వాహనం ఢీ కొని వ్యక్తి మృతి | Man Killed in road accident | Sakshi
Sakshi News home page

వాహనం ఢీ కొని వ్యక్తి మృతి

Published Tue, Oct 18 2016 11:51 PM | Last Updated on Mon, Sep 4 2017 5:36 PM

వాహనం ఢీ కొని వ్యక్తి మృతి

వాహనం ఢీ కొని వ్యక్తి మృతి

గాలివీడు: మండల పరిధిలోని అరవీడు ఆంజనేయస్వామి గుడి దగ్గర మంగళవారం సాయంత్రం బొలొరో వాహనం ఢీ కొన్న సంఘటనలో ఓ వ్యక్తి  మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. అరవీడు పంచాయతీ క్రిందమాలపల్లెకు చెందిన నగిరిమడుగు సిద్దయ్య(30) గాలివీడులో కూలి పని ముగించుకొని మోటర్‌సైకిల్‌పై ఇంటికి బయలుదేరాడు. మదనపల్లె నుంచి వస్తున్న బొలొరో వాహనం ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఏఎస్‌ఐ రెడ్డెయ్య సంఘటన  స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement