మహారాష్ట్రతో ఒప్పందం నష్టమే | Maharastra deal Loss | Sakshi

మహారాష్ట్రతో ఒప్పందం నష్టమే

Published Tue, Aug 23 2016 12:58 AM | Last Updated on Mon, Sep 4 2017 10:24 AM

మాట్లాడుతున్న టీపీసీసీ ఉపాధ్యక్షుడు రవి

మాట్లాడుతున్న టీపీసీసీ ఉపాధ్యక్షుడు రవి

జడ్చర్ల : సాగునీటి ప్రాజెక్టుల కోసం మహారాష్ట్ర ఒప్పందాలతో తెలంగాణకు తీరని నష్టం ఏర్పడుతుందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఆరోపించారు. సోమవారం జడ్చర్ల మండలం కావేరమ్మపేట ఎంబీ మెడికల్‌ సెంటర్‌లో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా మంగళవారం నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు.  కాంగ్రెస్‌ హయాంలోనే శ్రీశైలం, నాగార్జునసాగర్, జూరాల, దేవాదుల ప్రాజెక్టులు పూర్తయ్యాయన్నారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టిందీ తామేనన్నారు. వర్షాభావంతో పంటలు ఎండిపోయి రైతులు నష్టాల్లో కూరుకుపోయారని వెంటనే ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, బ్లాక్‌కాంగ్రెస్‌ అధ్యక్షు డు అశోక్‌యాదవ్, మార్కెట్‌ కమిటీæమాజీ వైస్‌చైర్మెన్‌ మాలిక్‌ షాకీర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement