Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

No Coercive Action Till AP High Court On YS Jagan Quash Petition1
జగన్‌ క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

సాక్షి, అమరావతి: రెంటపాళ్ల పర్యటన కేసులో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు ఇవాళ కీలక వ్యాఖ్యలు చేసింది. కారు ప్రమాదం జరిగితే.. కారులో ఉన్నవాళ్లపై కేసు ఎలా పెడతారు? అంటూ పోలీసులను నిలదీసింది. అలాగే ఈ కేసులో తదుపరి విచారణ జరిగేదాకా ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. పల్నాడు జిల్లా సత్తెన్నపల్లి మండలం రెంటపాళ్ల పర్యటన సందర్భంగా సింగయ్య అనే వైఎస్సార్‌సీపీ కార్యకర్త మరణించాడు. జగన్‌ కాన్వాయ్‌ వల్లే అతను మరణించాడని కేసు నమోదు చేసిన నల్లపాడు పోలీసులు.. నిందితుల జాబితాలో ఆయన పేరును కూడా చేర్చారు. అయితే రాజకీయ ప్రతీకారంతోనే తనపై కేసు నమోదు చేశారని, ప్రజల్ని కలవకుండా అడ్డుకునేందుకే ఈ ప్రయత్నమని పేర్కొంటూ వైఎస్‌ జగన్‌ క్వాష్‌ పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌తో పాటు ఇదే కేసులో వైఎస్సార్‌సీపీ నేతలు వేసిన మరో నాలుగు క్వాష్‌ పిటిషన్లను కలిపి హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. ‘‘కారు ప్రమాదం జరిగితే కారులో ఉన్నవాళ్లపై ఎలా కేసు పెడతారు?. ప్రమాదానికి ప్రయాణికులను ఎలా బాధ్యుల్ని చేస్తారు?. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కుంభమేళాలో తొక్కిసలాట ఘటన జరిగింది కదా’’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో వాదనలు వినిపించేందుకు ప్రభుత్వ లాయర్‌ మరింత గడువు కోరగా.. తదుపరి విచారణను మంగళవారానికి(జులై 1వ తేదీకి) వాయిదా వేసింది. అప్పటిదాకా నిందితులపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

Who Is Rajasthan IAS Ajitabh Sharma What He Says About IAS Work Culture2
మనం చేసే పని 80 శాతం నాన్‌ కోర్‌ వర్కే!!

