Three Dead
-
స్కూల్లో కాల్పులు.. ముగ్గురు మృతి
మాడిసన్: అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రంలోని సోమవారం ఒక స్కూలులో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. మృతుల్లో కాల్పులకు తెగబడ్డ ఉన్మాది కూడా ఉన్నట్లు సమాచారం. మాడిసన్లోని అబుండంట్ లైఫ్ క్రిస్టియన్ స్కూల్లో ఈ దుర్ఘటన జరిగింది. కాల్పులకు తెగబడిన వారు ఇంకా ఎవరైనా ఉన్నారా? వారు క్రియాశీలకంగా ఉన్నారా? ఆయుధాలతో ఉన్నారా? అనేది పోలీసులు ధ్రువీకరించునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ స్కూలులో కిండర్ గార్డెన్ నుంచి పదో తరగతి దాకా మొత్తం 390 మంది చదువుతున్నట్లు పాఠశాల వెబ్సైట్లో ఉంది. ఇతర అత్యవసర విభాగాలకు చెందిన అధికారులు కూడా రంగంలోకి దిగి స్థానిక యంత్రాంగానికి అండగా నిలిచారు. -
మణిపూర్లో మళ్లీ చెలరేగిన హింస
ఇంఫాల్: మణిపూర్లో మరోసారి ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. తౌబల్ జిల్లా లిలాంగ్ చింగ్జావో ప్రాంతంలో సోమవారం సాయంత్రం పోలీసు దుస్తుల్లో వచ్చిన దుండగులు జరిపిన కాల్పుల్లో నలుగురు చనిపోగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. దాంతో తౌబల్తోపాటు ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్, కాక్చింగ్, బిష్ణుపూర్ జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. దాంతో ఆగ్రహించిన ఒక వర్గం వారు నాలుగు కార్లకు నిప్పుపెట్టారు. కార్లు ఎవరివనే విషయం తెలియాల్సి ఉంది. కాల్పుల ఘటనను సీఎం బీరేన్ సింగ్ తీవ్రంగా ఖండించారు. ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదన్నారు. పోలీసులు దీనిపై దర్యాప్తు జరుపుతున్నట్లు చెప్పారు. దోషులను పట్టుకుని, చట్టం ముందు నిలబెడతామని ఆయన స్పష్టం చేశారు. మణిపూర్లో గత ఏడాది మే 3వ తేదీన ట్రైబల్ సాలిడారిటీ మార్చ్ అనంతరం కొనసాగుతున్న జాతుల మధ్య వైరంతో 180 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మణిపూర్ జనాభాలో 53 శాతం మంది మొయితీలున్నారు. కొండ ప్రాంత జిల్లాల్లో నివసించే నాగాలు, కుకీలు కలిపి 40 శాతం వరకు ఉంటారు. -
అమెరికాలో కాల్పులు.. ముగ్గురు నల్లజాతీయులు మృతి
జాక్సన్విల్లె: అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం జాక్సన్విల్లెలో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకున్న కాల్పుల ఘటన కలకలం రేపింది. ఎడ్వర్డ్ వాటర్స్ యూనివర్సిటీకి సమీపంలోని డాలర్ జనరల్ స్టోర్ వద్ద ఓ యువకుడు(20) జరిపిన కాల్పుల్లో ముగ్గురు నల్ల జాతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఇది జాతి విద్వేష ఘటన అని పోలీసులు తెలిపారు. అనంతరం దుండగుడు తనను తాను కాల్చుకుని చనిపోయాడు. నిందితుడు నల్ల జాతీయులను ద్వేషించే వాడని, ఇతర గ్రూపులతో అతడికి సంబంధాలున్నట్లు ఎటువంటి ఆధారాలు లేవని పోలీసులు స్పష్టం చేశారు. అతడు హ్యాండ్గన్తోపాటు, సెమీ ఆటోమేటిక్ రైఫిల్తో కాల్పులకు తెగబడ్డాడన్నారు. ఒక తుపాకీపై స్వస్తిక్ గుర్తు ఉందని వివరించారు. పొరుగునే ఉన్న క్లె కౌంటీ నుంచి నల్లజాతీయులు ఎక్కువగా నివసించే ఈ ప్రాంతానికి వచ్చాడు. కాల్పులకు కొద్దిసేపటి ముందు తన తండ్రికి మెసేజీ పంపించాడని, దాని ప్రకారం నిందితుడి కంప్యూటర్ ఓపెన్ చేసి చూడగా విద్వేషపూరిత రాతలు కనిపించాయని పోలీసులు వివరించారు. -
ఉక్రెయిన్పై రష్యా దాడులు
కీవ్: ఉక్రెయిన్పై రష్యా సైన్యం శనివారం ఉదయం జరిపిన దాడుల్లో ముగ్గురు మృతి చెందగా, మరో 17 మంది గాయపడ్డారు. తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో ఈ కాల్పులు జరిగినట్లు ఉక్రెయిన్ తెలిపింది. డొనెట్స్క్ ప్రాంతంలోని బఖ్ముత్, లీమాన్, మరింకా నగరాల పరిసరాల్లో రెండు సైన్యాలకు మధ్య భీకర పోరు సాగుతోంది. ఇలా ఉండగా, ఉక్రెయిన్ నుంచి రష్యా బలగాలను వెళ్లగొట్టేందుకు జరుగుతున్న పోరాటంలో తుది వరకు యూరప్తోపాటు ఈయూ మద్దతుగా నిలుస్తాయని స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ హామీ ఇచ్చారు. శనివారం ఈయూ అధ్యక్ష బాధ్యతలను స్పెయిన్ చేపట్టిన నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు. -
మణిపూర్లో హింసకు మరో ముగ్గురు బలి
కోల్కతా: నివురుగప్పిన నిప్పులా మారిన మణిపూర్ మరో ముగ్గురు అమాయకుల ప్రాణాలు బలితీసుకుంది. రాష్ట్రంలోని పశ్చిమ ఇంఫాల్ జిల్లాలో చిన్నారిని తరలిస్తున్న ఒక అంబులెన్సుకు అల్లరిమూక నిప్పుపెట్టింది. దీంతో అంబులెన్సులో ఉన్న ఎనిమిదేళ్ల బాలుడు, అతని తల్లి, మరో బంధువు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటన తాలూకు వివరాలు తాజాగా వెలుగుచూశాయి. సంబంధిత వివరాలను అధికారులు వెల్లడించారు. కాంగ్చుప్ ప్రాంతంలోని అస్సాం రైఫిల్స్ బలగాల శిబిరం వద్ద మెయిటీ వర్గానికి చెందిన ఒకావిడ తన కుమారుడితో కలిసి నివసిస్తోంది. ఆదివారం సాయంత్రం క్యాంప్పైకి కాల్పులు మొదలయ్యాయి. ఈ ఘటనలో బాలుడి తలకు బుల్లెట్ గాయమైంది. దీంతో బాలుడిని హుటాహుటిన అంబులెన్సులో తల్లి, ఆమె బంధువు తరలిస్తున్నారు. కొంతదూరం వీరికి రక్షణగా వచ్చిన అస్సాం రైఫిల్స్ బలగాలు తర్వాత ఆ బాధ్యతను స్థానిక పోలీసులకు అప్పజెప్పి వెనుతిరిగారు. కాంగ్పోకీ జిల్లా సరిహద్దుకు రాగానే ఐసోసెంబా ప్రాంతంలో అంబులెన్సును ఓ అల్లరిమూక అడ్డుకుని తగలబెట్టింది. దీంతో మంటల్లో చిక్కుకుని బాలుడు, అతని తల్లి, బంధువు ప్రాణాలు కోల్పోయారు. ఘటన జరిగిన ప్రాంతంలో కుకీ గిరిజనుల గ్రామాలు ఎక్కువ. మృతులు మెయిటీ సామాజిక వర్గానికి చెందినవారు. ఈ ప్రాంతంలో కొద్దిరోజులుగా ఇరువర్గాల మధ్య హింస, ఎదురుకాల్పుల ఘటనలు జరుగుతున్నాయి. షా ఇంటివద్ద కుకీ వర్గీయుల నిరసన ఢిల్లీలోని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నివాసం వద్ద మణిపూర్ కుకీ వర్గీయులు నిరసనకు దిగారు. ‘కుకీల ప్రాణాలు కాపాడండి’ అంటూ నినాదాలు ఇచ్చారు. నలుగురు కుకీ ప్రతినిధులను షా ఇంట్లోకి సమావేశం కోసం అనుమతించామని మిగతా వారిని జంతర్మంతర్కు తరలించామని ఢిల్లీ పోలీసులు చెప్పారు. కుకీ, మెయిటీ వర్గాల మధ్య మొదలైన జాతి వైరం హింసాత్మకంగా మారి నెలరోజుల వ్యవధిలో 98 మంది ప్రాణాలు బలిగొంది. -
నీటికుంటలో మునిగి ముగ్గురు మృతి
పులివెందుల: సరదాగా ఈతకు వెళ్లి.. నీటి కుంటలో మునిగి ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటన వైఎస్సార్ జిల్లా పులివెందుల మండలంలోని నామాలగుండు వద్ద చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు.. ప్రొద్దుటూరు టౌన్లోని మోడంపల్లెకు చెందిన సంజీవరాయుడు కుమారుడు సంజీవ కుమార్(29) టైల్స్ వ్యాపారం చేస్తుంటాడు. వ్యాపారం నిమిత్తం సత్యసాయి జిల్లా కదిరికి వెళ్లేందుకు మంగళవారం ఉదయం తన తమ్ముడు బాలశేఖర్(19)తో కలిసి కారును అద్దెకు తీసుకున్నాడు. పొట్లదుర్తికి చెందిన డ్రైవర్ గోపాల్దాస్(22)తో కలిసి కదిరి వెళ్లి టైల్స్ కొనుగోలు చేశారు. తిరిగి వస్తూ కదిరి–పులివెందుల రోడ్డులోని నామాలగుండు వద్ద కారు ఆపారు. ఆ పరిసరాల్లో ఫొటోలు తీసుకొని.. ఈత కోసం నీటి కుంటలో దిగారు. కొద్దిసేపటికి సుడిగుండంలో చిక్కుకొని ముగ్గురూ మృతి చెందారు. రాత్రి అయినా వాళ్లు రాకపోవడంతో కుటుంబసభ్యులు ఫోన్ చేశారు. ఎలాంటి స్పందన లేకపోవడంతో.. కుటుంబసభ్యులు వెంటనే కారు యజమానిని కలిసి జీపీఎస్ సాయంతో నామాలగుండుకు చేరుకున్నారు. కారు అక్కడే ఉండటంతో చుట్టుపక్కల వెతికారు. నీటి కుంట వద్ద చెప్పులు, దుస్తులు కనిపించడంతో వెంటనే పులివెందుల అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ శ్రీనివాసులు, ఎస్ఐ చిరంజీవి ఘటనా స్థలికి చేరుకుని గజ ఈతగాళ్లతో గాలించగా బుధవారం మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను పోస్టుమార్టానికి పులివెందుల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
విషాదం: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం
సాక్షి, కర్నూలు: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గూడూరు సమీపంలో ఓ కరెంట్ సబ్ స్టేషన్ దగ్గర బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ట్రాక్టర్, బైక్ పరస్పరం ఢీకొనడంతో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకొని మృత దేహాలను స్వాధీనం చేసుకున్నారు. పత్తి తీసేందుకు ట్రాక్టర్లో వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసులు తెలిపారు. మృతులు బ్రాహ్మణ దొడ్డి గ్రామంలోని ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
విద్యుత్ తీగ తెగి పడి.. ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి
నెల్లూరు రూరల్: విద్యుత్ లైన్ తీగ తెగి పడటంతో ఓ కుటుంబంలోని ముగ్గురు మృత్యువాత పడిన విషాద ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలోని కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డులో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు, రూరల్ పోలీసుల కథనం మేరకు... ఎంఐబీ– 207 ఇంటిలో గోవిందు వేణుగోపాల్ (54) కుటుంబం నివసిస్తోంది. ఆయన సైదాపురం మండలం కలిచేడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. శనివారం సాయంత్రం 6.30 గంటల సమయంలో కొరియర్ రావడంతో కవర్ను అందుకుని డబ్బులు ఇచ్చే సమయంలో పైనున్న విద్యుత్ లైను తీగ తెగి కొరియర్ బాయ్ టోపీపై పడింది. అతను త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకోగా ఆ తీగ వేణుగోపాల్పై పడింది. ఆయన అరుపులకు ఇంటి నుంచి బయటకు వచ్చిన భార్య లత (45) భర్తను కాపాడే క్రమంలో విద్యుత్షాక్కు గురయ్యారు. వేణుగోపాల్ తల్లి బుజ్జమ్మ (71) కూడా బయటకు రాగా ఆమె కూడా విద్యుత్ షాక్కు గురికావడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. వేణుగోపాల్కు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడుకి ఇటీవలే బ్యాంక్లో ఉద్యోగం వచ్చింది. కుమార్తె డిప్లొమా పరీక్షలు రాయడానికి అనంతపురం వెళ్లింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
గుజరాత్లో విషాదం: ముగ్గురు మృతి
గాంధీనగర్: గుజరాత్లో విషాదం చోటు చేసుకుంది. రాష్టంలోని వడోదర జిల్లా బవమన్పురాలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం సోమవారం అర్ధరాత్రి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఒకరు తీవ్రంగా గాయపడగా స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందకున్న స్థానిక పోలీసులు, రెస్కూ టీం ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాద స్థలిలో శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఇళ్లు కూలి ముగ్గురు మృతి
