అమలాపురం : తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ట్రాక్టర్ ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో పెళ్లి కొడుకు తల్లితో సహా మరో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో పదిహేను మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. అమలాపురంలో పెళ్లికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కంకరలోడుతో ఎదురుగా వస్తున్న టిప్పర్ ఢీ కొట్టడంతో ట్రాక్టర్ నుజ్జునుజ్జయింది. గాయపడిన వారిని అమలాపురంలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
Published Mon, May 12 2014 8:08 AM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM
Advertisement
Advertisement