పని గంటలు.. వర్క్‌కల్చర్‌ గురించి ఈ మధ్యకాలంలో విపరీతంగా చర్చ నడుస్తోంది. రంగాలకు అతీతంగా ఈ వ్యవహారంపై ప్రముఖులు సైతం స్పందిస్తుండడం చూస్తున్నాం. అయితే.. ఓ సీనియర్‌ బ్యూరోక్రట్‌, అందునా LinkedIn లాంటి ప్రొఫెషనల్‌ వెబ్‌సైట్‌లో చేసిన ఒక పోస్ట్‌ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఐఏఎస్‌ల పని తీరు గురించి చర్చించుకునేలా చేసింది. జైపూర్‌: రాజస్థాన్ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అజితాభ్ శర్మ (Ajitabh Sharma).. ఇటీవల విద్యుత్ శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆయన తాజాగా LinkedInలో ఓ పోస్ట్ పెట్టారు. అందులో ఆయన IAS అధికారుల పని విధానంపై కఠినమైన వ్యాఖ్యలు చేశారు.ఐఏఎస్‌ అధికారులను ఉద్దేశించి అజితాభ్ శర్మ ఏమన్నారంటే.. ‘‘మన పని 80 శాతం పైగా నాన్-కోర్ వర్క్(ప్రధాన బాధ్యతలు కాని పనులు) మీదే వెచ్చిస్తున్నాం. అవి.. ఇతర శాఖలతో జరిపే సాధారణ సమావేశాలు, మానవ వనరుల సమస్యలు (HR issues), కేసులు..లీగల్ వ్యవహారాలు, సమాచార హక్కు చట్టం (RTI)కు సమాధానాలు, వార్తా కటింగ్స్.. లేఖలపై సమాధానాలు ఇవ్వడం, ఎన్నో రిపోర్టులు తయారు చేయడం ఇవే ప్రధానంగా ఉన్నాయి. ఒక శాఖ యొక్క నిజమైన కోర్ పని చేయడమే సమాజానికి నిజమైన సేవ.. అయితే.. ప్రతీ IAS పోస్టింగ్‌ను కష్టమైనదిగా అనుకోవడం తప్పుదారి చూపుతోంది. అలాంటి భావనను నేను ఎప్పుడూ నమ్మను. అధికులు అసలు బాధ్యతలను నిర్వహించాల్సిన సమయం లేక విలువైన పని చేసేందుకు అవకాశం కోల్పోతున్నారు. తద్వారా పాలనా వ్యవస్థ నెట్‌వర్క్‌లో కొత్తతరహా ఆలోచనలకు తలుపులు మూసేస్తున్నారు అని అభిప్రాయపడ్డారాయన. అజితాభ్ శర్మ వ్యాఖ్యలపై నెట్టింట జోరుగా చర్చ నడుస్తోంది. ప్రభుత్వ పరిపాలనలో సమర్థత, అధికారుల పనితీరు, శాఖల స్వాతంత్ర్యం వంటి అంశాలపై పలువురు స్పందిస్తున్నారు. ప్రభుత్వం, పాలనా వ్యవస్థలో మార్పు కోరే దిశగా ఒక IAS అధికారే స్పందించిన తీరు.. పరిశీలించదగ్గదని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశారు. LinkedInలో తన పోస్టుతో IAS వ్యవస్థలో చెలామణిలో ఉన్న కొన్ని భ్రమలపై అజితాభ్‌ తీవ్ర విమర్శలు చేశారంటూ మరో యూజర్‌ కామెంట్‌ చేశారు.IAS అధికారులు శాఖానుసారమైన ముఖ్యమైన లక్ష్యాల మీద కాకుండా.. సాధారణ పరిపాలనా ప్రక్రియల్లో బిజీగా ఉంటారని అజితాభ్‌ ఐఏఎస్‌ల వర్క్‌కల్చర్‌(IAS Work Culture) పోస్టుతో తేటతెల్లమైందని మరో వ్యక్తి అభిప్రాయపడ్డాడు. ప్రభుత్వ పరిపాలనలో సమర్థత, ఉద్యోగుల స్వయంప్రేరణ, శాఖానుగుణమైన అవగాహన ఎంత అవసరమో గుర్తు చేశాయని ఇంకో వ్యక్తి కామెంట్‌ చేశాడు. ఇది పరిపాలనలో నిపుణత, ప్రత్యేకత, వినూత్నతను తగ్గించేలా ఉందని.. ఫలితంగా అధికారుల శక్తి ప్రభావవంతమైన పాలన మీద కాకుండా ‘ఫార్మాలిటీ’గానే మిగిలిపోతోందని మరో యూజర్‌ విమర్శించారు. అయితే అజితాభ్ శర్మ మాత్రమే కాదు.. గతంలో కూడా కొంతమంది ఏఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు పాలనా వ్యవస్థలో ఉన్న లోపాలు, అధికారుల పని ఒత్తిడి, సమర్థత లోపం వంటి అంశాలపై తమ అభిప్రాయాలు వ్యక్తపరిచారు. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో కీలక పాత్ర పోషించిన రిటైర్డ్‌ మహిళా ఐఏఎస్‌ అరుణా సుందరరాజన్ బ్యూరోక్రసీలో ఉన్న ఫైల్ కల్చర్, కొత్త ఆలోచనలకు వ్యతిరేకంగా ఉన్న దృక్పథం గురించి పలు సందర్భాల్లో మాట్లాడారు. శివానందన్‌ అనే మాజీ ఐపీఎస్‌.. అధిక బ్యూరోక్రసీ, ఫీల్డ్ వర్క్‌కు ప్రాధాన్యత లేకపోవడాన్ని విమర్శించారు. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అనిల్ స్వరూప్ తన పుస్తకాల్లో(Fear of decision-making is the biggest bottleneck in governance), ఇంటర్వ్యూలలో.. ఫైల్ నిబంధనలు, అనవసరమైన నివేదికలు, అన్నింటికి మించి పాలనా వ్యవస్థలో ఉన్న భయాందోళనలు గురించి స్పష్టంగా చెప్పారు. అయితే.. ప్రస్తుతం సర్వీసులో ఉన్న అజితాభ్ శర్మ లాంటి వ్యక్తి.. సూటిగా అదీ LinkedIn వేదికగా, పైగా గణాంకాలతో (80%) పాలనా సంస్కరణల అవసరాన్ని స్పష్టంగా పేర్కొనడం గమనార్హం. అజితాభ్ శర్మ గురించి..1996 రాజస్తాన్‌ కేడర్‌కు చెందిన అజితాభ్ శర్మ.. ఢిల్లీ ఐఐటీలో బీటెక్‌ సివిల్‌ ఇంజినీరింగ్‌ చదివారు. భివాడి ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ అథారిటీ (BIDA)కి ఓఎస్డీగా , జైపూర్ మెట్రో రైల్ కార్పొరేషన్‌కు చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్‌గా, ఇన్వెస్ట్‌మెంట్ & NRI వ్యవహారాలు, BIP, జైపూర్‌కు ప్రిన్సిపల్ సెక్రటరీ.. ఇలా పాలనా రంగంల అనేక విభాగాల్లో సేవలందించారు. ఈ మధ్యే విద్యుత్ శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు.

Too Much of Risk This Week: Ex-England Captain On Archer Selection3
IND Vs ENG: అత్యుత్తమ బౌలరే.. కానీ ఇప్పుడే జట్టులోకి అవసరమా?