మరికల్ (నారాయణపేట): మండలంలోని కన్మనూర్కు చెందిన అనంతమ్మ (68) ఇంటి గోడ కూలి మరణించింది. మధ్యాహ్నం 12గంటలకు భోజనం చేసిన అనంతరం ఇంటిముందు ఉన్న శిథిలావస్థకు చేరిన గోడ సమీపంలో కూర్చొంది. అకస్మాత్తుగా గోడ కూలడంతో వృద్ధురాలు దుర్మరణం చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మృతురాలికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నాసర్ తెలిపారు. కుడికిళ్లలో.. కొల్లాపూర్ రూరల్: మండలంలోని కుడికిళ్లకు చెందిన సంకె దేవమ్మ(65) మంగళవారం అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా మట్టి మిద్దె కూలి మరణించింది. భారీగా వర్షం కురిసే సమయంలో ఈ ఘటన జరిగినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆమెకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్రావు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ధన్వాడ: మండలకేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన గ్రామ పంచాయతీ పారుశుద్ధ్య కార్మికుడు తిరుమలేష్ పెద్ద కుమారుడు గౌతం(3) బుధవారం మట్టి మిద్దె కూలి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం 11గంటలకు వర్షం తగ్గడంతో పిల్లాడి తల్లి పల్లవి గౌతంకు అన్నం తినిపించి వంట రూంలోని మంచంపై పడుకోపెట్టి బట్టలు ఉతికేందుకు బయటకు వచ్చింది. 5నిమిషాలకే మిద్దెకూలి భారీ శబ్ధం రావడంతో అక్కడే ఉన్న తిరుమలేష్తో పాటు చుట్టు పక్కలవారు వచ్చి మట్టిని తొలగించి చిన్నారిని బయటకు తీశారు. వెంటనే జిల్లాకేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చిన్నారిని పరీక్షించి అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించడంతో తల్లితండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ విషయం తెలుసుకున్న తహసీల్దార్, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. గ్రామంలో మట్టి మిద్దెలు ఉన్న వారు జాగ్రత్తగా ఉండాలని చాటింపు వేయించారు. మూడేళ్లకే నూరేళ్లు నిండాయ్.. మంగళవారం రాత్రి మూడోఏట పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాడు. ఉదయం చుట్టుపక్కల పిల్లలతో సరదాగా ఆడుకున్నాడు. ఈ సమయంలో అమ్మచేతి గోరు ముద్దలు తిన్నాడు. నిద్ర వస్తుందనో లేక మృత్యువు పిలిచిందో తెలియదు కాని ఇంట్లోకి వెళ్లాడు. పిల్లాడిని చూసిన అమ్మ దగ్గరికి పిలుచుకుని మంచంపై పడుకోబెట్టి బయటకు పనులు చూసుకునేందుకు వెళ్లింది. బయటకు వెళ్లినా నిమిషాల్లో మట్టి మిద్దె ఉన్నపాటుగా కుప్పకూలింది. ఈ హృదయ విషాదకర ఘటన గ్రామస్తులను కలిచివేసింది. -
కారు బోల్తా: ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు మృతి
సాక్షి, పశ్చిమగోదావరి: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం తణుకు సమీపంలో ఓ కారు అదపు తప్పి పంట కాలువలో బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు ఉద్యోగులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతి చెందిన వారిలో ఒకరు స్థానిక మున్సిపల్ ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్న జీవన శేఖర్, ఆర్టీఓ ఆఫీస్లో పని చేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ శ్రీను, వెలుగు డిపార్ట్మెంట్ ఉద్యోగిని సుభాషిణిగా పోలీసులు గుర్తించారు. వీరు విధులకు హాజరుకావడానికి భీమవరం నుంచి తణుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. తణుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆర్టీఓ కార్యలయంలో ఉద్యోగి శ్రీను జీవన శేఖర్ మునిసిపల్ ఉద్యోగి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సుభాషిణి -
జమ్మూలో విషాదం: ముగ్గురు మృతి
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపాటుకు ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటన సోమవారం గమ్సార్ ప్రాంతంలో జరిగింది. మెరుపులతో కూడిన పిడుగుపాటుకు ఓ జంట, మరో వ్యక్తి మరణించినట్లు పూంచ్ జిల్లా సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ రమేష్ కుమార్ అంగ్రాల్ తెలిపారు. మృతులను సూరన్కోట్లోని లాథోంగ్ గ్రామానికి చెందిన మహ్మద్దిన్ కుమారుడు మహ్మద్ హసీక్(38), అతని భార్య జరీనా కౌసర్(30), మరో వ్యక్తి జావేద్ అహ్మద్(38)గా పోలీసులు గుర్తించారు. వీరు పశువుల పెంపకం ద్వారా జీవనం సాగించే సంచార జాతికి చెందినవారని తెలిపారు. పిడుగుపాటుకు పెద్ద సంఖ్యలో జంతువులు కూడా మృత్యువాత పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. (రాజీవ్ గాంధీ హంతకురాలు నళిని ఆత్మహత్యాయత్నం) -
లండన్లో ముగ్గురు సిక్కుల హత్య
లండన్: ఒకే వర్గానికి చెందిన రెండు గ్రూపుల మధ్య జరిగిన గొడవలో ముగ్గురు సిక్కులు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. లండన్లోని స్కాట్లాండ్ యార్డ్లో ఈ ఘటన జరిగింది. పోలీసులు ఆ ప్రాంతంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. 29 ఏళ్ల వయసున్న ఇద్దరు అనుమానితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. కత్తుల గాయాల వల్ల వారు మృతిచెందినట్లు చెప్పారు. మృతుల వయస్సు 20–30 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు చెప్పారు. -
డివైడర్ను ఢీకొన్న డీసీఎం వ్యాన్: ముగ్గురి మృతి
పహాడీషరీఫ్: డీసీఎం వ్యాన్ అదుపు తప్పి డివైడర్ను ఢీ కొట్టిన ఘటనలో ముగ్గురు కూలీలు మార్బుల్స్ మధ్య నలిగిపోయి దుర్మరణం పాలయ్యారు. పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకున్న ఘటన వివరాలిలా ఉన్నాయి. శంషాబాద్ నుంచి డీసీఎం వ్యాన్ (ఏపీ 28 టీఏ2410) కల్వకుర్తి వైపు మార్బుల్స్ లోడ్తో ఏడుగురు కార్మికులను ఎక్కించుకుని వెళుతోంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ రోడ్డు తుక్కుగూడ గ్రామం వద్దకు రాగానే డీసీఎం డ్రైవర్ నియంత్రణ కోల్పోయి వాహనాన్ని టోల్గేట్ డివైడర్కు ఢీ కొట్టాడు. ఈ ఘటనలో షాపూర్ గ్రామానికి చెందిన రాములు(32), సాయిలు(40), కూకట్పల్లికి చెందిన శ్రీను(35)లు మార్బుల్స్ మధ్య నలిగిపోయి అక్కడికక్కడే మృతి చెందారు. ఎ.సంగయ్య(50), సత్యనారాయణ(48), పండరీ (32), ఎర్ర సాయిలు(40)కు తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పహాడీషరీఫ్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
గ్రానైట్ లారీ బోల్తా, ముగ్గురు మృతి
సాక్షి, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. గ్రానైట్ రాళ్ల లోడ్తో వెళుతున్న లారీ బ్రేక్ ఫెయిలై డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గ్రానైట్ రాళ్లు మీదపడి ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్ట్మార్టంకు తరలించారు. ఇందుకు సంబందించి పూర్తివ వివరాలు తెలియాల్సి ఉంది. -
దుబాయ్లో ఘోర రోడ్డు ప్రమాదం
గోల్కొండ: దుబాయ్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నగరానికి చెందిన ముగ్గురు మృతి చెందగా ఓ నాలుగేళ్ళ చిన్నారి తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు తెలిపిన వివరాల ప్రకారం..వరంగల్కు చెందిన గౌస్ఉల్లా ఖాన్(30) నగరంలోని టోలిచౌకీలో ఉంటూ ఉద్యోగరీత్యా యూఏఈ వెళ్ళాడు. కాగా, ఇతడు శుక్రవారం ఉల్లాఖాన్తో పాటు భార్య అయేషా (30), కుమారుడు హమ్జ (8 నెలలు), కుమార్తె హానియా సిద్ధిఖి(3)లతో కలసి దుబాయ్ సలాల హైవే మీదుగా మస్కట్కు కారులో బయల్దేరి వెళ్తున్నాడు. అయితే ఎదురుగా వస్తున్న వాహనం వీరి కారును ఢీకొట్టడంతో గౌస్ఉల్లా, అయేషా, హమ్జలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన కుమార్తె హానియాను చికిత్స నిమిత్తం దుబాయ్లోని కౌలా ఆస్పత్రిలో పోలీసులు చేర్పించారు. కాగా సమాచారం అందుకున్న గౌస్ఉల్లాఖాన్ కుటుంబ సభ్యులు శనివారం మధ్యాహ్నం మస్కట్కు వెళ్ళారు. ఆదివారం ఉదయం మృతదేహాలను నగరానికి తీసుకువస్తారని తెలిసింది. కాగా, ఆదివారం టోలిచౌకీ సాలార్జంగ్ కాలనీలోని మజ్జీద్ ఎ సాలార్జంగ్లో మధ్యాహ్నం 1ః30 గంటలకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తామని స్థానికులు తెలిపారు. -
పిడుగుపాటుకు ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి
ధారూరు(వికారాబాద్): పిడుగుపాటుకు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బలి అయ్యారు. ఈ ఘటనలో తల్లి, కూతురు, కుమారుడు మృతి చెందగా కుటుంబపెద్ద తీవ్రంగా గాయపడ్డాడు. కూతురు ఇటీవల పదో తరగతి ఉత్తీర్ణురాలైంది. వికారాబాద్ జిల్లా ధారూరు మండలం రాజాపూర్కి చెందిన ఫక్రుద్దీన్(43)కు ఇద్దరు భార్యలు. చిన్న భార్య ఖాజాబీ(38), ఆమె కుమారుడు అక్రమ్ (12), కూతురు తబస్సుమ్(15)లతో కలసి సోమ వారం పొలానికి వెళ్లాడు. మొక్కజొన్న పంటను మెషీన్ ద్వారా తీయించి మధ్యాహ్నం భోజనం తర్వాత మొక్కజొన్న గింజలను సంచుల్లో నింపే పనిమొదలు పెట్టారు. సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం రావడంతో వారంతా కలసి పొలంలో ఉన్న మంచె వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో వారి సమీపంలో పిడుగు పడింది. దీంతో ఖాజాబీ, అక్రమ్, తబస్సుమ్ ఘటనాస్థలంలోనే తుదిశ్వాస వదిలారు. వీరి పక్కన ఉన్న రెండు మేకలు కూడా చనిపోయాయి. ఫక్రుద్దీన్ తీవ్రంగా గాయపడటంతో సమీప పొలాల రైతులు, పెద్ద భార్య కుమారుడు ఫయాజ్ గమనించి అతనిని వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఫక్రుద్దీన్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. కాలేజీకి వెళ్లాల్సిన కూతురు పరలోకానికి.. ఫక్రుద్దీన్ పెద్ద భార్యకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. ఆమె అనారోగ్యంతో మృతి చెందిన తర్వాత ఖాజాబీని రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెకు కూతురు, కుమారుడు సంతానం. చిన్న కొడుకు అక్రమ్ కొడంగల్ రెసిడెన్షియల్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. కూతురు పరిగి మండలం మిట్టకోడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతిలో ఇటీవల 9.0 గ్రేడ్తో ఉత్తీర్ణురాలై స్కూల్ ఫస్ట్ వచ్చింది. -
ప్రాణాలు తీసిన మాంజా
అహ్మదాబాద్: పతంగులు ఎగురవేస్తూ వాటి పదునైన దారాలు లోతుగా గీరుకుపోవడంతో గొంతు తెగి ఓ బాలుడు(8)సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్లో ఉత్తరాయణ్ పండగ సందర్భంగా సోమవారం ఈ విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. మెహ్సనా పోలీస్స్టేషన్ పరిధిలోని తెహజీబ్ ఖాన్(8) సైకిల్పై వెళుతుండగా పతంగు దారం మెడకు గీసుకుపోయి చనిపోయాడు. అహ్మదాబాద్ జిల్లా ఢోల్కా సమీపంలో మోటారు సైకిల్పై వెళ్తున్న అశోక్ పంచాల్(45) కూడా పతంగు దారం గొంతుకు గీరుకుపోవడంతో తీవ్ర రక్తస్రావం అయి చనిపోయాడు. ఆనంద్ జిల్లా కత్తానా గ్రామ సమీపంలో పతంగు ఎగురవేస్తూ మెడకు దారం గీరుకుని గాయపడ్డాడు. సోమవారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. అహ్మదాబాద్, రాజ్కోట్, సూరత్, వడోదరా జిల్లాల్లో ఆదివారం సాయంత్రం వరకు పతంగులు ఎగురవేసే క్రమంలో ఇళ్లపై నుంచి పడి 117 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. -
దూసుకొచ్చిన మృత్యువు
