో కన్వర్ క్యాంపులో ఉండగా గుర్తించారు. ఈ నెల 18న పోలీసులు సైతం కన్వరియాలుగా వేషం వేసుకుని వెళ్లి వారిని మోనుతోపాటు ఇద్దరు మైనర్లను పట్టుకున్నారు. ప్రధాన నిందితుడైన భోలాపై గతేడాది ప్రత్యర్థి బధ్వార్ సోదరులు మోను, సోనులు దాడి చేశారు. అక్రమ మద్యం విక్రయాలు, చోరీల ఆరోపణలపై పోలీసులు మోకా చట్టం కింద మోను, సోనులను జైలులో పెట్టారు. ఈ సోదరులకు తనను గురించిన సమాచారం అందిస్తున్నట్లు అనుమానం పెంచుకున్న భోలా.. ఆ బాలుడిని చంపేందుకు కుట్ర పన్నాడు. జూన్ 29వ తేదీ రాత్రి బాలుడిని వీర్ చౌక్ వద్ద ఉండగా పట్టుకుని తీవ్రంగా కొట్టారు. అనంతరం బలవంతంగా బైక్పై ఎక్కించుకుని మునాక్ కాల్వ వద్దకు తీసుకెళ్లారు. లైంగిక దాడికి పాల్పడటంతోపాటు వెంట తెచ్చుకున్న కత్తితో ఒకరి తర్వాత ఒకరు అతడిని పొడిచి, వదిలేసి పరారయ్యారు. గుర్తు తెలియని మృతదేహం పడి ఉందని సమాచారం అందడంతో పోలీసులు వెళ్లి పరిశీలించారు. ఒంటిపై ఎలాంటి ఆచ్ఛాదన లేదు. మెడకు కేవలం స్కార్ఫ్ మాత్రం కట్టి ఉంది. ఆధారాల ప్రకారం దర్యాప్తు చేపట్టి భోలాను పట్టుకున్నారు. మిగతా వారి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. నిందితుల్లో అత్యధికులు మైనర్లే అయినప్పటికీ అత్యంత తీవ్రమైన నేరమైనందున మేజర్లుగా 16ఏళ్లు దాటిన వారిగా గుర్తించి, తీవ్ర శిక్షలు వేయాలని కోర్టును కోరుతామని డీసీపీ హరేశ్వర్ స్వామి తెలిపారు. నిందితులపై హత్య, సాక్ష్యాధారాల తారుమారుతోపాటు పోక్సో కేసు కూడా నమోదు చేశామన్నారు.
ఎన్ఆర్ఐ

అమెరికా నాసా ఎన్ఎస్ఎస్ ఐఎస్డీసిలో సత్తా చాటిన విద్యార్థులు
బంజారాహిల్స్: అంతర్జాతీయ స్థాయిలో అమెరికా నాసా ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ నిర్వహించిన ఐఎస్డీఎస్ కాన్ఫరెన్స్లో శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు సత్తా చాటారని శ్రీ చైతన్య స్కూల్ అకడమిక్ డైరెక్టర్ సీమ తెలిపారు. శుక్రవారం జూబ్లీహిల్స్లోని దసపల్లా హోటల్లో నాసా ఏర్పాటు చేసిన ఐఎస్డీఎస్ కాన్ఫరెన్స్లో పాల్గొన్న విద్యార్థుల అభినందన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా సుమారు 30 దేశాల నుంచి 475 మంది విద్యార్థులు హాజరైతే అందులో 67 మంది భారత దేశం నుంచి పాల్గొనగా 45 మంది శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులే ఉండటం తమకు గర్వకారణంగా ఉందని అన్నారు. అమెరికా నాసా ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ నిర్వహించిన స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్లో అంతర్జాతీయ స్థాయిలో 60 విన్నింగ్ ప్రాజెక్టులు గెలుచుకొని తాము వరల్డ్ నెం1.గా నిలిచామని తెలిపారు. వీటిలో వరల్డ్ ఫస్ట్ ప్రైజ్ 3 ప్రాజెక్టులు, వరల్డ్ సెకండ్ ప్రైజ్ 4 ప్రాజెక్టులు, వరల్డ్లో మూడో ప్రైజ్ కింద 10 ప్రాజెక్టులు గెలుచు కోవడంతో పాటు 43 ప్రాజెక్టులకు హానరబుల్ మెన్షన్స్ సాధించాయని తెలిపారు. తెలంగాణ, ఏపీ, తమిళనాడు రాష్ట్రాల నుంచి మరే ఏ ఇతర పాఠశాల నుంచి విద్యార్థులు ఈ కాన్ఫరెన్స్లో పాల్గొనలేదన్నారు.ఈ కాన్ఫరెన్స్లో ఆర్టిస్టిక్ కేటగరిలో 500 డాలర్ల బహుమతి అందుకున్న ఏకైక టీం తమదేనని ఆమె వెల్లడించారు.