టీమిండియాతో రెండో టెస్టుకు జోఫ్రా ఆర్చర్‌ (Jofra Archer)ను ఎంపిక చేయడాన్ని ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ నాసిర్‌ హుసేన్‌ విమర్శించాడు. ఈ పేస్‌ బౌలర్‌ను ఇప్పుడే ఆడించడం రిస్క్‌ అని మేనేజ్‌మెంట్‌ను హెచ్చరించాడు. పూర్తిస్థాయిలో ఫిట్‌నెస్‌ సాధిస్తేనే అతడిని తుదిజట్టుకు ఎంపిక చేయాలని సూచించాడు.1-0తో ముందంజలో ఇంగ్లండ్‌కాగా ‘అండర్సన్‌–టెండూల్కర్‌ ట్రోఫీ’ (Tendulkar-Anderson Trophy) ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. ఇరుజట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్‌ జరుగనుంది. ఇందులో భాగంగా .. లీడ్స్‌ (Leeds Test)లో నువ్వా నేనా అన్నట్లు సాగిన తొలి పోరులో ఇంగ్లండ్‌ విజయం సాధించి సిరీస్‌లో 1–0తో ముందంజ వేసింది. ఇక భారత్‌- ఇంగ్లండ్‌ మధ్య బుధవారం (జూలై 2) నుంచి రెండో టెస్టు మొదలుకానుంది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరిగే మ్యాచ్‌ కోసం ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టు... పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ను తీసుకుంది.2021లో చివరగా..గాయాలతో సహవాసం చేసే ఆర్చర్‌... 2021 తర్వాత టెస్టు జట్టులో చోటు దక్కించుకోవడం ఇదే తొలిసారి. అతడు చివరగా... అహ్మదాబాద్‌ వేదిగా టీమిండియాపై టెస్టు మ్యాచ్‌ ఆడాడు. అనంతరం మోచేతి గాయంతో సుదీర్ఘ ఫార్మాట్‌కు దాదాపు దూరమయ్యాడు. ఇటీవలే మళ్లీ సంప్రదాయ క్రికెట్‌లో తిరిగి అడుగుపెట్టాడు.కౌంటీ చాంపియన్‌షిప్‌ డివిజన్‌ వన్‌ మ్యాచ్‌లో ససెక్స్‌ జట్టు తరఫున బరిలోకి దిగిన అతడు.. దుర్హమ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడాడు. పద్దెనిమిది ఓవర్ల పాటు బౌలింగ్‌ చేసి దుర్హమ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఎమిలో గేను 37 పరుగుల వద్ద అవుట్‌ చేశాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్‌ తరఫున రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు.ఆర్చర్‌ రాక గురించి ప్రస్తావిస్తూ ‘జాతీయ జట్టు తరఫున 13 టెస్టులు ఆడిన 30 ఏళ్ల జోఫ్రా ఆర్చర్‌ రెండో టెస్టుకు అందుబాటులో ఉంటాడు. 2021 ఫిబ్రవరిలో భారత్‌పైనే చివరి టెస్టు ఆడిన అతడు... మళ్లీ టీమిండియాపైనే పునరాగమనం చేస్తున్నాడు’ అని ఇంగ్లండ్, వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) వెల్లడించింది. అత్యుత్తమ బౌలరే.. కానీ ఇప్పుడే జట్టులోకి అవసరమా?ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ నాసిర్‌ హుసేన్‌ మాట్లాడుతూ.. ‘‘రానున్న వారం రోజుల్లో ఇంగ్లండ్‌ నిజంగానే పెద్ద రిస్క్‌ తీసుకోబోతోంది. ఇందులో వారు సఫలం అవుతారో లేదో తెలియదు. జోఫ్రా ఆర్చర్‌ ఫిట్‌నెస్‌ ఏ స్థాయిలో ఉందో నాకైతే తెలీదు.అంతా బాగుంటే మంచిదే. అయినా, ఆర్చర్‌ కోసం ఇప్పుడు ఎవరిని జట్టు నుంచి తప్పిస్తారన్నదే ప్రశ్న?.. ఇప్పుడే జట్టులో మార్పులు అవసరం లేదనుకుంటా. ఆర్చర్‌ను ఆడించే విషయంలో లార్డ్స్‌ టెస్టు వరకు వేచి చూస్తే మంచిది’’ అని అభిప్రాయపడ్డాడు.అదే విధంగా.. ‘‘అతడు ససెక్స్‌ తరఫున ఒకే ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ ఆడి తిరిగి వస్తున్నాడు. నాలుగేళ్లు టెస్టులకు దూరంగా ఉండి.. రీఎంట్రీలో కేవలం 18 ఓవర్లు బౌల్‌ చేశాడు. నిజంగానే ఆర్చర్‌ పూర్తి ఫిట్‌గా ఉండే ప్రపంచంలో అతడే అత్యుత్తమ బౌలర్‌ అని చెప్పడానికి సందేహించను.అయితే, దురదృష్టవశాత్తూ గాయాల వల్ల సుదీర్ఘకాలంగా టెస్టు ఫార్మాట్‌కు అతడు దూరమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ’’ అని నాసిర్‌ హుసేన్‌ చెప్పుకొచ్చాడు.కాగా టీమిండియాతో తొలి టెస్టులో క్రిస్‌ వోక్స్‌ ఒకే ఒక్క వికెట్‌ తీయగా.. బ్రైడన్‌ కార్స్‌, జోష్‌ టంగ్‌ కలిసి పదకొండు వికెట్లు కూల్చారు. అయితే, వోక్స్‌ పొదుపుగా బౌలింగ్‌ చేసిన కారణంగా అతడిని ఇప్పుడే జట్టు నుంచి తప్పించడం తొందరపాటు చర్యే అవుతుంది.చదవండి: WI vs AUS: ఆసీస్‌కు చుక్కలు చూపిస్తున్న విండీస్‌

Elephants went out of control Ahmedabad Jagannath Rath Yatra4
రథయాత్రలో అపశృతి.. భక్తులపైకి దూసుకెళ్లిన ఏనుగులు