సాక్షి, సిద్దిపేట/హైదరాబాద్: ఆగివున్న టాటా ఏస్ వాహనాన్ని మృత్యువులా దూసుకొచ్చిన లారీ ఢీకొట్టిన ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో 24 మందికి తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మర్కూక్ మండలం పాములపర్తికి చెందిన అక్కారం కిష్టయ్య కుటుంబ సభ్యులు, బంధువులు కలసి చేర్యాల మండలం నాగపురి గ్రామంలో మృతి చెందిన తమ సమీప బంధువైన మల్లేశం అంత్యక్రియలకు టాటా ఏస్ వాహనంలో వెళ్తున్నారు. రిమ్మనగూడ స్టేజీ వద్దకు రాగానే మరో బంధువు దాచారం నుంచి వస్తున్నానని కబురు పెట్టడంతో పక్కనే వాహనాన్ని ఆపి వేచి చూడసాగారు. ఇదే సమయంలో హైదరాబాద్ నుంచి సిద్దిపేట వైపు వస్తున్న లారీ (ఏపీ 15టీవీ 9129) వీరి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ సంఘటనలో టాటా ఏస్లో ఉన్న అక్కారం కిష్టయ్య (55), అక్కారం సాయమ్మ (60), అక్కారం పోచయ్య (35) అక్కడికక్కడే మృతి చెందారు. మరో 24 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని మొదట గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన అనంతరం 21 మంది పరిస్థితి విషమంగా ఉందని గుర్తించి, హైదరాబాద్లోని నిమ్స్కు తరలించారు. మరో ముగ్గురికి గజ్వేల్ ప్రభుత్వాసుపత్రిలోనే చికిత్స చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు భూంరెడ్డి, భూపతిరెడ్డి, సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయెల్ డేవిస్, అదనపు డీసీపీ నర్సింహారెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆసుపత్రికి వచ్చి మృతుల కుటుంబాలను పరామర్శించారు. కాగా, రిమ్మనగూడ వద్ద జరిగిన ప్రమాద ఘటన గురించి తెలుసుకున్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన వారికి సంతాపం తెలిపారు. గాయాలపాలైన వారికి అవసరమైన వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. మంత్రి హరీశ్ రావు మృతుల కుటుంబాలతో ఫోన్లో మాట్లాడారు. అనంతరం గజ్వేల్ ప్రభుత్వాస్పత్రి వైద్యులతో మాట్లాడి క్షతగాత్రుల పరిస్థితిపై ఆరా తీశారు. నిమ్స్ కు తరలించిన వారికి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఒక్కరు మినహా.. అందరి పరిస్థితి విషమం! నిమ్స్కు తీసుకు వచ్చిన 21 మంది క్షతగాత్రులకు వైద్యులు అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో రాములు (55), చంద్రమ్మ (40), భిక్షపతి (40), చంద్రయ్య (50), అమృతయ్య (55), చంద్రమ్మ (45), స్వామి (40), ఐలమ్మ (40), బాల నర్సయ్య (75), నర్సింహులు (65), భాగ్య (35), కమలమ్మ, పోశయ్య, మ రో ఎనిమిది మంది ఉన్నారు. వీరిలో ఒకరు మినహా మిగిలిన అందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వై ద్యుల ద్వారా తెలిసింది. నిమ్స్లో బాధితులను పరామర్శించిన హరీశ్ నిమ్స్లో చికిత్స పొందుతున్న బాధితులను ఆపద్ధర్మ మంత్రి హరీశ్రావు శుక్రవారం పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియాను ప్రకటించారు. తక్షణ ఖర్చుల నిమిత్తం క్షతగాత్రుల సహాయకులకు రూ.10 వేల చొప్పున అందజేశారు. అంత్యక్రియలకు తక్షణమే పదివేల రూపాయల చొప్పున స్వయంగా వెళ్లి మృతుల కుటుంబాలకు అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. -
అస్సాంలో బోటు పల్టీ.. ముగ్గురి మృతి
గువాహటి: అస్సాంలో ఘోర ప్రమాదం సంభవించింది. గువాహటి నుంచి దాదాపు 36 మందితో బ్రహ్మపుత్ర నది మీదుగా ఉత్తర గువాహటి నగరానికి వెళుతున్న నాటు పడవ బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, 11 మంది గల్లంతయ్యారు. ప్రమాద ఘటన జరిగిన వెంటనే రంగంలోకి దిగిన విపత్తు నిర్వహణ అధికారులు 10 మందిని రక్షించగా, మరో 12 మంది ఈదుతూ ఒడ్డుకు చేరుకున్నారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఇంజిన్ చెడిపోవడంతో నాటు పడవ సమీపంలోని ఓ రాయిని ఢీకొని పల్టీ కొట్టిందని కామరూప్ జిల్లా డిప్యూటీ కమిషనర్ కమల్ కుమార్ తెలిపారు. ఈ పడవలో నిబంధనలకు విరుద్ధంగా 18 మోటార్సైకిళ్లను తీసుకెళ్తున్నారనీ, మొత్తం ప్రయాణికుల్లో 22 మందికే సరైన టికెట్లు ఇచ్చారని వెల్లడించారు. ఈ ఘటనపై సీఎం సోనోవాల్ విచారణకు ఆదేశించారు. -
కేరళకు ‘నిపా’ దెబ్బ
కొజికోడ్: నిపా అనే అరుదైన వైరస్ కారణంగా కేరళలోని కొజికోడ్ జిల్లాలో గత పక్షం రోజుల్లో ముగ్గురు మరణించారు. ఈ వైరస్ సోకిన ఒకరికి ప్రస్తుతం చికిత్స అందిస్తుండగా, మరో 8 మందిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. అధిక జ్వరంతో మరో ఇద్దరు నర్సులు కూడా ఆసుపత్రిలో చేరారు. చనిపోయిన ముగ్గురూ ఒకే కుటుంబానికి చెందినవారే. నిపా వైరస్ కారణంగా మొదట మే 5న ఈ కుటుంబంలోని ఓ యువకుడు (23), మే 18న అతని అన్న (25), మే 19న ఆ కుటుంబంలోని 50 ఏళ్ల మహిళ మరణించారు. ఆ యువకుల తండ్రికి కూడా ఈ వ్యాధి సోకడంతో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. చనిపోయిన ముగ్గురు చికిత్స పొందుతున్న సమయంలో వారి బాగోగులు చూసుకున్న నర్సు లినీ కూడా సోమవారం మరణించారు. అయితే ఆమె కూడా నిపా వైరస్ సోకడం వల్లే చనిపోయారా లేదా మరేదైనా కారణం ఉందా అన్న విషయాన్ని ఇంకా నిర్ధారించాల్సి ఉంది. అటు కొజికోడ్ పొరుగు జిల్లా మలప్పురంలోనూ నిపా వైరస్ సోకిన లక్షణాలతోనే ఐదుగురు చనిపోయారు. అయితే వీరికి కూడా కచ్చితంగా వైరస్ సోకిందా లేదా అనే విషయాన్ని ఇంకా తేల్చాల్సి ఉందని ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు. కొజికోడ్లో ముగ్గురు చనిపోయిన ఇంటిలోని బావిలో గబ్బిలం కనిపించడంతో ఆ బావిని మూసివేశామని అధికారులు తెలిపారు. కేరళలో హై అలర్ట్.. నిపా వైరస్ వ్యాప్తి చెందుతున్నందున సీఎం పినరయి విజయన్ కేరళ అధికారులను అప్రమత్తం చేశారు. మరిన్ని ప్రాణాలు పోకుండా చూసేందుకు అత్యంత శ్రద్ధతో పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. కేరళ ఆరోగ్య శాఖ మంత్రి శైలజ కొజికోడ్ జిల్లా అధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. వైరస్ వ్యాప్తి చెందకుండా నియంత్రించేందుకు అవసరమైన అన్ని చర్యలనూ తీసుకుంటున్నామని శైలజ తెలిపారు. కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా కూడా శైలజతో మాట్లాడి జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రం నుంచి ఉన్నత స్థాయి వైద్యుల బృందాన్ని కొజికోడ్కు పంపారు. గబ్బిలాలను పట్టుకుంటున్న సిబ్బంది 1998లో తొలిసారి.. నిపా వైరస్ను తొలిసారిగా 1998లో గుర్తించారు. మలేసియాలోని కాంపుంగ్ సుంగై నిపా అనే ప్రాంతంలో ఈ వైరస్ను మొదట గుర్తించటంతో దానికి ఆ పేరు పెట్టారు. నిఫాలో ఇది పందుల ద్వారా వ్యాపించింది. ఈ సూక్ష్మక్రిమిని నిరోధించే వ్యాక్సిన్ లేదు. పండ్లు తినే గబ్బిలాలు, పందుల నుంచి ఈ వైరస్ సంక్రమిస్తోంది. వైరస్ సోకిన గబ్బిలాలు, పందులకి దగ్గరగా మసలడం వల్ల, నిపా వ్యాధి ఉన్న పక్షులు, జంతువులు కొరికి వదిలేసిన పండ్లను తినడం, వైరస్ బారిన పడిన వ్యక్తులను నేరుగా తాకడం వల్ల ఇది వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ సోకినవారిలో సగటున 70 శాతం మంది వరకు మరణించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. నిపా వైరస్ భారతదేశంలో తొలిసారిగా 2001 సంవత్సరంలో పశ్చిమబెంగాల్లోని సిలిగుడిలో వెలుగులోకి వచ్చింది. అప్పట్లో 66 కేసులు నమోదైతే 45 మంది (68 శాతం) మరణించారు. ఆ తర్వాత 2007 సంవత్సరం పశ్చిమ బెంగాల్లోనే నాడియాలోనూ నిపా వైరస్ కనిపించింది. కేరళలో ఈ వైరస్ను గుర్తించడం ఇదే తొలిసారి. లక్షణాలు ఇవీ: నిపా వైరస్ సోకితే జ్వరం, తలనొప్పి, వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి. ఎప్పుడు చూసినా నిద్రమత్తుగా ఉండడం, మానసికంగా గందరగోళానికి గురవడం కూడా ఈవ్యాధి లక్షణమే. ఒక్కోసారి ఈ మానసిక ఆందోళన మెదడువాపునకు కూడా దారితీస్తుంది. వైరస్ సోకిన అయిదు నుంచి 14 రోజుల్లో వ్యాధి లక్షణాలు బయటకొస్తాయి. గబ్బిలాలున్న బావిని మూసేస్తున్న దృశ్యం – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
రహదారులు రక్తసిక్తం
జిల్లాలోని రోడ్లు గురువారం రక్తసిక్తమయ్యాయి. యాదమరి, బుచ్చినాయుడుకండ్రిగ, పుంగనూరు మండలాల్లో వేర్వేరుగా జరిగిన ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పోలీసులు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆటోను ఢీకొన్న కర్ణాటక ఆర్టీసీ బస్సు యాదమరి : మండల పరిధిలోని లక్ష్మయ్యకండ్రిగ వద్ద బెంగళూరు–చెన్నై జాతీయ రహదారిలో బుధవారం రాత్రి ఆటోను కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో ఒకరు మృతి చెందగా, ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్ఐ మనోహర్ కథనం మేరకు.. బంగారుపాళెం మండలం గుండ్లకట్టమంచికి చెందిన ఉమాపతి కుటుంబ సభ్యులతో కలిసి ఆటోలో తమిళనాడులోని వళ్లిమలైలోని మురుగన్ ఆలయానికి వెళ్లారు. స్వామి వారి దర్శనం అనంతరం తిరిగి వస్తుండగా యాదమరి మండలంలోని లక్ష్మయ్య కండ్రిగ వద్ద బెంగళూరు నుంచి తిరుపతికి వెళుతున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో ఉమాపతి(47) అక్కడికక్కడే మృతి చెందాడు. అతని కుటుంబ సభ్యులు పల్లవి(23), ఇంద్రాణి(27), మునెమ్మ(40), విజయలక్ష్మి(47), శ్రీధర్(07), మౌనిష్(07), ఆటో డ్రైవర్ వేణు(35) తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో పల్లవిని తిరుపతికి, ఇంద్రాణి, మౌనిష్ను వేలూరు సీఎంసీకి తరలించారు. కేసు దర్యాపు చేస్తున్నట్లు ఎస్ఐ మనోహర్ తెలిపారు. బైక్ను లారీ ఢీకొని.. పుంగనూరు : మండలంలోని సుగాలిమిట్ట సమీపంలో గురువారం రాత్రి ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో యువకుడు మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం సన్నువారిపల్లెకు చెందిన రామయ్య కుమారుడు రవీంద్రారెడ్డి(28) ఎస్ఆర్కే రోడ్ కన్స్ట్రక్షన్ కంపెనీలో ఇంజినీరుగా పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి మదనపల్లె నుంచి పుంగనూరుకు ద్విచక్ర వాహనంలో బయలుదేరాడు. ముందు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేసే సమయంలో లారీ డ్రైవర్ ఎటువంటి సిగ్నల్స్ ఇవ్వకుండా రాంగు సైడులోకి లారీని పోనిచ్చాడు. ఈ సంఘటనలో అతన్ని లారీ లాక్కెళ్లింది. తీవ్రంగా గాయపూడిన అతన్ని స్థానికులు పుంగనూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతను మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చెట్టును ఢీకొన్న బైక్ బుచ్చినాయుడుకండ్రిగ : మండల కేంద్రమైన బుచ్చినాయుడుకండ్రిగ సమీపంలో ద్విచక్రవాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొనటంతో యువకుడు దుర్మరణం చెందాడు. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని పద్మావతిపురం దళితవాడకు చెందిన గురవయ్య (25) బుచ్చినాయుడుకండ్రిగలోని హోటల్లో వంట మాస్టర్గా పనిచేస్తున్నాడు. అతను బుధవారం రాత్రి హోటల్లో పనిముగించుకుని ద్విచక్ర వాహనంలో ఇంటికి బయలుదేరాడు. బుచ్చినాయుడుకండ్రిగ సమీపంలో వస్తుండగా ద్విచక్ర వాహనం అదుపు తప్పి కేటీరోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొంది. తీవ్రంగా గాయపడిన గురవయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. దీన్ని గమనించిన వాహనదారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ రామ్మోహన్ అక్కడికి చేరుకుని గురవయ్య మృతదేహాన్ని శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
వివాహానికి వచ్చి.. మృత్యు ఒడిలోకి..
సరదాగా వివాహ వేడుకకు వచ్చిన ముగ్గురు యువకులు మృత్యుఒడికి చేరారు. బహిర్భూమికని వచ్చి ఈత కొట్టేందుకు చెరువులో దిగిన ఓ యువకుడిని కాపాడబోయి మరో ఇద్దరు యువకులు మృతిచెందిన సంఘటన మండలంలోని మాందారిపేట(తహరాపూర్) గ్రామంలో చోటుచేసుకుంది. మృతులంతా వరంగల్లోని కొత్తవాడకు చెందిన చిన్ననాటి స్నేహితులే కావడంతో ఆ కుటుంబాల్లో విషాదం అలుముకుంది. శాయంపేట(భూపాలపల్లి): వివాహానికి హాజరయ్యేందుకు వచ్చిన స్నేహితుల బృందంలో విషాదం చోటుచేసుకుంది. ఈత సరదాతో కుంటలోకి దిగి మునిగిపోతున్న ఓ స్నేహితుడిని కాపాడబోయి మరో ఇద్దరు స్నేహితులు కూడా మృత్యుఒడికి చేరారు. వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలం మాందారిపేటలో జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. మాందారిపేట గ్రామానికి చెందిన మాజీ ప్రజాప్రతినిధి కూతురు వివాహానికి వరంగల్కు చెందిన బంధువులు ఆలేటి విజయ–స్వామి దంపతులతోపాటు వారి పెద్ద కుమారుడు సునీల్(19) హాజరయ్యారు. అతడితోపాటు అతడి చిన్ననాటి స్నేహితులు ఎనిమిది మంది పెళ్లికి వచ్చారు. భోజనాల అనంతరం సునీల్తోపాటు వరంగల్ కొత్తవాడకు చెందిన దేవులపల్లి అరుణ–సురేష్ దంపతుల కుమారుడు వంశీ(19), రంగు సునీత–మార్కండేయ దంపతుల కుమారుడు సాయికృష్ణ(17) సమీపంలోని గోగుకుంటలోకి బహిర్భూమికి వెళ్లారు. ఈ క్రమంలో దేవులపల్లి వంశీ ఈత కొట్టేందుకు కుంటలోకి దిగాడు. వంశీకి ఈత రాకపోవడంతో లోతుగా ఉన్న ఆ కుంటలో మునిగిపోతూ కనిపించడంతో పక్కనే ఉన్న సునీల్ అతడిని కాపాడేందుకు నీళ్లలోకి దూకాడు. సునీల్ను వంశీ గట్టిగా పట్టుకోవడంతో ఇద్దరు మునిగిపోతూ కనిపించారు. దీంతో గట్టుపై ఉన్న సాయికృష్ణ మిగతా స్నేహితులకు సమాచారమిచ్చి అతడు కూడా వారిని కాపాడేందుకు చెరువులోకి దూకాడు. అయితే సాయికృష్ణకు కూడా ఈత రాకపోవడంతో ఇద్దరు కలిసి సునీల్ను గట్టిగా పట్టుకోవడంతో ముగ్గురు అందులోనే మునిగిపోయారు. మిగతా స్నేహితులు వచ్చేసరికే ముగ్గురు యువకులు మునిగిపోయారు. వెంటనే వారు అందులోకి దిగి మునిగిన ముగ్గురిని ఒడ్డుకు చేర్చారు. అప్పటికే వారు మృత్యుఒడికి చేరారు. వరంగల్లోని కొత్తవాడకు చెందిన సాయికృష్ణ, వంశీ కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి వచ్చారు. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. పరకాల ఏసీపీ సుధీంద్ర, తహసీల్దార్ వెంకటభాస్కర్, సీఐ షాదుల్లాబాబా, ఎస్సైలు రాజబాబు, బాబుమోహన్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం కుటుంబ సభ్యుల అనుమతితో మృతిచెందిన ముగ్గురిని పరకాల సివిల్ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. మృతులు సునీల్, వంశీ నర్సంపేటలోని బిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలలో బీటెక్ సెకండియర్ చదువుతుండగా, సాయికృష్ణ హన్మకొండలోని భద్రకాళి జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. కాగా మృతుల కుటుంబాలను టీఆర్ఎస్ నాయకుడు గండ్ర సత్యనారాయణరావు పరామర్శించారు. -