అడాప్ట్ ఏ స్ట్రీట్ పేరుతో నాట్స్ సేవా కార్యక్రమాలు
డాలస్, టెక్సాస్ : భాషే రమ్యం .. సేవే గమ్యం అనే నినాదంతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. తాజాగా విద్యార్ధుల్లో సామాజిక బాధ్యత పెంచేలా అడాప్ట్ ఏ స్ట్రీట్ పేరుతో కార్యక్రమాన్నిచేపట్టి వీధులను శుభ్రం చేసింది. ఫ్రిస్కో నగరంలో ఫీల్డ్స్ పార్క్వేలో చెత్తను తీసేసి.. అక్కడ వీధిని శుభ్ర పరిచింది. దాదాపు 20 మందికి పైగా తెలుగు వారు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకు అందరిలో అవగాహన పెంచే ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 25 పౌండ్లకు పైగా చెత్తను సేకరించి ఆ వీధిని బాగుచేసింది. ఈ కార్యక్రమం ద్వారా యువతలో పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యతను, ప్రకృతి పట్ల ప్రేమను పెంపొందించే లక్ష్యాలు నెరవేరుతాయని నాట్స్ పూర్వ అధ్యక్షులు బాపు నూతి అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్ధులకు సామాజిక బాధ్యతను నేర్పిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలకీ , పెద్దలకీ మరియు మద్దతు అందించిన దాతలకు నాట్స్ డాలస్ చాప్టర్ కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ. శ్రావణ్ నిడిగంటిలు ధన్యవాదాలు తెలిపారు. ఈ సేవా కార్యక్రమంలో నాట్స్ జాతీయ జట్టు నుండి సహ కోశాధికారి రవి తాండ్ర , మీడియా కోఆర్డినేటర్ కిషోర్ నారె,డల్లాస్ చాప్టర్ జట్టు నుండి పావని నున్న, వంశీ వేనాటి, కిరణ్ మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు. మానవతా విలువలకు ప్రాధాన్యతనిస్తూ ఈ తరహా సేవా కార్యక్రమాలను తరచూ నిర్వహిస్తున్న డాలస్ చాప్టర్ బృందానికి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షులు శ్రీహరి మందాడి అభినందనలు తెలిపారు.