గాంధీనగర్‌: గుజరాత్‌లో జగన్నాథ రథయాత్ర సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది. జగన్నాథ యాత్రలో పాల్గొన్న ఒక ఏనుగు ఆగ్రహంతో భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో భయాందోళనకు గురైన భక్తులు ఆలయం నుంచి బయటకు పరుగులు తీశారు. దీంతో, ఆలయం వద్ద తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట కారణంగా పలువురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.వివరాల ప్రకారం​.. ఒడిశాలోని ప్రసిద్ధ పూరీ జగన్నాథ రథయాత్ర ఈ రోజు ఘనంగా ప్రారంభమైంది. కన్నుల పండుగగా జరిగే ఈ యాత్రను చూడడానికి దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. ఈ రథయాత్ర సందర్భంగా పలు రాష్ట్రాల్లో కూడా జగన్నాథ ఆలయాల్లో వేడుకలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే గుజరాత్‌లోని గోల్‌వాడలో కూడా భక్తులు రథయాత్రను నిర్వహించారు. అయితే, నిర్వాహకులు యాత్రలో ప్రత్యేక ఆకర్షణకు 18 ఏనుగులను అక్కడికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా యాత్ర ప్రారంభమైన 10 నిమిషాలకు అందులో ఉన్న ఓ ఏనుగు ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆగ్రహంతో జనం పైకి దూసుకెళ్లింది.Breaking!🚨Three elephants went out of control during the Jagannath Rath Yatra in Ahmedabad, GujaratHorrifying visuals. #RathaJatra2025pic.twitter.com/W2b7CwHpVw— 𝗩eena Jain (@DrJain21) June 27, 2025 ఇక, సదరు ఏనుగును చూసి పక్కనే ఉన్న ఏనుగులు సైతం ఆగ్రహానికి లోనయ్యాయి. ఒక్కసారిగా అక్కడున్న భక్తులపైకి ఏనుగులు దూసుకెళ్లాయి. దీంతో, ఏనుగులను చూసి అక్కడ ఉన్న వారు భయపడి పరుగులు తీశారు. ఏనుగులు గట్టిగా అరుస్తూ.. అటూ ఇటూ తిరగాయి. ఈ క్రమంలో రథ యాత్ర వద్ద స్వల్ప తొక్కిసలాట జరిగింది. ఆ ఏనుగులను కంట్రోల్ చేయడానికి మావటివాళ్లు కూడా ప్రయత్నించినప్పటికీ పరిస్థితి అదుపు కాలేదు. ఎట్టకేలకు పరిస్థితిని అదుపు చేసి రథ యాత్రకు సిద్ధం చేశారు. ఈ ఘటనలో మొత్తం తొమ్మిది గాయపడినట్టు తెలుస్తోంది. చికిత్స కోసం వారిని సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. Ahmedabad Rath Yatra ….All people are safe … pic.twitter.com/0rw979Mfxa— €hetu $oN¥ (@chetusony) June 27, 2025🔵During the Rath Yatra in Ahmedabad, an elephant ran out of control. A mishap was narrowly avoided...Jai Jagannath Ji 🙏🙏🙏 pic.twitter.com/fr6Cyx2qSi— THE UNKNOWN MAN (@Theunk13) June 27, 2025

Israel Defence Minister Shocking Comments On Iran Supreme Khamenei5
చాలా వెతికాం.. కనిపిస్తే కథ ముగించేవాళ్లం: ఇజ్రాయెల్‌