విద్యుదాఘాతానికి ముగ్గురి బలి
పరిగి: కరెంట్ షాక్ ముగ్గురిని కాటేసింది. తొలుత ఓ మహిళ విద్యుదాఘాతానికి గురికాగా.. ఆమెను కాపాడే యత్నంలో మరో ఇద్దరు మృతి చెందారు. ముగ్గురి మరణంతో వికారాబాద్ జిల్లా పరిగి మండలం లఖ్నాపూర్లో విషాదం అలుముకుంది. లఖ్నాపూర్లో చల్లా రామచంద్రమ్మ అనే మహిళ సోమవారం గృహప్రవేశం చేసింది. రాత్రి 7 గంటలకు గ్రామస్తులను భోజనానికి ఆహ్వానించాలని ఊరిలోకి బయలుదేరింది. చాకలి మొగులయ్యకు చెందిన రెండు ఇళ్ల మధ్య గల్లీలో విద్యుత్ తీగలు తేలి ఉన్నాయి. అక్కడే మరో ఇనుప తీగ వేలాడుతూ ఉంది. ఆ ఇనుప తీగకు సందులో తేలి ఉన్న విద్యుత్తీగ తగిలింది. చీకట్లో అటుగా వెళ్లిన రామచంద్రమ్మ (62)కు ఆ ఇనుప తీగ తగలడంతో కరెంట్ షాక్కు గురైంది. వెంటనే ఆమె కేకలు వేస్తూ అక్కడే కుప్పకూలింది. పొరుగింటి చాకలి లక్ష్మి(55) గమనించి రామచంద్రమ్మను రక్షించేందుకు యత్నించింది. ఆమెకు కూడా షాక్ కొట్టడంతో కుప్పకూలింది. వీరి కేకలు విని ఏం జరిగిందోనని సమీపంలో ఉన్న గోనెల శేఖర్ (25) పరుగెత్తు కుంటూ వచ్చా డు. వారిని తన భుజాలపై ఎత్తుకుని పక్కకు తీసుకెళ్లే యత్నం చేశాడు. ఆ ప్రదేశమంతా తడిగా ఉండటంతో శేఖర్ కూడా షాక్కు గురై అక్కడే పడిపోయాడు. స్థానికులు గమనించి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. రామచంద్రమ్మ ఘటనాస్థలంలోనే మృతి చెందగా, పరిగి ఆస్పత్రికి తరలిస్తుండగా లక్ష్మి, శేఖర్ మార్గమధ్యంలో మృతి చెందారు. శేఖర్కు భార్య లలిత, ఇద్దరు కుమారులున్నారు. ఒకే గ్రామంలో ముగ్గురు మృతి చెందటంతో స్థానికుల్లో విషాదం అలుముకుంది. -
తెల్లారిన బతుకులు
రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబాలు వారివి. ఇంట్లో పెద్దలు చిందీలను సఫాయి చేయాలి.. ఆడబిడ్డలు నైటీలు, లంగాలు, జుబ్బాలు, నైట్ ప్యాంట్లో.. ఇలా ఏవి అందుబాటులో ఉంటే వాటిని కుట్టి తీరాలి. మగవారు ర్యాగ్స్ కటింగ్తో దుస్తుల తయారీకి సహకరించాలి. ఇలా కుటుంబసభ్యులందరూ శ్రమిస్తే తప్ప పూట గడవని దుర్భర జీవితాలు. కాసింత నాలుగు పైసలు కళ్లతో చూడాలనుకుంటే ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి విక్రయించాలి. బతుకు పోరులో అలుపెరగని శ్రమజీవులపై విధి వింత పాచిక విసిరింది. పొరుగున ఉన్న రాష్ట్రంలో దుస్తులు విక్రయించేందుకు వెళుతున్న వారి బతుకులు చీకట్లు వీడకముందే రోడ్డు ప్రమాదంతో తెల్లారిపోయాయి. పామిడికి చెందిన ముగ్గురు వ్యాపారులు దుర్మరణం చెందారు. డిసెంబర్లో జరిగిన పోలీస్ బ్రదర్స్ మరణం నుంచి కోలుకోకముందే మరో విషాదం పామిడి వాసులను విషాదంలో ముంచెత్తింది. పామిడి: కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చిందీ వ్యాపారులు ముగ్గురు మృత్యువాత పడ్డారు. వివరాలిలా ఉన్నాయి. బెంగళూరులోని రామనగర్లో జరుగుతున్న ఇజ్తెమాలో జుబ్బాలు, నైట్ ప్యాంట్లు విక్రయించడం కోసం పామిడికి చెందిన 11మంది ముస్లిం వ్యాపారులు శనివారం రాత్రి పదిన్నర గంటలకు అనంతపురానికి చెందిన మహీంద్రా బొలెరో వాహనంలో బయల్దేరారు. ఆదివారం వేకువజామున 3.30 గంటలకు చిక్బళ్లాపూర్ దాటి పది కిలోమీటర్లు వెళ్లగానే వెనుకచక్రం బరెస్ట్ కావడంతో బొలెరో వాహనం పల్టీలు కొట్టింది. ట్రాలీలో కూర్చున్న నెహ్రూకాలనీ వాసి ఎన్.ఖాదర్వలి (38), బొడ్రాయి వీధికి చెందిన అనుంపల్లి ఖాజాహుసేన్ (42)లు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. తీవ్రంగా గాయపడిన షేక్ ఇబ్రహీం (48)ను హుటాహుటీన బెంగుళూరులోని ప్రో లైఫ్ హాస్పిటల్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం ఇబ్రహీం మృతి చెందాడు.ఇదే ప్రమాదంలో షెక్షావలి, రసూల్, శింగనమల మహమ్మద్, తరిమెల హాజీవలి, దేవరపల్లి బాషా గాయాలపాలయ్యారు. క్యాబిన్లో కూర్చున్న డీఎం బాషా, షేక్ జాఫర్, హన్నూ సురక్షితంగా బయటపడ్డారు. ♦ మృతుడు ఖాదర్వలికి భార్య యాస్మిన్, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అనుంపల్లి ఖాజాహుసేన్కు భార్య ఫకృన్నీ, ఇద్దరు కుమారులు, షేక్ ఇబ్రహీమ్కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ♦ ఆదివారం సాయంత్రం పామిడికి చేరుకున్న ఎన్.ఖాదర్వలి, ఖాజాహుసేన్ల మృతదేహాలకు కుటుంబ సభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు. షేక్ ఇబ్రహీం మృతదేహం ఆదివారం రాత్రికి వచ్చింది. సోమవారం అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. కూతురు వద్దన్నా వెళ్లి.. ఇజ్తెమాకు వెళుతున్న ఖాదర్వలిని మూడేళ్ల కూతురు వెళ్లొద్దంటూ అడ్డుపడింది. పాపను సముదాయించి బయల్దేరిన ఖాదర్వలి రోడ్డుప్రమాదంలో మరణించడం కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. అప్పుడే నూరేళ్లు నిండినా అంటూ తల్లి, భార్య, సోదరులు రోదించడం చూపరుల హృదయాలను కలచివేసింది. వెంటాడిన మృత్యువు.. ఖాజాహుసేన్ గత రంజాన్ మాసంలో చిందీ వ్యాపారం కోసం బళ్లారికి ద్విచక్రవాహనంలో వెళ్లి ప్రమాదానికి గురయ్యాడు. కాలు విరిగింది. కుటుంబ పోషణ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో శనివారం రాత్రి బెంగళూరుకు వెళుతుండగా రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. మరణవార్త తెలియగానే తల్లి జహీరాబీ, భార్య ఫకృన్నీ గుండెలవిసేలా రోదించారు. తనయుడి ఎదుటే తండ్రి మరణం షేక్ ఇబ్రహీంకు తనయుడు షేక్ జాఫర్ వ్యాపారంలో చేదోడువాదోడుగా ఉండేవాడు. బెంగళూరుకు తండ్రితోపాటు బయల్దేరాడు. రోడ్డు ప్రమాదంలో తనయుడి కళ్లెదుటే ఇబ్రహీమ్ ప్రాణాలు విడిచాడు. ఆ బాధ నుంచి జాఫర్ కోలుకోలేదు. కుటుంబ యజమాని మృతితో తామెట్ల బతికేదంటూ ఇబ్రహీం భార్య గుల్జార్ విలపించింది. -
పెళ్లి చూపులకు వెళుతూ..
కొడుకుకు పెళ్లి సంబంధం చూసేందుకు తల్లి తన కుమార్తె, మనుమరాలితో కలిసి బయలుదేరారు. విధి వక్రించింది. లారీ రూపంలో దూసుకువచ్చింది. ముగ్గురిని కబళించింది. దీంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఈ సంఘటన శాంతిపురం మండలంలో ఆదివారం జరిగింది. శాంతిపురం/గుడుపల్లి:లారీ దూసుకెళ్లడంతో ముగుగరు దుర్మరణం చెందారు. మృతులు ఒకే కుటుంబానికి చెందిన వారు. పోలీసుల కథనం మేరకు.. గుడుపల్లి మండలం అగరం కొత్తపల్లికి చెందిన నారాయణమ్మ (40) తన కుమారుడు రాజప్పకు శాంతిపురం మండలంలోని నడింపల్లిలో వివాహ సంబంధం చూసింది. వెంకటాపురంలో ఉన్న కుమార్తె మమత(21)కు పెళ్లి కుమార్తెను చూపించాలని భావించింది. ఈ క్రమంలో ఆదివారం మమత, ఆమె కుమార్తె యశ్వంతిక(1)ను తీసుకుని కొడుకు రాజప్ప ద్విచక్ర వాహనంలో నడింపల్లికి బయలుదేరారు. సి.బండపల్లి సమీపంలో ఎదురుగా వచ్చిన లారీకి ఉన్న టార్పాలిన్ గాలికి ఎగిరి వీరిపైకి వచ్చింది. దీన్ని గుర్తించిన రాజప్ప పక్కకు తప్పుకునేలోపే టార్పాలిన్ పట్ట వెను క కూర్చున్న తల్లి, చెల్లి, మేనకోడలిని రోడ్డుపై పడేసింది. ఈ క్రమంలో రాళ్లు తరలించే భారీ లారీ వెనుక చక్రాలు ముగ్గురిపైనా దూసుకుపోయాయి. దీంతో ముగ్గురూ దుర్మరణం చెందారు. ఈ విషయం తెలు సుకున్న కుప్పం సీఐ రాజశేఖర్, గుడుపల్లి, రాళ్లబూ దుగూరు ఎస్ఐలు భాస్కర్, వెంకటశివకుమార్ అక్కడికి చేరుకున్నారు. మృతదేహాలను కుప్పం ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. రాజప్ప స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. రెండు గ్రామాల్లో విషాదం ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడంతో నారాయణమ్మ స్వగ్రామం అగరం కొత్తపల్లి, మమత అత్తగారి ఊరు వెంటాపురంలో విషాదం నెలకొంది. పోస్టుమార్టం అనంతరం నారాయణమ్మకు అగరం కొత్తపల్లిలో, మమత, చిన్నారి యశ్వంతికలకు వెంటాపురంలో అంత్యక్రియలు నిర్వహించారు. పెళ్లి చూపులకని వెళ్లి శవాలుగా ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులు చేస్తున్న రోదనలు చూసి స్థానికులు కంటతడి పెట్టారు. ఏడాదికే నూరేళ్లు నిండిపోయాయా తల్లీ నీకు అంటూ చిన్నారి యశ్వంతిక మృతదేహంపై పడి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మృతుల బంధువుల ఆగ్రహం ఇరుకుగా ఉన్న రోడ్డులో రాళ్లు రవాణా చేసే భారీ టారాస్ లారీ రావడంతోనే ప్రమాదం జరిగిందని మృతుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వాహనాలను ఎందుకు అనుమతిస్తున్నారని అధికారులతో వాదనకు దిగారు. అధికారులు, లారీ డ్రైవరు నిర్లక్ష్యంతోనే మూడు ప్రాణాలు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమీపంలోని రత్నా మినరల్స్ క్వారీపై దాడి చేశారు. అక్కడ ఉన్న జనరేటర్, ఇతర వస్తువులకు నిప్పు పెట్టారు. అదనపు బలగాలు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి. -
రైతు కుటుంబం బలవన్మరణం
సాక్షి, సిద్దిపేట: ఆర్థిక ఇబ్బందులతో ఓ రైతు కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ఇద్దరు పిల్లలతో సహ దంపతులు ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన సిద్దిపేట జిల్లాలో మంగళవారం ఉదయం వెలుగు చూసింది. అక్కన్నపేట మండలం తురకవానికుంట గ్రామానికి చెందిన రైతు గుండా భగవాన్రెడ్డి(50), భార్య రాజవ్వ, కొడుకు ప్రేమ్ చందర్ రెడ్డి, కూతురు రోజా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అయితే... వీరిలో భగవాన్రెడ్డి, ప్రేమ్ చందర్ రెడ్డి, రోజా మృతి చెందగా ప్రాణాపాయస్థితిలో ఉన్న రాజవ్వను హుస్నాబాద్ ఆస్పత్రిలో చేర్చారు. రాజవ్వ పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. భార్య ఇద్దరు పిల్లలకు విషమిచ్చి భగవాన్ రెడ్డి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాల వల్లే వారు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డట్టు తెలుస్తోంది. కొడుకు కూతురు ఇద్దరూ ఎంబీఏ పూర్తి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
మట్టిలో ‘కలిసి’పోయారు