పేద పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు నాట్స్ ముందడుగు
డాలస్, టెక్సాస్: అమెరికాలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ .. ఆకలితో ఆలమటిస్తున్న పేద పిల్లలకు పోషకాహారం అందించేందుకు రంగంలోకి దిగింది. తాజాగా నాట్స్ డాలస్ విభాగం, ఫీడ్ మై స్ట్రావింగ్ చిల్డ్రన్లు కలిసి పేద పిల్లలకు ఆహారం అందించేందుకు కావాల్సిన ఆహారాన్ని సిద్ధం చేశాయి. రిచర్డ్సన్ నగరంలో దాదాపు 20 మంది తెలుగు యువతీ, యువకులు, పెద్దలు.. 133 బాక్సుల పౌష్టికాహారాన్ని ప్యాక్ చేశారు. ఇందులో 28,728 భోజనాలు సిద్ధం చేశారు. ఈ ప్రయత్నం ద్వారా 78 మంది పిల్లలకు ఒక సంవత్సరం పాటు పోషకాహారం అందించేలా ఫుడ్ ప్యాకింగ్ చేశారు. నాట్స్ పూర్వ అధ్యక్షులు, ప్రస్తుత నాట్స్ బోర్డు అఫ్ డైరెక్టర్ బాపు నూతి, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రాజేంద్ర మాదల మార్గదర్శకత్వంలో పలువురు నాట్స్ యువ వాలంటీర్లు కుటుంబ సమేతంగా పాల్గొని వేల సంఖ్యలో ఆహార కిట్లను సిద్ధం చేశారు నాట్స్ డాలస్ చాప్టర్ యువతను ప్రోత్సహిస్తూ, పిల్లల్లో సేవాభావాన్ని పెంపొందించటానికి ఇలా పేద పిల్లలకు పౌష్టికాహారం సిద్ధం చేసే కార్యక్రమాన్ని చేపట్టిందని బాపు నూతి అన్నారు. సేవా కార్యక్రమాల్లో విద్యార్ధులను భాగస్వామ్యులను చేయటం చాలా సంతోషంగా ఉందని, ఇందులో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు అని రాజేంద్ర మాదల అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన పావని నున్న, సౌజన్య రావెళ్ల డాలస్ టీం సభ్యులకు డల్లాస్ చాప్టర్ కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ, శ్రావణ్ కుమార్ నిడిగంటిలు కృతజ్ఞతలు తెలిపారు.. ఈ సేవా కార్యక్రమంలో నాట్స్ జాతీయ జట్టు నుండి సహకోశాధికారి రవి తాండ్ర, మీడియా కోఆర్డినేటర్ కిషోర్ నారె, డల్లాస్ చాప్టర్ జట్టు నుండి పావని నున్న తదితరులు పాల్గొన్నారు. డాలస్ చాప్టర్ టీం, నాట్స్ సలహాదారు బృందం సభ్యుల సహకారంతో ఇంత మంచి సేవా కార్యక్రమం చేపట్టినందుకు నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని నాట్స్ అధ్యక్షులు శ్రీహరి మందాడి నాట్స్ డాలస్ విభాగానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మృతిపై నాట్స్ సంతాపం
ప్రముఖ నటుడు పద్మశ్రీ కోట శ్రీనివాసరావు మరణ వార్త పట్ల ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. 750 సినిమాల్లో ఎన్నో విలక్షణమైన పాత్రలను పోషించిన కోట తెలుగు వారి మనస్సుల్లో చెరిగి పోని ముద్ర వేశారని నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని అన్నారు. తండ్రిగా, తాతగా, కామెడీ విలన్గా, పోలీసుగా, మాంత్రికుడిగా ఎన్నో పాత్రలను పోషించిన కోటను తెలుగు వారు ఎన్నటికి మరిచిపోలేరని ఓ ప్రకటనలో తెలిపారు. కోట మృతి పట్ల నాట్స్ ప్రగాఢ సంతాపాన్ని వెలిబుచ్చింది. కోట శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నామని నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి తెలిపారు.కాగా ‘కోట’గా పాపులర్ అయిన నటుడు కోట శ్రీనివాసరావు (83) జూలై 13 తెల్లవారుజామున హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లోని ఫిల్మ్ నగర్లోని తన నివాసంలో కన్నుమూసారు. 83వ పుట్టినరోజు జరుపుకున్న కేవలం మూడు రోజులకే ఆయన మరణించడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఒక శకం ముగిసింది అంటూ పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
క్రైమ్

పాదపూజ చేసినా.. కనికరించని భర్త
దొడ్డబళ్లాపురం: వివాహిత అనుమానాద స్థితిలో మృతి చెందిన సంఘటన బెంగళూరు ఉత్తర తాలూకా అంచెపాళ్యలో చోటుచేసుకుంది. అంచెపాళ్యలలో అభిషేక్, స్పందన(24) దంపతులు నివాసం ఉంటున్నారు. కాలేజీకి వెళ్లే సమయంలో స్పందన అభిషేక్ ను ప్రేమించి వివాహం చేసుకుంది. అయితే ఈ వివాహం అభిషేక్ కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు. కట్నం కోసం స్పందనను వేధించేవారు. తల్లిదండ్రులకు ఫోన్ చేసి తన బాధలు చెప్పుకుని ఏడ్చేది. ఇటీవల ఇరు వైపుల పెద్దలు మాట్లాడి రూ.5 లక్షలు ఇప్పించారు. గురువారం భీమన అమావాస్య నేపథ్యంలో భర్తకు పాదపూజ చేసిన స్పందన శుక్రవారం ఉదయం విగతజీవిగా మారింది. స్పందన మృతి చెందినట్లు తల్లితండ్రులకు ఫోన్ చేసి చెప్పడంతో వారు వచ్చి బోరున విలపించారు. అయితే స్పందనను అభిషేక్, అతని తల్లి లక్ష్మమ్మ హత్య చేశారని మృతురాలి తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాదనాయకనహళ్లి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

కుప్పం: వివాహితుడి ప్రేమతో మోసపోయి..