ఇజ్రాయెల్‌ మరోసారి సంచలన ప్రకటన చేసింది. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతొల్లా ఖమేనీ కోసం చాలా వెతికామని, ఆయన కనబడితే కచ్చితంగా చంపేవాళ్లమని అంగీకరించింది. అయితే ప్రాణ భయంతోనే ఖమేనీ పారిపోయి దాక్కున్నారంటూ ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి ఇజ్రాయెల్‌ కాట్జ్‌ వ్యాఖ్యానించారు.ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ తాజాగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఆయన కోసం చాలా చోట్ల వెతికామని, జాడ తెలిసి ఉంటే కచ్చితంగా మట్టుపెట్టేవాళ్లమని, కానీ ఆ విషయం తెలుసుకున్న ఖమేనీ లోతైన బంకర్‌లలో దాక్కున్నారని వ్యాఖ్యానించారాయన. ఖమేనీని అంతమొందించేందుకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF)కు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చాం. కానీ, ఆయన సురక్షితంగా ఎక్కడో బంకర్‌లో దాక్కుని క్షిపణి దాడులు చేయించారు. ఇది అత్యంత తీవ్రమైన యుద్ధ నేరం కిందకే వస్తుంది అని కాట్జ్‌ అభిప్రాయపడ్డారు. అయితే భవిష్యత్తులో అలాంటి ప్రయత్నాలు సాగుతాయా? అనే ప్రశ్నకు.. ఆయన మౌనం వహించారు. ఇదిలా ఉంటే.. ఖమేనీపై కాట్జ్‌ తీవ్ర వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారేం కాదు. టెల్ అవీవ్‌పై జూన్‌ 14వ తేదీన ఇరాన్‌ క్షిపణి దాడి చేసింది. ఈ దాడిలో దాదాపు 47 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై స్పందించిన కాట్జ్‌.. ఖమేనీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఖమేనీకి ఇక భూమ్మీద ఉండే హక్కు లేదు అని, ఖమేనీ పాలనను అంతమొందించడమే తమ లక్ష్యమని ఆ సమయంలో కాట్జ్‌ ఎక్స్‌ వేదికగా ప్రకటించారు. అదే సమయంలో ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహు కూడా ఖమేనీపై విరుచుకుపడ్డారు. ఖమేనీ అభినవ హిట్లర్‌ అని, ఆయన ప్రాణాలతో లేకుంటేనే శాంతి నెలకొంటుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే అమెరికా మాత్రం ఖమేనీ ఎక్కడ దాక్కున్నారనే పక్కా సమాచారం తమ వద్ద ఉందని చెబుతూ.. ఆయన్ని చంపే ఉద్దేశం లేదని, బేషరతుగా లొంగిపోవాలంటూ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు.. ఖమేనీ తనకు వస్తున్న బెదిరింపులను తేలికగానే తీసుకుంటూ వచ్చారు. ఇరాన్ ఎప్పటికీ లొంగదు, బెదిరింపులకు భయపడదు అని సోషల్‌ మీడియాలో, ఇటు టెలివిజన్ ప్రసంగంలో పేర్కొంటూ వస్తున్నారు.ఇజ్రాయెల్‌-ఇరాన్‌ ఉద్రిక్తతలు ప్రారంభం అయ్యాక.. ఆయన టెహ్రాన్‌ను వీడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వ వర్గాలతో సంబంధాలు లేకుండా.. ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్‌కు దూరంగా.. గట్టి భద్రత మధ్య ఆయన సురక్షిత ప్రాంతంలో ఉన్నట్లు అక్కడి మీడియా వర్గాలు వరుస కథనాలు ఇస్తున్నాయి. ఈ క్రమంలో కాల్పుల విరమణ తర్వాత ఆయన జాడ లేదంటూ ఇరాన్‌ వ్యాప్తంగా ఆందోళన మొదలైంది. అయితే ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ ఆయన తాజాగా ఓ వీడియో సందేశం విడుదల చేశారు. అయితే అందులో 86 ఖమేనీ కాస్త నీరసంగా కనిపించారు.

gold and silver rates today on market in telugu states6
పుత్తడి ప్రియుల్లో కోటి ఆశలు.. బంగారం తగ్గుముఖం

ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర(Today Gold Rate) క్రమంగా తగ్గుముఖ పడుతోంది. మూడు రోజులుగా క్రమంగా పడిపోతున్న పుత్తడి ధరలు గురువారంతో పోలిస్తే శుక్రవారం కూడా తగ్గాయి. దేశంలోని ప్రధానం నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.ఇదీ చదవండి: సోనీ కెమెరాతో పోకో కొత్త ఫోన్‌(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Twitter Killer: Who Murdered Nine In Japan Reportedly Executed7
సంచలన సైకో ‘ట్విటర్‌ కిల్లర్‌’ ఉరితీత

జపాన్‌లో సుమారు మూడేళ్ల తర్వాత మరణశిక్ష అమలు చేశారు. ‘ట్విటర్‌ కిల్లర్‌’గా పేరున్న తకహిరో షిరాయిషి(Takahiro Shiraishi)ని శుక్రవారం ఉరి తీసినట్లు ఆ దేశ న్యాయశాఖ అధికారికంగా ప్రకటించింది. సోషల్‌ మీడియాలో పరిచయం పెంచుకుని.. ఆపై అతికిరాతంగా హత్యాచారం చేయడంతో ఇతనికి ఆ పేరు ముద్రపడింది. సంచలనం సృష్టించిన ఈ సీరియల్‌ కిల్లర్‌ ఉదంతంతో.. షాకింగ్‌ విషయాలే వెలుగు చూశాయి అప్పట్లో.. సామాజిక వేదిక ట్విట్టర్‌లో పరిచయమైన బాలికలను, మహిళలకు నమ్మించి.. మాయమాటలు చెప్పి తకహిరో షిరాయిషి(Takahiro Shiraishi).. తన అపార్టుమెంట్‌కు రప్పించుకుని లైంగికదాడికి పాల్పడేవాడు. ఆపై డబ్బు, ఇతర విలువైన వస్తువులు లాక్కుని.. అనంతరం చంపేసి వారి తల, మొండెం, కాళ్లు, చేతులు.. శరీర భాగాలన్నీ ముక్కలుగా నరికిపడేసేవాడు.2020లో ఈ సీరియల్ కిల్లర్‌కు టోక్యో కోర్టు మరణశిక్ష విధించింది. తకహిరో షిరాయిషి.. ట్విట్టర్‌లో ఆత్మహత్యకు సంబంధించిన పోస్టులు పెట్టే యువతనే టార్గెట్‌గా చేసుకునేవాడు. బాధను తనతో పంచుకోమంటూ మాటల కలిపి.. స్నేహం చేసేవాడు. అనంతరం ఇద్దరం కలిసి చనిపోదామంటూ నమ్మకం కలిగించేవాడు. ఆ తరువాత తన ఇంటికి రప్పించి వారిని హతమార్చేవాడు. ఇలా ఏకంగా తొమ్మిది మందిని హత్య చేశాడు. వారిలో 26 ఏళ్ల లోపు ఎనిమిది మంది మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. 🧠 వెనుక కథతకహిరో షిరాయిషి 1990లో జపాన్‌లో జన్మించాడు. అతను "ట్విటర్ కిల్లర్"గా ప్రసిద్ధి చెందాడు. ఎందుకంటే అతను ట్విటర్ వేదికగా ఆత్మహత్య ఆలోచనలు ఉన్న వ్యక్తులను టార్గెట్ చేసి, వారిని తన అపార్ట్‌మెంట్‌కు రప్పించి హత్య చేశాడు కాబట్టి.🧪 హత్యల మోడ్ ఆఫ్ ఆపరేషన్2017 ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్య, అతను 15–26 ఏళ్ల వయసున్న 8 మంది యువతులు, ఒక యువకుడిని హతమార్చాడుబాధితులను మాయ చేసి, "ఆత్మహత్యలో సహాయం చేస్తానని" చెప్పి తన ఇంటికి రప్పించేవాడుహత్య చేసిన తర్వాత, శరీర భాగాలను ముక్కలుగా చేసి ఫ్రిజ్‌లలో దాచేవాడుఅతని అపార్ట్‌మెంట్‌లో 9 తలలు, చేతులు, కాళ్ల ఎముకలు లభించాయి⚖️ న్యాయ విచారణ & శిక్ష2020లో కోర్టు అతనికి మరణదండన విధించిందిఅతను మొదట హత్య చేశానని చెప్పినా, తర్వాత ఆ వాదనను తిరస్కరించాడు2025 జూన్ 27న జపాన్‌లో అతనికి ఉరిశిక్ష అమలు చేశారు📌 సామాజిక ప్రభావంఈ కేసు జపాన్‌ను తీవ్రంగా కుదిపేసింది. సోషల్ మీడియా వేదికలపై భద్రత, ఆత్మహత్యలపై చర్చలు ముమ్మరమయ్యాయి. జపాన్‌లో మరణశిక్షపై ప్రజల మద్దతు ఎక్కువగా ఉండటంతో ఈ తీర్పు పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.