వర్షానికి పెంకుల ఇల్లు కూలి దంపతులు సహా మనుమడు మృతి చెందడంతో రామకుప్పంలోని రాజుపేటలో తీవ్ర విషాదం నెలకొంది. దశాబ్దాలుగా ఇటుక బట్టీలో కూలీలుగా జీవనం సాగి స్తున్న ఆ భార్యాభర్తలు చివరికి గోడకూలి మట్టిలోనే కలిశారంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు, రామకుప్పం: వర్షానికి నానిన గోడ కూలి ఒకే ఇంట్లో ముగ్గురు దుర్మరణం చెందడం రామకుప్పంలో తీవ్ర విషాదం నింపింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. రెక్కాడితేగానీ డొక్క నిండని కుటుంబం సుక్కుర్సాబ్ది. బతుకు దెరువు కోసం రాజుపేట నుంచి కర్ణాటక సరిహద్దు రాజుపేటరోడ్డుకు వెళ్లా రు. అక్కడ బాడుగ ఇంట్లో ఉంటూ సుక్కుర్సాబ్ (60), అతని భార్య పాతిమా(50) ఇటుక బట్టీలో పనిచేస్తున్నారు. పని ఎక్కువగా ఉన్న సమయంలో బట్టీ వద్ద యజ మాని ఏర్పాటు చేసిన పెంకుల ఇంటిలోనే నిద్రించేవారు. తెల్లవారుజామున పనుల్లో నిమగ్నమయ్యేవారు. వయసు మీదపడినా పొట్ట కూటి కోసం శక్తివంచన లేకుం డా కష్టపడి ఇటుకలు తయారు చేసే వారు. వీరి పాలిట పెంకుల ఇల్లు మృత్యుపాశమైంది. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇటుకుల బట్టీలో ఇద్దరు కలిసి ఇటుకలు తయారు చేశారు. రాత్రి పెంకుల ఇంటిలోనే తలదాచుకున్నారు. అక్కడే భోజనం చేశారు. నిద్రకు జారుకునే సమయంలో తమ కుమార్తె ఆశ ఐదేళ్ల కొడుకు నయాజ్తో కలిసి ఇటుకుల బట్టీ వద్దకు వచ్చి తల్లిదండ్రులను కలిసింది. కొద్దిసేపు మాట్లాడి ఇంటికి తిరిగి వెళ్లే సమయంలో చిన్నారి నయాజ్ అమ్మమ్మ తాతయ్య దగ్గరే ఉంటానని మారాం చేయడంతో ఆశ తన కుమారుడుని అక్కడే వదిలి వెళ్లింది. రాత్రి 11 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఈ క్రమంలో బుధవారం తెల్లవారు జామున 3.30 గంటల ప్రాంతంలో పెంకుల ఇంటి గోడలు ఒక్కసారిగా కుప్ప కూలాయి. పెంకులు, కట్టెలు మీదపడడంతో గాఢ నిద్రలో ఉన్న సుక్కుర్సాబ్, పాతిమా, నయాజ్(05) ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు గుర్తించి కాపాడే ప్రయత్నం చేసినా.. అప్పటికే రక్తపు మడుగులో చిక్కుకుని మృతి చెందారు. కుటుంబ సభ్యుల రోదనలతో ఆ ప్రాంతం శోకసంద్రంగా మారింది. రాజుపేటరోడ్డులో అంత్యక్రియలు నిర్వహించారు. ఒక్కరాత్రి గడిచి ఉంటే.. మృతి చెందిన చిన్నారి నయాజ్ తల్లి ఆశ రోదనలు స్థానికులను కలచివేశాయి. బెంగళూరులో కూలి పనులకు వెళ్లేందుకు బుధవారం ప్రయాణానికి అంతా సిద్ధం చేసినట్లు ఆమె వాపోయింది. ఈ ఒక్క రాత్రి గడిచి ఉంటే తన బిడ్డ బతికి ఉండే వాడని కన్నీరుమున్నీరైంది. తన బిడ్డకు అప్పడే నూరేళ్లు నిండాయంటూ గుండెలు బాదుకుంది. మృత్యువులోనూ వీడని సంబంధం సుక్కుర్సాబ్కు భార్య పాతిమా మొద టి నుంచి పనుల్లో చేదోడువాదోడుగా ఉండేది. 30 ఏళ్ల క్రితం ఒక్కటైన ఈ జంట.. మరణంలోనూ తమ బం ధాన్ని వీడలేదని స్థానికులు వాపోయారు. ప్రాణాలు తీసిన ఇటుకల బట్టీ.. కూలీల కోసం ఏర్పాటు చేసిన పెంకుల ఇల్లు శిథిలావస్థకు చేరుకుంది. అయినా యాజమాని ఏం పట్టించుకోక నిర్లక్ష్యంగా ఉండడంతో ప్రమాదం జరిగినట్టు పలువురు ఆరోపిస్తున్నారు. అనధికారికంగా ఏర్పాటు చేసిన ఇటుక బట్టీల వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, అధికారులు చర్యలు తీసుకుని పేద కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. వర్షానికి కూలిపోయిన పెంకుటిల్లు -
ఘోర ప్రమాదం, ముగ్గురు సజీవ దహనం
-
ఘోర ప్రమాదం, ముగ్గురు సజీవ దహనం
మహాబలిపురం: తమిళనాడులోని మహాబలిపురంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈసీఆర్ రోడ్డులో వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు సజీవదహనమయ్యారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. -
మంగళూరు వద్ద బస్సు బోల్తా,ముగ్గురు మృతి
-
ఆటోను ఢీకొన్న రెండు లారీలు ముగ్గురు మృతి
-
మిస్టరీ ప్రమాదాలు.. ముగ్గురి మృతి
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణించిన తర్వాతి నుంచి ఆమె ఆస్తులకు సంబంధించి ఏదో ఒక మిస్టరీ వెలుగు చూస్తూనే ఉంది. తాజాగా.. జయలలిత వద్ద గతంలో డ్రైవర్గా పనిచేసిన వ్యక్తి ఒక 'రోడ్డు ప్రమాదం'లో మరణించాడు. అయితే ఇది నిజంగా ప్రమాదమేనా, లేక ఎవరైనా అలా చిత్రించారా అనే విషయం అనుమానంగానే ఉంది. తమిళనాడులోని సేలం జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. చెన్నై పోయెస్ గార్డెన్స్లోని జయలలిత నివాసంలో కనకరాజ్ (36) డ్రైవర్గా పనిచేసేవాడు. మూడేళ్ల క్రితం అతడిని తీసేశారు. ఆ తర్వాతి నుంచి అతడు టాక్సీ నడుపుకొంటున్నాడు. ఇటీవల కొడనాడులోని జయలలిత ఎస్టేట్లో జరిగిన వాచ్మన్ ఓం బహదూర్ హత్యకేసులో ఇతడు ప్రధాన నిందితుడు. నీలగిరి పోలీసులు ఇప్పటికే అతడిని ఒకసారి ప్రశ్నించారు. కనకరాజ్ మోటార్ సైకిల్ మీద వెళ్తుండగా ఓ వాహనం అతడిని ఢీకొంది. ఇదే హత్య కేసులో మరో నిందితుడు, కనకరాజ్ స్నేహితుడైన సాయన్ కూడా ఇదే రోజు కేరళలో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. అతడి భార్య, కుమార్తె ఆ ప్రమాదంలో మరణించారు. ఒకే రోజు రెండు ప్రమాదాలు జరగడం, గార్డు హత్యకేసులో నిందితులే ఈ ప్రమాదాల్లో ఉండటం చూస్తుంటే ఇవి మామూలుగా సంభవించినవి కావని, ఏదో కావాలనే చేసి ఉంటారని అంటున్నారు. కొడనాడులోని జయలలిత ఎస్టేట్లో ఈనెల 24న సెక్యూరిటీ గార్డు ఓం బహదూర్ హత్య జరిగింది. అతడి నోట్లో గుడ్డలు కుక్కి, చేతులు కట్టేసి మరీ అతడిని హతమార్చారు. అప్పుడు జయలలిత ఆస్తులకు సంబంధించిన ముఖ్యమైన పత్రాలు కొన్ని చోరీకి గురైనట్లు కూడా భావించారు. ఇప్పుడు ఆ కేసులో ప్రధాన నిందితులు ఇద్దరినీ హతమార్చేందుకు 'రోడ్డు ప్రమాదాలు' సృష్టించడం, అవి కూడా ఒకేరోజు ఒకటి సేలంలో, మరొకటి కేరళలో జరగడం చూస్తుంటే.. జయలలిత ఆస్తుల మీద కన్నేసిన వాళ్లే ఇవన్నీ చేయించి ఉంటారని భావిస్తున్నారు. -
విషాదం
ప్రమాదంలో ముగ్గురి మృతి ఇద్దరు వరుసకు అన్నదమ్ములు రెండు కుటుంబాల్లో విషాదం వారు వరుసకు అన్నదమ్ములు. ఇద్దరూ ఎంతో స్నేహంగా ఉండేవారు. పెళ్లి కూడా ఇద్దరూ ఒకేసారి చేసుకున్నారు. ఒకే రకమైన వ్యాపారం చేస్తున్నారు. వారి అన్యోన్యతను చూసి విధి ఓర్వలేకపోయింది. తిరుమల శ్రీవారి దర్శనానికి స్నేహితులతో కలిసి వెళుతుండగా బస్సు రూపంలో వచ్చి పొట్టన పెట్టుకుంది. ప్రస్తుతం గర్భంతో ఉన్న వారి ఇద్దరి భార్యలూ చేస్తున్న రోదనలతో తిరుపతి రుయా ఆస్పత్రి దద్దరిల్లింది. వారి మృతితో ఆ కుటుంబాల్లో విషాదం నెలకొంది. రొంపిచెర్ల: మండలంలోని పెద్దగొట్టిగల్లు సమీపంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందిన విషయం తెలిసిందే. అలాగే బుధవా రం మరొక వ్యక్తి ఆస్పత్రిలో మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. బెంగళూరు పట్టణానికి చెందిన లారీ ట్రాన్స్పోర్టు యాజమానులు వెంకటేశ్వరమూర్తి(30) ప్రసన్నకుమార్(30), స్నేహితులు మంజునాథ(35), నాగరాజ(30)తో కలిసి మారుతీ కారులో తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనం కోసం బయలుదేరారు. పెద్దగొట్టిగల్లు వద్ద బుధవారం తెల్లవారుజామున ఒంటి గంట ప్రాంతంలో చైన్నై నుంచి కర్ణాటకలోని హోస్పేటకు వెళుతున్న మానస ట్రావెల్ బస్సు ఢీకొంది. వెంకటేశ్వరమూర్తి, ప్రసన్నకుమార్ అక్కడికక్కడే మృతి చెందారు. మంజునాథ, నాగరాజ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానికులు 108 ద్వారా పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మంజునాథ పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతి రుయా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ అతను బుధవారం మధ్యాహ్నం మృతి చెందాడు. మృతులు ఇద్దరు వరుసకు అన్నదమ్ములు. ఇద్దరూ ఒకే రోజు వివాహం చేసుకున్నారు. వారి భార్యలు భవ్య, చైత్ర గర్భవతులు. వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకుని వస్తామని వెళ్లిన వారు రోడ్డు ప్రమాదం లో మృతి చెందడంపై కుటుంబ సభ్యులు బోరున విలపించారు. క్షతగాత్రు డు నరేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రహీముల్లా తెలిపారు. ప్రైవేటు బస్సును పోలీసులు సీజ్ చేశా రు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు వారు బెంగళూరుకు తీసుకెళ్లారు. -
ప్రాణం తీసిన ట్రాన్స్ ఫార్మర్
జోగుళాంబ గద్వాల జిల్లా ఆలూరులో ముగ్గురు రైతులు బలి • సర్కారు ట్రాన్సఫార్మర్ రాక ప్రైవేటుగా కొన్న రైతులు • పొలంలోని దిమ్మెపై అమర్చుతుండగా ప్రమాదం • ముగ్గురు మృతి.. మరో నలుగురికి తీవ్ర గాయాలు • పరిహారం కోసం బంధువులు, గ్రామస్తుల డిమాండ్ • మృతదేహాలతో గ్రామంలో బైఠాయింపు • దరఖాస్తు చేసి ఆరు నెలలైనా అందని ట్రాన్స్ఫార్మర్లు • అధికారుల నిర్లక్ష్యం.. మామూళ్ల కక్కుర్తి • పంటలు ఎండిపోతాయనే ఆవేదనలో రైతులు • కాపాడుకునేందుకు సొంతంగా ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు • బిగించే నైపుణ్యం లేక విద్యుత్ ప్రమాదాలు • తమ నిర్లక్ష్యమేమీ లేదంటున్న విద్యుత్ అధికారులు ఖరీఫ్ దెబ్బకొట్టింది.. రబీలోనైనా ఉన్న కాస్త భూమిని సాగుచేసుకుందామనుకున్నారు.. నీళ్లున్నా కరెంటు సరఫరా చేసే ట్రాన్స్ఫార్మర్ లేదు.. విద్యుత్ శాఖకు దరఖాస్తు చేసినా ఎప్పుడు వస్తుందో తెలియదు.. సవాలక్ష కొర్రీలు.. అది లేదు, ఇది లేదంటూ రోజూ కార్యాలయాల చుట్టూ తిప్పుకోవడాలు.. కిందిస్థాయి నుంచి పైస్థాయి అధికారుల చేతులు తడిపినా పనవుతుందన్న నమ్మకం లేదు.. చేసేదిలేక ఆ రైతులే ఓ పాత ట్రాన్సఫార్మర్ కొనుక్కువచ్చారు.. బిగించేందుకూ సన్నద్ధమయ్యారు. కానీ బిగింపులో మెళకువలు తెలియకపోవడం వారి పాలిట శాపమైంది. విద్యుత్ షాక్కు గురై... గుడిసె కుర్వ ఉరుకుందు (45), మూలింటి కుర్వ పెద్ద బుడ్డన్న (45), కారం ఈదన్న (40) ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు రైతులు తీవ్రగాయాల పాలయ్యారు. జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలం ఆలూరు గ్రామంలో శుక్రవారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. - గట్టు ఇటీవల మంచి వర్షాలు పడడంతో గట్టు మండలంలోని ర్యాలంపాడు రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. ర్యాలంపాడు గ్రామానికి చెందిన రైతులు మూలింటి బుడ్డన్న, గుండన్న, గుడిసె పెద్ద నర్సింహులు కలిసి.. రిజర్వాయర్ బ్యాక్వాటర్ నుంచి కిలోమీటర్ దూరంలో ఉన్న వారి పొలాలకు పైపులైన్ ఏర్పాటు చేసుకున్నారు. దాని మోటార్లకు విద్యుత్ సరఫరా కోసం ట్రాన్స్ఫార్మర్ కావా లి. విద్యుత్ శాఖకు దరఖాస్తు చేస్తే నెలలు గడిచినా ట్రాన్స్ఫార్మర్ వచ్చే అవకాశం లేని పరిస్థితుల్లో.. తామే ప్రైవేటుగా ట్రాన్స్ఫార్మర్ కొనుగో లు చేయాలని నిర్ణయించుకున్నారు. బ్యాక్వాటర్ సమీపంలో ఉన్న గుడిసె తిమ్మప్ప పొలంలో కొందరు రైతులు ఇప్పటికే రెండు ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసుకున్నారు. వాటి పక్కనే తాము మరో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసుకునేందుకు సిద్ధమయ్యారు. కర్ణాటకలో పాత ట్రాన్సఫార్మర్ కొనుగోలు చేసి మరమ్మతు చేయించుకున్నారు. శుక్రవారం మూలింటి బుడ్డన్న ట్రాక్టర్లో ట్రాన్స్ఫార్మర్ను తీసుకుని గుడిసె తిమ్మప్ప పొలానికి బయలుదేరాడు. దానిని అమర్చేందుకు సహాయం కోసం కారం ఈదన్న, చిన్న జమ్మన్నలతోపాటు పక్క పొలానికి చెందిన కుర్వ ఉరుకుందు, బసన్న, గోవింద్, నర్సప్పలను పిలిచాడు. తిమ్మప్ప పొలం లో అప్పటికే ఉన్న 2 ట్రాన్స ఫార్మర్ల పక్కనే ఈ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసేందుకు దిమ్మె నిర్మించారు. దానికి, ట్రాక్టర్ ట్రాలీకి అనుసంధానంగా ఇనుప పైపు పెట్టారు. దానిపై ట్రాన్స ఫార్మర్ ఉంచి దిమ్మెపైకి నెడుతుండగా.. అది ఒరిగి పక్కనున్న ట్రాన్సఫార్మర్కు తగిలింది. దీంతో ఏడుగురు రైతులూ విద్యుత్ షాక్కు గురయ్యారు. ట్రాన్స్ఫార్మర్ను గట్టిగా పట్టుకున్న గుడిసె ఉరుకుందు(45), కారం ఈదన్న (45) మూలింటి బుడ్డన్న(40) అక్కడికక్కడే మృతిచెందారు. నర్సప్పకు తీవ్రగాయాలుకాగా గోవిందు, బసన్న, చిన్న జమ్మన్నకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిలో నర్సప్ప పరిస్థితి విషమంగా ఉండడంతో గద్వాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ముగ్గురు