పామర్రు: కృష్ణా జిల్లా పామర్రు మండలం కొత్తమద్దాల వద్ద గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో విజయవాడ సమీపంలోని గ్రామానికి చెందిన అట్లూరి సత్యనారాయణ(60), వెంకటేశ్వర్రెడ్డి(55), మరో మహిళ అక్కడికక్కడే మృతిచెందగా..పిచ్చిరెడ్డి, నెలపోగు గోపయ్య అనే ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం విజయవాడ తరలించారు. పాలకొల్లు నుంచి విజయవాడ వస్తోండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పామర్రులో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
Published Thu, Jul 14 2016 7:32 AM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM
Advertisement
Advertisement