కుప్పం: ప్రియుడు మోసం చేశాడంటూ ఓ మహిళా కానిస్టేబుల్ అతని ఇంటి ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కుప్పం మండలం, మార్వాడకు చెందిన వెంకటేష్ కుమారుడు వాసు ఓ ఫైనాన్స్ కంపెనీలో కలెక్షన్ మెన్గా పనిచేస్తున్నారు. కడప, మైదుకూరు, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో డబ్బులు వసూలు చేసేవాడు. ఈ క్రమంలో కడప పట్టణం, వూటుకూరు ప్రాంతానికి చెందిన ప్రశాంతితో పరిచయం ఏర్పడింది. ఈమె వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు ఆర్టీసీ డిపోలో మహిళా సెక్యూరిటీ కానిస్టేబుల్. వీరిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. అయితే.. అప్పటికే వాసుకు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ విషయాన్ని అతను ప్రశాంతికి చెప్పకుండా పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. వాసు పనిచేస్తున్న ఫైనాన్స్లో గొడవలు రావడంతో అతన్ని ఉద్యోగం నుంచి తీసేశారు. దీంతో ఆరు నెలల క్రితం ప్రొద్దుటూరు వదిలి వాసు స్వగ్రామానికి వచ్చేశాడు. అప్పటి నుంచి ప్రశాంతితో మాట్లాడడం తగ్గించేశాడు. అతనిపై అనుమానంతో గురువారం ఆమె మార్వాడ గ్రామానికి వచ్చి విచారించడంతో అసలు విషయం బయటపడింది. అప్పటికే భార్యాబిడ్డలతో కలిసి ఉన్న వాసును చూసి తట్టుకోలేకపోయింది. ప్రియుడి ఇంటి ముందే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్రంగా గాయపడిన ప్రశాంతిని కుప్పం పీఈఎస్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం తిరుపతి స్విమ్స్కు తీసుకెళ్లారు. కాలిన గాయాలతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ప్రాణాలొదిలింది. ప్రేమ ముసుగులో మోసం చేసిన ప్రియుడు వాసును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కుప్పం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తల్లి ఏమరపాటు.. బిడ్డ ప్రాణం తీసింది
తల్లి ఏమరపాటు ఆ పసిబిడ్డ ప్రాణం తీసింది. హడావిడిలో.. కిటికీని ఆనుకుని ఉన్న చెప్పుల స్టాండ్ మీద మూడున్నరేళ్ల చిన్నారిని కూర్చోబెట్టింది. అయితే ఆ చిన్నారి వెనక్కి దొర్లడంతో.. 12వ అంతస్తు నుంచి కిందపడి మరణించింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింటకు చేరింది.ముంబైలోని నియగావ్ నవకర్ సిటీలో బుధవారం సాయంత్రం ఘోరం జరిగిపోయింది. అన్వికా ప్రజాప్రతి అనే చిన్నారి ప్రమాదవశాత్తూ అపార్ట్మెంట్ 12వ అంతస్తు నుంచి పడి మరణించింది. బుధవారం 8గం. సమయంలో బయటకు వెళ్లేందుకు అన్వికా, ఆమె తల్లి వచ్చారు. తన బిడ్డ బయట తిరుగుతున్న విషయం గమనించిన తల్లి..