Two India Players Who Could Be Dropped For Second Test vs England8
భార‌త జ‌ట్టులో కీల‌క మార్పులు.. అత‌డిపై వేటు! తెలుగోడికి చోటు?

ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో ఓట‌మిపాలైన టీమిండియా ఇప్పుడు మ‌రో కీల‌క పోరుకు సిద్ద‌మ‌వుతోంది. జూలై 2 నుంచి ఎడ్జ్‌బాస్ట‌న్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో ప్రారంభ‌మ‌య్యే రెండో టెస్టులో అమీతుమీ తెల్చుకోవ‌డానికి భార‌త్ సిద్ద‌మైంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను 1-1తో స‌మం చేయాల‌ని గిల్ సేన ప‌ట్టుద‌ల‌తో ఉంది. ఈ క్ర‌మంలో రెండో టెస్టు కోసం భార‌త జ‌ట్టులో కీల‌క మార్పులు చోటు చేసుకోనున్న‌ట్లు తెలుస్తోంది.శార్ధూల్ ఠాకూర్‌పై వేటు..?తొలి టెస్టులో దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచిన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండ‌ర్ శార్ధూల్ ఠాకూర్‌(Shardul thakur)పై వేటు వేసేందుకు టీమిండియా మెనెజ్‌మెంట్ సిద్ద‌మైంది. లీడ్స్ టెస్టులో శార్ధూల్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. బ్యాటింగ్‌లో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి కేవలం మూడు పరుగులు మాత్రమే చేసిన ఠాకూర్‌.. బౌలింగ్‌లో కేవలం రెండు వికెట్లు పడగొట్టాడు.ఈ క్రమంలో శార్ధూల్ బదులుగా ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి(Nitish kumar reddy)ని తీసుకోవాలని గంభీర్ అండ్ కో భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియా పర్యటనలో నితీశ్ తన ఆల్‌రౌండర్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మెల్‌బోర్న్ టెస్టులో ఓ సెంచరీ కూడా సాధించాడు. దీంతో తిరిగి మళ్లీ అతడిని తుది జట్టులోకి తీసుకోవాలని టీమ్‌ మెనెజ్‌మెంట్ యోచిస్తుందంట. ఒకవేళ ఇద్దరు స్పిన్నర్లతో ఆడాలనుకుంటే శార్థూల్ స్ధానంలో కుల్దీప్ యాదవ్ తుది జట్టులో​కి వచ్చే ఛాన్స్ ఉంది.బుమ్రాకు విశ్రాంతి..?ఇక రెండో టెస్టుకు వర్క్‌లోడ్ కారణంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని టీమ్‌మెనెజ్‌మెంట్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. బుమ్రా కేవలం మూడు మ్యాచ్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటాడని ఈ సిరీస్‌కు ముందే భారత హెడ్ కోచ్ గౌతం గంభీర్ స్పష్టం చేశాడు.దీంతో రెండో టెస్టుకు అతడికి విశ్రాంతి ఇచ్చి తిరిగి లార్డ్స్ టెస్టులో ఆడించాలని గంభీర్ అండ్ కో భావిస్తున్నరంట. తొలి టెస్టులో బుమ్రా అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల హాల్‌తో బుమ్రా చెలరేగాడు. రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ పడగొట్టకపోయినప్పటికి దాదాపు 20 ఓవర్లు బౌలింగ్ చేశాడు. ఒకవేళ రెండో టెస్టుకు బుమ్రా దూరమైతే అతడి స్ధానంలో అర్ష్‌దీప్ సింగ్ అరంగేట్రం చేసే అవకాశముంది. లేదంటే పేసర్ ఆకాష్ దీప్ తిరిగి జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది.ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు భార‌త తుది జ‌ట్టు(అంచ‌నా)యశస్వి జైస్వాల్, కేఎల్‌ రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్ (కెప్టెన్‌), రిషబ్ పంత్ (వికెట్ కీప‌ర్‌), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, నితీశ్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్‌, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ

Kannappa Movie Twitter Review9
Kannappa Review: ‘కన్నప్ప’ మూవీ ట్విటర్‌ రివ్యూ

మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ కన్నప్ప(Kannappa ) ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆయన లీడ్‌ రోల్‌లో నటించిన ఈ చిత్రంలో మోహన్‌ బాబు, ప్రభాస్‌, మోహన్‌ లాన్‌, శరత్‌ కుమార్‌ కీలక పాత్రలు పోషించారు.అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద డా. ఎం. మోహన్ బాబు నిర్మాణంలో ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్‌లు ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయి. దానికి తోడు ప్రమోషన్స్‌ కూడా గట్టిగా చేయడంతో సినిమాపై భారీ హైప్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(జూన్‌ 27) ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌ అయింది. ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్‌ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. కన్నప్ప కథేంటి? ఎలా ఉంది? ప్రభాస్‌ ఈ సినిమాకు ఎంత వరకు ప్లస్‌ అయ్యాడు? తదితర అంశాలను ఎక్స్‌ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు.కన్నప్ప చిత్రానికి ఎక్స్‌లో మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమా చాలా బాగుందని కొంతమంది, యావరేజ్‌గా ఉందని మరికొంతమంది ట్వీట్‌ చేశారు. మంచు విష్ణు నటనపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆయన కెరీర్‌లోనే ఇది బెస్ట్‌ ఫెర్పార్మెన్స్‌ అని కామెంట్‌ చేస్తున్నారు. #KannappaReview ✅🔥Vishnu Manchu delivers his career-best performance 👑Prabhas cameo = Goosebumps overload 💥Mohanlal’s character is a big surprise 👀BGM & elevations are top-class 💯Climax is pure emotion – will leave you in tears 😢BLOCKBUSTER LOADING 📿✨ 3.5/5 pic.twitter.com/NhfoLlh9an— POWER Talkies (@PowerTalkies1) June 26, 2025 మంచు విష్ణు కెరీర్‌లోనే బెస్ట్‌ పెర్ఫార్మెన్స్‌ ఇచ్చారు. ప్రభాస్‌ క్యామియో రోల్‌ గూస్‌బంప్స్‌ తెప్పిస్తాయి. మోహన్‌ లాల్‌ క్యారెక్టర్‌ బిగ్‌ సర్‌ప్రైజ్‌, నేపథ్య సంగీతం, ఎలివేషన్స్‌ టాప్‌ క్లాస్‌గా ఉన్నాయి. క్లైమాక్స్‌ ఎమోషనల్‌గా ఉంటుంది. కన్నీళ్లు పెట్టుకుంటూ థియేటర్‌ బయటకు వస్తారంటూ ఓ నెటిజన్‌ ఈ సినిమాకు 3.5 రేటింగ్‌ ఇచ్చాడు. Prabhas kosam cinema ki vellipovachuPrabhas scenes chala baagunnayi His cameo is worth the ticket price🙏🏽🙏🏽🙏🏽#Kannappa #Prabhas‌ #KannappaMovie #KannappaOnJune27th— IndianCinemaLover (@Vishwa0911) June 27, 2025 ప్రభాస్‌ కోసమే ఈ సినిమాకు వెళ్లిపోవచ్చు. ప్రభాస్‌ సీన్స్‌ చాలా బాగున్నాయి. మనం కొన్న టికెట్‌కు ప్రభాస్‌ అతిథి పాత్ర న్యాయం చేస్తుంది అని మరో నెటిజన్‌ ట్వీట్‌ చేశాడు.#Kannappa is an Mythology drama that bores from start to finish due to its outdated and bland screenplay. The storyline idea may have been emotional on paper. However, it feels lifeless and somewhat silly when translated on screen. Rating: 2/5 #Kannappa#Prabhas‌ #Prabhas‌— AbhishekSharma Sena (@KapuIndrasen) June 27, 2025 కన్నప్ప బోర్‌గా సాగే ఓ మైథాలజీ డ్రామా. స్క్రీన్‌ప్లే చప్పగా ఉండడంతో స్టార్టింగ్‌ నుంచి ఎండ్‌ వరకు బోరింగ్‌గా సాగుతుంది. ఈ స్టోరీ లైప్‌ పేపర్‌పై రాసుకున్నప్పుడు ఎమోషనల్‌గా అనిపించొచ్చు కానీ తెరపై చూస్తే మాత్రం నిర్జీవంగా, కొన్ని సీన్లు సిల్లీగా అనిపించాయి అంటూ ఓ నెటిజన్‌ కేవలం 2 రేటింగ్‌ మాత్రమే ఇచ్చాడు.#Kannappa #KannappaMovieIf same cameo of Rudra was offered to any contemporary stars they would have said no because of risk and insecurity#Prabhas gambles pay off in hugeThen Baahubali now the list ever goes onHe is the choosen one of all the stars and he's the super star pic.twitter.com/YCHHckCoB1— IndianCinemaLover (@Vishwa0911) June 27, 2025 ప్రభాస్ పోషించిన రుద్ర పాత్రను ఈ రోజుల్లో ఏదైనా యంగ్ హీరోకు ఆఫర్ చేస్తే రిస్క్‌ ఎందుకని సున్నితంగా తప్పుకునే వారు. కానీ ప్రభాస్‌ మాత్రం ఆ రిస్క్‌ చేశాడు. ఆయన పాత్ర ఈ సినిమాకు ప్రాణం పోసింది. బాహుబలి తర్వాత ఆయన మరో మంచి పాత్రని ఎంచుకున్నాడు. అందుకే ప్రభాస్‌ సూపర్‌స్టార్‌ అయ్యాడంటూ ఇంకో నెటిజన్‌ రాసుకొచ్చాడు.#KannappaReview Rating: ⭐️⭐️½ #VishnuManchu gives a heartfelt performance, #AkshayKumar brings divine intensity as Lord Shiva,But the film suffers from a slow pace, flat BGM & a dull and disengaged cameo by #Prabhas that adds no real value.Review 👇https://t.co/YOC4dI82lU— CineMarvel🇮🇳 (@cinemarvelindia) June 27, 2025Mahashivratri Episode starring Prabhas worked very big time🛐🔥🔥🔥🔥🔥Adhi Biggest plus point ani mention chestunaru andharu🥵🔥🔥 And vishnu last 20 mins ichi padesadu anta🔥🔥#KannappaReview pic.twitter.com/b45nW48OH1— Legend Prabhas 🇮🇳 (@CanadaPrabhasFN) June 27, 2025