రైతులు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. రోడ్డున పడిన మూడు కుటుంబాలు సాయం చేసేందుకు వెళ్లిన ముగ్గురు రైతులు మృత్యువాత పడడంతో వారి కుటుంబాలన్నీ విషాదంలో మునిగిపోయాయి. ఘటనలో మ రణించిన బుడ్డన్నది పేద కుటుంబం. ఆయనకు భార్య సరోజమ్మ, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. వారికి నాలుగు ఎకరాల పొలం ఉండేది. ర్యాలంపాడు రిజ ర్వాయర్లో ముంపునకు గురైంది. దాంతో బుడ్డన్న కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇప్పుడాయన మరణించడంతో ఆ కుటుంబం దిక్కులేనిదైపోయింది. గుడిసె ఉరుకుందుకు భార్య గోవిందమ్మ, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కారం ఈదన్నకు భార్య సుజాత, ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ పెద్దలు మరణించడంతో వారంతా కన్నీట మునిగిపోయారు. పరిహారం కోసం ఆందోళన... మృతి చెందిన రైతుల కుటుంబాలకు ప్రభుత్వం నష్ట పరిహారం ఇవ్వాలంటూ ఆలూరు గ్రామస్తులు, మృతుల బంధువులు ఆందోళనకు దిగారు. జిల్లా అధికారుల నుంచి స్పష్టమైన హామీ వచ్చేదాకా మృతదేహాలను తరలించేది లేదంటూ బైఠాయించారు. విషయం తెలుసుకున్న జిల్లా ఏఎస్పీ శ్రీనివాసరావు, గద్వాల డీఎస్పీ బాలకోటి, సీఐ సురేశ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదే హాలను పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ఏరియా ఆస్పత్రికి తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా గ్రామస్తులు, బంధువులు అడ్డుకున్నారు. దీంతో రాత్రి వరకు కూడా మృతదేహాలను గ్రామంలోనే ఉంచారు. సాయం చేసేందుకు వెళ్లి.. కారం ఈదన్న, చిన్న జమ్మన్న కలసి పునరావాస కేంద్రంలో ఇంటి నిర్మాణానికి అవసరమైన ఇసుకకు అనుమతి కోసం గట్టు తహసీల్దార్ కార్యాలయానికి బయలుదేరారు. కానీ ట్రాన్స్ఫార్మర్ను దిమ్మెపై అమర్చడానికి సాయం చేయాల్సిందిగా మిగతా రైతులు కోరడంతో తోడుగా వెళ్లారు. వారిలో ఈదన్న మరణించగా.. జమ్మన్న తీవ్రంగా గాయపడ్డాడు. ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్లే.. సాక్షి, గద్వాల: విద్యుత్ శాఖ నుంచి సకాలంలో ట్రాన్స్ఫార్మర్లు అందకపోవడం, మామూళ్ల కోసం అధికారుల కక్కుర్తి, ప్రభుత్వ నిర్లక్ష్యం, రైతుల అవసరాన్ని గుర్తించకపోవడం, కనీస పర్యవేక్షణ లేకపోవడం వంటివి రైతుల ఉసురు తీస్తున్నాయి. పంటలు కళ్లముందే ఎండిపోయే పరిస్థితులు ఏర్పడుతుండడంతో.. రైతులు పంటను రక్షించుకోవాలన్న తపనతో తామే ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సాధారణంగా ట్రాన్స్ఫార్మర్ల కోసం దరఖాస్తు చేసుకున్న రైతులకు గతంలో డీడీ తీసిన వెంటనే సరఫరా చేసేవారు. రెండేళ్లుగా పెద్ద సంఖ్యలో ట్రాన్స్ఫార్మర్ల కోసం దరఖాస్తులు వస్తున్నాయి. కానీ అధికారులు తగిన స్థాయిలో సరఫరా చేయడంపై దృష్టి సారించడం లేదు. నలుగురు రైతులు కలిసి ఒక్కొక్కరూ రూ.6 వేల చొప్పున మొత్తం రూ.24 వేలు డీడీ తీసి ట్రాన్స్ఫార్మర్ కోసం దరఖాస్తు చేసుకుంటారు. దానికితోడు అధికారులు మరో రూ.24 వేల వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. ఇలా డబ్బులు చెల్లించినా ట్రాన్స్ఫార్మర్ మంజూరుకావడానికి సుమారు 6 నెలల నుంచి ఏడాది కాలం పడుతోంది. దీంతో రైతులు పంటలను కాపాడుకోవడానికి ప్రైవేటు ట్రాన్స్ఫార్మర్లు తెచ్చుకుని, ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రైవేటు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు సుమారు రూ.25 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. సాధారణంగా ప్రభుత్వం ద్వారా మంజూరైన ట్రాన్స్ఫార్మర్కు అధికారులే దగ్గరుండి కనెక్షన్ ఇస్తారు. కానీ రైతులు ప్రైవేటుగా తెచ్చుకుంటున్న ట్రాన్స్ఫార్మర్లకు వారే కనెక్షన్లు ఇచ్చుకోవడానికి ప్రయత్నించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఒక్క గట్టు మండలంలోనే సుమారు 300 ట్రాన్సఫార్మర్లను అనధికారికంగా ఏర్పాటు చేసుకున్నట్లు అంచనా. మాకు సమాచారం లేదు ప్రభుత్వం మంజూరు చేసిన ట్రాన్సఫార్మర్లకు మేమే కనెక్షన్లు ఇస్తాం. మాకు తెలియకుండా రైతులు ప్రైవేటుగా కొనుగోలు చేశారు. ఇలాంటి ప్రైవేటు ట్రాన్సఫార్మర్లను మేం ప్రోత్సహించం. ఆ ట్రాన్సఫార్మర్ బిగించుకుంటున్నట్లు సమాచారం కూడా లేదు. మాకు తెలియకుండా రైతులే కనెక్షన్ ఇచ్చుకునేందుకు ప్రయత్నించారు. కనీసం లైన్ క్లియర్ కూడా అడగలేదు.. - గట్టు ట్రాన్సకో ఏఈ ఆర్థర్ కాటన్ అధికారుల నిర్లక్ష్యమేమీ లేదు విద్యుత్ శాఖ అధికారులకు ఎలాంటి సమాచారం లేకుండా ప్రైవేటుగా ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. మాకు దరఖాస్తు చేసుకుంటే లైన్మన్ను పంపించి ఏర్పాటు చేస్తాం. కానీ ఇతర ప్రాంతాల నుంచి ట్రాన్స్ఫార్మర్ను కొనుగోలు చేసుకువచ్చి.. ప్రభుత్వ ట్రాన్స్ఫార్మర్కు కనెక్షన్ ఇచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆలూరులో చనిపోయిన రైతులకు విద్యుత్శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణం కాదు.. - శ్రీనివాస్, విద్యుత్శాఖ డీఈ ఎల్సీ తీసుకోలేదు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు సంబంధించి రైతులు లైన్ క్లియర్ కోసం ఉదయం 11.50కు ఫోన్ చేశారు. ఎల్సీ ఇవ్వాలంటే లైన్మన్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని రైతులకు సూచించా. ఆ తర్వాత రైతుల నుంచి సమాచారమేదీ లేదు. ఆలూరు ఫీడర్కు ఉదయం 10 గంటల నుంచి సింగిల్ ఫేస్ లైన్ ఆన్లో ఉంది. మధ్యాహ్నం 12.30 గంటలకు త్రీఫేజ్ లైన్ ఆన్ చేయాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఘోరం జరిగింది. - చెన్నకేశవులు, ఆలూరు సబ్స్టేషన్ ఆపరేటర్ -
రెండు ఆటోలు ఢీ, ముగ్గురు దుర్మరణం
-
వసంత్ నగర్లో కమాన్ కూలి ముగ్గురు మృతి
హైదరాబాద్ : ఫిల్మ్ నగర్లో నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఇద్దరు మృతి చెందిన సంఘటన మరవక ముందే మరో ఘటన చోటుచేసుకుంది. కూకట్పల్లి వసంత్ నగర్ లో మంగళవారం నిర్మాణంలో ఉన్న కమాన్ కూలి ముగ్గురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు నాగభూషణం, జనార్దన్, పుల్లారావుగా గుర్తించారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పామర్రు రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
-
పామర్రులో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
పామర్రు: కృష్ణా జిల్లా పామర్రు మండలం కొత్తమద్దాల వద్ద గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో విజయవాడ సమీపంలోని గ్రామానికి చెందిన అట్లూరి సత్యనారాయణ(60), వెంకటేశ్వర్రెడ్డి(55), మరో మహిళ అక్కడికక్కడే మృతిచెందగా..పిచ్చిరెడ్డి, నెలపోగు గోపయ్య అనే ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం విజయవాడ తరలించారు. పాలకొల్లు నుంచి విజయవాడ వస్తోండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురి దుర్మరణం
♦ టిప్పర్, డీసీఎం ఢీకొనడంతో ప్రమాదం ♦ మృతుల్లో ఇద్దరు మహబూబ్నగర్ జిల్లావాసులు మేడ్చల్ రూరల్: డీసీఎం, టిప్పర్ ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. రంగారెడ్డి జిల్లా మేడ్చల్ సమీపంలోని బాసిరేగడి వద్ద బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. సీఐ రాజశేఖర్రెడ్డి కథనం ప్రకారం.. వుహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల వుండలం తునికీపూర్కు చెందిన వుువ్ముళ్ల రాజు(26), అతడి చిన్నాన్న కుమారుడు వుహబూ (21) మెదక్ జిల్లా అమీన్పూర్లోని నవదీప్ ట్రాన్స్పోర్టులో పనిచేస్తున్నారు. డీసీఎం (ఏపీ 28 టీసీ 8509) డ్రైవర్గా రాజు, వుహబూ క్లీనర్గా జీవనం సాగిస్తున్నారు. మేడ్చల్ వుండలం గిర్మాపూర్ రాక్సాండ్లో జార్ఖాండ్కు చెందిన రితూ వుహతో(29) టిప్పర్ నడిపిస్తున్నాడు. బుధవారం అర్ధరాత్రి డీసీఎం కూల్డ్రింక్ లోడ్తో దుండిగల్ -మేడ్చల్ దారిలో మేడ్చల్ వైపు వస్తుంది. టిప్పర్ కంకర లోడ్తో మేడ్చల్ నుంచి దుండిగల్ వైపు వెళ్తుంది. వుండలంలోని బాసిరేగడి సమీపంలో టిప్పర్, డీసీఎం వేగంగా ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో డీసీఎం డ్రైవర్ రాజు, టిప్పర్ డ్రైవర్ రీతూ వుహతో అక్కడికక్కడే దుర్మరణం చెందారు. తీవ్రంగా గాయపడిన డీసీఎం క్లీనర్ వుహబూబ్ను హైదరాబాద్ నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి ప్రాణం విడిచాడు. మృతదేహాలను మేడ్చల్ వూర్చురీకి తరలించారు. మృతుల కుటుంబీకులకు సమాచారం ఇచ్చి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజశేఖరరెడ్డి తెలిపారు. -
హై టెన్షన్ విద్యుత్ తీగలు పడి ముగ్గురు మృతి
బిహార్: బిహార్లో మరో విషాదం చోటుచేసుకుంది. ముజఫర్ పూర్ జిల్లా మజిలియా ప్రాంతంలో హై టెన్షన్ విద్యుత్ వైరు తెగి పడి ముగ్గురు దుర్మరణం చెందారు. కాగా కొద్దిరోజుల క్రితం ఇంట్లో నిద్రిస్తుండగా కరెంట్ తీగలు తెగి ఇంటిపై పడిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా పది రోజుల్లో ఇది రెండో సంఘటన. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మాజీ డీజీపీ మనవడి దుర్మరణం
పటాన్చెరులో ఓ శుభకార్యానికి వెళ్లి వస్తుండగా దుర్ఘటన వరుణ్తో పాటు పెదనాన్న కుమారుడు అమిత్, స్నేహితుడు జ్ఞాన్దేవ్ కూడా మృతి పాల ట్యాంకర్ను అమిత వేగంతో ఢీకొట్టిన స్కోడా కారు పొగమంచు వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసుల అంచనా సాక్షి, హైదరాబాద్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ను చుట్టి ఉన్న ఔటర్ రింగ్రోడ్డుపై మరో ఘోర ప్రమాదం జరిగింది. మాజీ డీజీపీ, తెలంగాణ పర్యాటక సంస్థ చైర్మన్ పేర్వారం రాములు మనవడు వరుణ్ పవార్ (21)తో పాటు మరో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. ఔటర్ రింగ్ రోడ్డుపై కోకాపేట ప్రాంతంలో బుధవారం ఉదయం ఆరున్నర గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. వారు ప్రయాణిస్తున్న స్కోడా కారు.. ముందు వెళుతున్న పాల ట్యాంకర్ను బలంగా ఢీకొట్టింది. దీంతో కారు తునాతునకలైంది. అందులో ప్రయాణిస్తున్న వరుణ్ పవార్తో పాటు అమిత్ పవార్ (21), జ్ఞాన్దేవ్ (21) మరణించారు. మరో యువకుడు రాహుల్ పవార్ (22) తీవ్రగాయాలతో కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. శుభకార్యానికి వెళ్లివస్తూ.. పేర్వారం రాములు కుమార్తె రేవతి కుమారుడే వరుణ్ పవార్. రేవతి పదేళ్ల క్రితమే మరణించడంతో వరుణ్ తాతయ్య వద్దే ఉంటున్నాడు. అమిత్ పవార్, రాహుల్ పవార్ వరుణ్ పెదనాన్న కుమారులు. మంగళవారం రాత్రి పటాన్చెరులో ఓ స్నేహితుడి ఇంట్లో శుభాకార్యానికి వరుణ్ పవార్, అమిత్పవార్, రాహుల్పవార్లతో పాటు వారి స్నేహితుడు కుందన్బాగ్కు చెందిన జ్ఞాన్దేవ్ కలసి వెళ్లారు. అర్ధరాత్రి కావడంతో పటాన్చెరులోని ఫాంహౌస్లోనే ఉండి బుధవారం ఉదయం ఇంటికి బయలుదేరారు. ఉదయం 6.30 ప్రాంతంలో ఓఆర్ఆర్పై కోకాపేట్ ప్రాంతంలో ప్రయాణిస్తుండగా అమిత వేగంతో ఉన్న వారి వాహనం అదుపుతప్పి ముందు వెళుతున్న పాల ట్యాంకర్ (టీఎస్ 08 యూఏ 0086)ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వరుణ్, అమిత్, జ్ఞాన్దేవ్ అక్కడికక్కడే మృతిచెందారు. రాహుల్కు తీవ్ర గాయాలు కావడంతో కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ఈ కారును వరుణ్ నడుపుతుండగా.. ముందు సీట్లో జ్ఞాన్దేవ్, వెనుక సీట్లలో మిగతా ఇద్దరూ కూర్చున్నారు. నుజ్జునుజ్జయిన కారు.. ట్యాంకర్ వెనుక ఇరుక్కున్న స్కోడా వాహనాన్ని పోలీసులు, స్థానికులు క్రేన్ సహాయంతో బయటికి తీశారు. అమిత వేగంతో ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జయిపోవడంతో తీసేందుకు దాదాపు గంటసేపు పట్టింది. అనంతరం కారు ముందు భాగం నుంచి ఇద్దరి మృతదేహాలను తీసి, ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. పంజగుట్ట ద్వారకాపూరి కాలనీలోని పేర్వారం నివాసానికి మృతదేహాలను తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ముల పిల్లలు మృతి చెందడంతో బంధువులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. కుటుంబ సభ్యులు మృతదేహాలపై పడి రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, సైబరాబాద్ కమిషనర్ సి.