ఆమె దగ్గరికి వచ్చింది. ఆ సమయంలో చిన్నారిని షూ ర్యాక్ మీద కూర్చోబెట్టింది. అయితే చిన్నారి నిల్చుని ఒక్కసారిగా కూర్చునేందుకు ప్రయత్నించి.. వెనక్కి పడిపోయింది. ఆ ఘటనతో గుండెపగిలిన ఆ తల్లి సాయం కోసం కేకలు వేసింది. చుట్టుపక్కల వాళ్లు రక్తపు మడుగులో పడిన చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. చిన్నపిల్లల విషయంలో తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఈ వీడియోను చూసిన వాళ్లు కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి నిర్లక్ష్య ధోరణి వల్ల ఏడాదిలో ప్రాణాలు పోతున్న చిన్నారుల సంఖ్య.. వేలల్లోనే ఉంటోందని యూనిసెఫ్ నివేదిక చెబుతోంది. View this post on Instagram A post shared by NDTV Marathi (@ndtvmarathi)

HYD: ప్రేమ జంటకు ఆశ్రయమిస్తే కటకటాల్లోకే!
ఫిలింనగర్: ప్రేమ జంటకు ఆశ్రయం ఇచ్చినందుకు యువతీ, యువకులను ఫిలింనగర్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే ప్రేమజంట మధ్య విబేధాలు రావడంతో సదరు బాలిక ఫిలింనగర్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు ఆమె మైనర్ కావడంతో ఆమె ప్రియుడిని ఫోక్సో చట్టం కింద అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. విచారణలో భాగంగా బాధితురాలు తమకు ఫిలింనగర్లోని బీజేఆర్నగర్లో నివసించే కోనె అఖిల్ అనే యువకుడు తన గదిలో ఆశ్రయం ఇచి్చనట్లు చెప్పింది. దీంతో బాలికతో పాటు ఆమె ప్రియుడికి చట్టవిరుద్ధంగా గదిని ఇచ్చినందుకుగాను పోలీసులు కోనె అఖిల్, అతడికి సహాయపడిన నిఖిత అనే యువతిని గురువారం అరెస్టు చేశారు. బీజేఆర్నగర్ బస్తీకి చెందిన యువకుడు, మైనర్ బాలిక ప్రేమించుకున్నారు. వీరిద్దరూ తరచూ కలుసుకునేందుకు అఖిల్ పలుమార్లు తన గదిని ఇచ్చాడు. అంతేగాక ఇదే బస్తీలో నివసించే నిఖిత అనే యువతి కూడా వీరికి పలుమార్లు ఆశ్రయం కల్పించింది. ఇలా గదులు ఇవ్వడం చట్టవిరుద్ధం కాగా, బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు గదులు ఇచ్చిన వారిని కూడా నిందితులుగా చేర్చి అరెస్టు చేశారు. బస్తీల్లో, కాలనీల్లో, అపార్ట్మెంట్లలో ఎవరైనా స్నేహితులకు తమ గదులను ఇస్తే వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని ఫిలింనగర్ ఇన్స్పెక్టర్ సంతోషం హెచ్చరించారు. ముఖ్యంగా ఫిలింనగర్ 18 బస్తీల్లో కొందరు ప్రేమ జంటలకు తమ గదులను వాడుకునేందుకు ఇస్తున్నట్లుగా ఫిర్యాదులు అందుతున్నాయని, వారిపై కూడా కేసులు నమోదు చేస్తామన్నారు. ఇళ్ల యజమానులు తమ ఇళ్లల్లో అద్దెకు ఉంటున్న వారి ఇంటికి ఎవరు వస్తున్నారో.. ఎవరు వెళ్తున్నారో తెలుసుకుని అనుమానాస్పదంగా ఉంటే బయటకు పంపించాలని, పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.