
‘సాక్షి’ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు
వాడపల్లి (దామరచర్ల) : మండలంలోని వాడపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో ‘సాక్షి’ దినపత్రిక ఆధ్వర్యంలో శనివారం వ్యాసరచన పోటీలు నిర్వహించారు. కష్ణా పుష్కరాలు ఆవశ్యకతపై జరిగిన ఈపోటీలకు 60 మంది విద్యార్థులు హాజరయ్యారు. విజేతలకు మంగళవారం బహుమతులు అందజేస్తామని వికాస సమితి మండల కమిటీ అధ్యక్షుడు, ఉపాధ్యాయుడు గుడిపాటి కోటయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం కె.శ్రవణ్కుమార్, సాక్షి విలేకరి బండి శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు రాధిక, గురులక్ష్మి,నాగలత, సరోజ, రజబ్అలీ, శాంతకుమారి తదితరులు పాల్గొన్నారు.