వి.ఆనంద్, పలువురు ప్రముఖులు అక్కడికి వచ్చి పేర్వారం రాములును పరామర్శించారు. మృతదేహాల్ని వారి స్వస్థలం నిజామాబాద్ జిల్లాకు తరలించారు. ప్రమాదానికి పొగమంచే కారణమా? కోకాపేట్ ప్రాంతంలో ఔటర్ రింగ్రోడ్ చుట్టూ దట్టమైన చెట్లు, కొండలు ఉన్నాయి. ఉదయం వేళల్లో పొగమంచు అధికంగా ఉంటుంది. ఆ కారణంగానే ముందు వెళుతున్న వాహనాన్ని వరుణ్ గమనించక ఢీకొట్టి ఉంటారని పోలీసులు అంచనా వేస్తున్నారు. పాల ట్యాంకర్ వెనుక బంపర్ ఎత్తులో ఉండటంతో పాటు కమాన్పట్టీలను ఎక్కువగా ఏర్పాటు చేశారు. ఇదికూడా ప్రమాద తీవ్రతను పెంచాయని చెబుతున్నారు. ట్యాంకర్ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ్ముళ్లు చనిపోయారు.. అన్నది బతుకుపోరాటం నిజామాబాద్కు చెందిన దివంగత మాజీ ఎమ్మెల్యే సతీశ్పవార్ సోదరులు దిగంబర్ పవార్, సుభాష్ పవార్. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న దిగంబర్ పవార్ కుమారులే రాహుల్, అమిత్. మేడ్చల్లోని సీఆర్పీ కాలేజీలో రాహుల్ బీటెక్ ఫైనలియర్, అమిత్ బీటెక్ సెకండియర్ చదువుతున్నారు. రోడ్డు ప్రమాదంలో అమిత్ చనిపోగా.. రాహుల్ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. --------------- నీలో కూతురిని చూసుకుంటున్నా.. నిజామాబాద్లో ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్న సుభాష్పవార్, పేర్వారం రాములు కుమార్తె రేవతి దంపతులు. వారికి వరుణ్ (23) ఏకైక కుమారుడు. రేవతి పదేళ్ల క్రితమే మరణించడంతో వరుణ్ తాతయ్య పేర్వారం రాములు ఇంట్లోనే ఉంటున్నాడు. వరుణ్ను రాములు భార్య ఇందిర ప్రాణంగా చూసుకుంటారు.11:19 గంటలకు 11/25/2015 ప్రమాదంలో వరుణ్ మరణించడంతో ఆమె ఆవేదనలో కూరుకుపోయారు. ‘నీలో నా బిడ్డను చూసుకుంటున్నా.. ఇక ఎవరిని చూడాలి’ అని ఆమె చేసిన రోదనలు కంటతడిపెట్టించాయి. --------------- టీమ్1లో చేరతానని అన్నాడు ‘‘వరుణ్ బీఆర్క్ ఐదో సంవత్సరం చదువుతున్నాడు. చివరి ఏడాది ట్రైనింగ్ పేరిట కాలేజీ బయటే జాబ్ చేస్తుంటారు. వరుణ్కు గచ్చిబౌలిలోని టీమ్1 కంపెనీలో ఉద్యోగం వచ్చింది. బుధవారం అందులో చేరుతున్నానని మంగళవారమే మాకు చెప్పాడు. కానీ అదేరోజున మరణించాడు. వరుణ్ ఇక లేడన్న విషయం జీర్ణించుకోలేకపోతున్నాం..’’ - ప్రొఫెసర్ కేజేఏబీ బాబు, వైష్ణవి స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్ట్ అండ్ ప్లానింగ్ -
మాజీ డీజీపీ మనవడి దుర్మరణం
-
తొమ్మిది మంది రైతుల ఆత్మహత్య
అప్పుల బాధలే కారణం సాక్షి నెట్వర్క్: తెలంగాణ జిల్లాల్లో అప్పుల బాధ తాళలేక వేర్వేరుగా తొమ్మిది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం అర్నరకొండకు చెందిన రైతు పిల్లలమర్రి జగన్(43) తనకున్న ఏడు ఎకరాలోల పత్తి, వరి సాగు చేయగా, వరుస నష్టాలు వచ్చాయి. దీంతో రూ. 9 లక్షల వరకు అప్పులు అయ్యాయి. మనస్తాపం చెంది ఈ నెల 1న క్రిమిసంహారక మందు తాగాడు. ఆస్పత్రిలో శనివారం మృతి చెందాడు. మహాముత్తారం మండలం నిమ్మగూడెంకు చెందిన కండెల రాజమౌళి(55) పత్తి సాగు చేయగా, నష్టపోయాడు. రూ. 5 లక్షల అప్పులయ్యాయి. మనస్తాపం చెందిన శనివారం క్రిమిసంహారక మందు తాగాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా, చనిపోయాడు. మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేటకు చెందిన పొచన్నగారి దుర్గ రాములు (26) తండ్రితో పాటు వ్యవసాయం చేస్తున్నాడు. రెండేళ్లుగా వర్షాలు లేక పంట దెబ్బతింది. రూ. 2 లక్షల వరకు అప్పు చేశారు. అప్పు తీరే మార్గం కనిపించక శుక్రవారం రాత్రి ఉరి వేసుకున్నాడు. వరంగల్ జిల్లా ములుగు మండలం దేవగిరిపట్నంకు చెందిన రైతు తేజావత్ స్వామి(50)కు గతేడాది వర్షాభావ పరిస్థితుల్లో ఆశించిన మేర దిగుబడి రాలేదు. దీంతో అప్పులు పెరిగాయి. ఈ ఏడాది కూడా పంట పోవడంతో.. పంటను కాపాడుకునేందుకు బ్యాంకుకు రుణం కోసం వెళ్లి ప్రయత్నించగా, ఆలస్యమవుతుందని చెప్పారు. దీంతో ఈ నెల 1న క్రిమిసంహార మందు తాగాడు. ఎంజీఎంలో శనివారం చనిపోయాడు. నల్లగొండ జిల్లా రాజాపేట మండలం నెమిలకు చెందిన కొత్త ఉప్పల్రెడ్డి(48) నాలుగు బోర్లు వేయించగా, నీరు పడలేదు. ఈ ఏడాది తన మూడు ఎకరాల్లో పత్తి వేశాడు. పెట్టుబడులు, కుటుంబ అవసరాల కోసం రూ. 10 లక్షల వరకు అప్పు చేశాడు. పంట ఆశాజనకంగా లేకపోవడంతో మనస్తాపం చెంది శుక్రవారం రాత్రి క్రిమిసంహారక మందు తాగాడు. ఇదే జిల్లా చిట్యాల మండలం ఏవూరుకు చెందిన కొండె యాదయ్య(60) తన ఐదు ఎకరాల్లో పత్తి వేశాడు. మూడో కుమారుడు మతిస్థిమితం కోల్పోయాడు. పెట్టుబడులు, కొడుకు చికిత్స కోసం రూ. 7 లక్షల వరకు అప్పు చేశాడు. పంట వచ్చే పరిస్థితి లేకపోవడంతో మనస్తాపం చెంది శుక్రవారం రాత్రి క్రిమిసంహారక మందు తాగాడు. నల్లగొండ జిల్లా నిడమనూర్ మండలం ఊట్కూర్కు చెందిన మారగోని కోటమ్మ(25) భర్త సైదయ్యతో కలిసి సాగు చేస్తోంది. పెట్టుబడుల కోసం అప్పు చేశారు. పంట పోవడంతో మనస్తాపం చెంది శనివారం ఉదయం క్రిమిసంహారక మందు తాగింది. రంగారెడ్డి జిల్లా ధాదూరు మండలం నాగసముద్రంకు చెందిన అంజిలప్ప(45) తనకున్న ఎకరం 13 గుంటలను అమ్మి కూతురి వివాహం చేశాడు. నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి వేశాడు. వర్షాభావ పరిస్థితుల్లో పంట ఎండిపోయింది. రూ. 2.65 లక్షల అప్పు ఉంది. అప్పు తీరే మార్గం కనిపించక శుక్రవారం సాయంత్రం ఒంటికి నిప్పంటిచుకున్నాడు. హైదరాబాద్ తరలిస్తుండగా చనిపోయాడు. ఇదే జిల్లా షాబాద్ మండలం ఎల్గొండగూడకు చెందిన కుమ్మరి యాదయ్య(35)కు వర్షాభావ పరిస్థితుల్లో పంట చేతికి వచ్చే పరిస్థితి లేకపోవడంతో పెట్టుబడులు, కుటుంబ అవసరాల కోసం చేసిన రూ. 3 లక్షల అప్పు తీరే మార్గం కనిపించక శుక్రవారం రాత్రి ఉరి వేసుకున్నాడు. గుండెపోటుతో ముగ్గురు మృతి కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలం గొల్లపల్లిలో వంకాయల పెద్దశంకర్(42) తనకున్న భూమిలో వరి పంట సాగు చేస్తున్నాడు. రూ.3లక్షల అప్పు చేశాడు. కుమారుడు నవీన్ అనారోగ్యానికి గురికావడంతో మరో రెండు లక్షలు అప్పు చేశాడు. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో శంకర్ శనివారం వేకువజామున గుండెపోటుకు గురై మృతి చెందాడు. వరంగల్ జిల్లా జిల్లా పర్వతగిరి మండలం కొంకపాకు చెందిన మహిళా రైతు సూర్ల గట్టమ్మ(47) తనకున్న పొలంలో మిర్చి, పత్తి వేసింది. పత్తి చేతికి వచ్చే సమయంలో వర్షాల వల్ల దెబ్బతింది. రూ. 2 లక్షల మేరకు అప్పుల కాగా, మనోవేదనకు గురై శనివారం గుండెపోటుకు గురైంది. నల్లగొండ జిల్లా గుండాల మండలం పల్లెపహాడ్కు చెందిన ముత్తినేని ప్రభాకర్(63) 8 ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. 6 లక్షల వరకు అప్పు చేశాడు. వర్షాలు రాకపోవడంతో మనస్తాపం చెంది శనివారం ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇరుగు పొరుగు వారు నిలువరించగా, కొద్దిసేపటికే గుండెపోటుతో మరణించాడు. -
పిడుగుపాటుకు ముగ్గురి మృతి
శనగపాడు (పెనుగంచిప్రోలు) : మండలంలోని శనగపాడులో గురువారం మధ్యాహ్నం పిడుగుపాటుకు ముగ్గురు వ్యవసాయ కూలీలు మృతిచెందారు. గ్రామానికి చెందిన కీసర రాజారత్నం (35), కీసర ఇసాక్ (28), మరో పది మంది వ్యవసాయ కూలీలు గ్రామ శివారులోని సుబాబుల్ కర్ర కొట్టేందుకు వెళ్లారు. మధ్యాహ్నం తర్వాత భారీ వర్షం పడటంతో ఇంటికి బయలుదేరారు. మార్గం లో పిడుగు పడటంతో రాజారత్నం, ఇసాక్ అక్కడికక్కడే మృతిచెందారు. ము నేరు మధ్య లంకల్లో గేదెలు మేపేందుకు వెళ్లిన కోనంగి శక్తేశ్వరరావు (22) కూడా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. అశోక్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలవడంతో తొలుత నందిగామకు, అక్కడినుంచి విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పిడుగుపాటుకు రోడ్డుపై రంధ్రాలు పడ్డాయి. గ్రామంలో విషాదం... ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబానికి పెద్ద దిక్కును కోల్పోవటంతో రాజారత్నం, ఇసాక్ కుటుంబ సభ్యులు భోరున విలపిస్తున్నారు. రాజారత్నంకు భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. ఇసాక్కు భార్య, ఐదేళ్లలోపు ముగ్గురు సంతానం ఉన్నారు. చేతికి అందివచ్చిన కొడుకు మృతిచెందటంపై శక్తేశ్వరరావు కుటుం బ సభ్యులు శోకసముద్రంతో మునిగిపోయారు. సంఘటనా స్థలాన్ని తహశీల్దార్ కె.నాగేశ్వరరావు, ఎంపీడీవో వై.శ్రీనివాసరెడ్డి, ఎస్ఐ కె.సతీష్ సందర్శించి వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నందిగామకు తరలించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు సామినేని ఉదయభాను మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. కాగా ఈ ఘటనలో మృతులకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. -
దైవ దర్శనానికి వెళ్లి వస్తూ.. మృత్యు ఒడికి
♦ చెట్టును ఢీకొన్న స్కార్పియో ♦ ముగ్గురి మృతి.. ♦ మరో ముగ్గురికి తీవ్ర గాయాలు నల్లచెరువు : దైవ దర్శనానికి వె ళ్లి వస్తూ మృత్యు ఒడికి చేరుకున్నారు. తిరుమలకు వెళ్లి ఏడు కొండల స్వామిని దర్శించుకొని వస్తుండగా, జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ సంఘటన గురువారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, హిందూపురం పట్టణంలో అయ్యప్పస్వామి గుడిని నిర్మిస్తున్నారు. ఈ గుడికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు సంగీత వాయిద్యాలను ఉచితంగా ఇస్తామన్నారు. ఇవి తీసుకురావడానికి హిందూపురం పట్టణానికి చెందిన పాండురంగ రవి, గురుస్వామి మురళి, డ్రైవర్ అనిల్తోపాటు రమేష్, టీడీపీ మాజీ కౌన్సిలర్ శ్రీరాములు, రవీంద్రనాథ్ ఠాగూర్ స్కార్పియోలో బయల్దేరారు. తిరుమలకు వెళ్లి సంగీత వాయిద్యాలు తీసుకొని స్వామి వారి దర్శనం చేసుకున్నారు. తిరిగి హిందూపురానికి బుధవారం రాత్రి బయలుదేరారు. మార్గమధ్యంలో దేవిరెడ్డిపల్లి బస్టాండ్ వద్ద రోడ్డుకు ఆనుకొని వున్న చింత చెట్టును స్కార్పియో ఢీ కొట్టింది. సమాచారమందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని గాయపడ్డ వారిని 108లో కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పాండురంగ రవి (48) అక్కడికక్కడే మృతి చెందాడు. మార్గమధ్యంలో గురుస్వామి మురళి (45), చికిత్స పొందుతూ డ్రైవర్ అనిల్ (30) మృతి చెందారు. రమేష్, శ్రీరాములు, రవీంద్రనాథ్ఠాగూర్ తీవ్రంగా గాయపడ్డారు. రమేష్ పరిస్థితి విషమంగా ఉంది. మృతుడు రవికి భార్య శాంత, ఇద్దరు కుమారులున్నారు. మురళికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. డ్రైవర్ అనిల్కు ఇంకా పెళ్లికాలేదు. గాయపడిన వారు కదిరి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 8 నెలల క్రి తం ఇదే చింత చెట్టుకు తుఫాన్ వాహ నం ఢీ కొని సిరిగుప్ప మండలానికి చెందిన వారు నలుగురు మృతి చెందారు. దేవుళ్లకు ఎన్ని పూజలు చేసినా ఏమి ఫలితమురా నాయినా.. అంటూ పాండురంగ రవి భార్య శాంత విలపించడం చూపరులను కలిచివేసింది. -
లారీ - కారు ఢీ: ముగ్గురు మృతి
అనంతపురం: అనంతపురం జిల్లా డి.హరియాహాల్ మండలం లింగంపల్లి క్రాస్ రోడ్డు వద్ద బుధవారం లారీ - కారు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఓ సెల్ఫీ ఖరీదు.. మూడు నిండు ప్రాణాలు!