Rs 500 crore trust for kin of Ahmedabad Air India plane victims by Tata Sons Report10
ఎయిరిండియా విషాదం : రూ. 500కోట్లతో టాటా సన్స్‌ కీలక నిర్ణయం!

అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరిన కొద్ది నిమిషాలకే లండన్ కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన ఘటనలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. జూన్ 12న లండన్‌కు బయలుదేరిన విమానం (AI-171) టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో కూలిపోయిన విషాద సంఘటన 270 మందికి పైగా ప్రాణాలను బలిగొన్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాద బాధితుల కుటుంబీకుల కోసం టాటా సన్స్‌ కీలక నిర్ణయం తీసుకుంది.అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద బాధితుల బంధువుల కోసం రూ. 500 కోట్ల ట్రస్ట్ ఏర్పాటు చేయాలని అటా సన్స్ యోచిస్తోందని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. విమాన ప్రమాద బాధితుల బంధువులకు ఆర్థిక సహాయం అందించడానికి ఒక ట్రస్ట్ ఏర్పాటుకు టాటా సన్స్ బోర్డు అనుమతులు కోరుతోంది. ఈ ఘోరవిషాదం తర్వాత జరిగిన మొదటి బోర్డు సమావేశంలో టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ దీని గురించి చర్చించారు.ప్రమాదంలో ప్రభావితమైన వారి కుటుంబాల కోసం టాటా గ్రూప్ తీసుకున్న చర్యల గురించి డైరెక్టర్ల బోర్డుకు వివరిస్తూ, సహాయక చర్యలు త్వరగా అమలు అయ్యేలా చూసుకోవడానికి తాను ఎయిర్ ఇండియాతో సన్నిహిత సమన్వయంతో పనిచేస్తున్నానని చంద్రశేఖరన్ వివరించారు. అలాగే వీరి సహాయార్థం ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేయడానికి టాటా సన్స్ రూ. 500 కోట్ల అంచనా కేటాయింపుతో ఆమోదం కోరుతున్నట్లు ది ఎకనామిక్ టైమ్స్ తెలిపింది. టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ గతంలో రెండు ప్రత్యేక ట్రస్టులను ఏర్పాటు చేయాలని భావించింది. ఒకటి భారతీయ పౌరుల కుటుంబాలకు, మరొకటి విదేశీ పౌరులకు. ఈ మొత్తాన్ని 271 మంది బాధితుల కుటుంబాలకు పరిహారం చెల్లింపులు, వైద్య సంరక్షణ అలాగే ప్రభావితమైన బీజే మెడికల్ కాలేజ్ , సివిల్ హాస్పిటల్ పునరుద్ధరణ కోసం ఉపయోగిస్తారు."టాటా గ్రూప్ చరిత్రలో చీకటి రోజులలో ఒకటి" గా పేర్కొన్న చంద్రశేఖరన్‌, కంపెనీ తన బాధ్యతల నుండి వెనక్కి తగ్గదని గాయపడిన వారి వైద్య ఖర్చులు, బీజే మెడికల్ హాస్టల్ నిర్మాణంలో సహాకారం తోపాటు సంబంధిత అన్ని చర్యలూ తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే ఈప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి ప్రయాణీకుడి కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement