బాలికపై దాడి.. టీడీపీ నాయకురాలి అరెస్టు | tdp learer arrested for allegedly attack on a store girl | Sakshi
Sakshi News home page

బాలికపై దాడి.. టీడీపీ నాయకురాలి అరెస్టు

Published Mon, Dec 19 2016 10:14 AM | Last Updated on Fri, Aug 10 2018 9:46 PM

బాలికపై దాడి.. టీడీపీ నాయకురాలి అరెస్టు - Sakshi

బాలికపై దాడి.. టీడీపీ నాయకురాలి అరెస్టు

నూజివీడు(కృష్ణా): కిరాణ దుకాణంలో పనిచేసే బాలికపై దాడి చేసిన టీడీపీ నాయకురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కృష్ణా జిల్లా నూజివీడులో ఈ ఘటన చోటుచేసుకుంది. పట్టణ టీడీపీ నాయకురాలు, జిల్లా బీసీ సంఘం అధ్యక్షురాలిగా పనిచేస్తున్న రాణిసింగ్ ఇటీవల స్థానిక సూపర్‌మార్కెట్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా సేల్స్‌గర్ల్‌తో వాగ్వాదం జరిగింది. రాణిసింగ్ ఆగ్రహంతో ఆమెను చెప్పుతో కొట్టారు.

ఈ ఘటనతో మనస్తాపం చెందిన బాలిక నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఇందుకు కారణం తెలుసుకున్న కుటుంబీకులు ఎస్సీ సంఘాల వారి మద్దతుతో ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు సోమవారం ఉదయం రాణిసింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement