గుర్తు తెలియని వ్యక్తి దుర్మరణం
Published Mon, Aug 22 2016 1:31 AM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM
దేవరపల్లి : దేవరపల్లి–కొవ్వూరు రోడ్డులో దేవరపల్లి శివారున అయ్యప్ప స్వామి ఆలయం సమీపంలోని పోలవరం కుడి కాలువ వంతెన వద్ద శనివారం రాత్రి సుమారు 45 ఏళ్ల వయసుగల ఓ గుర్తుతెలియని వ్యక్తిని వాహనం ఢీకొట్టింది. దీంతో తీవ్రగాయాల పాలై రోడ్డుపై పడి ఉన్న అతడ్ని ఎస్సై సీహెచ్ ఆంజనేయులు 108 వాహనంలో కొవ్వూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే మార్గమధ్యలోనే అతడు మృతిచెందాడు. మృతుని ఆచూకీ తెలియాల్సి ఉందని, మృతదేహాన్ని కొవ్వూరు ప్రభుత్వాస్పత్రి మార్చురీలో ఉంచామని ఎస్సై తెలిపారు.
Advertisement
Advertisement