సెల్ఫీలు తీసుకోవడం అందరికీ సరదానే. కానీ ఆ సరదా ఒకోసారి వికటిస్తే పెను ప్రమాదంగా మారుతుంది. ఇలాగే ముగ్గురు కాలేజి పిల్లలు చేసిన సెల్ఫీ ప్రయత్నం.. వాళ్ల ప్రాణాలు బలిగొంది. వేగంగా వస్తున్న రైలు ఎదుట నిలబడి సెల్ఫీ తీసుకుని దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలన్న ప్రయత్నం ముగ్గురు స్నేహితుల మరణానికి కారణమైంది. ఢిల్లీ, మొరాదబాద్, ఫరీదాబాద్లకు చెందిన ముగ్గురూ అక్కడికక్కడే మరణించారు. నలుగురు మిత్రులు కలిసి రిపబ్లిక్ దినోత్సవం రోజున తాజ్మహల్ చూసేందుకు ఆగ్రా బయల్దేరారు. రైల్వేట్రాక్ చూడగానే తమకు అక్కడ సాహసం చేయాలనిపించి కారు ఆపామని, వేగంగా వస్తున్న రైలు దగ్గర సెల్ఫీ తీసుకోడానికి ఆగామని ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలతో బయటపడిన అనీష్ అనే నాలుగో అబ్బాయి చెప్పాడు. మరణించిన ముగ్గురి పేర్లు యాకూబ్, ఇక్బాల్, అఫ్జల్. వీళ్లంతా 20-22 ఏళ్ల మధ్య వయసువాళ్లే. రైలు రావడానికి కొద్దిక్షణాల ముందు ఫొటో తీసుకుని, అక్కడినుంచి దూకేద్దామనుకున్నా.. ఈలోపే వేగంగా వచ్చిన రైలు వారిని ఢీకొంది. మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టంకు పంపారు. -
కుటుంబాన్ని బలిగొన్న చలిమంట
చలి చంపేస్తోంది అంటాం.. కానీ ఇక్కడ చలిమంట నిజంగానే ఓ కుటుంబాన్ని చంపేసింది. మహారాష్ట్రలోని పుణె నగరంలో చలి కాచుకోడానికి బొగ్గులు వెలిగించుకోవడంతో.. దాన్నుంచి వచ్చిన పొగ కారణంగా ఊపిరాడక ఓ కుటుంబంలోని ముగ్గురు సభ్యులు మరణించారు. ఈ ఘటన నారాయణ్ పేట్ ప్రాంతంలోని కబీర్బాగ్లో జరిగింది. భగవాన్ దోండిబా ఘరే (55), ఆయన భార్య మంగళ (50) పూర్ణిమ (22) ముగ్గురూ ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. అయితే.. ఘరే కుమారుడు ధీరజ్ మాత్రం ఆరోజు వేరే ఇంట్లో ఉండటంతో అతనొక్కడూ బతికిపోయాడు. చలి ఎక్కువగా ఉందని ఇంటి కిటికీ తలుపులు కూడా వేసుకున్నారు. దాంతో బొగ్గుల నుంచి వచ్చిన కార్బన్ డయాక్సైడ్ గదిలో వ్యాపించి.. ఊపిరాడక ముగ్గురూ మరణించి ఉంటారని పోలీసులు తెలిపారు. -
ఔటర్ పై ప్రమాదం, బెజవాడ వాసులు మృతి
హైదరాబాద్ : శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆగివున్న లారీని... మహీంద్రా జైలో కారు (ఏపీ 16 టీఎల్ 5252) వెనకనుంచి వేగంగా ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్నవిజయవాడ సెంట్రల్ ఎక్సయిజ్ ఉద్యోగి మహేందర్, ఆయన భార్య నాగరామలక్ష్మి, ఎంబీబీఎస్ చదువుతున్న సింధూర అక్కడికక్కడే చనిపోయారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మహిళతో పాటు మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వీరంతా విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. -
పక్కా ప్లాన్తోనే హత్య.. రాజమండ్రికి పరారీ
-
పక్కా ప్లాన్తోనే హత్య.. రాజమండ్రికి పరారీ
పక్కాగా ప్లాన్ వేసుకున్న తర్వాతే విజయవాడ సమీపంలోని పెద అవుటపల్లి వద్ద దుండగులు హత్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ కేసులో వివరాలన్నీ క్రమక్రమంగా బయటపడుతున్నాయి. మూడు రోజుల నుంచి గన్నవరంలోని రాయల హంపి అనే హోటల్లో మకాం వేసిన దుండగులు.. కాల్పుల తర్వాత కూడా మళ్లీ అదే హోటల్కు వచ్చినట్లు తాజాగా తేలింది. అక్కడే తాము ఉపయోగించిన కారును వదిలేసి, మరో రెండు కార్లలో అక్కడినుంచి రాజమండ్రి వెళ్లారని చెబుతున్నారు. ముందుగా విశాఖపట్నం వరకు మాట్లాడుకుని కూడా రాజమండ్రిలో దిగిపోయి అక్కడినుంచి వేరే ప్రాంతానికి వెళ్లినట్లు తెలుస్తోంది. వాళ్లు ప్రయాణించిన వాహనాల ట్రావెల్స్ డ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే.. హోటల్ ప్రాంగణంలో ఎక్కడా సీసీటీవీ కెమెరాలు లేకపోవడంతో నిందితులను గుర్తించడం కష్టంగా మారింది. పక్కనే ఉన్న ఎస్బీఐ ఏటీఎం, సూపర్ బజార్లలో గల సీసీటీవీ కెమెరాల ఫుటేజిని పరిశీలించారు. సూపర్ బజార్ కెమెరాలో అస్పష్టంగా నిందితుల చిత్రాలు కనిపించినట్లు తెలుస్తోంది. మరోవైపు మృతుల స్వగ్రామం పశ్చిమగోదావరి జిల్లా చినకడిమిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ గ్రామానికి చెందిన ముగ్గురిని ఒకేసారి హతమార్చడంతో అక్కడివారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
అమలాపురం : తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ట్రాక్టర్ ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో పెళ్లి కొడుకు తల్లితో సహా మరో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో పదిహేను మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. అమలాపురంలో పెళ్లికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కంకరలోడుతో ఎదురుగా వస్తున్న టిప్పర్ ఢీ కొట్టడంతో ట్రాక్టర్ నుజ్జునుజ్జయింది. గాయపడిన వారిని అమలాపురంలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. -
ముగ్గుర్ని బలిగొన్న టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి కారు
కడప : వైఎస్ఆర్ జిల్లాలో వీరపునాయునిపల్లె మండలం ఉరుటూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. చక్రాయపేట టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి రుక్మాంగధరెడ్డి కారు ...ఆటోను ఢీ కొనటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రి తరలించారు. -
ఊటీలో నరభక్షక పులి కాల్చివేత
పర్యాటకానికి ప్రసిద్ధి చెందిన ఊటీ జిల్లాలో గ్రామస్థులకు నరభక్షక పులి బాధ ఎట్టకేలకు తీరింది. ముగ్గురు వ్యక్తులతో పాటు.. రెండు ఆవులు, మరో రెండు మేకలను కూడా చంపి తిన్న ఆ పులిని అటవీ శాఖాధికారులు, పోలీసులు కలిసి కాల్చిచంపారు. తొలిసారి ఈ పులి ఈనెల 5వ తేదీన కనిపించింది. అప్పటినుంచి రెండు వారాల పాటు చుట్టుపక్కల ప్రాంతాల వారందరికీ నరకం చూపించింది. కుండచప్పాయ్ గ్రామ సమీపంలో అటవీ శాఖాధికారులు ఎట్టకేలకు కాల్చిచంపారని, తుపాకి గుళ్లు తగిలిన తర్వాత కనిపించకుండా పోయిన పులి మృతదేహాన్ని దాదాపు గంట తర్వాత స్వాధీనం చేసుకున్నారని నీలగిరి జిల్లా కలెక్టర్ పి.శంకర్ తెలిపారు. అంతకు ముందు ఈ పులి ముగ్గురు వ్యక్తులను చంపి తినేసింది. ఈ పులి కారణంగా ఆ ప్రాంతంలోని పాఠశాలలన్నింటినీ మూసేశారు. వ్యాపార, వాణిజ్య సంస్థలన్నీ కూడా మూతపడ్డాయి. సాయంత్రం కావడానికి ముందే జనమంతా ఇళ్లకు పరుగులు తీశారు. టీ ఎస్టేట్లు, పండ్లు, కూరగాయల తోటల్లో కూడా పనివేళలను తగ్గించారు. అటవీ శాఖాధికారులు ఎంతకూ దాన్ని వేటాడేందుకు ముందుకు రాకపోవడంతో బుధవారం నాడు దాదాపు 600 మంది గ్రామస్థులు కత్తులు, కొడవళ్లు పట్టుకుని అడవిలోకి బయల్దేరారు. అయితే, వాళ్లుంటే వేటకు ఇబ్బంది అవుతుందని అధికారులు చెప్పారు. శిక్షణ పొందిన ఏనుగులను తీసుకుని పులివేటకు బయల్దేరారు. కెమెరా ట్రాప్లు పులి ఆనవాళ్లను గుర్తించగలిగామని డీఎఫ్ఓ తెలిపారు. తిండిలేక అది నీరసంగా కనిపించిందని, గాయాలు కూడా కావడంతో రక్తపు మరకలు కూడా కనిపించాయని అధికారులు చెప్పారు. -
ఊటీలో రెచ్చిపోతున్న నరభక్షక పులి
పర్యాటకానికి ప్రసిద్ధి చెందిన ఊటీ జిల్లాలో ఇప్పుడో నరభక్షక పులి రెచ్చిపోతోంది. ఇప్పటివరకు ముగ్గరు వ్యక్తులను చంపి తిన్న ఆ పులి.. తాజాగా ఓ ఆవును లాక్కెళ్లిపోయింది. దాన్ని పట్టుకోడానికి తాము చేస్తున్న ప్రయత్నాలకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు అడ్డుపడుతున్నాయని అటవీ శాఖాధికారులు అంటున్నారు. ఆవును లాక్కెళ్లడంతో భయకంపితులైన కపాచి గ్రామస్థులు వెంటనే ఆ పులిని పట్టుకోవాలని లేదా కాల్చి చంపాలని డిమాండ్ చేశారు. కానీ, దాన్ని చంపకూడదని స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు అడ్డుపడుతున్నారు. నరభక్షకిగా మారిన పులిని పట్టుకోడానికి పట్టుకోడానికి ప్రయత్నాలను అటవీ శాఖాధికారులు ముమ్మరం చేశారు. తాను క్రికెట్ ఆడుకుంటుండగా పొదల చాటున ఆ పులి కనిపించిందని ఓ స్కూలు పిల్లడు చెప్పడంతో ఈ ప్రయత్నాలు వేగవంతం అయ్యాయి. షార్ప్ షూటర్లు, స్పెషల్ టాస్క్ఫోర్స్ సిబ్బంది సహా దాదాపు 300 మంది దీని వేటలో ఉన్నారు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వస్తే, 24 గంటల్లోనే పులిని కాల్చిచంపగలమని సిబ్బంది అంటున్నా, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మాత్రం వారిని అడ్డుకుంటున్నారు. పులి భయంతో ఈ ప్రాంతంలోని 17 పాఠశాలలు మూసేయాలని తాము చెప్పినా, ఈరోజు తెరిచారని, అయితే విద్యార్థులు మాత్రం ఎవరూ రాలేదని చెప్పారు. ఎస్టేట్ వర్కర్లు కూడా ప్రాణభయంతో పనికి వెళ్లడంలేదు. ఇప్పటివరకు ఇద్దరు మహిళలు సహా ముగ్గురిని ఈ పులి చంపేసింది. -
రైలు ఢీకొని ముగ్గురి మృతి
సాక్షి, న్యూఢిల్లీ: పాతఢిల్లీ రైల్వేస్టేషన్లో ఫుట్పాత్పైకి దూసుకువచ్చిన గూడ్సురైలు ముగ్గురి ప్రాణా లు తీసింది. పార్సిల్ రైలుకు ఇంజను అమరుస్తుం డగా ఆ రైలు వేగంగా వెనక్కివెళ్లింది. పట్టాలు దిగి పక్కనున్న గోడను కూల్చి ఫుట్పాత్పైకి వచ్చింది. గోడ శిథిలాలు మీదపడడంతో మహిళతోపాటు ముగ్గురు మరణించారు. ఒక బాలుడు ఈ ప్రమా దం నుంచి తప్పిచుకున్నాడు. అగ్నిమాపక విభాగ వాహనాలు, పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు మొదలుపెట్టారు. రైల్వేశాఖ ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. పోలీసులు సెక్షన్ 304 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దుర్ఘటన అర్ధరాత్రి 11.45 గంటలకు పాత ఢిల్లీ రైల్వేస్టేషన్లో కౌండియాపుల్వైపు జరిగిందని డీసీపీ తెలిపారు. 20వ నంబరు ప్లాట్ఫారం యార్డులో 10 బోగీల గూడ్సురైలును పార్సిళ్లను లోడ్ చేయడానికి నిలిపి ఉంచారు. ఇంజ ను అమరుస్తుండగా దుర్ఘటన జరిగిందని ప్రత్యక్షసాక్షి చెప్పారు. ఇంజన్ స్పీడ్ ఎక్కువగా ఉండడం వల్ల రైలు వెనక్కి వెళ్లి పార్సిల్ గోదాము గోడను కూల్చుకుంటూ వెళ్లి ఫుట్పాత్పైకి చేరింది. కూలిన గోడ శిథిలాలు ఫుట్ ఫాత్పై నిద్రిస్తున్న నలుగురిపై పడ్డాయి. పోలీసులు, అగ్నిమాపక వాహనాలు కూడా ఘటనాస్థలానికి చేరుకున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసి వెంటనే ఎయిమ్స్ ట్రామాకేర్ సెంటర్కు తరలించారు. వీరిలో పది సంవత్సరాల బాలుడు మినహా మిగతా ముగ్గురు మరణించారు. వీరిలో ఒక మహిళ కూడా ఉంది. ఇదిలా ఉంటే..బెంగళూరు నిజాముద్దీన్ రాజధాని ఎక్స్ప్రెస్ను బెంగళూరు స్టేషన్ యార్డుకు తరలిస్తుండగా రైలు పట్టాలు తప్పి రోడ్డుపెకైక్కి అపార్ట్మెంటుకు సమీపంలో ఆగిపోయింది. ఈ ఘటనలో ప్రాణనష్టం సంభవించలేదు. రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి గ్రేటర్ నోయిడా: వేగంగా దూసుకొచ్చిన కారు రోడ్డుపై నిలిచి ఉన్న చిన్న ట్రక్కును ఢీకొట్టడంతో నలుగురు మరణించగా, ఇద్దరికి గాయాల య్యాయి. రబుపురా ప్రాంతంలోని యమునాఎక్స్ప్రెస్వైపై మంగళవారం ఉదయం ఆరింటికి ఈ ఘటన జరిగింది. కారులో ప్రయాణిస్తున్న వారు ఆగ్రా నుంచి నోయిడావైపు వస్తుండగా ఈ దారుణం సంభవించింది. మృతుల్లో ఒకరిని హర్విందర్ సింగ్గా గుర్తించామని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. -
'చెట్టున్నపాలెం' ఘటనలో ప్రత్యర్థులు లొంగుబాటు
ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలం చెట్టున్నపాడులో చేపల చెరువుల లీజు వివాదంపై రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ ఘటనలో ఓ వర్గం వారు శనివారం పోలీసులకు లొంగిపోయారు. గత సోమవారం రాత్రి రెండు వర్గాల మధ్య జరిగిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో అప్పటి నుంచి పరారీలో ఉన్న ఓ వర్గం వారు ఈరోజు ఉదయం భీమడోలు పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. ఎస్ఐ సుధాకర్ వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వివరాల్లోకి వెళితే చెరువు లీజు సొమ్ము విషయమై రెండువర్గాల మధ్య ఏర్పడిన వివాదం చినికిచినికి గాలివానగా మారి హత్యలకు దారితీసింది. ప్రత్యర్థుల చేతిలో గ్రామానికి చెందిన దేవదాసు లలిత్ (64) అనే వృద్ధుడు, నేతల రంగరాజు (50), బొంతు జయరాజు (50) హత్యకు గురైన విషయం తెలిసిందే.