
- సన్నిధానం నరసింహశర్మ ఇంటర్వ్యూలు, సమీక్షలు, వ్యాసాల కలబోత ‘ప్రమేయఝరి’ పుస్తకం విడుదల సభ అక్టోబర్ 11న సాయంత్రం 5:30కు హైదరబాద్ స్టడీ సర్కిల్లో జరగనుంది. ఆవిష్కర్త జస్టిస్ టి.రజని. వయ్యి స్వీకృతి: జయధీర్ తిరుమలరావు. పొత్తూరి వెంకటేశ్వరరావు, సామల రమేశ్బాబు, గూడూరు మనోజ, ఎ.కె.ప్రభాకర్ పాల్గొంటారు. నిర్వహణ: సాహితీ సర్కిల్, హైదరాబాద్.
- ‘నందగిరి ఇందిరాదేవి కథలు’ ఆవిష్కరణ అక్టోబర్ 8న సాయంత్రం 6 గంటలకు రవీంద్ర భారతి కాన్ఫరెన్స్ హాలులో జరగనుంది. నందిని సిధారెడ్డి, ముదిగంటి సుజాతారెడ్డి, నందగిరి వీర, చీదెళ్ల సీతాలక్ష్మి, పరిమి వెంకట సత్యమూర్తి పాల్గొంటారు. నిర్వహణ: తెలంగాణ సాహిత్య అకాడమి.
- పుణే తెలుగు సాహితీ పీఠం నిర్వహణలో ‘రచయితల కార్యగోష్ఠి’ అక్టోబర్ 14న ఉదయం 10:30కు పుణే ఆంధ్ర సంఘం, పుణేలో జరగనుంది. అతిథి: నందిని సిధారెడ్డి. 40 మంది మహారాష్ట్ర కవుల ‘మరో అడుగు’ కవితా సంకలనం ఆవిష్కరణ కానుంది.
- గిడుగు రామ్మూర్తి భాషా సాహిత్య సేవా పురస్కారాల సభ అక్టోబర్ 10న ఉదయం 10 గంటలకు విజయవాడ ప్రెస్క్లబ్లో జరగనుంది. ముఖ్య అతిథి: మండలి బుద్ధప్రసాద్. నిర్వహణ: నవ్యాంధ్ర రచయితల సంఘం.
- ర్యాలి ప్రసాద్ ‘ఆల్ఫా– ఒమేగా’ కవితా సంపుటికి 2018 సంవత్సరపు ఎ.ఎల్.ఫౌండేషన్ పురస్కారం లభించింది.
- ‘దేవులపల్లి కృష్ణశాస్త్రి స్మరణ– స్ఫురణ’ కార్యక్రమం విజయవాడ ప్రెస్క్లబ్లో అక్టోబర్ 13న సాయంత్రం 3 గంటలకు జరగనుంది. నిర్వహణ: సాంస్కృతీ సమాఖ్య
- శ్రీ కళా గౌతమి మాసపత్రిక అక్టోబర్ 28న కందుకూరి వీరేశలింగం శత వర్ధంతి సందర్భంగా రాజమండ్రిలోని నన్నయ విశ్వవిద్యాలయంలో కందుకూరి జీవితం ఆధారంగా రాసిన కవితలతో శతాధిక కవి సమ్మేళనం నిర్వహించనుంది. వివరాలకు వాట్సాప్ నంబరు 9885661850.
Comments
Please login to add a commentAdd a comment